-
నిర్లక్ష్యం వల్లే ప్రమాదం
తాడిపత్రి: గెర్డావ్ ఉక్కు పరిశ్రమలో విషవాయువు లీకై ఆరుగురు మృత్యువాత పడిన ఘటనపై విచారణ ప్రారంభమైంది. ఇందులో భాగంగా రెవెన్యూ, పోలీస్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు శుక్రవారం గెర్డావ్ పరిశ్రమలోని రోలింగ్ మిల్లు విభాగాన్ని సందర్శించి కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. కార్బన్ మోనాక్సైడ్ ఉత్పత్తి అయి పైపు ద్వారా సరఫరా అవుతున్న ప్రదేశంలో పైపుల నాణ్యత గురించి ఆరా తీశారు. గ్యాస్లీక్ అయినా దాని ప్రభావానికి లోనుకాకుండా అక్కడ పనిచేస్తున్న కార్మికులు వాడుతున్న సేఫ్టీ పరికరాలను పరిశీలిస్తున్నారు. అయితే విచారణ ముందుకు సాగకుండా రాజకీయ ఒత్తిళ్లు ప్రారంభమైనట్లు, స్థానిక అధికారపార్టీ నేతలు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. మీడియాకు నో ఎంట్రీ పరిశ్రమ లోపలికి వెళ్లి మరిన్ని వివరాలను సేకరించాలనుకున్న మీడియాను పోలీసులు అనుమతించలేదు. లోపల ఏమి జరుగుతోందో అర్థం కానిపరిస్థితి నెలకొంది. ఒకానొక దశలో మీడియా ప్రతినిధులకు, పోలీసులకు మధ్య వాగ్వావాదం జరిగింది. చివరకు పరిశ్రమ ముఖ్య అధికారి బాపూజీ ప్రెస్ నోట్ విడుదల చేశారు. అయితే అందులో సమగ్రమైన సమాచారం ఏమీ లేదు. కంపెనీ ప్రతినిధులు కూడా దీనిపై నోరు మెదపలేదు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే.. గెర్డావ్ పరిశ్రమలో జరిగిన ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యం కొట్టొచినట్లు కనబడుతోంది. ఘటన జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరాలు లేవు. మాస్కులు అందుబాటులో ఉన్నా ధరించలేకపోయారు, మనోజ్ అనే కార్మికుడు ప్రమాదంలో చిక్కుకొని మృతి చెందిన నేపథ్యంలో అతన్ని కాపాడేందుకు మరో ఐదుగురు కార్మికులు వెళ్లడంతో మొత్తం ఆరుగురూ మృతి చెందారు. స్వీయ రక్షణ చర్యలు ఉన్నా వాటిని కార్మికులు విస్మరించారు. ఎక్కువ శాతం నిర్లక్ష్యం పరిశ్రమ యాజమాన్యం వైపే ఉంది. పరిహారం కూడా అధిక మొత్తంలో ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. – మలోలా, ఆర్టీఓ, విచారణాధికారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ప్రమాదంలో ఆరుగురు కార్మికులను కోల్పోవడం దురదృష్టకరం. అన్ని కుటుంబాలనూ ఆదుకుంటాం. ఎక్కువ పరిహారం వచ్చేందుకు కృషి చేస్తాం. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తాం. పరిశ్రమ లోపల ఎక్కడా యాజమాన్యం నిర్లక్ష్యం లేదు.– శ్రీధర్ క్రిష్ణమూర్తి,గెర్డావ్ పరిశ్రమ ఎండీ -
గెర్దావ్ స్టీల్ ప్లాంట్లో లారీ క్లీనర్ మృతి
తాడిపత్రి రూరల్ : పట్టణంలోని గెర్దావ్ స్టీల్ ప్లాంటులో డోలమైట్ ఫౌడర్ అన్లోడ్ చేస్తుండగా ప్రమాద వశాత్తు లారీ డోర్ తగిలి కర్నూల్ జిల్లా డోన్ మండలం కొత్తచెరువు గ్రామానికి చెందిన లారీ క్లీనర్ తిమ్మా గురుడు (40) మంగళవారం రాత్రి మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు..డోన్కు చెందిన లారీ తాడిపత్రి నియోజకవర్గంలోని కిష్టపాడు గ్రామంలో లారీలో డోలమైట్ లోడ్ చేసుకుని గెర్దావ్ స్టీల్ ప్లాంటుకు తీసుకొచ్చారు. స్టీల్ ప్లాంటులో డోలమైట్ అన్లోడ్ చేస్తుండగా క్లీనర్ తిమ్మాగురుడుకు డోర్ తగిలి కింద పడ్డాడు. గమనించని డ్రైవర్ లారీ డోర్ తీశాడు. దీంతో లిఫ్ట్ ఓపన్ అయ్యి ఫౌడర్ అన్లోడ్ అయ్యింది. తిమ్మాగురుడుపై ఫౌడర్ పడటంతో ఊపిరి ఆడక అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న రూరల్ ఎస్ఐ నారాయణరెడ్డి సిబ్బందితో సంఘటన స్థలం చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement