-
గాలి జనార్థన్రెడ్డిపై సోదరుడు సోమశేఖర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు
బళ్లారి: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గాలి జనార్థన్రెడ్డిపై సోదరుడు సోమశేఖర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి బళ్లారి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సోమశేఖర్రెడ్డి.. తనదే విజయం అని స్పష్టం చేశారు. గాలి జనార్థన్రెడ్డి భార్య బరిలోకి దిగుతున్నప్పటికీ విజయం మాత్రం తనదేని నొక్కి చెప్పారు సోమశేఖర్రెడ్డి. గాలి జనార్థన్రెడ్డి పేరు అక్కడక్కడ వినిపిస్తున్నా, ఆయన పబ్లిక్తో ఎటువంటి సంబంధాలు లేవన్నారు. పబ్లిక్తో ఉండేది తానేనని సోమశేఖర్రెడ్డి పేర్కొన్నారు. అదే తనను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో తామంతా గాలి జనార్థన్రెడ్డి ఉన్పామని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు సోదరుడు సోమశేఖర్రెడ్డి. పక్కా కార్యకర్తలంతా తమతోనే ఉన్నారని, అది తన గెలుపునకు దోహదం చేస్తుందన్నారు. డబ్బులకు ఆశ పడే వాళ్లు మాత్రమే గాలి జనార్థన్రెడ్డి వైపుకు వెళ్తున్నారని, నిజమైన కార్యకర్తలు మాత్రం తమ పార్టీ వెంటే ఉన్నారన్నారు. ఇదిలా ఉంచితే, గాలి జనార్థన్రెడ్డి స్థాపించిన కళ్యాణ రాజ్య ప్రగతిపక్ష(కేఆర్పీ)పార్టీ తరఫున ఆయన భార్య అరుణ లక్ష్మి పోటీ చేస్తున్నారు. కాగా, కర్నాటక ఎన్నికలకు సంబంధించి కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ అధ్యక్షుడు గాలి జనార్ధన్ రెడ్డి స్పందించారు. కర్నాటక ఎన్నికల్లో మేమే కీలకం కాబోతున్నాం. 25 అసెంబ్లీ స్థానాల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తాం. మా రాజకీయ ప్రత్యర్ధులు బీజేపీ - కాంగ్రెస్. బసవేశ్వర సిద్ధాంతాలే మా అజెండా. కులాలు, మతాలకు అతీతంగా సేవ చేసేందుకే రాజకీయ పార్టీ స్థాపించాను’ అని అన్నారు. -
ఒకే వేదికపై నారా, గాలి!
సాక్షి, బళ్లారి (కర్ణాటక): రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది నానుడి. శుక్రవారం బళ్లారిలో జరిగిన ఓ క్రికెట్ టోర్నీ వేడుకకు హాజరైన బీజేపీ ఎమ్మె ల్యే గాలి సోమశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే నారా సూర్యనారాయణరెడ్డిలు ఒకే వేదికపై కనిపించడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. పార్టీల పరంగా వైరం ఉన్నా వాటిని పక్కనపెట్టి కొద్దిసేపు ఈ ఇద్దరు నేతలు ముచ్చటించుకోవడం గమనార్హం. చదవండి: (పరిటాల సునీతకు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సవాల్) -
కాంగ్రెస్కు నూకలు చెల్లాయి
బళ్లారి సిటీ మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్రెడ్డి కంప్లి :కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లాయని బళ్లారి సిటీ మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పేర్కొన్నారు. కురుగోడు పురసభకు జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్కు పరాభవం తప్పదన్నారు. పురసభ ఎన్నికల సందర్భంగా సోమవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా ఆయన 4వ వార్డు బీజేపీ అభ్యర్థి ప్రమీలతో కలిసి సోమవారం పురసభ కార్యాలయం చేరుకొని ఎన్నికల అధికారి రవీంద్రకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ప్రధానమంత్రి పేదల సమస్యలపై స్పందించి అనేక పథకాలు జారీ చేస్తున్నారన్నారు. ఇక రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను రాజకీయ కురు వృద్ధుడు, యడ్యూరప్పకు అందించడంతో పార్టీకి కొండంత బలం చేకూరిందన్నారు. కంప్లి క్షేత్రంలోని ప్రజలు బీజేపీపై ఎంతో అభిమానంతో ఎమ్మెల్యే సురేష్బాబుకు వెన్నంటి ఉన్నారని, ఈ ఎన్నికల్లో 23 వార్డులకు గాను 18 నుంచి 20 వార్డుల్లో తమ పార్టీ అభ్యర్థులే గెలుపొందుతారన్నారు. కంప్లి క్షేత్ర అధ్యక్షుడు యువరాజ్, జిల్లా సమన్వయ ప్రధాన కార్యదర్శి అనిల్, యర్రంగిళి తిమ్మారెడ్డి, హరీష్రెడ్డి, బెసేజ్రెడ్డి, ప్రేంకుమార్ తదితరులు పాల్గొన్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
బీజేవైఎం నిరసన గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత
సీఎం యోగిని టార్గెట్ చేసిన ప్రతిపక్షాలు?
సైబర్ కేటుగాళ్లు దోచేశారు.. ఆర్బీఐ ఉద్యోగినికి రూ.24.5లక్షల టోకరా
వరల్డ్ కప్ నే కాళ్ళ కింద పెట్టుకున్న కెప్టెనే ఇలా అంటే..
Vishnu Priya Photos: టీవీ స్టార్లు కూడా ఎక్కడా తగ్గట్లేదుగా! (ఫొటోలు)
గాజాలో జరుగుతోంది మారణహోమం కాదు: జో బైడెన్
IPL 2024: ధోనిని అవమానించిన ఆర్సీబీ ప్లేయర్లు!.. తప్పు ‘తలా’దేనా?
రైతులూ.. జాగ్రత్త! విత్తనాల కొనుగోలులో.. ఆఫర్లు చూశారో?
RCBని ధోని అవమానించాడా..? ధోనినే ఆర్సీబీ అవమానించిందా..?
'లూసిఫర్2'లో మాఫియా డాన్గా మోహన్లాల్ లుక్ రివీల్
తప్పక చదవండి
- కెనడాలో భారతీయ విద్యార్థుల నిరసన.. ఎందుకంటే?
- Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్
- కొన్ని గంటల్లోనే నిర్ణయం వెనక్కి తీసుకున్న బీఐఏఎల్
- T20: ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో కొత్తగా ఇద్దరు.. స్మిత్కు మరోసారి!
- తెలంగాణ డీజీపీ పేరుతో వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు
- MI: ఈ సీజన్లో నిరాశే మిగిలింది: నీతా అంబానీ వ్యాఖ్యలు వైరల్
- AP: అంతా ప్రీ ప్లాన్డ్గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
- వారి ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తున్న పాయల్ రాజ్పుత్
- Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
- ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
Advertisement