-
పట్టణ జనాభా-రవాణా వ్యవస్థ
కాంపిటీటివ్ గెడైన్స్ : జనరల్ ఎస్సే ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ పెరుగుతోంది. ప్రపంచ జనాభా వృద్ధిరేటు కంటే పట్టణ జనాభా వృద్ధి అధికంగా ఉంది. ప్రపంచ పట్టణ జనాభా వార్షిక వృద్ధి మూడు శాతమని అంచనా. ప్రపంచ జనాభాలో సుమారు 50 శాతం మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. 2011 లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో పట్టణ జనాభా 31.16 శాతంగా ఉంది. భారత్లో పట్టణీకరణని పరిశీలిస్తే.. పట్టణ జనాభాలో వృద్ధి అధికంగా ఉండటంతోపాటు పెద్ద నగరాల్లో జనాభా కేంద్రీకరణను గమనించొచ్చు. స్వాతంత్య్రానంతరం భారతదేశం మిశ్రమ ఆర్థిక విధానాన్ని అవలంబించింది. దీంతో ప్రైవేట్ రంగం అభివృద్ధి చెంది పట్టణ జనాభా పెరుగుదలకు కారణమైంది. 1901లో దేశ జనాభాలో పట్టణ జనాభా వాటా 11.4%. ఇది 2001లో 27.81 శాతానికి, 2011లో 31.16 శాతానికి పెరిగింది. వివిధ నివేదికలు ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం రాబోయే దశాబ్దాల్లో పెరిగే పట్టణ జనాభాలో భారత్, చైనా వాటా 1/3 వంతుగా ఉండనుంది. 2010 నుంచి 2050 మధ్య కాలంలో భారత్లో పట్టణ జనాభాకు అదనంగా 497 మిలియన్లు, చైనాలో 341 మిలియన్లు, నైజీరియాలో 200 మిలియన్లు, అమెరికాలో 103 మిలియన్లు, ఇండోనేషియాలో 92 మిలియన్ల మంది తోడవనున్నారని నివేదికలు పేర్కొంటున్నాయి. గత 40 ఏళ్లతో పోల్చినప్పుడు 2010 నుంచి 2050 మధ్య కాలంలో పట్టణ జనాభాలో పెరుగుదల భారత్, నైజీరియాలలో ఎక్కువగా ఉండనుంది. చైనాలో 2000-2050 మధ్య కాలంలో పట్టణ జనాభా పెరుగుదలకు పట్టణాభివృద్ధిని ప్రధాన కారణంగా పేర్కొనవచ్చు. ఇదే కాలంలో భారత్లో పట్టణ జనాభాలో 2/3 వంతు పెరుగుదలకు పట్టణాభివృద్ధి, 1/3 వంతు పెరుగుదలకు మొత్తం జనాభా పెరుగుదల దోహదపడతాయని నివేదికలు పేర్కొంటున్నాయి. ది గ్లోబల్ కమిషన్ ఆన్ ది ఎకానమీ అండ్ క్లైమేట్ 2014లో ‘న్యూ క్లైమేట్ ఎకానమీ’ పేరిట నివేదిక రూపొందించింది. దీని ప్రకారం 2031 నాటికి భారతదేశ పట్టణ జనాభా 600 మిలియన్లకు చేరనుంది. దేశ మొత్తం జనాభాలో ఇది 40 శాతంగా ఉండనుంది. రాబోయే 20 ఏళ్ల కాలంలో పట్టణ అవస్థాపనా పెట్టుబడిలో 827 బిలియన్ డాలర్ల లోటు ఉండే అవకాశం ఉంది. 2050 నాటికి అంచనా వేసిన వయసు కంటే ముందు సంభవించే మరణాలకు పట్టణ వాయుకాలుష్యం ప్రధాన కారణం అవుతుందని నివేదిక పేర్కొంది. పెరుగుతున్న పట్టణీకరణ కారణంగా భారత్ అధిక ప్రయోజనం పొందగలదని ఎం.సి.కిన్సె నివేదిక పేర్కొంది. 2030 నాటికి నగరాలు 70 శాతం నికర నూతన ఉపాధిని అందించగలవని, భారతదేశ స్థూల దేశీయోత్పత్తిలో నగరాల వాటా 70 శాతంగా ఉండొచ్చని నివేదిక అభిప్రాయపడింది. పట్టణ ప్రాంతాల్లోని మౌలిక సౌకర్యాలపై భారత్లో వార్షిక తలసరి మూలధన వ్యయం 17 డాలర్లు కాగా, చైనా వార్షిక తలసరి మూలధన వ్యయంలో 14 శాతం, పట్టణీకరణ డిమాండ్కు అనుగుణంగా భారత్లో ఏటా 700 మిలియన్ చదరపు మీటర్ల రెసిడెన్షియల్, 900 మి.చ.మీ. కమర్షియల్ నిర్మాణాలు జరగాలని నివేదిక పేర్కొంది. ప్రపంచ బ్యాంకు నివేదిక 2016 ప్రకారం ప్రపంచ జనాభాలో 54 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 2045 నాటికి నగరాల్లోని జనాభా 1.5 రెట్లు పెరిగి, మొత్తం పట్టణ జనాభా 6 బిలియన్లకు చేరుకునే అవకాశం ఉంది. ప్రపంచ జీడీపీలో పట్టణ ప్రాంత వాటా 80 శాతంగా ఉండనుంది. ఉత్పాదకత, నవకల్పనల్లో పెరుగుదల కారణంగా సుస్థిర వృద్ధి సాధనకు పట్టణ ప్రాంతాలు దోహదపడతాయి. వేగవంతమైన పట్టణీకరణ కారణంగా మౌలిక సౌకర్యాల కల్పనలో అనేక సవాళ్లు ఎదురవుతాయి. వాతావరణ మార్పును అధిగమించడంలో పట్టణ ప్రాంతాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని నివేదిక పేర్కొంది. ప్రపంచంలో శక్తి వినియోగంలో పట్టణ ప్రాంతాలు 2/3వ వంతు వాటాను కలిగి ఉన్నాయి. ప్రపంచ హరిత గృహ వాయు ఉద్గారాల విడుదలలోనూ పట్టణాల వాటా 70 శాతమని నివేదిక పేర్కొంది. జాతీయ రవాణా అభివృద్ధి విధాన కమిటీ అభిప్రాయంలో 2031 నాటికి భారత పట్టణ జనాభా 60 కోట్లకు చేరే అవకాశం ఉంది. మొత్తం దేశ జనాభాలో పట్టణ జనాభా 40 నుంచి 42 శాతంగా కమిటీ అంచనా వేసింది. పట్టణ అవస్థాపనా సేవలకు అవసరమైన పెట్టుబడి అంచనాలో భాగంగా.. 2031 నాటికి పట్టణ జనాభా 600 మిలియన్లకు చేరుతుందని హై పవర్డ ఎక్స్పర్ట కమిటీ పేర్కొంది. రవాణా వ్యవస్థ: భారత ఆర్థిక వ్యవస్థలో రవాణా ఒక ముఖ్య అంశం. 1990వ దశకంలో మొదలైన సరళీకృత ఆర్థిక విధానాల వల్ల భూ, జల, వాయు రవాణాల్లో అనేక రవాణా సాధనాలు వాడుకలోకి వచ్చాయి. ఇదే సమయంలో దేశంలోని అధిక జనాభాకు ప్రజా రవాణా ప్రాథమిక రవాణా సాధనంగా నిలిచింది. ప్రపంచంలో ప్రజా రవాణాను అధికంగా వినియోగిస్తున్న రవాణా వ్యస్థల్లో భారత్ రైల్ నెట్వర్క ఒకటి. భారత రైల్వే వ్యవస్థ 2014-15లో రోజుకు 23 మిలియన్ల మంది ప్రయాణీకులను చేరవేసింది. మొత్తంగా ఆ ఏడాదిలో 8.397 బిలియన్ల మంది రవాణా అవసరాలను తీర్చిడంతో పాటు 1058.81 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసింది. మార్చి 2013 నాటికి దేశంలో మొత్తం రిజిస్టర్డ మోటారు వాహనాలు 172 మిలియన్లు. వీటిలో 21.5 మిలియన్లు కార్లు, టాక్సీలు, జీపులున్నాయి. మొత్తం కుటుంబాల్లో 10 శాతం కుటుంబాలు మోటారు సైకిల్ కలిగి ఉన్నాయి. ట్రాఫిక్ రద్దీ కారణంగా ప్రపంచంలో అధిక మరణాలు సంభవిస్తున్న దేశంగా భారత్ నిలిచింది. భారత ఆటోమొబైల్ పరిశ్రమ ఏటా 4.6 మిలియన్ల వాహనాలను ఉత్పత్తి చేస్తోంది. 2015-16లో భారత ప్రభుత్వం భూ ఉపరితల రోడ్లు, రైల్వేల నుంచి ట్రాఫిక్ను జలమార్గాలకు మరల్చడానికి ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కింద 106 జాతీయ జల మార్గాలను ప్రకటించింది. పట్టణ రవాణా: దేశంలో పేదరిక నిర్మూలనకు విద్యుత్, భూమిని పొదుపుగా వినియోగించుకోవాలి. దీంతోపాటు కాలుష్యం, గ్రీన్ హౌజ్ వాయు ఉద్గారాలను నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఈ లక్ష్యసాధనలో పట్టణ రవాణా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం దేశంలో నాణ్యత, పరిమాణం పరంగా పట్టణ రవాణా సర్వీసులు, అవస్థాపనా సదుపాయాల లోటు అధికమైంది. దేశంలోని మెగాసిటీల్లో వాహన కాలుష్య పెరుగుదలకు కారణాలుగా కింది అంశాలను పేర్కొనవచ్చు. 1. అధిక ట్రాఫిక్ పరిమాణం, పట్టణ జనాభా పెరుగుదల. 2. ప్రైవేట్, వ్యక్తిగత వాహనాల సంఖ్య పెరగడం. 3. వాహనాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం. 4. ట్రాఫిక్ అడ్డంకుల పెరుగుదల 5. పర్యావరణహిత రవాణా సాధనాల వినియోగం తక్కువగా ఉండటం. ఇంధన సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తక్కువగా ఉండటం. 6. ప్రైవేట్, వ్యక్తిగత వాహనాల సంఖ్యను తగ్గించడానికి సమగ్రమైన కోశపరమైన వ్యూహాలు అవలంభించిక పోవడం. - డాక్టర్ తమ్మా కోటిరెడ్డి ప్రొఫెసర్, ఐబీఎస్, హైదరాబాద్ -
మెయిన్స్లో విజయానికి వ్యూహాలు
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి అత్యున్నత సర్వీసుల్లో అడుగుపెట్టి వ్యక్తిగత వికాసంతో పాటు సామాజిక అభివృద్ధికి బాసటగా నిలిచే భాగ్యం కోసం సివిల్ సర్వీసెస్ రాస్తుంటారు. ఇలాంటి లక్ష్యంతో 2014 సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్కు హాజరైన లక్షల మందిలో విజయాన్ని అందుకున్నది కొందరే! ఇక రెండో మెట్టు మెయిన్స్.. ఇందులో మెరుగైన స్కోర్ సాధిస్తేనే గెలుపు గమ్యాన్ని చేరుకునేందుకు మార్గం కనిపిస్తుంది. మెయిన్స్లో విజయానికి అవసరమైన ప్రిపరేషన్ వ్యూహాలపై ఫోకస్... ముందుగా సివిల్స్ ప్రిలిమ్స్ను దిగ్విజయంగా పూర్తిచేసిన అభ్యర్థులకు అభినందనలు. ఇప్పటి నుంచి రెట్టించిన ఉత్సాహంతో డిసెంబర్లో జరిగే మెయిన్స్ పరీక్షలో మంచి స్కోర్ సాధించేందుకు సిద్ధంకావాలి. ఆప్షనల్ పేపర్లతో పాటు జనరల్ ఎస్సే (ఒక పేపర్), జనరల్ స్టడీస్ (నాలుగు పేపర్లు) రాయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు పటిష్ట ప్రణాళికను రూపొందించుకుని, ప్రిపరేషన్ కొనసాగించాలి. జనరల్ ఎస్సే ఈసారి జరిగే మెయిన్స్లో ఒకటి కంటే ఎక్కువ ఎస్సేలు రాయాల్సిన అవసరం ఉండొచ్చు. దీనికి సంబంధించి నోటిఫికేషన్లో సూచనప్రాయంగా (candidates may be required to write essays on multiple topics) పేర్కొన్నారు. ఈ క్రమంలో అభ్యర్థులు కొన్ని ముఖ్యమైన అంశాలపై ఎస్సేలు రాయటం ప్రాక్టీస్ చేయాలి. ఇటీవలి కాలంలో వివిధ రంగాల్లో చోటుచేసుకున్న ముఖ్యమైన పరిణామాలపై దృష్టిసారించాలి. ఉదా: ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పాత్ర బాలల హక్కులు స్మార్ట్ సిటీలు ఒక ప్రవర్తనా సవాలుగా శుభ్రత కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పాలన (కజీజీఝఠఝ జౌఠ్ఛిటఝ్ఛ్ట ్చఛీ క్చ్ఠజీఝఠఝ జౌఠ్ఛిట్చఛ్ఛి ్ఛ్టఛి.,) మనకంటూ ఓ ప్రత్యేకం జనరల్ ఎస్సేను జనరల్ స్టడీస్ నుంచి వేరుగా చూడాలి. రాసే విషయంలో ఒక్కొక్కరికీ ఒక్కో శైలి ఉంటుంది. ఓ అంశానికి సంబంధించి అభిప్రాయాలను సౌకర్యవంతంగా, స్వేచ్ఛగా వెల్లడించగల శైలి ఏంటన్నది గుర్తించి, దాన్ని అనుసరించాలి. సందర్భానుసారం గొప్ప వ్యక్తుల వ్యాఖ్యలను ఉదాహరించాలి. ఇవి అభిప్రాయాలకు బలం చేకూరుస్తాయి. అభ్యర్థి రాసే వ్యాసంలో ఆత్మస్థైర్యం, ఆశావాదం, నిర్మాణాత్మకత ప్రతిబింబించాలి. అనవసర విషయాల జోలికి వెళ్లకూడదు. ఎస్సే ద్వారా మన వ్యక్తిత్వం ఏంటన్నది బయటపడుతుంది. దీన్ని గుర్తుంచుకొని ముందడుగు వేయాలి. మంచి వాక్యాలతో ఉత్సాహంతో మనస్ఫూర్తిగా ఇష్టపడుతూ రాసే ఎస్సే.. ఎగ్జామినర్ను కట్టిపడేస్తుందనడంలో సందేహం లేదు. జనరల్ స్టడీస్ జనరల్ స్టడీస్ పేపర్లలోని ప్రశ్నలకు సమాధానాలు రాసేటప్పుడు ప్రధానంగా అయిదు అంశాలను గుర్తుంచుకోవాలి.. 1.కిందటి సారి జరిగిన పరీక్షలో పదాల సంఖ్య భారంగా పరిణమించింది. అయితే ఈ విషయంలో అభ్యర్థులు భయపడాల్సిన అవసరం లేదు. పదాల పరిమితిపై ఆందోళన చెందకుండా, నాణ్యతకు ప్రాధాన్యమిస్తూ బాగా రాస్తే మంచి స్కోర్ సాధించవచ్చు. 2.ప్రశ్నను బట్టి సమాధానాన్ని పాయింట్ల రూపంలో రాయాలా? లేదంటే దీంతోపాటు విశ్లేషణాత్మకత విధానంలోనూ రాయాలా? అనేది నిర్ణయించుకోవాలి. కొన్ని ప్రశ్నలకు పాయింట్ల రూపంలో సమాధానం రాయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. మరికొన్నింటికి రెండు విధానాలనూ జోడిస్తూ రాసినప్పుడే మేలు జరుగుతుంది. నేషనల్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ (ఈసీసీఈ); ప్రతిపాదిత మోటార్ వాహనాల చట్ట సవరణలు, జువైనల్ జస్టిస్ యాక్ట్ తదితర అంశాలను పాయింట్ల రూపంలో రాయొచ్చు. భారతదేశంలో పంట మార్పిడి ఆవశ్యకతకు సమాధానాన్ని రెండు విధానాల్లోనూ రాయొచ్చు. 3.Comment, Elaborate, Illustrate, analyse, Be Critica.. తదితర పదాలు ప్రశ్నల్లో కనిపిస్తాయి. ఓ ప్రశ్నను రూపొందించే వ్యక్తి మీ నుంచి దేన్ని ఆశిస్తున్నాడనేది ఈ పదాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. దానికి తగినట్లు సమాధానం రాయాలి. వ్యాఖ్యానించమన్నారా.. విశ్లేషించమన్నారా? లేదంటే విమర్శనాత్మకంగా విశ్లేషించమన్నారా? ఇలా సమాధానాన్ని ఏ కోణంలో రాయాలన్నది గుర్తించాలి. 4.మరో ముఖ్య విషయం కచ్చితమైన సమాధానమంటే కేవలం ఫ్యాక్ట్స్ను మాత్రమే రాయడం కాదు. విశ్లేషణాత్మకంగా సమాధానం రాయడం ప్రధానం. ఫ్యాక్ట్స్ అనేవి ఓ అంశంపై అభ్యర్థి శ్రద్ధను మాత్రమే తెలియజేస్తాయి. 5.కారణం ఏదైనా సరే ఒక పేపర్ను సరిగా రాయలేదని అనిపిస్తే అతిగా ఆలోచించకుండా అంతటితో దాన్ని మరచిపోయాలి. లేదంటే దీని ప్రభావం మరో పేపర్పై పడుతుంది. హిస్టరీ- కొన్ని ముఖ్యాంశాలు మొదటి ప్రపంచ యుద్ధం గదర్ పార్టీ భారతదేశానికి గాంధీజీ తిరిగి రాక (1915) 1914 నుంచి అరబ్ రాజకీయాలు టిబెట్ అంశం (1950-59) పంచశీల ఒప్పందం హెండర్సన్ బ్రూక్స్ రిపోర్టుసిమ్లా ఒప్పందం (1972) జాతీయ ఆత్యయిక పరిస్థితి (1975)జనతా పార్టీ (1977-79) కార్గిల్ యుద్ధం (1999) తదితర అంశాలపై దృష్టిసారించాలి. భౌగోళిక శాస్త్రం/పర్యావరణం: అయిచీ జీవ వైవిధ్య లక్ష్యాలు; తుఫాన్లు, ఎల్నినో, కరువుకాటకాలు; తీవ్ర వాతావరణ మార్పులు; ఆగ్రో ఫారెస్ట్రీ విధానం- 2014 తదితర అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి.సామాజిక అంశాలకు సంబంధించి ముఖ్యంగా యువత జీవనశైలి, ప్రపంచీకరణ అనంతరం భారతీయ సంస్కృతిలో మార్పులను అధ్యయనం చేయాలి.సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (ఎల్పీజీ) విధానాలు అమలు కాలం (1991) నుంచి గ్రామీణ సమాజంలో వచ్చిన మార్పులపై అవగాహన పెంపొందించుకోవాలి. పాలిటీ, గవర్నెన్స: ఇందులో ప్రధానంగా ప్రతిపక్ష నేత, ఉరిశిక్ష అమలు, ఉమ్మడి పౌర స్మృతి, ఆర్టికల్ 370, సహకార సమాఖ్యవాదం, ఖనిజాలకు రాయల్టీ చెల్లింపుల పెరుగుదల, ఉన్నత స్థాయి న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్-కొలీజియం వ్యవస్థ, ప్రధాని కార్యాలయం (పీఎంవో) తదితర అంశాలు ముఖ్యమైవని.అంతర్జాతీయ సంబంధాలు, జాతీయ వ్యవహారాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధిత అంశాలపై తప్పనిసరిగా దృష్టిసారించాలి. జీఎస్ పేపర్ 4 (నైతికత, నిజాయితీ, అభిరుచి): ఈ విభాగంలోని ప్రశ్నలకు వ్యక్తిగత అవగాహన సామర్థ్యం ప్రధానం. వివిధ కేస్స్టడీలను అధ్యయనం చేయడం ద్వారా దీన్ని పెంపొందించుకోవచ్చు. శక్తి, సంపద, ధర్మ (డ్యూటీ), నిజాయితీ తదితరాలకు సంబంధించిన మంచి కొటేషన్స్తో సిద్ధంగా ఉండాలి. ఈ అంశాలు మీరు రాసే సమాధానంలో ప్రతిబింబించాలి. ప్రభుత్వంలో పనిచేసే వారికి ఉండాల్సిన కనీస విలువలు, నైతిక ఆవశ్యకత అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఒక అంశంపై ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ఎవరి విశ్లేషణ వారిది. విశ్వజనీన సమాధానాలను రూపొందించడం కష్టమైన పని. అందుకే స్వీయ వివేచన ఆధారంగా, నిర్మాణాత్మకంగా, ప్రాక్టికల్గా సాధ్యమయ్యేలా సమాధానాలు ఇవ్వాలి. ఆల్ ది బెస్ట్... మెయిన్స్ పరీక్ష విధానం పేపర్ మార్కులు అర్హత పేపర్లు: పేపర్-ఎ: రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లోని ఎంపిక చేసుకున్న భాష 300 పేపర్-బి: ఇంగ్లిష్ 300 మెరిట్కు పరిగణనలోకి తీసుకునే పేపర్లు: పేపర్-1 ఎస్సే 250 పేపర్ 2 (జీఎస్-1) 250 పేపర్ 3 (జీఎస్-2) 250 పేపర్ 4 (జీఎస్-3) 250 పేపర్ 5 (జీఎస్-4) 250 పేపర్ 6 (ఆప్షనల్ సబ్జెక్టు పేపర్-1) 250 పేపర్ 7 (ఆప్షనల్ సబ్జెక్టు పేపర్-2) 250 మొత్తం మార్కులు 1750 ఆలోచనా తీరు.. రాసే శైలి.. విజయానికి కీలకం -శశాంక, సివిల్స్ 2012 టాపర్, అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనింగ్ సివిల్స్ మెయిన్స్ ప్రిపరేషన్లో ‘రాయడం ప్రాక్టీస్’ చేయడమనేది కీలకమైన అంశం. ఎందుకంటే ఓ అంశానికి సంబంధించి ఎంతటి పరిజ్ఞానమున్నా, అవగాహన ఉన్నప్పటికీ రాతపూర్వకంగా సరిగా వ్యక్తీకరించకుంటే ఫలితం శూన్యం! వీలైనన్ని మాక్ టెస్ట్లు రాయడం ద్వారా లోపాలను అధిగమించి, రాత తీరును మెరుగుపరుచుకోవచ్చు.ఒకటి కంటే ఎక్కువ ఎస్సేలకు సమాధానాలు రాయాల్సి వస్తే సమయ పాలన కీలకపాత్ర పోషిస్తుంది. సమకాలీన అంశాలపై ఎస్సేలు రాసి నిపుణులతో దిద్దించుకోవాలి. దీనివల్ల బలాలు, బలహీనతలు తెలుస్తాయి. మెరుగుపరచుకోవాల్సిన అంశాలపై స్పష్టత వస్తుంది. జనరల్ స్టడీస్ పేపర్లను చాలా మంది బాగానే రాస్తున్నారు.. ఈ నేపథ్యంలో విజయాన్ని నిర్దేశించడంలో ఎస్సే, ఆప్షనల్ పేపర్లు, ఇంటర్వ్యూ కీలకమవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ సాగించాలి. ప్రతి రోజూ జనరల్ స్టడీస్, ఆప్షనల్ ప్రిపరేషన్కు సమయం కేటాయించాలి. ఉదయం జనరల్ స్టడీస్ చదివితే, సాయంత్రం ఆప్షనల్ సబ్జెక్టు చదవాలి. సమయం ఎక్కువగా అందుబాటులో ఉండదు కాబట్టి ఒకట్రెండు పేపర్లతో పాటు ఒక ప్రామాణిక మ్యాగజైన్కు పరిమితమవ్వాలి. ముఖ్యమైన అంశాలను ప్రత్యేకంగా నోట్ చేసుకోవాలి. ఎంత ఎక్కువ చదివామనే దానికంటే చదివిన విషయం ఎంత వరకు గుర్తుంది అనేది ప్రధానం. అందుకే పునశ్చరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. సామాజిక, ఆర్థిక సర్వే, బడ్జెట్, ముఖ్యమైన కమిటీల నివేదికలు వంటి వాటిని అధ్యయనం చేయడం ముఖ్యం. రాష్ట్రపతి, ప్రధానిమంత్రి ప్రసంగాలపై దృష్టికేంద్రీకరించాలి. ఎందుకంటే వీటి ద్వారా వివిధ అంశాలకు సంబంధించిన ప్రభుత్వ ఆలోచనా ధోరణి తేటతెల్లమవుతుంది. సమాధానం రాసేటప్పుడు ఒక ‘ఆఫీసర్’గా రాయాలి. ఆఫీసర్ అయినట్లు ఊహించుకుని సమాధానం రాస్తే ప్రాక్టికల్గా వీలయ్యే సూచనలు బయటపడతాయి. ఏదైనా సమస్య పరిష్కారానికి సూచనలు ఇచ్చేటప్పుడు క్షేత్రస్థాయిలో ప్రాక్టికల్గా అమలు చేయడానికి వీలయ్యే వాటిని సూచించాలి. సమాధానాల్లో నెగిటివ్ అభిప్రాయాలను రాయొద్దు. అన్నీ సమస్యలే.. అంతా అవినీతి మయం, ఏమీ చేయలేం.. వంటి నిరాశాజనక అభిప్రాయాలను కాకుండా ‘‘తప్పులున్నాయి.. వాటిని సరిదిద్దుకునేందుకు అవకాశముంది..’’ అనే సానుకూల ధోరణిని ప్రతిబింబించాలి. జనరల్ స్టడీస్ 4 పేపర్ ప్రిపరేషన్కు ఇగ్నో మెటీరియల్ ను సేకరించి వాటిలోని కేస్ స్టడీలను అధ్యయనం చేయాలి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement