-
‘తవ్వి’పోదురుగాక!
సాక్షి, హైదరాబాద్: ప్రతియేటా జీహెచ్ఎంసీ రోడ్ల నిర్మాణాలు, మరమ్మతులకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. రహదారులు వేయడానికి ముందే అవసరమైన వరద కాల్వలు, క్యాచ్పిట్లు, డ్రైనేజీ మ్యాన్హోళ్లు, కేబుళ్ల కోసం డక్ట్ వంటివి వేయాల్సి ఉండగా ఆ పని చేయడం లేదు. దాంతో ఆయా అవసరాల కోసం రోడ్డు వేసిన కొన్ని నెలలకే తిరిగి తవ్వుతున్నారు. దాంతో ప్రజాధనం పెద్దయెత్తున దుబారా అవుతోంది. అందుకు మచ్చుతునక ఫొటోలో కనిపిస్తున్న దృశ్యం. దోమలగూడలో రోడ్డు వేసిన కొద్దినెలలకే ఇలా.. తవ్విపోస్తున్నారు. ముందస్తుగానే ఆయా విభాగాలు తాము చేయాల్సిన పనులు తెలియజేయడంతో ఇలాంటి పరిస్థితి రాకుండా చేస్తామని సిటీ కన్జర్వెన్స్ సమావేశాల్లో చెబుతున్నప్పటికీ, అమలులో లోపం కళ్లకు కడుతోంది.. ఇలా.. (క్లిక్: ట్యాంక్బండ్పై సరోజినీ నాయుడి జ్ఞాపకాలు) -
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హిమాయత్నగర్ రోడ్లే రీకార్పెటింగ్ చేస్తున్నారా?
సాక్షి, సిటీబ్యూరో: గతంతో పోలిస్తే నగరంలో రహదారుల అవస్థలు కొంతమేర తగ్గాయి. గతంలో మాదిరిగా ఎగుడుదిగుళ్లు.. అధ్వానపు రహదారులు అన్ని ప్రాంతాల్లో లేవు. దాదాపు రెండేళ్ల క్రితం ప్రారంభించిన సమగ్ర రోడ్డు నిర్వహణ పథకం (సీఆర్ఎంపీ) కింద ప్రధాన రహదారుల మార్గాల్లో 709 కి.మీ మేర పనుల్ని పేరెన్నికగన్న పెద్ద ఏజెన్సీలకు కాంట్రాక్టుకిచ్చారు. కాంట్రాక్టులో భాగంగా ఎప్పటికప్పుడు రోడ్లను సాఫీ ప్రయాణానికి అనుగుణంగా ఉంచాల్సిన బాధ్యత వాటిదే. అంతే కాదు.. రోడ్ల మధ్య డివైడర్లు, రోడ్ల పక్కల ఫుట్పాత్లు.. రోడ్డుకిరువైపులా పచ్చదనం పెంపు తదితర పనులు సైతం వాటివే. అంతేకాదు.. పారిశుద్ధ్య నిర్వహణ కూడా వాటిదే. ఫుట్పాత్లు, పారిశుద్ధ్యం, డివైడర్ల నిర్వహణ వంటి పనుల సంగతెలా ఉన్నా ప్రధాన రహదారుల మార్గాల్లో మాత్రం ఇదివరకులా సమస్యల్లేవు. బాగున్న రోడ్లే మళ్లీ మళ్లీ.. సీఆర్ఎంపీలో భాగంగా నిధుల ఖర్చు చూపేందుకు బాగున్న రోడ్లనే మళ్లీ మళ్లీ చేస్తున్నారనే విమర్శలున్నాయి. ముఖ్యంగా వీఐపీలు పర్యటించే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లతో పాటు హిమాయత్నగర్ తదితర ప్రాంతాల్లో బాగున్న రోడ్లకే రీకార్పెటింగ్ చేస్తున్నారనే విమర్శలున్నాయి. మరోవైపు రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో జరుపుతున్న మిల్లింగ్ శాస్త్రీయంగా జరగడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో రోడ్డు ఎత్తు పెరుగుతోందని, మరమ్మతుల సందర్భంగా డైవర్షన్లకు సైనేజీల ఏర్పాట్లు వంటివి చేయడం లేదనే ఫిర్యాదులున్నాయి. శివారు సమస్యలు పట్టవా..? ప్రధాన రహదారుల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలకివ్వగా.. మిగిలిన ఇతర మార్గాలు.. ముఖ్యంగా శివార్లలోని రోడ్లు.. అక్కడి కాలనీల్లోని అంతర్గత రహదారులు మాత్రం మారలేదు. దాదాపు 300 కి.మీ మేర మెటల్ రోడ్లను సీసీ రోడ్లుగా మార్చాలని ఏడాదిన్నర క్రితమే ప్రతిపాదించినా పనులు జరగలేదు. దీంతో అక్కడి సమస్యలు తీరలేదు. వానలొస్తే బురదమయంగా మారుతున్న రోడ్లతో ప్రజల అవస్థలు వర్ణనాతీతం. జోనల్ కమిషనర్లకే అధికారాలివ్వడంతో వారు ఆడింది ఆటగా సాగుతోందనే ఆరోపణలున్నాయి. ప్రధాన కార్యాలయం ప్రే„ý కపాత్ర వహించడం మాని.. పర్యవేక్షించాలని పలు ఎన్జీఓ సంఘాలు, ప్రజలు కోరుతున్నారు. శివారు ప్రాంతాల్లోనూ రోడ్ల సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు పేర్కొన్నారు. ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదుల్ని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని, లేని పక్షంలో సంబంధిత ఏఈలపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 16వేల ఫిర్యాదులు పరిష్కరించినట్లు తెలిపారు. నిర్ణీత వ్యవధిలో పరిష్కరించకుంటే సీఆర్ఎంపీ ఏజెన్సీలకు పెనాల్టీలు విధించి, బిల్లుల చెల్లింపుల్లో మినహాయిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు రూ. 15లక్షల పెనాల్టీలు విధించినట్లు పేర్కొన్నారు. కచ్చితమైన లెక్కలు జోన్లనుంచి అందాల్సి ఉందన్నాన్నారు. సీఆర్ఎంపీ.. స్వరూపం.. ► గ్రేటర్లో మొత్తం రోడ్లు: 9013 కి.మీ. ► సీఆర్ఎంపీలోని రోడ్ల పొడవు: 709 కి.మీ ► అయిదేళ్ల వరకు నిర్వహణతో సహా మొత్తం అంచనా వ్యయం : రూ1839 కోట్లు ► సీఆర్ఎంపీ పనులకు ఇప్పటి వరకు చేసిన ఖర్చు : రూ.594 ► ఈ ఆర్థిక సంవత్సరం (2021–22) ఇప్పటి వరకు ఖర్చు రూ.177.98 కోట్లు ► ఇప్పటి వరకు రీకార్పెట్ చేసిన మొత్తం రోడ్లు: 496 కి.మీ ► ఈ ఆర్థిక సంవత్సరంలో రీకార్పెట్ చేసిన రోడ్లు:124 కి.మీ జీహెచ్ఎంసీలో ఇతర మార్గాల్లో చేసిన రోడ్ల పనులు ► ఈ ఆర్థిక సంవత్సరం మంజూరైన పనులు: 2,562 ► అంచనా వ్యయం: రూ 644కోట్లు ► ఇప్పటి వరకు పూర్తయిన పనులు: 802 ► వీటికైన వ్యయం: రూ. 177 కోట్లు ► పురోగతిలోని పనులు: 1,760 ► వాటి అంచనా వ్యయం రూ.467 కోట్లు ► 2021లో పూడ్చిన గుంతలు: 15,696 ► ఈ ఆర్థిక సంవత్సరం పరిష్కరించిన ఫిర్యాదులు: 15,849. -
గ్రేటర్లో ‘రోడ్డు డాక్టర్స్’
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో దెబ్బతిన్న రోడ్లను ఎప్పటికప్పుడు మరమ్మతు చేసేందుకు ఐదు ‘రోడ్డు డాక్టర్’ యంత్రాలను అద్దెకు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. వీటిని జోన్కొకటి చొప్పున వినియోగించనున్నారు. ఈ మేరకు త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. నగరంలో ఏటా దాదాపు రూ. 300 కోట్లు రహదారుల మరమ్మతులకు వెచ్చిస్తున్నారు. కొద్ది రోజులకేపరిస్థితి షరా మామూలుగా మారుతోంది. ఈ నేపథ్యంలో రోడ్డు డాక్టర్ యంత్రం ద్వారా ఎప్పటికప్పుడు గుంతలు పూడ్చేందుకు సిద్ధమవుతున్నారు. దీనివల్ల తక్కువ సమయంలో పని పూర్తవుతుంది. తద్వారా ట్రాఫిక్కు ఎక్కువ సేపు అంతరాయం కలుగకుండా నివారించవచ్చు. రోడ్డు తడిగా ఉన్నప్పటికీ దీనితో మరమ్మతులు చేపట్టవచ్చు. వీటన్నింటితో పాటు జీహెచ్ఎంసీ రోడ్ల మరమ్మతులకు ఏటా వెచ్చిస్తున్న మొత్తంతో పోల్చినా అదనపు ఖర్చు ఉండదని లెక్కగడుతున్నారు. దీంతో ఈ యంత్రాలను అద్దెకు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఏడాది పాటు రహదారుల మరమ్మతులకు కిలోమీటరుకు దాదాపు రూ.50 వేల నుంచి రూ. 60 వేల వంతున చెల్లించనున్నారు. ఏడాది పొడవునా రహదారులపై గుంతలు లేకుండా చూడాల్సిన బాధ్యత కాంట్రాక్టు సంస్థదే. గుంతలు గుర్తించాక 24 గంటల్లోగా మరమ్మతులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు టెండర్లు పిలిచి.. సంబంధిత సంస్థల ద్వారా యంత్రాలను వినియోగించనున్నారు. గత ఆగస్టులో జీహెచ్ఎంసీ ప్రయోగాత్మకంగా ఒక రోడ్డు డాక్టర్ను అద్దెకు తీసుకుంది. కొద్ది రోజులకే మరమ్మతులకు గురికావడంతో పనులు నిలిచిపోయాయి. తాజాగా మరోసారి అద్దెకు తీసుకొని... వర్షాకాలానికి ముందే రహదారుల మరమ్మతులు పూర్తి చేయడమే కాక, ఏడాది పొడవునా నిర్వహణకు రోడ్డు డాక్టర్ ను వినియోగించాలని అధికారులు భావిస్తున్నారు. దేశంలోని వివిధ నగరాల్లో వివిధ కంపెనీలకు చెందిన రోడ్డు డాక్టర్లు పని చేస్తున్నాయి. వాటిని పరిగణనలోకి తీసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు నగరంలోనూ వినియోగించాలని యోచిస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ఫిల్ సాల్ట్ విధ్వంసం.. ఢిల్లీను చిత్తు చేసిన కేకేఆర్
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement