-
కోవిడ్: కొత్త జంట పరార్
సాక్షి, కాజీపేట: కరోనా వైరస్ మహమ్మారి ఒకవైపువిజృంభిస్తోంటే.. మరోవైపు బాధ్యతగా ఉండాల్సిన పౌరులు నిర్లక్ష్యంగా ప్రవర్తించడం మరింత ఆందోళన రేపుతోంది. తాజాగా ఢిల్లీ వెళుతున్న రాజధాని ఎక్స్ప్రెస్లో ఇద్దరు కరోనా అనుమానితులను గుర్తించారు. స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందిగా వైద్యులు చేతికి వేసిన స్టాంప్ (క్వారంటైన్ మార్క్) ను కూడా లెక్క చేయకుండా ఓ కొత్త జంట పలువురి రైల్వే ప్రయాణీకుల ఆరోగ్యాన్ని ప్రమాదంలో నెట్టిన వైనం కాజీపేట్ రైల్వేస్టేషన్లో వెలుగులోకి వచ్చింది. తోటి ప్రయాణికులు అప్రమత్తంగా కావడంతో అలర్ట్ అయిన అధికారులు ఆ జంటను గాంధీ ఆస్పత్రికి తరలించారు. రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి శనివారం ప్రకటించిన వివరాల ప్రకారం కొత్తగా పెళ్ళి చేసుకున్న జంట ఈ ఉదయం సికింద్రాబాద్ స్టేషన్లో రాజధాని ఎక్స్ప్రెస్లో ఎక్కారు. రైలు ఉదయం 9.45 గంటలకు కాజీపేట స్టేషన్కు చేరుకుంది. చేతులు కడుక్కోవడానికి వాష్ బేసిన్ ఉపయోగిస్తుండగా, సహ ప్రయాణికులు చేతిపై ఉన్న ముద్రను గమనించి టీటీకి సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు కాజీపేటలో రైలు ఆపి వైద్యులతో సహా ప్లాట్ఫాంపైకి వచ్చి వారిద్దరినీ అంబులెన్స్లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ముందు జాగ్రత్త చర్యగా వారు ప్రయాణిస్తున్న బీ-3 కోచ్లోని ప్రయాణికులను మరో బోగీలోకి పంపించారు. అలాగే బీ-3 కోచ్ ను శానిటైజ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 5 వరకు ఎక్కడికి వెళ్లొద్దని వికారాబాద్ వైద్యులు హెచ్చరించినా వైద్యుల మాట వినకుండా వీరి ఢిల్లీకి బయలుదేరారని తెలిపారు. కాగా శనివారం నాటికి దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య 271 కి చేరింది. -
అమ్మా... గర్భిణుల విలాపం!
మరమ్మతుల కోసం సుల్తాన్బజార్ ప్రసూతి ఆస్పత్రి ఖాళీ మూడు రోజులుగా ప్రసవ వేదన.. గర్భిణులు వస్తే..ఇతర ఆస్పత్రులకు సిఫార్సు పేట్లబురుజు, నిలోఫర్, గాంధీలోనూ చేదు అనుభవమే అల్లాడుతున్న నిరుపేద మహిళలు సిటీబ్యూరో పురిటి నొప్పులతో ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి వచ్చే నిరుపేద గర్భిణులకు ప్రసవ వేదన తప్పడం లేదు. నొప్పులు భరించలేక కళ్లముందే కుప్పకూలుతున్నా.. వైద్య సిబ్బంది కనికరించడం లేదు. సుల్తాన్బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్ గోడలకు పగుళ్లు ఏర్పడటంతో నాలుగు రోజులుగా సిజేరియన్ ప్రసవాలు నిలిపేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చిన గర్భిణులను నిలోఫర్, గాంధీ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. అతికష్టం మీద ఆయా ఆస్పత్రులకు వెళ్లిన గర్భిణులకు తీరా అక్కడ కూడా చేదు అనుభవమే ఎదురవుతోంది. పడకలు ఖాళీ లేక..తగినంత మంది వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో ఇక్కడ అడ్మిషన్ చేసుకోవడం లేదు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రరుుంచలేని నిరుపేదలు అల్లాడిపోతున్నారు. సరైన ప్రత్యామ్నాయం చూపకుండా..సుల్తాన్ బజార్ ఆస్పత్రిలో డెలివరీలు నిలిపివేయడం వల్లే ఈ సమస్యలు ఎదురవుతున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. ప్రతిష్టాత్మక సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ఔట్ పేషంట్ విభాగానికి రోజుకు సగటున 300 మంది గర్భిణులు వస్తుండగా, 200 మందికిపైగా చికిత్స పొందుతుంటారు. రోజుకు సగటున 30 ప్రసవాలు జరుగుతుంటారుు. ఆపరేషన్ థియేటర్లోని గోడలకు ఇటీవల పగుళ్లు ఏర్పడ్డారుు. దీనికి తోడు వార్డుల్లోని గోడలకు బ్యాక్టీరియా, ఫంగస్ వ్యాపించింది. ఇది బాలింతలకు వ్యాపించే అవకాశం ఉండటంతో గత సోమవారం నుంచి ఆపరేషన్ థియేటర్ను మూసేసి మరమ్మతులు చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ అడ్మిటైన గర్భిణులను, బాలింతలను ఖాళీ చేరుుంచారు. తాజాగా వస్తున్న రోగులను పేట్లబురుజు, గాంధీ, నిలోఫర్, కింగ్కోఠి ప్రసూతి ఆస్పత్రులకు సిఫార్సు చేస్తున్నారు. అంబులెన్స కూడా లేక పోవడంతో ఎవరికి వారే ఆటోల్లో వెళ్లిపోతున్నారు. నిరాకరించిన పేట్లబురుజు... ఇతర ఆస్పత్రుల నుంచి వచ్చిన గర్భిణులను చేర్చుకుని చికిత్స అందించేందుకు పేట్లబురుజు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు నిరాకరిస్తున్నారు. ఇప్పటికే ఆ ఆస్పత్రిలో వైద్యుల నిష్పత్తికి మించి గర్భిణుల సంఖ్య ఉండటంతో...కొత్తగా ఇతర ఆస్పత్రుల నుంచి వచ్చిన గర్భిణులకు తాము ప్రసవాలు చేయలేమని ఆ ఆస్పత్రి వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో వారిని గాంధీ, నిలోఫర్ ఆస్పత్రులకు పంపుతున్నారు. అనేక వ్యయప్రయాసలకోర్చి ఆయా ఆస్పత్రులకు చేరుకున్న గర్భిణులకు తీరా అక్కడ కూడా చేదు అనుభవమే ఎదురవుతోంది. ఆయా ఆస్పత్రుల్లో పడకలు ఖాళీ లేక పోవడం, ఉన్నవాటిపై ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు సర్దుకుంటుండటంతో చేసేది లేక వచ్చిన వారిని తిప్పి పంపుతున్నారు. నొప్పులు మొదలైన తర్వాత రావాల్సిందిగా సూచిస్తున్నారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన గర్భిణులు మళ్లీ వచ్చే ఓపిక లేక ఆర్థికంగా భారమైనా తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రరుుస్తున్నారు. చేరుు తడపాల్సిందే.. ఇదిలా ఉంటే ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రుల్లో పుట్టిన ప్రతి బిడ్డకూ సిబ్బంది ధర నిర్ణరుుస్తున్నారు. తల్లిదండ్రులు తమ కన్నబిడ్డను కళ్లారా చూసుకోవాలంటే అడిగినంత (ఆడబిడ్డ పుడితే రూ.800, మగబిడ్డ పుడితే రూ.1500) ఇవ్వాల్సిందే. లేదంటే చీదరింపులు, చీత్కారాలే. దీంతో పైసా ఖర్చు లేకుండా మెరుగైన వైద్యం చేరుుంచు కోవచ్చని భావించి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి వచ్చిన పేదలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. కీలకమైన విభాగాల్లో రెగ్యులర్ స్టాఫ్ను నియమించాల్సి ఉన్నా..కొంత మంది అధికారులు కాంట్రాక్ట్ సిబ్బందితో కుమ్మకై ్క అక్రమ వసూళ్లకు పాల్పడుతుండటంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement