-
పాము కాటుకు గుర్రం మందు
/// జి.రామచంద్రారెడ్డి - ఏపీ బ్యూరో: ముల్లును ముల్లుతోనే తీయడం, వజ్రాన్ని వజ్రంతోనే కోయడం... అందరికీ తెలిసిన మాటే. అలాగే విషానికి విషమే విరుగుడు కూడా. పాము కరిస్తే దానికి విరుగుడుగా పాము విషమే మందు అన్నది కొంతమందికి తెలియొచ్చు. పాము కాటుకు విరుగుడు తయారు చేయడంలో గుర్రం పాత్ర ఎంతో కీలకమన్న విషయం మాత్రం ఎవరికీ తెలియకపోవచ్చు. ఒక్క పాము విషానికే కాదు, యాంటీ వీనంతో పాటు యాంటీ టీటీ, యాంటీ డీటీ వంటి ఎన్నో విషాలకు విరుగుడు గుర్రమే అన్నది వాస్తవం. యాంటీ స్నేక్ వీనం (పాము విషానికి విరుగుడు) గుర్రం నుంచే ఎందుకు తీస్తారు? గుర్రం నుంచే వీనం ఎందుకు తియ్యాలి? పాముకాటు విరుగుడుకు రక్తంలోని ప్లాస్మా ఎంతో కీలకం. పంది, కోతి, మనిషి నుంచి సేకరించే రక్తంలోని ప్లాస్మా నుంచి కూడా మందును తయారు చేయొచ్చు. కానీ అవి ఆశించిన ఫలితాలనివ్వవు. పైగా ఎక్కువ మోతాదులో తీసేందుకు సాధ్యం కాదు. పాముకాటు విరుగుడుకు అవసరమయ్యే వ్యాధి నిరోధక ప్లాస్మా గుర్రంలో మాత్రమే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. పైగా ఒక ఆరోగ్య కరమైన గుర్రం నుంచి నెలకు 7 లీటర్ల రక్తాన్ని సేకరించవచ్చు. గుర్రం రక్తంలో ప్లాస్మా ఎక్కువ. ఒక లీటర్ రక్తంలో 70 శాతం ప్లాస్మా ఉంటుంది. అదే మిగతా జీవుల నుంచి నెలకు 2 లీటర్ల రక్తం కూడా వృద్ధి కాదు. పైగా ప్లాస్మా శాతం తక్కువ. అందుకే పాముకాటు విషానికి విరుగుడుగా గుర్రాన్నే ఎంచుకున్నారు. పాము నుంచి సేకరించిన విషాన్ని గుర్రానికి ఎక్కించడం, గుర్రంలో విషానికి విరుగుడుగా ప్లాస్మా ఉత్పత్తి కావడం, ఆ ప్లాస్మా నుంచి యాంటీ వీనం తయారు చేయడం జరుగుతుంది. ఇరులా గిరిజనులు విరుగుడు సరే, పాము విషం సేకరించడం కూడా సులభమేమీ కాదు. విరుగుడుకు అవసరమైన విషాన్ని ఎక్కడ్నుంచి తెస్తారనేది మరో అంశం. తమిళనాడులో ‘ఇరులా’ అనే గిరిజన తెగ ఉంది. తమిళంలో ఇరుల్ అంటే చీకటి. ఇరులార్ అంటే చీకటిలో బతికే వాళ్లు. అందుకే వీరికి ఇరులా అని పేరొచ్చింది. తమిళనాడులోని ఈశాన్య ప్రాంతాల్లో వీరెక్కువగా ఉంటారు. ముఖ్యంగా విల్లుపురం, కంచీపురం, తిరువణ్ణామలై, చెంగల్పట్టు, తిరువల్లూర్ తదితర ప్రాంతాల్లో వీరు నివసిస్తారు. అటు కేరళ, ఇటు ఆంధ్రప్రదేశ్ (చిత్తూరు)లోనూ ఇరులా తెగ వారున్నారు. పాములు, ఎలుకలను పట్టుకోవడం వీరి వృత్తిలో భాగం. ఆడ మగా చిన్నా పెద్దా అందరూ విషపూరితమైన పాములను కూడా ఇట్టే పట్టేస్తారు. వీళ్లిప్పుడు ముఖ్యంగా నాలుగు రకాల పాముల విషం సేకరించి భారతదేశంలో ఉన్న నాలుగు కంపెనీలకు సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా కోబ్రా, రసెల్స్ వైపర్, క్రేట్, సాస్కేల్డ్ వైపర్ అనే నాలుగు రకాల అత్యంత విషమున్న పాములనుంచి విషాన్ని సేకరిస్తారు. ఈ సేకరణకు వన్యప్రాణి సంరక్షణా విభాగం లెసైన్సు ఉంటుంది. విషాన్ని గుర్రాలకు ఎక్కించి... సేకరించిన విషాన్ని 3 నుంచి 5 నెలల మధ్య కాలంలో డోసుల వారీగా ప్రతి వారానికి ఒకసారి గుర్రాలకు ఎక్కిస్తారు. దానికిగానూ 10 మిల్లీలీటర్ల విషాన్ని 1000 మిల్లీలీటర్ల రకరకాల మందులతో డైల్యూట్ చేస్తారు. విషం ఎక్కించిన రెండు నెలల్లో గుర్రం శరీరంలో విషానికి విరుగుడు చేసే రక్తం తయారవుతుంది. ఒక్కో గుర్రం నుంచి నెలకు 7 లీటర్ల రక్తాన్ని తీస్తే, అందులో నుంచి 4.9 లీటర్ల ప్లాస్మా వస్తుంది. ఒక్కో లీటర్ ప్లాస్మా నుంచి 10 మిల్లీ లీటర్లున్న 28 వయెల్స్ (ఇంజెక్షన్ బాటిల్) మందు తయారవుతుంది. ఒక ఆరోగ్యకరమైన గుర్రం నుంచి నెలకు 125 వయెల్స్ తయారు చేయొచ్చు. రేస్కోర్స్ గుర్రాలు గత కొన్నేళ్ల క్రితం మలక్పేట రేస్ కోర్సు గుర్రాలను యాంటీ స్నేక్ వీనం తయారీకి తీసుకెళ్లేవారు. పరుగులో వేగం తగ్గినవి, ఆరోగ్యంగా ఉన్నా వయసు మీదపడుతున్న వాటిని ఇలా విక్రయించేవారు. ఒక్కో గుర్రం రూ.2 నుంచి రూ.5 లక్షల వరకూ ధర పలికేది. అయితే చాలినంత గుర్రాలు ఉండేవి కావు. దీంతో యాంటీస్నేక్ వీనం తయారీ కంపెనీలు సొంతంగా గుర్రాల పెంపకం యూనిట్లు ఏర్పాటు చేసుకోవడం మొదలెట్టాయి. మన రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా కొత్తూరు వద్ద ఇలాంటి యూనిట్ ఉంది. ఏటా పాముకాటు మరణాలు... 1500 * మనదేశంలో ఏటా సుమారు 5 లక్షల మందికి పైగా పాముకాటుకు గురవుతూంటే అందులో 45000 వరకూ మృతి చెందుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. * ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏటా సుమారు 1,000 నుంచి 1,500 మంది పాముకాటు మృతులు ఉంటున్నట్టు వెద్య ఆరోగ్యశాఖ అంచనా. * పాము కాటు మరణాలు ఎక్కువగా రాత్రి పూటే సంభవిస్తున్నాయి. సకాలంలో ఆస్పత్రులకు రాలేక మృత్యువాత పడుతున్నారు. * పాముకాటు బాధితులకు యాంటీ స్నేక్ వీనం ఇవ్వడం ఒకెత్తయితే.. ఆ విషం శరీరంలో బలంగా ఉన్నప్పుడు వెంటిలేటర్ సపోర్ట్ ఉండాలి. జిల్లా ఆస్పత్రులు, బోధనాసుపత్రుల్లో మినహా పీహెచ్సీ, సీహెచ్సీ, ఏరియా ఆస్పత్రుల్లో ఈ వసతి లేదు. నెల ఖర్చు భారీగానే... రూ. 5000 ఒక గుర్రం నుంచి నెలకు 3 సార్లు అదీ 7 లీటర్లకు మించకుండా రక్తాన్ని సేకరించాలి. అంతకంటే ఎక్కువ తీస్తే గుర్రానికి ప్రమాదం. పైగా విషాన్ని ఎక్కించేప్పుడు గుర్రానికి మంచి పోషణ ఉండాలి. లేదంటే ప్లాస్మా ఉత్పత్తి తగ్గడమే కాకుండా, గుర్రం ఆరోగ్యం దెబ్బతింటుంది. * ఒక సంస్థ 600 గుర్రాలను పోషించాలంటే 10 ఎకరాల స్థలం ఉండాలి. * ఒక్కో గుర్రాన్ని పోషించేందుకు నెలకు రూ.5,000 ఖర్చు అవుతుంది. * 25 గుర్రాలకు రూ.5 వేల లెక్కన నెలకు రూ.1.25 లక్షలు ఖర్చవుతుంది. * 25 గుర్రాలను సంరక్షించేందుకు 10 మంది అవసరం. అంటే నెలకు ఒక్కొక్కరికి రూ.10 వేల * చొప్పున 10 మందికి లక్ష రూపాయలు అవసరం. -
అబ్బా.. మెడనొప్పి
డాక్టర్స్ కాలమ్ తలకూ మొండేనికి మధ్య బాల్ బేరింగ్ లాంటిది మెడ. వాహనాలు నడపడంలో బాల్ బేరింగ్లు ఎంత ముఖ్యమైనవో మన శరీరంలో మెడకూడా అంతే. తిరుగుతున్నాయి కదా అని బేరింగ్లను ఎలాగ పడితే అలా తిప్పితే అవి ఎలా పాడైపోతాయో.. ఇష్టారాజ్యంగా తిప్పితే మెడ పరిస్థితీ అంతే. మెడ పనితీరు, దీని ప్రాధాన్యం అనేది నగరీకరణ జరుగుతున్న క్రమంలో బాగా తగ్గిపోవడంతో బాధితులు ఎక్కువయ్యారు. నడక, పడకల నుంచీ కూర్చునే కుర్చీలు, కూర్చునే తీరు అన్నీ మెడ నొప్పికి కారణాలవుతున్నాయి. కంప్యూటరీకరణ నేపథ్యంలో చాలా మంది ఉద్యోగులు శిలల్లా మారి పనిచేయడం వల్ల మెడ నరాలు మొద్దుబారి.. కండరాలు పట్టేస్తున్నాయి. హైదరాబాద్లో చాలామంది ముప్పయ్ ఏళ్లు నిండకుండానే మెడ నొప్పితో బాధపడుతున్నారు. విధి నిర్వహణలో, వాహనాలు నడిపేటప్పుడు పక్కా ప్రిన్స్పుల్స్ ఫాలో కాకపోవడం మెడపై ఒత్తిడి పెరుగుతోంది. చిన్నపాటి మెడనొప్పే కదా అని అశ్రద్ధ చేస్తే.. తర్వాత స్పాండిలైటిస్, ఆ తర్వాత నెక్ సర్జరీ వరకూ వెళ్తోంది. మన పనితీరులో కొన్ని పద్ధతులు ఫాలో అయితే మెడను ఈజీగా కాపాడుకోవచ్చంటున్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డా.బి.సాంబశివారెడ్డి. నగరంలో వాహన చోదకులు, సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసే వారిలో రెండొంతుల మంది మెడనొప్పి బాధితులేనని ఆయన చెబుతున్నారు. ప్రజెంటర్: జి.రామచంద్రారెడ్డి అపసవ్య దిశలే కారణం.. * 90 శాతం మందిలో కూర్చునే తీరు, పనిచేసే తీరు వల్లే మెడనొప్పి కలుగుతుంది * ద్విచక్రవాహనాలు నడుపుతున్న సమయంలో మణికట్టు, భుజాలు సరైన దిశలో పెట్టకపోవడం మెడపై ప్రభావం చూపుతోంది * గంటల తరబడి కంప్యూటర్ల ముందు పనిచేయడం వల్ల మెడ కండరాలపై ఒత్తిడి పెరిగి నొప్పి మొదలవుతుంది * ఈ నొప్పి దీర్ఘకాలంగా ఉంటే స్పైనల్ (వెన్నుపూస) నరాలు దెబ్బతినే అవకాశం ఉంది * పడుకోవడంలో సరైన పద్ధతులు ఫాలో కాకపోవడం కూడా మెడనొప్పికి హేతువవుతోంది * మెడనొప్పి తీవ్రమైతే శస్త్రచికిత్స మినహా మార్గం లేదు దిశను మార్చుకుంటేనే.. * చాలామంది మెడనొప్పి రాగానే నెక్ కాలర్ (మెడకు ఓ పట్టీ) వేస్తుంటారు. దీనివల్ల ఉపయోగం ఉండదు * కంప్యూటర్ వద్ద పనిచేస్తున్నప్పుడు భుజాలు, మోచేతులు సమాంతర దిశలో ఉండాలి * అలాగే కంప్యూటర్ కీబోర్డుకు మణికట్టు సమాంతరంగా ఉండాలి. * టూ వీలర్ నడుపుతున్నప్పుడు నిటారుగా ఉండి, భుజాలు మెడకు సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి * రోజుకు కనీసం ఐదారు సార్లు నెక్ వ్యాయామం చేయాలి. అంటే రెండు చేతులూ తల వెనుక అదిమి పట్టి ముందుకు, వెనకకు స్ట్రెచ్ చేయడం * గంటల తరబడి కుర్చీలో కూర్చోకుండా మధ్య మధ్యలో రిలాక్స్ అవుతుండాలి
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- అక్రమాలు కో‘కొల్లు’లు
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement