-
అభివృద్ధి కంట్లో ఇసుక నలుసు
తణుకు : ‘కొత్తగా పదవులు చేపట్టాం. మునిసిపాలిటీల్లో కొద్దోగొప్పో సొమ్ములున్నారుు. అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిద్దాం’ అనుకుంటున్న పురపాలకులకు ఇసుక కొరత కంట్లో నలుసులా మారింది. దీంతో ఏలూరు నగరపాలక సంస్థతోపాటు భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం మునిసిపాలిటీల్లో సుమారు రూ.40 కోట్ల విలువైన పనులు నిలిచి పోయూరు. నాలుగు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది. మునిసిపల్, సార్వత్రిక ఎన్నికల కోడ్ పుణ్యమా అని మూడు నెలలపాటు అభివృద్ధి పనులు పడకేయగా.. ఎన్నికల కోడ్ ముగిసి, ఎన్నికైన ప్రజాప్రతినిధులు పదవుల్లో కొలువు తీరిన తరువాత అయినా పెండింగ్ పనులన్నీ వేగం పుంజుకుంటాయని ప్రజలు భావించారు. కానీ.. ఇసుక కొరత ఏర్పడటంతో జిల్లా వ్యాప్తంగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోతున్నాయి. తణుకు ప్రాంతంలో మొన్నటివరకూ ఐదు యూనిట్ల ఇసుక రూ.6 వేలకే లభించగా, ప్రస్తు తం బ్లాక్ మార్కెట్కు అక్రమంగా తరలిస్తున్న ఐదు యూనిట్ల ఇసుక రూ.22 వేల నుంచి రూ.24 వేల వరకు విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంత మొ త్తం వెచ్చించి ఇసుక కొనుగోలు చేయలేక కాంట్రాక్టర్లు ఎక్కడ పనులను అక్కడే వదిలేస్తున్నారు. ఇసుక రీచ్ ల వేలం పాటలకు సంబంధించి నూతన విదానాన్ని ఖరారు చేసేందుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండటంతో అత్యవసరంగా చేయాల్సిన పనులకు ఆటంకం కలుగుతోంది. అన్నిచోట్లా ఇదే పరిస్థితి ఇసుక కొరత కారణంగా జిల్లాలోని ముని సిపాలిటీల్లో సీసీ రోడ్లు, మేజర్ డ్రెరుున్లు, కమ్యూనిటీ హాల్స్, పాఠశాల భవనాల నిర్మాణం వంటి అభివృద్ధి పనులు నిలిచి పోయాయి. భీమవరం మునిసిపాలిటీలో రూ.10 కోట్లు, తణుకు మునిసిపాలిటీలో రూ.8.50 కోట్లు, తాడేపల్లిగూడెం మునిసిపాలిటిలో రూ.5 కోట్లు, నరసాపురం మునిసిపాలిటిలో రూ.3 కోట్లు, పాలకొల్లు మునిసిపాలిటీలో రూ.2 కోట్లు ,కొవ్వూరు మునిసిపాలిటీలో రూ.3 కోట్లు, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ పరిధిలో రూ1.50 కోట్లు, నిడదవోలు మునిసిపాలిటీలో రూ.2కోట్లు , ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో సుమారు రూ.6 కోట్ల విలువైన పనులు నిలిచిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు పంచాయతీరాజ్, మం డల పరిషత్, గ్రామ పంచాయతీలు, ఆర్డబ్ల్యుఎస్, గృహ నిర్మాణం తదితర శాఖల్లోనూ కోట్లాది రూపాయల విలువైన పనులు పడకేశారుు. గనుల శాఖ మంత్రి పీతల సుజాత ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనూ ఇసుక కొరత ఏర్పడటం, దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం విమర్శలకు దారితీస్తోంది. -
కొలిక్కి వచ్చిన ‘మంజీర’!
గజ్వేల్, న్యూస్లైన్: గజ్వేల్ నియోజకవర్గంలో చేపట్టిన ‘మంజీర’ మంచినీటి పథకం టెండర్ల ప్రక్రియలో నెలకొన్న జాప్యానికి తెర పడనుంది. సాధారణ ఎన్నికల ‘కోడ్’ ముంచుకొస్తున్న వేళ.. అప్రమత్తమైన అధికార యంత్రాంగం ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ పథకానికి ఏడాదిన్నర క్రితం ఎన్ఆర్డీడబ్ల్యూపీ (నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్) పథకం కింద రూ.40 కో ట్లు మంజూరుకాగా.. ఇందులో రెండు నెలల క్రితం రూ.10 కోట్లకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయ్యింది. మిగతా రూ.30 కోట్లకు సంబంధించిన టెండర్ల ప్రక్రియలో జాప్యం నెలకొనగా ఈ వ్యవహారం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. మరో 15 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తిచేసే దిశగా హైదరాబాద్లోని ఇంజినీరింగ్ చీఫ్(ఈఎన్సీ) వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. ‘మంజీర’ పథకం పను లు పూర్తి చేయడానికి మంజూరైన నిధులతో తూప్రాన్, వర్గల్, ములుగు, గజ్వేల్, జగదేవ్పూర్ మండలాల్లోని 129 గ్రామాల్లో పైప్లైన్ విస్తరణ పనులు చేపట్టాల్సి ఉంది. అంతేగాకుండా పలుచోట్ల ఓహెచ్బీఆర్ ట్యాంకుల నిర్మాణం జరగనుంది. కానీ కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం స్టేట్ టెక్నికల్ కమిటీ అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉండగా ఈ ప్రక్రియలో నెలలతరబడి జాప్యం నెలకొంది. ఫలితంగా ప్రభుత్వం మంజూరుచేసిన రూ.40 కోట్లల్లో కేవలం రూ.10 కోట్లకు సంబంధించి మాత్రమే ఈ ప్రక్రియ పనులు సాగుతున్నాయి. మిగిలిన రూ.30కోట్ల వినియోగానికి కూడా ప్రభుత్వం ఆమోదం పలికింది. ఇందుకు సంబంధించి ఇటీవల హైదరాబాద్లోని ఈఎన్సీ కార్యాలయ వర్గాలు టెండర్లను నిర్వహించినా సాంకేతిక లోపాల కారణంగా దీనిని నిలిపివేశారు. రీ-టెండర్ ప్రక్రియ వేగవతం ‘మంజీర’ పథకానికి సంబంధించి రీ-టెండర్ ప్రక్రియను వేగంగా పూర్తిచేయడానికి అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే నర్సారెడ్డి సైతం ఇందుకు సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంతో రీ-టెండర్ పక్రియను చేపడుతున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ గడువు కూడా పూర్తయ్యింది. మరో 15 రోజుల్లో టెండర్ను పూర్తిచేసి నిధులను వినియోగించే అవకాశం కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నారు. ఈ వ్యవహారంపై స్థానిక ఆర్డబ్ల్యూఎస్ ఇన్చార్జి డిప్యూటీఈఈ మోహన్రెడ్డి ‘న్యూస్లైన్’తో మాట్లాడుతూ కొద్దిరోజుల్లోనే టెండర్ ప్రక్రియ పూర్తయి నిధులు విడుదలయ్యే అవకాశాలున్నాయని చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
తప్పక చదవండి
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement