-
పొంచివున్న చైనా కొత్త ముప్పు
చైనాలోని గన్సు ప్రావిన్స్లో 119 అధునాతనమైన భూగర్భ క్షిపణి వేదికల ప్రయోగ కేంద్రాలను చైనా నిర్మిస్తున్నట్లు మోంటెరీలోని జేమ్స్ మార్టిన్ అణుపరీక్షల నిషేధ అధ్యయన సంస్థకు చెందిన పరిశోధకులు కనుగొన్నారు. చైనా నిర్మిస్తున్న అత్యధునాతనమైన డీఎఫ్–41 అనే పేరున్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల నిల్వ కేంద్రాలుగా ఈ నిర్మాణాలను ఉపయోగించవచ్చు. ఈ క్షిపణుల పరిధి 15,000 కిలోమీటర్లు. ప్రపంచంలో ఏ ప్రాంతాన్నయినా ఇవి ధ్వంసం చేయగలవు. ఇప్పటికే ఉనికిలో ఉన్న అణ్వాయుధాల వ్యవస్థలో భారీ పెట్టుబడులు పెట్టడం ద్వారా, ఆమెరికా అణ్వాయుధ ఆధిక్యతను ఎదుర్కోవాలనే ప్రయత్నంలో భాగంగా చైనా ఈ భూగర్భ క్షిపణి ప్రయోగ కేంద్రాలను నిర్మిస్తున్నట్లు అంచనా. ఈ పరిణామాలన్నింటినీ మూడు కారణాల వల్ల భారత ప్రభుత్వం పరిశీలించాల్సి ఉంది. మొదటగా, అమెరికా, చైనా మధ్య పోటీ... అంతర్జాతీయ రాజకీయాల్లో అణ్వాయుధాల పాత్రకు అత్యంత ప్రాధాన్యత కలిగించనుంది. అణ్వాయుధాలు దేశాల మధ్య యుద్ధం విషయంలో మహా సమానత (ఈక్విలైజర్)ను ఏర్పర్చేవని చెబుతుంటారు. ఎందుకంటే శక్తిలేని దేశాల చేతికి చిన్నస్థాయి అణ్వాయుధం వచ్చినా సరే.. బలమైన శత్రుదేశాలను అది అడ్డుకోగలదు. భారతగడ్డపై అతిపెద్ద సంప్రదాయ ఆయుధాలతో దాడులు జరిపించిన తర్వాత కూడా భారత్ నుంచి భారీ ప్రతీకార దాడులతో దెబ్బతినకుండా పాకిస్తాన్ను కాపాడింది.. అది సేకరించి పెట్టుకున్న అణ్వాయుధాలేనని చెప్పాలి. భారత్, చైనా వివాదాల్లో అణ్వాయుధాల ప్రభావం తక్కువే కానీ, భారత్ కూడా అణ్వాయుధాలను సాధించినప్పటినుంచి, చైనా 1962 నాటి సైనిక విజయాలను ఇకపై కొనసాగిస్తుందని ఊహించడానికి కూడా సాధ్యం కాకుండా పోయింది. అణ్వాయుధాలు చిన్నస్థాయి విజయాలు తెచ్చిపెడతాయనే అంశాన్ని తోసిపుచ్చలేం. అయితే బాలిస్టిక్ క్షిపణులలో అత్యంత కచ్చితత్వం విషయంలో సాధించిన విప్లవం కానీ, ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో రిజల్యూషన్ పెరగడం, అత్యంత తక్కువ ధ్వనితో ప్రయాణించే జలాంతర్గాములను కనుగొనడంలో సాధించిన నైపుణ్యం కానీ, అణ్వాయుధాలను సాధించడంద్వారా శక్తిహీనమైన దేశాలు పొందిన ఈ మహా సమానత అవకాశాన్ని తోసిపుచ్చాయి. అమెరికా వంటి సాంకేతికంగా సంపన్న దేశాలు ఇప్పుడు తమ ప్రత్యర్థి దేశాల అణ్వాయుధ శక్తులను సులభంగా కనుగొనేలా తమ ఉపగ్రహాలను ఉపయోగించగలవు. అంతేకాకుండా కఠినతరమైన ఆయుధ షెల్టర్లను కూడా ధ్వంసం చేసే అత్యంత నిర్దిష్టమైన క్షిపణులను ఇవి ప్రయోగించగలవు. అమెరికా సాంకేతిక ఆధిపత్యం ముందు తాను నిలబడలేనని చైనా గుర్తించిన తర్వాతే అనేక ప్రతిఘటనా వ్యవస్థల నిర్మాణం వైపు చైనా పురోగమించింది. భూగర్భ క్షిపణి ప్రయోగ కేంద్రాలు కూడా దాంట్లో భాగమే. భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్, చైనాకు వ్యతిరేకంగా భారత్ కూడా ఈ కోవలోనే సాగే అవకాశం ఉంది. చైనా అణ్వాయుధాల దుర్భేద్యం అనేది భారత్కి శుభసూచకం కాకపోవచ్చు. ఎందుకంటే, చైనా అణ్వాయుధాలు అమెరికా రక్షణకే ప్రమాదం అనుకున్నప్పుడు, దాంతో పోలిస్తే భారత్కు మరీ ప్రమాదకరం. భారతీయ జలాంతర్గాములను నిర్మూలించ డానికి హిందూ మహాసముద్రంపై అణ్వాయుధాలతో కూడిన జలాంతర్గాములను మోహరించే లక్ష్యంతో.. అధునాతన కౌంటర్ ఫోర్స్ ప్లాట్ఫామ్లపై పెట్టుబడి పెట్టాలని చైనా నిర్ణయించుకుంటే అది భారత్కు నిజంగా ప్రమాదకరమే. శత్రుదాడులనుంచి తట్టుకోగల అణ్వాయుధ శక్తిని చైనా మోహరించగలదా లేదా అనే అంశంపై నిపుణులకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులపై పెట్టుబడి పెట్టిన చైనాకు పూర్తి రక్షణతో కూడిన అణ్వాయుధ శక్తిని నిర్మించుకునే సామర్థ్యం ఉంటుందని కొందరు అణ్వాయుధ నిపుణులు చెబుతుండగా, మరికొందరు నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకే ఒక్క స్పష్టమైన దాడితో చైనావద్ద ఉన్న దీర్ఘ శ్రేణి క్షిపణులను తుడిచిపెట్టగలనని అమెరికా నమ్ముతున్నట్లయితే, అవసరమైతే ఆ దేశం అంత పనీ చేయగలుగుతుంది. ప్రత్యేకించి అమెరికా నగరాలను ధ్వంసం చేయగల అణ్వాయుధాన్ని మొట్టమొదటగా చైనా ప్రయోగించే ప్రమాదం ఉందని అమెరికా భావిస్తోంది. చైనాపై భారీస్థాయి అణుదాడికి పూనుకోవాలని అమెరికా నిర్ణయించి ఒకమేరకు ఆ ప్రయత్నంలో విజయం సాధించిన పక్షంలో, చైనా వద్ద మిగిలి ఉన్న మధ్య, స్వల్ప శ్రేణి క్షిపణులు అమెరికాతోపాటు జపాన్, దక్షిణ కొరియా, భారత్ వంటి దాని వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలను కూడా చేరుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అమెరికా ప్రత్యర్థులు దీర్ఘ శ్రేణి క్షిపణులను సేకరించి పెట్టుకున్న ప్పుడు, అణ్వాయుధాల ప్రయోగం నుంచి తన మిత్రదేశాలకు అమెరికా కల్పించే రక్షణ ఛత్రం బలహీనపడిపోతుందని కొందరు వాదిస్తున్నారు. ఎందుకంటే అమెరికా ప్రభుత్వం తన మిత్రదేశాలకు అనుకూలంగా జోక్యం చేసుకోవాలని నిర్ణయించుకుంటే, దాని ప్రత్యర్థులు నేరుగా అమెరికా భూభాగంపైనే దాడికి దిగే అవకాశం ఉంది. అణ్వాయుధాల ప్రయోగం నుంచి బయటపడే పద్ధతి కొన్ని అంశాలతో ముడిపడి ఉంటుంది. అమెరికాకు చెందిన క్షిపణి రక్షణ వ్యవస్థల, ఎదురుదాడి ప్రమాదంతో చైనా వ్యవహరించాల్సి వచ్చినప్పుడు భూగర్భ క్షిపణి వ్యవస్థలను నిర్మించతలపెట్టడం కాస్త ఆశ్చర్యం కలిగించకమానదు. ఒకే చోట స్థిరంగా ఉంచిన ఈ తరహా క్షిపణులను రాడార్ ఉపగ్రహాలను ఉపయోగించి రాత్రింబవళ్లు పర్యవేక్షించవచ్చు. బహుశా అమెరికా అణ్వాయుధ దాడిని సంక్లిష్టం చేయడానికి తన భూగర్భ క్షిపణి వ్యవస్థలను చైనా అటూఇటూ తరలించే ప్రయత్నం చేయవచ్చు లేక వీటిలో కొన్నింటిని డమ్మీలుగా ఉపయోగించవచ్చు. ఒకే సమయంలో అసలు క్షిపణి వ్యవస్థలను, వీటిని కూడా ఉపయోగించవచ్చు. తీవ్రస్థాయిలో ఎదురుదాడి సామర్థ్యం కలిగిన బలమైన ప్రత్యర్థులతో ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తాయి అనే విషయంలో చైనా ఒక ఉదాహరణగా నిలుస్తోంది. భారత్ వద్ద ఉన్న ఎదురుదాడి క్షిపణి వ్యవస్థలను పాకిస్తాన్ ఎదుర్కొవలసి వస్తున్నప్పటికీ భూగర్భ క్షిపణి వ్యవస్థల విషయంలో చైనా అనుసరిస్తున్న పద్ధతిని పాక్ పాటించకపోవచ్చు. ఎందుకంటే చైనా లాగా కాకుండా, పాక్ సైన్యం అణ్వాయుధాలపై అధికంగా నియంత్రణ కలిగి వుంది. పైగా అమెరికాతో ఘర్షించే పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నాయని చైనా గ్రహిస్తున్నందువల్లే భూగర్భ క్షిపణి వ్యవస్థల నిర్మాణం దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఇదే భారత్పై, దాని విదేశాంగ విధానంపై అనేక ప్రభావాలను కలిగిస్తోంది. చైనా ఇంతకుముందు కూడా భూగర్భ క్షిపణి వ్యవస్థలను కలిగి ఉండేది కానీ ఇంత పెద్ద స్థాయిలో నిర్మించటం గతంలో ఎన్నడూ లేదు. ఈ నూతన పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలించాల్సి ఉంది. ఎందుకంటే అణ్వాయుధాల భవిష్యత్తు మొదలుకుని, ఇండో–పసిఫిక్ ప్రాంతంలో యుద్ధం జరిగి అవకాశం వరకు అన్నింటిపై వీటి ప్రభావం తప్పక ఉంటుంది. కునాల్ సింగ్, పీహెచ్డీ స్కాలర్ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ -
ఊరంతటికీ ఒక్కడే!
ఔరూరా! ఊరికొక్కడు అంటారు సరే... ఆ ఊళ్లో ఉండేది మాత్రం అతడొక్కడే! ఇంకెవరూ ఉండరక్కడ. ఇంకోలా చెప్పాలంటే ఆ ఊరి జనాభా ఒక్క మనిషి మాత్రమే! ఏమా ఊరు? ఏమా కథ... అనుకుంటున్నారా? అలాంటి ఊరు ఏదో ఒక ఒంటరి దీవిలో ఉంటుందనుకుంటున్నారా? ఆగండాగండి... ఆ ఊరు ఏ ఒంటరి దీవిలోనో లేదు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల చైనాలోని గన్సు ప్రావిన్స్లో ఉంది. ఆ ఊరి పేరు జువెన్షాన్షె. ఆ ఊళ్లో ఉండే ఒకే ఒక్కడి పేరు లియు షెంగ్జియా. ఇరవయ్యేళ్ల కిందట ఆ ఊళ్లోనూ మనుషులు ఉండేవారు. అప్పట్లో దాదాపు ఇరవై కుటుంబాలు ఉండేవి. కరువు కాలం దాపురించడంతో ఒక్కొక్కరే ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. ఇంకొందరు ఊళ్లోనే కన్నుమూశారు. పదేళ్ల కిందట... అంటే 2006 నాటికి చూసుకుంటే ఆ ఊళ్లో లియు కుటుంబం ఒక్కటే మిగిలింది. అప్పట్లో మంచాన పడ్డ లియు తల్లి, అతడి తమ్ముడు కూడా అతడితో ఆ ఇంట్లోనే ఉండేవారు. ఏడాది గడిచేలోగానే వారిద్దరు కూడా అనారోగ్యంతో కన్నుమూశారు. అప్పటి నుంచి ఆ ఊళ్లో లియు ఒక్కడే మిగిలాడు. ఊళ్లో ఒక్కడూ మిగిలిన కొత్తలో తనకు రాత్రి సరిగా నిద్రపట్టేది కాదని, అయితే, క్రమంగా అలవాటైపోయిందని లియు చెబుతాడు. ఇప్పుడు అతడు ఆ ఊరికి సమీపంలోని అడవికి కాపలాదారుగా పనిచేస్తున్నాడు. ఈ ఉద్యోగం ద్వారా అతడికి నెలకు 700 యువాన్లు (107 డాలర్లు) వస్తాయి. తిండి కోసం, నీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, అయితే, ఇది తనకు పెద్ద సమస్య కాదని చెబుతాడు లియు. ఊళ్లో ఏ ఇంట్లో కావాలంటే ఆ ఇంట్లో ఉండగలనని, ఇక్కడ తనకు చాలా ప్రశాంతంగా ఉందని అంటాడు అతడు. -
బాలికను గాల్లోకెగరేసిన సుడిగాలి
చైనాలోని గాజౌ కౌంటీలోని యువాన్క్వాన్ టౌన్ ఎలిమెంటరీ స్కూల్లో ఆ రోజు స్పోర్ట్స్ డే. పిల్లలందరూ గ్రౌండ్లోకి వచ్చారు. అకస్మాత్తుగా గాలిదుమారం. పెనుగాలులు సుడులు తిరుగుతూ వచ్చేశాయి. టోర్నడో(పెద్ద సుడిగాలి) అని గ్రహించిన టీచర్లు అప్రమత్తమయ్యారు. పిల్లలందరూ నేలపై పడుకోవాలని అరిచారు. లీజియాకీ కాస్త లేట్ అయింది.. అంతే.. టోర్నడో ఆ బాలికను గాలిలోకి విసిరికొట్టింది. అయితే.. టోర్నడో ప్రభావం వెంటనే తగ్గిపోవడంతో లీజియాకీ ప్రాణాలు దక్కాయి. స్వల్ప గాయాలతో ఆమె బయటపడింది. ఈ వారం మొదట్లో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. -
ప్రాథమిక పాఠశాల టీచర్ కు మరణశిక్ష
బీజింగ్: విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడిన ప్రాథమిక పాఠశాల మాజీ టీచర్ కు చైనాలో మరణశిక్ష విధించారు. నిందితుడు లీ జిషున్ కు గురువారం గాస్సు ప్రావిన్స్ లోని టియాన్ షుయ్ నగరంలో మరణశిక్ష అమలు చేసినట్టు స్థానిక వార్తా సంస్థ తెలిపింది. 4 నుంచి 11 ఏళ్ల వయసున్న 26 మంది చిన్నారులను అతడు లైంగిక వేధింపులకు గురిచేసినట్టు టియాన్ షుయ్ ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్టు నిర్ధారించింది. 2011-2012 మధ్యకాలంలో అతడీ అకృత్యాలకు పాల్పడినట్టు తేల్చింది. చిన్నపిల్లల అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుని తరగతి గదులు, హాస్టళ్లలో అత్యాచారాలకు ఒడిగట్టాడని కోర్టు తెలిపింది. ఇలాంటి దురాగతాలు సమాజంపై చెడు ప్రభావం చూపిస్తాయనే భావనతో నిందితుడికి మరణశిక్ష విధించినట్టు న్యాయమూర్తి తీర్పు సందర్భంగా పేర్కొన్నారు. మరోకేసులో ఐదుగురు బాలికలపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి విధించిన మరణశిక్షను కోర్టు రెండేళ్ల పాటు నిలిపివేసింది. ఇటీవల కాలంలో లైంగిక వేధింపులు కేసులు పెరగడం పట్ల కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. 2012-2014 మధ్యకాలంలో చైనాలో 7,145 రేప్ కేసులను కోర్టులు విచారించాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వ్యక్తిపై అకారణంగా ఎస్ఐ దాడి
వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించండి
వైభవంగా శ్రీనివాసుడి కల్యాణోత్సవం
సీఎం జగన్తోనే బడుగుల అభ్యున్నతి
ముమ్మరంగా పోస్టల్ బ్యాలెట్
No Headline
నా మంచితనాన్ని.. చేతగానితనంగా తీసుకోవద్దు
టీడీపీ ప్రచారంలో యానిమేటర్
బాల్యవివాహాలను నియంత్రించాలి
ఆదివాసీల హక్కుల జోలికొస్తే ఊరుకోం
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement