-
అల్లు అర్జున్ బాటలో విజయ్.. ట్యూషన్కు సిద్దమైన ‘రౌడీ’ హీరో!
విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. 'వీడీ12' అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కబోయే ఈ మూవీ ఫస్ట్లుక్ పోస్టర్ను ఇటీవల విడుదల చేసింది చిత్ర బృందం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ను జరుపుకుంటున్న ఈ మూవీ త్వరోలోనే సెట్స్పై రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. అయితే లైగర్తో ఫ్యాన్స్ను నిరాశ పరిచిన విజయ్ ఈసారి గట్టి హిట్ కొట్టాలని ఆశగా ఎదురు చూస్తున్నాడు. చదవండి: చిరంజీవి మెసేజ్ను అవాయిడ్ చేసిన స్టార్ యాంకర్! అసలేం జరిగిందంటే.. ఈ నేపథ్యంలో గౌతమ్ తిన్ననూరి మూవీ కోసం విజయ్ స్పెషల్గా ట్యూషన్కు వెళ్లనున్నాడని తెలుస్తోంది. ఇందుకోసం జానపద గాయకుడు, రచయిత పెంచల్ దాస్ను విజయ్ సంప్రదించబోతున్నట్లు ఫిలిం దూనియాలో వినికిడి. వీడీ12 మూవీ కథ చిత్తూరు ప్రాంతం చూట్టు తిరుగుతుందట. ఇందులో విజయ చిత్తూరు యువకుడిగా బాడీ లాగ్వేజ్, ఆ యాసలోనే మాట్లాడాల్సి ఉంటుందట. తెలంగాణ స్టాంట్లో అదరగొట్టే విజయ్కి చిత్తూరు యాస రావడం కొంచం కష్టమే. ఇందుకోసం విజయ్ గట్టిగానే కసరత్తు చేయాల్సి ఉంటుంది. అందుకోసం పెంచల్ దాస్ దగ్గర స్పెషల్గా ట్రెయినింగ్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట. చదవండి: విజయ్ వారసుడు ఓటీటీ స్ట్రీమింగ్ ఇక్కడే! అంతకు ముందే రిలీజ్? ఈ నేపథ్యంలో త్వరలోనే విజయ్ అయనను కలిసి ట్యూషన్ తీసుకోనున్నాడట. కాగా అల్లు అర్జున్ పుష్ప సినిమాలో చిత్తూరు యాసలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. అయితే సీక్రెట్ బన్ని పంచల్ దాస్ దగ్గర ఈ ట్రెయిన్ అయ్యాడు. అయితే ఈ వార్తలు బయటకు రాకుండ బన్నీ జాగ్రత్త పడ్డాడు. ఇప్పుడు అల్లు అర్జున్ బాటలోనే విజయ్ కూడా చిత్తూరు యాస నేర్చుకునేందుకు సిద్దమయ్యాడిన సినీవర్గాల నుంచి సమాచారం. మరి వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే మూవీ టీం, విజయ్ నుంచి క్లారిటీ వచ్చే వరకు వేచి చూడాలి. కాగా విజయ్ మరోవైపు ఖుషి మూవీతో బిజీగా ఉన్నాడు. ఇందులో విజయ్ జోడిగా సమంత నటిస్తున్న విషయం తెలిసిందే. -
బాలీవుడ్లో సినిమాలు చేస్తున్న తెలుగు డైరెక్టర్లు
హిందీ దర్శకులు తెలుగులో సినిమాలు చేయడం చాలా అరుదు. తెలుగు దర్శకులు హిందీకి వెళ్లడం కూడా అరుదే. అయితే ఇప్పుడు ఒకేసారి ఐదుగురు దర్శకులు హిందీ చిత్రాలు చేస్తున్నారు. హిందీ పరిశ్రమ మనవాళ్లకు ‘స్వాగ్ సే స్వాగత్’ పలికింది. అంటే... ఆత్మీయ స్వాగతం పలికింది. ఆ ఆహ్వానం అందుకున్న దర్శకుల గురించి తెలుసుకుందాం. తెలుగులో వీవీ వినాయక్ స్టార్ డైరెక్టర్. దాదాపు 20 ఏళ్లుగా ఇక్కడ సినిమాలు చేస్తున్నారు. తొలి సినిమా ‘ఆది’ (2002)తోనే ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు అందుకున్న వీవీ వినాయక్ ఆ తర్వాత ‘దిల్’(2003), ‘ఠాగూర్’(2003), ‘బన్నీ’(2005), ‘కృష్ణ’ (2008) ‘అదుర్స్’ (2010), ‘ఖైదీ నంబరు 150’ (2017) వంటి హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు హిందీ సినిమా చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించిన హిట్ మూవీ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్తో ఆయన దర్శకుడిగా బీ టౌన్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరో. ఇటు సాయి శ్రీనివాస్కు కూడా హిందీలో ‘ఛత్రపతి’యే తొలి సినిమా కావడం విశేషం. ఇక ‘అర్జున్రెడ్డి’ (2017) సక్సెస్తో డైరెక్టర్గా ఫుల్ క్రేజ్ సంపాదించిన సందీప్ రెడ్డి వంగా ఇదే సినిమాను హిందీలో షాహిద్ కపూర్తో ‘కభీర్ సింగ్’ (2019)గా రీమేక్ చేసి, బాలీవుడ్లోనూ నిరూపించుకున్నారు. ఇప్పుడు హిందీలో రణ్బీర్ కపూర్తో ‘యానిమల్’ సినిమా చేస్తున్నారు సందీప్. మరోవైపు తొలి చిత్రం ‘ఘాజీ’తోనే జాతీయ అవార్డు సాధించి ఇండస్ట్రీ దృష్టిని వెంటనే తన వైపు తిప్పుకున్న యంగ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి కూడా బీ టౌన్ దర్శకుల లిస్ట్లో చేరారు. విద్యుత్ జమాల్ హీరోగా‘ఐబీ 71’ అనే స్పై థ్రిల్లర్ను తీయనున్నారు సంకల్ప్. జాతీయ అవార్డు సాధించిన మరో తెలుగు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కూడా హిందీకి హాయ్ చెబుతున్నారు. ‘మళ్ళీ రావా’(2017) వంటి ఫీల్గుడ్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల మెప్పు పొందిన గౌతమ్ 2019లో నానీతో తీసిన ‘జెర్సీ’కి జాతీయ అవార్డు లభించింది. ఈ చిత్రం షాహిద్ కపూర్ హీరోగా హిందీలో రీమేక్ అయ్యింది. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరియే దర్శకుడు. ఈ ఏడాది నవంబరు 4న విడుదల చేయాలనుకుంటున్నారు. విశ్వక్ సేన్ ‘హిట్’ (2020) చిత్రంతో దర్శకుడిగా హిట్టయ్యారు శైలేష్ కొలను. తెలుగు ప్రేక్షకులు ‘హిట్’ చేసిన ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాకు శైలేష్ కొలనుయే డైరెక్టర్. ఇందులో రాజ్కుమార్ రావు హీరోగా నటిస్తారు. ప్రముఖ సంగీత దర్శకులు యం.యం. కీరవాణి తనయుడు శ్రీ సింహా హీరోగా పరిచయమైన చిత్రం ‘మత్తువదలరా’ (2019)తో దర్శకుడిగా పరిచయమయ్యారు రితేష్ రాణా. ఈ చిత్రం హిందీ రీమేక్తో దర్శకుడుగా రితేష్ బీ టౌన్లో అడుగుపెట్టనున్నారని తెలుస్తోంది. వీరితో పాటు మరికొంతమంది టాలీవుడ్ దర్శకులు బాలీవుడ్కు డైరెక్షన్ మార్చారు. ఇదిలా ఉంటే.. ఈ దర్శకులందరూ హిందీలో డైరెక్ట్ సినిమా ద్వారా పరిచయమవుతుంటే, ప్యాన్ ఇండియన్ సినిమాల ద్వారా మరికొందరు హిందీ ప్రేక్షకులకు హాయ్ చెప్పనున్నారు. -
గురుశిష్యులు
సాధారణంగా అందరికీ లైఫ్లో గురువు పాత్రను ఎక్కువగా తండ్రే పోషిస్తారు. బాలీవుడ్ నటుడు షాహిదీ కపూర్కు వాళ్ల నాన్న పంకజ్ కపూరే గురువు. ఇప్పుడు ఆన్స్క్రీన్ కూడా తనయుడికి గురువు పాత్రలో కనిపించబోతున్నారు. తెలుగు సూపర్హిట్ సినిమా ‘జెర్సీ’ హిందీ రీమేక్లో నటించనున్నారు షాహిద్. తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి హిందీ రీమేక్ను డైరెక్ట్ చేయనున్నారు. అల్లు అరవింద్, ‘దిల్’ రాజు, అమన్ గిల్ నిర్మించనున్నారు. ఈ సినిమాలో షాహిద్ మెంటర్గా (తెలుగులో సత్యరాజ్ పోషించిన పాత్ర) ఆయన తండ్రి పంకజ్ కపూర్ నటించనున్నారని తెలిసింది. ఈ నెలాఖారున షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్ట్ 28న రిలీజ్ కానుంది. -
మరో రీమేక్
సౌత్లో సక్సెస్ఫుల్ సినిమాలు బాలీవుడ్ రీమేక్కి దారి ఇస్తున్నాయి. ఆ దారిలో బాలీవుడ్కు వెళ్తున్న చిత్రం ‘జెర్సీ’. నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ సినిమాను ఇటు విమర్శకులు అటు ప్రేక్షకులు సూపర్ అన్నారు. ఇప్పుడు ‘జెర్సీ’ హిందీ రీమేక్లో నాని పాత్రను షాహిద్ కపూర్ చేస్తున్నారు. తెలుగు వెర్షన్ను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి హిందీ రీమేక్ని కూడా డైరెక్ట్ చేస్తున్నారు. అల్లు అరవింద్, ‘దిల్’ రాజు, అమన్ గిల్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 28న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. షాహిద్ గత చిత్రం ‘కబీర్ సింగ్’ తెలుగు ‘అర్జున్ రెడ్డి’కి రీమేక్ అని తెలిసిందే. తన కెరీర్ బెస్ట్ హిట్గా ‘కబీర్ సింగ్’ సినిమా నిలిచింది. ఇప్పుడు ‘జెర్సీ’ రీమేక్ తన హిట్ ట్రాక్ని కొనసాగిస్తుందనే అంచనాలు ఉన్నాయి. -
జెర్సీ దర్శకుడితో మెగా హీరో
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం జెర్సీ. మళ్ళీరావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ టాలీవుడ్కు పరిచయం అయ్యారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతోంది. దీంతో దర్శకుడు గౌతమ్ను భారీ ఆఫర్లు వరిస్తున్నాయి. ప్రస్తుతం జెర్సీ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న గౌతమ్ తన తదుపరి చిత్రాన్ని మెగా హీరోతో చేసేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి ప్రయోగాత్మ చిత్రాలకు ఓటు వేస్తున్న మెగా హీరో వరుణ్ తేజ్, గౌతమ్తో సినిమా చేసేందుకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తుంది.ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నాడు. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న వరుణ్, గౌతమ్తో సినిమాను ఎప్పుడు ప్రారంభిస్తాడో చూడాలి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement