-
సూడాన్లో చిక్కుకున్న తెలంగాణ వాసుల తరలింపుపై సమీక్ష!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం 'ఆపరేషన్ కావేరి' పేరుతో సూడాన్లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించే కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సౌదీ అరేబియాలోని జెడ్డాకు చేరుకున్న భారతీయులను దశల వారిగా ఢిల్లీ, ముంబైలకు తరలించింది. ఇప్పటి వరకు సూమారు 160 మంది భారతీయులు ఢిల్లీకి చేరుకున్నట్లు సమాచారం. ఈ మేరకు విదేశాంగ శాఖ సూడాన్ నుంచి వస్తున్న భారతీయుల విషయమై అన్ని రాష్ట్రాల రెసిడెంట్ కమిషనర్లను అప్రమత్తం చేసింది.ఈ నేపథ్యంలో ఢిల్లీ తెలంగాణ భవన్లో తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఈ అంశంపై అధికారులతో సమీక్ష జరిపారు. దీని కోసం ఢిల్లీ తెలంగాణ భవన్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ రోజు మొత్తం నలుగురు తెలంగాణ వాసులు వస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ వచ్చే వారికి ఇక్కడే వసతి, భోజనం ఏర్పాటు చేసి హైదరాబాద్కు పంపే ఏర్పాటు చేస్తున్నట్ల రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. అంతేగాదు ఉక్రెయిన్ నుంచి వచ్చిన వారిని ఏవిధంగా అయితే తెలంగాణకు పంపామో అదే తరహాలో పంపించేలా.. ఢిల్లీలో ఏర్పాట్లు చేస్తున్నట్లు గౌరవ్ ఉప్పల్ వెల్లడించారు. (చదవండి: ముమ్మరంగా 'ఆపరేషన్ కావేరి'.. సూడాన్ నుంచి మరో 135 మంది తరలింపు) -
సెలూన్ లో కలెక్టర్ షేవింగ్..
పేటీఎం ద్వారా చెల్లింపులు కనగల్: నగదు రహిత లావాదేవీలపై నల్లగొండ జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ప్రచారం నిర్వహిస్తున్నారు. మంగళవారం కనగల్ మండలం చిన్నమాదారంలో పర్య టించిన ఆయన క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఓ హెయిర్ సెలూన్ లో షేవింగ్ చేయించుకున్న కలెక్టర్.. తన మొబైల్ ఫోన్ నుంచి పేటీఎం ద్వారా నగదు రహిత చెల్లింపులు నిర్వహించారు. మారుమూల కుగ్రామంలో ఉన్న చిన్న కటింగ్ డబ్బాలో కలెక్టర్ షేవింగ్ చేయించుకోవడంతో స్థానికులు ఆశ్చర్య పోయారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీల గ్రామాలుగా మార్చేందుకు జిల్లాలో 11 పల్లెలను ఎంపిక చేశామన్నారు. ఇందులో చినమాదారం గ్రామం ఒక్కటని చెప్పారు. -
కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
రామగిరి : జిల్లా కేంద్రం రామగిరి శ్రీనివాసనగర్లో గల వికలాంగుల వసతి గృహాన్ని శనివారం గౌరవ్ ఉప్పల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ఉన్న సమస్యలను పరిశీలించారు. ముందస్తుగా లైట్ల వసతి కల్పించాలని, మంచాలు, బెడ్షీట్స్, పుస్తకాలు, తదితర సామగ్రిని వెంటనే అందించాలని ప్రాధాన్యత క్రమంలో అవసరమై వస్తువులను సరఫరాచేయాలని స్త్రీ శిశు సంక్షేమశాఖ పీడీ పుష్పలతను ఆదేశించారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని అన్ని రూమ్లు తిరుగుతూ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ప్రాధాన్యతాక్రమంలో వసతులు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. వసతి గృహం పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. అంతకు ముందు బోయవాడలోని బాలసదన్ను సందర్శించి అక్కడ నెలలు మాత్రమే నిండిన చిన్నారుల ఆలనా పాలనా గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కంచర్ల యాదయ్యగౌడ్, విద్యార్థులు తదితరులున్నారు. -
జిల్లా కలెక్టర్గా లక్ష్మీనరసింహం
శ్రీకాకుళం పాతబస్టాండ్ : జిల్లా కొత్త కలెక్టర్గా పి.లక్ష్మీనరసింహాన్ని ప్రభుత్వం నియమించింది. కొద్దిరోజుల క్రితం వరకు కలెక్టర్గా ఉన్న గౌరవ్ ఉప్పల్ ను తెలంగాణ క్యాడర్కు కేటాయించడంతో ఈ నెల మూడో తేదీన ఆయన రిలీవై వెళ్లిపోయారు. జాయింట్ కలెక్టర్ వివేక్యాదవ్ ప్రస్తుతం ఇన్చార్జి కలెక్టర్గా వ్యవహరిస్తున్నారు. కాగా బుధవారం జరిపిన ఐఏఎస్ల పోస్టింగులు, బదిలీల్లో భాగంగా లక్ష్మీనరసింహం జిల్లా కలెక్టర్గా రానున్నారు. రాష్ట్ర సచివాలయంలోని భూపరిపాలనలో ప్రస్తుతం పని చేస్తున్న ఆయన గ్రూప్ వన్ అధికారిగా ప్రభుత్వ సర్వీసులో చేరి, 2008లో ఐఏఎస్ హోదా పొందారు. ఆ వెంటనే విజయనగరం జిల్లా అదనపు కలెక్టర్గా పని చేశారు. 2010 నుంచి 2013 వరకు ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. అక్కడి నుంచి భూ పరిపాలన విభాగానికి బదిలీ పలు పదవులు నిర్వహించారు. ప్రస్తుతం సీసీఎల్ఏలో విజిలెన్స్ విభాగాధిపతిగా పనిచేస్తున్నారు. గతంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి పి గోపాలక్రిష్టారెడ్డి వద్ద పీఎస్గా పనిచేశారు. హూద్హుద్ తుపాను సమయంలో సహయ చర్యల పర్యవేక్షణకు జిల్లాకు వచ్చిన ఆయనపాలకొండ డివిజన్లో పని చేశారు. కలెక్టర్గా నియమిస్తూ ఉత్తర్వులు విడుదల కావడంతో బుధవారం విజయవాడలో ముఖ్యమంత్రి నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఇన్చార్జి కలెక్టర్ వివేక్యాదవ్తో పాటు ఈయన కూడా పాల్గొన్నారు. అయితే కొత్త కలెక్టర్ విధుల్లో చేరేందుకు కొద్ది రోజులు పట్టవచ్చని తెలిసింది. -
అర్హతే కొలమానం
శ్రీకాకుళం అర్బన్: పింఛన్ లబ్ధిదారుల ఎంపికకు అర్హతే కొలమానమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగానే లబ్ధిదారుల ఎంపిక చేపడుతున్నామన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని శ్రీకాకుళంలోని బాపూజీ కళా మందిరంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వారి పింఛన్లను తొలగించే ప్రసక్తే లేదని.. ప్రతి ఒక్క అర్హుడూ లబ్ధి పొందాల్సిందేనన్నారు. గత పది సంవత్సరాలుగా ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా 10 లక్షల మంది అనర్హులు లబ్ధి పొందినట్టు పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ఎలా పరిష్కరించాలో ముఖ్యమంత్రి చంద్రబాబుకి తెలుసునన్నారు. ప్రజల వద్దకే అధికార యంత్రాంగం వెళ్లి వారి సమస్యల పరిష్కరించాలనే లక్ష్యంతోనే జన్మభూమి-మాఊరు కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అధికార యంత్రాంగం రోజంతా ఒకే గ్రామంలో ఉండి అక్కడి సమస్యలను తెలుసుకుంటారన్నారు. పేదల ఆరోగ్యానికి ఆసరా ఇవ్వాలనే ఉద్దేశంతోనే వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. 2029 సంవత్సరం నాటికి అభివృద్ధి చెందిన పేదరికం లేని పరిశుభ్ర రాష్ట్రంగా తయారు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందన్నారు. 2019 నాటికి పరిశుభ్ర భారత్లో భాగంగా పరిశుభ్ర రాష్ట్రాన్ని ఆవిర్భవించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. రైతులు, డ్వాక్రా సంఘాల రుణాల మాఫీకి ప్రత్యేక కార్పొరేషన్ను స్థాపించినట్టు వెల్లడించారు. జిల్లాలో రెండు మండలాలను 24 గంటల విద్యుత్ సరఫరాకు ఎంపిక చేసినట్టు మంత్రి ప్రకటించారు. అలాగే విద్యుత్ ఆదా చేయడానికి పేదలకు రూ. 400 విలువ చేసే ఎల్ఈడీ బల్బును పది రూపాయలకే అందిస్తున్నామని, ఇందుకోసం జిల్లాను ప్రయోగాత్మకంగా ఎంపిక చేశామన్నారు. ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం కింద పింఛన్ను ఐదురెట్లు పెంచి రెండు వందల పింఛన్ను రూ.వెరుు్య చేశామన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ జన్మభూమి మాఊరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని సెప్టెంబర్ 25న ప్రారంభించామని, ఈ కార్యక్రమం ఈ నెల 25వ తేదీ వరకూ కొనసాగుతోందన్నారు. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆధార్లో నమోదు కానివారు ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి గ్రామానికి విజన్ డాక్యుమెంట్లను రూపొందించనున్నట్లు తెలి పారు. ఈ సందర్భంగా స్వచ్ఛ ఆంధ్ర ప్రచార పోస్టర్లను మంత్రి తదితరులు విడుదల చేశారు. స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు మంత్రి బహుమతులు అందజేశారు. కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అదనపు జాయింట్ కలెక్టర్ ఎం.హెచ్.షరీఫ్, జిల్లా రెవెన్యూ అధికారి నూర్బాషా ఖాసీం, మెప్మా పీడీ ఎం.సత్యనారాయణ, డీఆర్డీఏ పీడీ ఎస్.తనూజారాణి, డ్వామా పీడీ ఎ.కల్యాణ చక్రవర్తి, డీఈవో ఎస్.అరుణకుమారి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు చౌదరి బాబ్జీ, నాయకులు జామి భీమశంకర్, పి.వి.రమణ, వెంకటలక్ష్మి, సుగుణ పాల్గొన్నారు. తొలిరోజు ఆర్భాటమే ! శ్రీకాకుళం పాతబస్టాండ్: జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో తొలి రోజైన గురువారం ఆర్భాటమే మిగిలింది. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అన్ని సంక్షేమాలకు, హమీలకు ఆక్టోబర్ రెండో తేదీ గడువని ప్రజలను పాలకులు నమ్మిస్తూ వచ్చారు. పలు పథకాలు, పెరిగిన పింఛన్లు ప్రజలకు అందజేయనున్నట్టు ప్రచారం చేశారు. అయితే జన్మభూమి ప్రారంభంతో మాత్రం ప్రజల ఆశలు తీరలేదు. అన్ని ఆరకొరగానే జరిగాయి. అయితే నాలుగో తేదీ శనివారం నుంచి జన్మభూమి కార్యక్రమం పూర్తిస్థారుులో ప్రారంభం కానున్నట్టు అధికారులు చెబుతున్నారు. తొలిరోజు జిల్లా అంతటా గాంధీ జయంతి ఉత్సవాలు, ర్యాలీలు నిర్వహించారే తప్పా హామీల మేరకు సంక్షేమ పథకాలు మాత్రం ప్రారంభం కాలేదు. సుజలధార పథకం శ్రీకాకుళం పట్టణంతోపాటు మరో రెండుచోట్ల మాత్రమే ప్రారంభించారు. నిరంతర విద్యుత్ కార్యక్రమం ప్రారంభం కాలేదు. వైద్య శిబిరాలు నిర్వహించలేదు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా నామమాత్రంగానే ప్రారంభమైంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement