-
తిరుమలలో జిలెటిన్ స్టిక్స్ పట్టివేత
తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో విజిలెన్స్ అధికారులు జిలెటిన్ స్టిక్స్ పట్టుకున్నారు. వెంకట పథం రోడ్డులో 28 జిలెటిన్ స్టిక్స్,34 డిటోనేటర్స్ స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. పేలుడు పదార్ధాలన్నీ ఓ బ్యాగులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఎవ్వరినీ అదుపులోకి తీసుకోలేదు. ఇంజనీరింగ్ పనుల నిమిత్తం కాంట్రాక్టర్లు తెప్పించి ఉంటారని అనుమానిస్తున్నారు. వెంకటపథం మూడో విడత పనుల నిమిత్తం నిబంధనలకు వ్యతిరేకంగా తెప్పించారని ఆరోపణలు వస్తోన్నాయి. -
పాఠశాలలో పేలిన తూటా..
ఆరుగురు చిన్నారులకు గాయాలు భయభ్రాంతులకు గురైన తల్లిదండ్రులు తూటా పేలటంతో బయటపడ్డ నిజాలు తాడే: పల్లి రూరల్ (గుంటూరు)తాడేపల్లి పట్టణ పరిధిలోని పోలకంపాడు పెట్రోల్ బంక్ వద్ద ఉన్న ప్రాథమిక పాఠశాలలో కొండను పేల్చే తూటా పేలటంతో ఆరుగురు చిన్నారులకు శుక్రవారం గాయాలయ్యాయి. సేకరించిన వివరాల ప్రకారం పాఠశాలకు సబంధంలేని ఓ వ్యక్తి కొండను పేల్చే తూటా ఒకదానిని పాఠశాలకు తీసుకొచ్చాడు. అక్కడ విద్యార్థులు ఆ తూటాను తీసుకుని అందులో ఒక విద్యార్థి అగ్గిపెట్టెతో దానిని వెలిగించాడు. దీంతలో సమీపంలోని నలుగురు విద్యార్థులకు చేతులు, మొహం, తలజుట్లు కాలాయి. విద్యార్థులు భయభ్రాంతులతో పక్కకు పరిగెత్తారు. అంతలో తూటా పేలటంతో సమీపంలో ఉన్న మరో ఇద్దరు విద్యార్థులకు చాతిపైన, వీపుపైన రాళ్లు తగిలి గాయాలయ్యాయి. గాయపడిన ఆరుగురు విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు ఎటువంటి ప్రాథమిక చికిత్స నిర్వహించకుండా ఒంటిపై నీళ్లు పోసి ఇంటికి పంపించే ప్రయత్నం చేశారు. అంతలో సమీపంలో ఉన్న ఒక వ్యక్తి గాయపడిన విద్యార్థుల బంధువులకు, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. తల్లిదండ్రులకు పాఠశాలలో సమాధానం చెప్పేవారు లేకపోవటంతో ప్రధానోపాధ్యాయులకు ఫోన్ చే శారు. ఆయన దురుసుగా మాట్లాడటంతో పాఠశాల ముందే బైఠాయించారు. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకే ఆర్ ఎంపీ డాక్టర్ని పిలిపించి ఆందోళన చేపట్టారు. వెంపాటి వెంకట శివనాగేంద్ర అనే ఆరో తరగతి విద్యార్థికి చేతివేలికి గాయమవగా, మూడో తరగతి చదివే ఉమామహేష్కి భుజంపై గాయమైంది. వెంకటసాయి అనే మరొక బాలుడుకి, నాలుగో తరగతి చదివే వేముల సురేష్, రెండో తరగతి చదివే జస్వంత్కి నుదుటి పైన జుట్టు కాలిపోయింది. మరో ఆరో తరగతి చదివే విద్యార్థికి ఛాతిపైన గాయమైంది. ఇంతమందికి గాయాలైనా పాఠశాల ఉపాధ్యాయులు పట్టించుకోకపోవటం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ద్వారా విషయం తెలుసుకున్న ఎం ఈవో రాయల సుబ్బారావు విద్యార్థులను తల్లిదండ్రులను సముదాయించాడు. తూటా పేలటంతో బయటపడ్డ నిజాలు కొండలు పేల్చే తూటా పాఠశాల ఆవరణలో పేలటంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఒక్కసారిగా పాఠశాలకు తరలివచ్చారు. పాఠశాలలో ఉపాధ్యాయుల నిర్లక్ష్యం ఏ స్తాయిలో ఉందో వారి మాటలు విన్నవారికి అర్థమైంది. పాఠశాల పరిసరాల్లో ఎటువంటి పదార్థాలు వచ్చి చేరుతున్నాయి. వాటిని ఎవరు తెస్తున్నారు? వాటి పరిణామాలు ఏంటో కూడా ఆలోచించలేని స్థితిలో ఉన్నారని స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పాఠశాలకు వచ్చి, పాఠాలు చెప్పి, నెలసరి వేతనాలు తీసుకోవటం తప్ప తమను నమ్మి బడికి పంపే పిల్లల క్షేమం ఏమాత్రం పట్టడంలేదని అర్థం అవుతుందంటున్నారు. పాఠశాలలో పిల్లలు ఆడుకునే సమయంలో లేదా ఒకరిని ఒకరు కొట్టుకునే సమయంలో దెబ్బలు తగిలితే పట్టించుకోకుండా స్కూల్ మానిపించేయండంటూ పెద్ద మాష్టారు మాపై ఒత్తిడి తెస్తున్నారంటూ ఒక మహిళ ఆవేదన చెందింది. ఈమధ్య కాలంలో బాత్రూంలు కడిగిస్తున్నారని ప్రశ్నించగా తనపై దురుసుగా ప్రవర్థించారని ఒక విద్యార్థి తల్లి ప్రధానోపాధ్యాయుని ముందే ఎంఈవోకి ఫిర్యాదు చేసింది. గతంలో ఇద్దరు విద్యార్థులు కొట్టుకున్న నేపథ్యంలో ఒక విద్యార్థికి తలపగిలితే ఆసుపత్రికి పంపకుండా ఇంటికి పంపారని, అడిగితు ప్రయివేటు పాఠశాలలో చదివించుకోండంటూ సమాధానం చెప్పినట్లు ఒక మహిళ చెప్పింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
తప్పక చదవండి
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement