-
డల్లాస్ లో గాంధీ జయంతి వేడుకలు
147వ గాంధీ జయంతి వేడుకల సందర్భంగా అక్టోబర్ 2న డల్లాస్ నగరంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్(ఎంజీఎంఎన్టీ) చైర్మన్ డా.తోటకూర ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. నగరంలోని మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా నుంచి ఉదయం 8గంటలకు 'గాంధీ శాంతి నడక'(గాంధీ పీస్ వాక్)ను ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త టెక్సాస్(ఐఏఎన్టీ) ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. నడకకు హాజరయ్యే వారికి ఉచితంగా టీ షర్ట్, టోపీలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. శాంతికి చిహ్నాలైన కొన్ని తెల్ల పావురాళ్లను వాక్ అనంతరం గాల్లోకి వదిలివేయనున్నట్లు తెలిపారు. సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య గత మూడేళ్లుగా నిర్వహిస్తున్న గాంధీ వార్షిక విందు కార్యక్రమం కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు dallas.eknazar.comలో టిక్కెట్లు కోనుగోలు చేయొచ్చని చెప్పారు. విప్రో సీఈవో అబిదాలి నీముచ్వాలా గాంధీ వార్షిక విందుకు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం www.mgmnt.org లేదా ఎంజీఎమ్ఎన్టీ బోర్డు తోటకూర ప్రసాద్-8173004747, పీయూష్ పటేల్-2148509828, ఇందూ రెడ్డి మాదండి-2145663159, కల్వల రావు-7323090621, సల్మాన్ ఫర్షోరీ-4695852104, తయబ్ కుంద్వాలా-697330859, మొద్గిల్ షబ్నమ్-2146751754, జాక్ గొద్వాని-9726933826, జాన్ హమ్మోన్డ్- 9729045904 లను సంప్రదించాలని పేర్కొన్నారు. -
నేడు మహత్మా గాంధీజీ 146వ జయంతి
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
నేడు సీఎం జగన్ ప్రచార సభలు ఇలా..
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement