-
GHMC: యూ ట్యూబ్లో సెర్చ్ చేసి.. ఫెవికాల్+ఎంసీల్= ఫింగర్ ప్రింట్
-
GHMC: యూ ట్యూబ్లో సెర్చ్ చేసి.. ఫెవికాల్+ఎంసీల్= ఫింగర్ ప్రింట్
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ శానిటేషన్ విభాగంలో చోటు చేసుకున్న కృత్రిమ వేలిముద్రల వ్యవహారాన్ని మధ్య మండల టాస్క్ఫోర్స్ పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ స్కామ్కు సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్లు, సూపర్వైజర్లుగా పని చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎన్నాళ్లుగా ఈ వ్యవహారం సాగుతోంది? ఇంకా ఎందరి పాత్ర ఉంది? తదితర అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. గోషామహల్ సహా మరికొన్ని ప్రాంతాలకు చెందిన జీహెచ్ఎంసీ శానిటరీ విభాగం ఉద్యోగులు క్షేత్రస్థాయిలో ఉండే పారిశుద్ధ్య కార్మికుల వద్దకు ప్రతి రోజూ వెళ్లి బయోమెట్రిక్ మిషన్ల ద్వారా వారి హాజరును తీసుకుంటారు. ఔట్ సోర్సింగ్ పద్దతిలో పని చేసే ఒక్కో కార్మికుడికీ నిర్దేశిత పని వేళలు ఉంటాయి. పని ప్రారంభించే ముందు బయోమెట్రిక్ మిషన్లో లాగ్ ఇన్, పూర్తయ్యాక లాగ్ ఔట్ నిర్దేశిస్తూ వీళ్లు వేలిముద్రలు వేయాల్సి ఉంటుంది. దీన్ని గమనించిన కొందరు ఉద్యోగులు భారీ స్కెచ్ వేశారు. కొందరు పరిచయస్తుల్ని శానిటరీ వర్కర్లుగా ఎన్రోల్ చేశారు. వీరిని ప్రతి రోజూ ఫీల్డ్లోకి తీసుకువెళ్లడం, అక్కడే వారితో వేలిముద్రలు వేయించి హాజరు తీసుకోవడం సాధ్యం కాదు. దీంతో కృత్రిమ వేలిముద్రలు తయారు చేయడంపై దృష్టి పెట్టారు. యూ ట్యూబ్లో సెర్చ్ చేయడం ద్వారా ఫెవికాల్, ఎంసీల్ తదితరాలు కలపడం ద్వారా ఓ రకమైన సింథటిక్ పదార్థం తయారు చేయవచ్చని తెలుసుకున్నారు. దీనిపై డమ్మీ కార్మికుల వేలిముద్రల్ని సేకరించారు. ఆ సింథటిక్ పదార్థాన్ని వేలిముద్రల ఆకారంలో కట్ చేశారు. వీటిని తమ జేబులో వేసుకుని ఫీల్డ్కు వెళ్తున్న ఉద్యోగులు అదును చూసుకుని లాగ్ ఇన్, లాగ్ ఔట్ కోసం వీటితో వేలిముద్రలు వేసేస్తున్నారు. కొన్నాళ్లుగా గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారంపై మధ్య మండల టాస్క్ఫోర్స్కు సమాచారం అందింది. దీంతో వలపన్నిన అధికారులు స్కామ్ గుట్టరట్టు చేయడంతో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకుని 21 కృత్రిమ వేలిముద్రలు స్వాధీనం చేసుకున్నారు. ఒకటిరెండు రోజుల్లో ఈ స్కామ్ సూత్రధారులు, పాత్రధారులపై స్పష్టత వస్తుందని, ఆపై అందరినీ అరెస్టు చేస్తామని టాస్క్ఫోర్స్ అధికారులు చెబుతున్నారు. -
కృపాదానం ఇంటిపై ఏసీబీ దాడి
హైదరాబాద్ : ఓల్డ్ ఆల్వాల్లోని జీహెచ్ఎంసీ శానిటరీ ఇన్స్పెక్టర్ కృపాదానం ఇంటిపై ఏసీబీ అధికారులు బుధవారం ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో 50 తులాల బంగారం, 12 ఎకరాల భూమి, రూ.3 లక్షల నగదు, 8 ఫ్లాట్లు, రెండు ఇళ్లులతో కలిపి మొత్తం రూ.5 కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. నగరంలో మొత్తం ఐదు చోట్ల ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతోన్నాయి. కృపాదానంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడి చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల్లో పరిశీలకుడి తనిఖీ
ఇంటి ‘ఓటు’ పడింది !
వివాహిత అనుమానాస్పద మృతి?
మిత్రపక్ష పార్టీల కోఆర్డినేటర్లు వీరే...
మోదీ ప్రభుత్వాన్ని సాగనంపాలి
కీలక ప్రదేశాల్లో కేంద్ర బలగాల పహారా
సై.. అంటే సై!
ఎస్సెస్సీ సప్లిమెంటరీ ఫీజులు చెల్లించాలి
ఓటరు సహకార కేంద్రం ఏర్పాటు
ఆదివారం రాహుల్ గాంధీ..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement