-
‘చెత్త’ సమస్యకు చెక్
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో రోజురోజుకూ వెలుస్తున్న కొత్త ఆవాసాలు, కాలనీలకనుగుణంగా చెత్త కూడా పెరుగుతోంది. ఈ చెత్త ఒకేచోట గుట్టలుగా పేరుకుపోకుండా ఉండేందుకు ఎక్కడికక్కడే చిన్న మొత్తాల్లో నిల్వ చేసేందుకు ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు.. మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాలకనుగుణంగా సర్కిల్కు మూడు వంతున 30 సర్కిళ్లకు 90 సెకండరీ కలెక్షన్ ట్రాన్స్ఫర్ పాయింట్స్(ఎస్సీటీపీ) ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కొన్ని సర్కిళ్లలో మూడు కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన స్థలాలు దొరకకపోవడం.. కొన్ని ప్రాంతాల్లో దొరికినా స్థానికుల నుంచి ఎదురైన వ్యతిరేకతతో ఎలాగోలా 24 ప్రాంతాల్లో మాత్రం ఏర్పాటు చేయగలిగారు. స్థల సమస్య కారణంగా మిగతా 66 ఎస్సీటీపీలను ఏర్పాటు చేయలేదు. అయినప్పటికీ చెత్త నిర్వహణ పకడ్బందీగా సాగాలంటే ఏరోజుకారోజు తరలించేందుకు వీలుగా ఎస్సీటీపీలు లేని ప్రాంతాల్లో మొబైల్ వాహనాలను అందుబాటులో ఉంచి వాటి ద్వారా చెత్త తరలిస్తున్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. మరో ఆరు వాహనాలు అదనంగా ఉంచి 72 (రెఫ్యూజి కంటైనర్) వాహనాలను ఇందుకు వినియోగిస్తున్నట్లు తెలిపింది. వీటినే మొబైల్ ఎస్సీటీపీలుగా చెబుతోంది. కనీసం వెయ్యి చదరపు మీటర్ల స్థలం ఉన్నా ఎస్సీటీపీలను ఏర్పాటు చేయగలమని జీహెచ్ఎంసీ పేర్కొంది. అందుకోసం అన్వేషిస్తోంది. ప్రస్తుతానికి ఎస్సీటీపీలతోపాటు మొబైల్ ఎస్సీటీపీల వల్ల సర్కిళ్లనుంచి చెత్తను ఎప్పటికప్పుడు జవహర్నగర్ డంపింగ్యార్డుకుతరలిస్తునట్లు తెలిపింది. డంపింగ్యార్డుకు తరలించేవాహనాల్లో పోర్టబుల్ సెల్ఫ్ కాంపాక్టర్, స్టాటిక్ కాంపాక్టర్, సీల్డ్ కంటైనర్ సదుపాయాలున్నట్లు తెలిపింది. ఎప్పటికప్పుడు చెత్తను తరలిస్తుండటంతో పనులు వేగంగా జరుగుతున్నట్లు పేర్కొంది. -
బక్రీద్ వ్యర్థాల కోసం కవర్ల పంపిణీ
బక్రీద్ పండుగ సందర్భంగా తయారయ్యే వ్యర్థాలను ప్లాస్టిక్ కవర్లలో మాత్రమే పడేయాలని చాంద్రాయణగుట్ట ఎస్సై చంద్రమోహన్ అన్నారు. స్టేషన్ పరిధిలోని అల్ జుబేల్ కాలనీలో స్థానిక నాయకులతో కలిసి సోమవారం ఆయన ప్లాస్టిక్ కవర్లను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....బక్రీద్ పండుగ సందర్భంగా ఖుర్బానీ నిర్వహించే వ్యర్థాలను రోడ్లపై పడేస్తే ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తాము అందజేసే కవర్లలో వ్యర్థాలను పడేసి చెత్త కుండీలలో, లేకుండే జీహెచ్ఎంసీ వాహనాలలో పడేయాలని ఆయన సూచించారు. తమ కార్యక్రమానికి స్థానికుల నుంచి మంచి స్పందన వచ్చిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- విడాకులపై సలహా అడిగిన యువతి.. శ్రీజ పోస్ట్ వైరల్
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
Advertisement