-
పథకం ప్రకారమే హత్య చేసి గ్యాస్ పేల్చారా?
హైదరాబాద్ (జీడిమెట్ల) : అనుమానాస్పదస్థితిలో ఇద్దరు యువకులు మృతిచెందిన సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ పవన్, స్థానికుల కథనం ప్రకారం..సుభాష్ నగర్ డివిజన్ రాంరెడ్డి నగర్లోని ఓ ఇంట్లో ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 8 మంది యువకులు అద్దెకు ఉంటూ.. అన్సారీ అనే కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి యువకులు వారు ఉండే గదిలోనే గొడవపడ్డారు. అరుపులు, పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయని స్థానికులు తెలిపారు. రాత్రి 8 గంటలకు ఓ యువకుడు ఆ గది నుంచి అకస్మాత్తుగా బయటకు వచ్చి ‘గ్యాస్ లీక్ అవుతోంది..ఇక్కడి నుండి పారిపోండి’ అని అరుస్తూ అక్కడి నుంచి పారిపోయాడు. అతడు వెళ్లిన రెండు నిమిషాల్లోనే భారీ పేలుడు సంభవించింది. భవనం గోడ ఓ పక్కకు కూలిపోయింది. మంటలు చెలరేగాయి. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న జీడిమెట్ల ఫైర్ సిబ్బంది ఘటనాస్ధలికి వెళ్లి మంటలను ఆర్పివేశారు. అనంతరం పరిశీలించగా ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన నబీదుద్దీన్ (20), బీరేందర్ (35)ల మృతదేహాలు లభించాయి. పేలుడు ధాటికి వీరు మృతిచెందారు. ఘటనా స్థలిలో 4 గ్యాస్ సిలిండర్లు చిందరవందరగా పడి ఉన్నాయి. పథకం ప్రకారమే హత్య చేసి గ్యాస్ పేల్చారా? ఉదయం నుంచి జరిగిన గొడవల్లో భాగంగా..నబీదుద్దీన్, బీరేందర్లను చంపి అనుమానం రాకుండా గ్యాస్ సిలిండర్లను పేల్చి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. గదిలో ఉండే యువకులు ఎవరూ లేకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్ట్మార్టం అనంతరం వాస్తవాలు వెలుగులోకి వస్తాయని బాలానగర్ ఏసీపీ గంగారాం పేర్కొన్నారు. -
గ్యాస్ పేలుడు ఘటన.. చికిత్స పొందుతూ మహిళ మృతి
హైదరాబాద్: గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ వృద్ధురాలు శుక్రవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ నెల 7న ఎల్బీనగర్ భరత్నగర్, ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చిన్నారిసహా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వీరిలో తీవ్రంగా గాయపడిన సాలమ్మ అనే వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతిచెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది
నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!
శోభిత పోస్ట్.. సమంత స్టైలిష్ట్ రిప్లై
ముంబై ఎయిర్పోర్టులో 12 కోట్ల విలువైన బంగారం, ఐఫోన్లు సీజ్
ఎన్నికల వేళ కలకలం.. బీజేపీ మంత్రిని చంపేస్తామని బెదిరింపులు!
సంజయ్లీలా భన్సాలీ 'హీరామండి' వెబ్ సిరీస్ ఎలా ఉంది..?
నాడు మోదీకి వంట వండిన దీపక్.. ఇప్పుడేం చేస్తున్నారు?
కాన్వాయ్ స్లో చేసి అంబులెన్స్కు దారిచ్చిన సీఎం జగన్ (ఫొటోలు)
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
ఎల్లో శారీలో హీరామండి హీరోయిన్ సంజీదా షేక్ లుక్స్.. ఫోటోలు
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement