-
ఆరు గంటల్లో ఫినిష్!
కలెక్టరేట్, న్యూస్లైన్: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు జిల్లా యంత్రంగా అన్నిఏర్పాట్లు పూర్తిచేసింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జిల్లా కేంద్రంలోని మూడు కేంద్రాల్లో ఓట్లు లెక్కించనున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు విడివిడిగా కౌంటింగ్ హాళ్లు ఏర్పాటుచేశారు.శుక్రవారం ఉదయం 8గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది. మొదటి అరగంటలో తొలి రౌండు ఫలితాలు వెలువడుతాయి. ఆరు గంటల వ్యవధిలో తుదిఫలితాలు తేలిపోతాయి. ఈవీ ఎంలు కావడంతో ఓట్ల లెక్కింపు సునాయాసంగా జరుగుతుంది. మీటనొక్కితే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలిసిపోతుంది. ఓట్ల లెక్కింపు కోసం 1,378 మంది సిబ్బందిని నియమించిం ది. 1,144 మంది విధుల్లో పాల్గొంటుండగా.. అత్యవసర నిమిత్తం 234 మందిని రిజర్వులో ఉంచింది. 442 మంది సూపర్వైజర్లు, 468 మంది అసిస్టెంట్లు, 468 మంది మైక్రోఅబ్జర్వర్లు ఓట్ల లెక్కింపులో పాల్గొంటారు. లెక్కింపు ఇలా.. ఉదయం 8గంటల లోపు స్ట్రాంగ్ రూంల నుంచి కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో కంట్రోల్ యూనిట్లను(ఈవీఎం) కౌంటింగ్ హాళ్లకు తీసుకువస్తారు. పోస్టల్ బ్యాలెట్లను కూడా తెస్తారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు వేర్వేరుగా కౌంటింగ్ హాళ్లు ఏర్పాటుచేశారు. ప్రతి రౌండ్ ఫలితాలను కౌంటింగ్ కేంద్రాల్లో డిస్ప్లే చేస్తారు. కంట్రోల్ యూనిట్లో ఫలితాల ప్రదర్శనకు ప్రింటింగ్ కమ్ ఆక్సిలరీ యూనిట్(పీఏడీయూ) వినియోగిస్తున్నారు. టేబుల్కు ఒకటి చొప్పున 510 పాడు యూనిట్లు ఏర్పాటు చేశారు. కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో మొత్తం వీడియో చిత్రీకరిస్తారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో లెక్కిస్తారు. వీటి లెక్కింపునకు ఆరు టేబుళ్లు ఉంటాయి. ఒక్కో టేబుల్ వద్ద సూపర్వైజర్, సహాయకులు, సూక్ష్మ పరిశీలకులు ఉంటారు. అనంతరం కంట్రోల్ యూనిట్లను ఆయా కౌంటింగ్ హాళ్లలో టేబుళ్లపై ఉంచి లెక్కిస్తారు. ఒక్కో టేబుల్కు ముగ్గురు సిబ్బంది ఉంటారు. ఈ ప్రక్రియతో తొలిరౌండ్ పూర్తవుతుంది. అలా ఒక్కో నియోజకవర్గానికి ఏర్పాటు చేసిన టేబుళ్లను బట్టి కంట్రోల్ యూనిట్లు(ఈవీఎం)ను తెరిచి ఓట్లు లెక్కిస్తారు. ఇలా చివరి వరకు ప్రక్రియ సాగుతుంది. ఆఖరి రౌండు తరువాత ఏజెంట్ల సంతకాలు తీసుకుని తుది ఫలితాలు రిటర్నింగ్ అధికారి వెల్లడిస్తారు. బ్యాలెట్లో అభ్యర్థులకు కేటాయించిన సంఖ్య ఆధారంగా వారికి వచ్చిన ఓట్లను గుర్తిస్తారు. ఇలా అన్ని రౌండ్లు లెక్కింపు పూర్తి చేస్తారు. ముందుగా వేములవాడ.. చివరగా కరీంనగర్ ఒక్కో నియోజకవర్గానికి రెండు హాళ్లు, హాల్కు 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఏడు టేబుళ్లలో ఎమ్మెల్యే ఓట్ల లెక్కింపు, మరో ఏడు టేబుళ్లలో ఎంపీ ఓట్ల లెక్కింపు చేపడుతారు. ఒక్కో రౌండ్కు 13వేల నుంచి 14వేల ఓట్లు ఉంటాయి. అత్యధిక పోలింగ్ కేంద్రాలున్న చోట ఎక్కువ సమయం పడుతుంది. కరీంనగర్ సెగ్మెంట్లో అత్యధికంగా 346పోలింగ్ కేంద్రాలున్నాయి. 14 టేబుళ్లలో 25రౌండ్లలో ఈ ఓట్లను లెక్కించే అవకాశమున్నందున మధ్యాహ్నం 2గంటల వరకు తుది ఫలితం వెల్లడవుతుంది. వేములవాడ నియోజకవర్గంలో అతి తక్కువగా 223 పోలింగ్ కేంద్రాలున్నాయి. 16 రౌండ్లలో లెక్కింపు పూర్తికానుండటంతో మధ్యాహ్నం 12గంటలకల్లా ఫలితం తేలిపోతుంది. కోరుట్ల 19 రౌండ్లు, జగిత్యాల 17, ధర్మపురి 18, రామగుండం 19, మంథని 20, పెద్దపల్లి 19, కరీంనగర్ 25, చొప్పదండి 19, వేములవాడ 16, సిరిసిల్ల 18, మానకొండూర్ 18, హుజూరాబాద్ 20, హుస్నాబాద్ 21 రౌండ్లలో ఫలితాలు తేలనున్నాయి. విజయోత్సవాలు 17న.. 16న ఎన్నికల విజయోత్సవాలపై ఈసీ నిషేధం విధించింది. 17న పోలీసుల అనుమతితో విజయోత్సవాలు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో 15 సాయంత్రం 5గంటల నుంచి 16న అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలను నిషేధించింది. ఇవి నిషిద్ధం.. కౌంటింగ్ ఏజెంట్లుగా నియమితులైన వారిపై ఎటువంటి క్రిమినల్ కేసులు ఉండకూడదు. మంచి ప్రవర్తన కలిగిన వారై ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగిని ఏజెంట్ నియమించకూడదు. సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, అగ్గిపెట్టెలు, పెన్నులు, పెన్సిళ్లు, పేపర్లు కౌంటింగ్ హాల్లోకి అనుమతించరు. ఏజెంట్లకు పేపర్, పెన్ను అక్కడే అందిస్తారు. కౌంటింగ్ ఏజెంట్లను వారికి కేటాయించిన సీట్లలోనే కూర్చోనిస్తారు. ఉదయం 7గంటలకు ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలి. కౌంటింగ్ కేంద్రాలివే.. ఎస్సారార్ కళాశాల : కరీంనగర్ పార్లమెంట్, కరీంనగర్, మానకొండూర్, హుజూరాబాద్, హుస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల కౌంటింగ్ జరుగుతుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఓట్ల వారీగా 14కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. అంబేద్కర్ పాలిటెక్నిక్ కళాశాల: పెద్దపెల్లి పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు పెద్దపెల్లి, మంథని, రామగుండం, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఎల్ఎండీ సమీపంలోని పాలిటెక్నిక్లో నిర్వహిస్తారు. ఇక్కడ 8కౌంటింగ్ హాళ్లు ఏర్పాటుచేశారు. సెయింట్ అల్ఫోన్స్ స్కూల్: నిజామాబాద్ ఎంపీ పరిధిలోని కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు సెయింట్ అల్ఫోన్స్ స్కూల్లో జరుగుతుంది. వీటికోసం 4 కౌంటింగ్ హాళ్లను సిద్ధం చేశారు. -
కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్లైన్ : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఆయా కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించడంతో ఈ ప్రక్రియ మధ్యాహ్నానికి పూర్తయ్యే అవకాశాలున్నాయని అధికారులు చెపుతున్నారు. కౌంటింగ్ నిర్వహణకు ఆయా స్ట్రాంగ్ రూమ్ల పరిధిలోనే కేంద్రాలను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక టేబుళ్లు, మెస్ ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రాల వద్దకు తేవడం నుంచి లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేంత వరకు వీడియోగ్రఫీ నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను వెబ్ కెమెరాల ద్వారా చిత్రీకరిస్తారు. లెక్కింపు కోసం ఇప్పటికే సూపర్వైజర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్లు, మైక్రో అబ్జర్వర్లు, వలంటీర్లను నియమించారు. కౌంటింగ్ ప్రక్రియపై ప్రత్యేక నిఘా ఉంచేందుకు కౌంటింగ్ అబ్జర్వర్లను సైతం ఎన్నికల సంఘం నియమించింది. జిల్లాలోని 10 అసెంబ్లీలకు 143 మంది అభ్యర్థులు, ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని 27 మంది అభ్యర్థుల భవితవ్యం మధ్యాహ్నం వరకు తేలనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ సిబ్బందికి, మీడియాకు ప్రత్యేకంగా పాస్లు ఇచ్చారు. ఈ పాస్ ఉన్నవారిని మాత్రమే లోనికి అనుమతిస్తారు. ఖమ్మం పార్లమెంట్ ఫలితాలను విజయ ఇంజనీరింగ్ కళాశాల(తనికెళ్ల) వద్ద, కలెక్టరేట్లో వెల్లడించేందుకు ప్రత్యేకంగా డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 14,39,983 మందికి గాను 11,79,136 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహబూబాబాద్ లోక్సభ పరిధిలోని ఇల్లెందు, పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో 5,77,018 మందికి గాను 4,49,489 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పది నియోజకవర్గాల పరిధిలో 253 రౌండ్ల ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే అత్యధికంగా సత్తుపల్లి నియోజకవర్గంలో 36 రౌండ్ల ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. దీని ప్రకారం ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి 36 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాలు ఇవే... ఖమ్మంలోని సెయింట్ జోసఫ్ స్కూల్లో ఖమ్మం అసెంబ్లీ, మౌంట్ఫోర్ట్ పాఠశాలలో పాలేరు, ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో కొత్తగూడెం, తనికెళ్లలోని విజయ ఇంజనీరింగ్ కళాశాలలో మధిర, అశ్వారావుపేట, సత్తుపల్లి, బ్రౌన్స్ కళాశాలలో వైరా నియోజకవర్గాల ఓట్లు లెక్కిస్తారు. కొత్తగూడెంలోని సింగరేణి మహిళా కళాశాలలో ఇల్లెందు, పినపాక, భద్రాచలం నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఉంటుంది. కౌంటింగ్ ప్రక్రియ ఇలా... కౌంటింగ్ ప్రక్రియకు ముందు పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. రిటర్నింగ్ అధికారి టేబుల్ మీద పోస్టల్ బ్యాలెట్ పత్రాల గణన జరుగుతుండగా, ఓటింగ్ యంత్రాల ద్వారా పోలింగ్ స్టేషన్లలో నమోదైన ఓట్ల లెక్కింపును కౌంటింగ్ హాలులో ఉన్న ఇతర టేబుళ్ల వద్ద అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు చేపడతారు. ఇందుకోసం పోలింగ్ స్టేషన్ నుంచి వచ్చిన ఓటింగ్ యంత్రాల కంట్రోల్ యూనిట్లను లెక్కింపు టేబుళ్ల వద్దకు తెస్తారు. మొదటి పోలింగ్ స్టేషన్ ఓటింగ్ యంత్రపు కంట్రోల్ యూనిట్ను మొదటి టేబుల్తో మొదలై... రెండో పోలింగ్ స్టేషన్ ఓటింగ్ యంత్రపు కంట్రోల్ యూనిట్ రెండో టేబుల్కు... ఇలా కొనసాగుతుంది. ప్రతి లెక్కింపు బల్ల వద్ద ఒక పోలింగ్ స్టేషన్లో పోలయిన ఓట్ల లెక్కింపు ఒకేసారి చేపడతారు. ఉన్న లెక్కింపు బల్లల సంఖ్యను బట్టి అన్ని పోలింగ్ స్టేషన్ల ఓట్ల లెక్కింపు ఏకకాలంలో మొదటి రౌండ్ లెక్కింపుగా చేపడతారు. అంటే ఒక నియోజకవర్గానికి 12 టేబుళ్లను ఏర్పాటు చేస్తే ఒకే రౌండ్లో 12 ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారన్నమాట. లెక్కింపు బల్లల సంఖ్య పోలింగ్ స్టేషన్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని అవసరమైన రౌండ్లలో గణన జరిగి లెక్కింపు పూర్తవుతుంది. అభ్యర్థుల్లో ఉత్కంఠ... ఎన్నికలు జరిగిన ఏప్రిల్ 30 నుంచి ఫలితాల కోసం వేచి ఉన్న అభ్యర్థులు, కార్యకర్తలతోపాటు ప్రజల ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. ఈ దఫా ఎన్నడూ లేని విధంగా బహుముఖ పోటీ నెలకొనడంతో అభ్యర్థుల్లో ఒకింత ఆందోళన నెలకొంది. ఫలితాలు ఏ మలుపు తిరుగుతాయి... క్రాస్ ఓటింగ్ జరిగిందా అనే అనుమానాలతో అభ్యర్థులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- అక్రమాలు కో‘కొల్లు’లు
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement