-
జీ20 నేతలకు అరకు కాఫీ గిఫ్ట్.. ఆనంద్ మహీంద్రా పోస్టు వైరల్..
జీ20 సమ్మిట్కు హాజరైన విదేశీ నేతలకు అరకు కాఫీలను కేంద్రం గిఫ్ట్గా ఇచ్చింది. దీనిపై వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయిలో అత్యుత్తమ నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేయగల భారతదేశ సామర్థ్యానికి ప్రధాన ఉదాహరణ అరకు కాఫీ అని ప్రశంసించారు. అరకు బోర్డు ఛైర్మన్గా ఈ ఘనత తనకు ఎంతో గర్వకారణమని అన్నారు. 'అరకు బోర్డు ఛైర్మన్గా నాకు ఇది ఎంతో గర్వించదగ్గ విషయం. అరకు కాఫీని గిఫ్ట్గా ఇవ్వడంపై నేను ఎక్కువ మాట్లాడలేను. ప్రపంచంలోనే అత్యంత కాఫీ ఉత్పత్తుల్లో ఇండియా అరకు కాఫీ కూడా ఒకటి. ఇది మనకు ఎంతో గర్వకారణం' అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. జీ20 సమావేశం నుంచి వెనుదిరుగుతున్న విదేశీ నేతలకు కేంద్రం అరకు కాఫీలను గిఫ్ట్గా ఇస్తున్న వీడియోను షేర్ చేశారు. As the Chairman of the Board of Araku Originals, I can’t argue with this choice of gift! It just makes me very, very proud. Araku Coffee is the perfect example of ‘The best in the World, Grown in India’… https://t.co/VxIaQT6nZL — anand mahindra (@anandmahindra) September 12, 2023 అరకు కాఫీ ఎంతో ప్రత్యేకమైనది. ఆంధ్రప్రదేశ్లోని అరకు కొండ ప్రాంతాల్లో సేంద్రీయ తోటల్లో దీనిని ఎక్కువగా పెంచుతారు. ప్రత్యేకమైన సుగంధ లక్షణాలు కలిగి రుచికి ప్రసిద్ధి చెందింది. అరకు కాఫీని గిరిజన రైతులు ఉత్పత్తి చేస్తారు. భారతదేశంలోని తూర్పు కనుమలలో ఉన్న సుందరమైన అరకు లోయ పర్యాటకంగా కూడా చాలా ప్రసిద్ధి చెందిన ప్రదేశం. 2008లో ఏర్పాటు చేసిన నంది ఫౌండేషన్ అరకు కాఫీని ప్రపంచ స్థాయికి తీసుకుపోవడంలో తోడ్పాటునిచ్చింది. ఇదీ చదవండి: భారతదేశాన్ని సూర్యుడు మొదట ముద్దాడే ప్రదేశం.. నాగాలాండ్ మంత్రి వీడియో వైరల్.. -
Mahindra Thar Gifted To Nikhat Zareen: వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్కు మహీంద్రా ‘థార్’ గిఫ్టు (ఫొటోలు)
-
ఫండ్స్ను మనవళ్లకు గిఫ్ట్ ఇవ్వొచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?
నేను గ్రోత్ ఆప్షన్ బదులు ఐడీసీడబ్ల్యూ (నెలవారీ) ప్లాన్ను ఎంపిక చేసుకుంటే, ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు ఎలా ఉంటాయి? ఈ విషయలో పన్ను బాధ్యతలు ఎలా ఉంటాయి? – అభినవశ్రీ మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటుంటే ఇనకమ్ ఇస్ట్రిబ్యషన్ కమ్ క్యాపిటల్ విత్డ్రాయల్ (ఐడీసీడబ్ల్య) ప్లాన్కు దూరంగా ఉండండి. దీనికి బదులు గ్రోత్ ప్లాన్ ఎంపిక చేసుకోండి. ఐడీసీడబ్ల్యూ ప్లాన్ పన్ను పరంగా మెరుగైనది కాదు. గ్రోత్ ప్లాన్ పన్ను పరంగా మెరుగైన సాధనం. గ్రోత్ ప్లాన్లో పెట్టుబడులపై రాబడులు అన్నీ ఫండ్ వద్దే ఉంటాయి. దీంతో వాటిపైనా రాబడితో కాంపౌండింగ్ ప్రయోజనాన్ని పూర్తిగా పొందుతారు. అదే ఐడీసీడబ్ల్యూ ప్లాన్లో డివిడెండ్ అన్నది పెట్టుబడి, రాబడుల్లో కొత భాగాన్ని ఫండ్ సంస్థ తిరిగి చెల్లించడం. స్టాక్స్లో అయితే డివిడెండ్ వరకే ఇన్వెస్టర్లకు నేరుగా చెల్లిచడం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో డివిడెండ్లు అన్నవి తప్పుడు పదంతో ఇంత కాలం కొనసాగాయి. అందుకే ఇటీవలే డివిడెండ్ పేరును ఐడీసీడబ్ల్యూగా మార్చారు. డివిడెండ్లు చెల్లించిన వెంటనే ఫండ్ ఎన్ఏవీ అంతే మేర తగ్గుతుంది. ఐడీసీడబ్ల్యూ ప్లాన్లో డివిడెండ్లు మీ పన్ను ఆదాయానికి తోడవుతాయి. మీ శ్లాబు ప్రకారం పన్ను చెల్లించాలి. ఒక ఏడాదిలో డివిడెండ్ ద్వారా రూ. 5,000కు మించి ఆదాయం లభిస్తే టీడీఎస్ కింద 10 శాతాన్ని మినహాయిస్తారు. డివిడెండ్ను ఇన్వెస్టర్కు చెల్లించినా, లేక దాన్ని తిరిగి ఇన్వెస్ట్ చేసినా కానీ ఈ 10 శాతం టీడీఎస్ అమలవుతుంది. సాంకేతికంగా చూస్తే ఆదాయం లభిస్తే టీడీఎస్ కింద 10 శాతాన్ని మినహాయిస్తారు. డివిడెండ్ను ఇన్వెస్టర్కు చెల్లించినా, లేక దాన్ని తిరిగి ఇన్వెస్ట్ చేసినా కానీ ఈ 10 శాతం టీడీఎస్ అమలవుతుంది. సాంకేతికంగా చూస్తే ఐడీసీడబ్ల్యూ ప్లాన్లో మీ పెట్టుబడి ఫండ్ సంస్థతోనే ఉంటుంది. కానీ, వాస్తవంగా చూస్తే చెల్లించే డివిడెండ్పై పన్ను పడుతుంది. కనుక పన్ను పరంగా అంత సమర్థమైనది కాదు. ఐడీసీడబ్ల్యూ ప్లాన్లో డివిడెండ్ ఎంత చెల్లించాలన్నది ఫండ్ సంస్థలు నిర్ణయిస్తాయి. ఇందులో ఇన్వెస్టర్లకు పాత్రకు ఉండదు. మీకు క్రమం తప్పకుండా ఫండ్స్ పెట్టుబడుల నుంచి ఆదాయం రావాలని కోరుకుంటే, అందుకు గ్రోత్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేసి, సిస్టమ్యాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ ఎంపిక చేసుకోవడం మెరుగైనది. దీనివల్ల ఎంత కాలానికి ఎంత చొప్పున కావాలన్నది మీరే నిర్ణయించుకోవచ్చు. కనుక ఐడీసీడబ్ల్యూ ప్లాన్తో పోలిస్తే గ్రోత్ ప్లాన్ చాలా మెరుగైనది. మీ పెట్టుబడులపై మీరు నియంత్రణ కలిగి ఉంటారు. నా కుమారుడు మరణించాడు. జాయింట్ హోల్డర్గా ఉండడంతో ఫండ్స్ యూనిట్లు నాకు సంక్రమించాయి. వీటిని నా కుమారుడి పిల్లలకు బదిలీ చేయాలని అనుకుంటున్నాను. సాధ్యపడుతుందా? – విష్ణు కుమార్ మీ పేరుతో ఉన్న ఫండ్ యూనిట్లను మీ మనవళ్లు, మనవరాళ్లకు ఇవ్వడానికి లేదు. ఎందుకంటే ఫండ్స్ యూనిట్లు అనేవి గిఫ్ట్గా ఇవ్వడానికి, మరొకరికి బదిలీ చేయడానికి అవకాశం లేదు. అయితే మీ మనవళ్ల పేరిట ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇందుకు మీరు ముందుగా మీ పేరుతో ఉన్న ఫండ్స్ పెట్టుబడులు మొత్తాన్ని వెనక్కి తీసుకోండి. మీ మనవళ్ల వయసు 18 ఏళ్లు నిండి ఉంటే ప్రస్తుత పెట్టుబడులను వెనక్కి తీసుకుని, వచ్చిన మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయండి. అప్పుడు మీ మనవళ్లు, మనవరాళ్లే స్వయంగా వారి బ్యాంకు ఖాతా నుంచి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ విషయంలో మీరు వారికి సాయం అందించొచ్చు. ఒకవేళ మీ మవనళ్ల వయసు 18 ఏళ్లలోపు ఉంటే వారి తల్లి లేదంటే కోర్టు నియమించిన గార్డియన్కు పెట్టుబడులు బదలాయించొచ్చు. ఆ పని వారే చేస్తారు. మరో మార్గంలో ప్రస్తుతం మీ పేరుతో ఉన్న పెట్టుబడులను కొనసాగిస్తూ, నామినీగా మీ మనవళ్లు, మనవరాళ్లను పేర్కొనాలి. ఎవరికి ఎంత శాతం అనేది నిర్ణయించొచ్చు. అప్పుడు యూనిట్ హోల్డర్కు ఏదైనా జరిగితే అవి వారి పేరిట బదిలీ అవుతాయి. ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
‘ఆదిపురుష్’ డైరెక్టర్కు లగ్జరీ ఫెరారీ కారు బహుమతి, ఎవరిచ్చారంటే..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు చర్చించుకుంటున్న సినిమా ఆదిపురుష్. ఇటీవల టీజర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఆదిపురుష్ ముచ్చట్లే కనిపిస్తున్నాయి. టీజర్ అద్భుతమంటు పలువురు ప్రశంసిస్తుంటే ఇందులోని పాత్రలను చూపించిన తీరుపై రాజకీయ ప్రముఖులు, హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అంతేకాదు ఇది కార్టున్ చిత్రంలా ఉందంటూ ఫ్యాన్స్ సైతం అసహనం వ్యక్తం చేశారు. చదవండి: సుకుమార్-దేవిశ్రీ మధ్య రెమ్యునరేషన్ చిచ్చు! అసలేం జరిగింది? పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ మూవీ రిలీజ్కు ముందే ఓం రౌత్ ఖరీదైన లగ్జరీ కారును బహుమతిగా అందుకున్నాడు. ఆది పురుష్ మూవీకి టీ-సిరీస్ అధినేత భూషన్ కుమార్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. తాజాగా నిర్మాత భూషన్ కుమార్ ఓం రౌత్కు లగ్జరీ ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో(uber-luxurious Ferrari F8 Tributo) కారును కానుగా ఇచ్చాడు. దీని ధర రూ. 4.02 కోట్లు ఉంటుందని అంచనా. చదవండి: ‘బ్రహ్మాస్త్ర’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఆ రోజు నుంచి స్ట్రీమింగ్.. అయితే ఇది అప్పటికప్పుడు షో రూంలో తీసుకుంది కాదనీ, ముందుగానే భూషన్ కుమార్ తన పేరు మీద ఈ కారు బుక్ చేశాడని తెలుస్తుంది. చూస్తుంటే ఓం రౌత్కు ఈ కారును గిఫ్ట్గా ఇవ్వాలని ఆయన ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా బడా నిర్మాత అయిన భూషన్ కుమార్ ఇలా కాస్ట్లీ కార్లను బహుమతిగా ఇవ్వడం ఇదేం తొలిసారి కాదు. ఈ ఏడాది విడుదలైన భూల్ భూలయా 2 సినిమా సక్సెస్ నేపథ్యంలో హీరో కార్తిక్ ఆర్యన్కు ఆయన రూ. 4.70 విలువ చేసే లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చాడు. -
ఈ విజయం ఎంతో ప్రత్యేకం
న్యూఢిల్లీ: పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్గా నిలవడంతో అందరికంటే అమితానందం పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్. తన శిష్యురాలి తాజా ప్రదర్శన గోపీచంద్ను గర్వపడేలా చేసింది. స్వర్ణం సాధించడంతో ఒక పనైపోయిందని ఆయన అన్నారు. ‘నాకు సంబంధించి ఇది చాలా పెద్ద విజయం. వరల్డ్ చాంపియన్ అనిపించుకోవడం నిజంగా చాలా గొప్ప ఘనత. దీనిని ఆమె సాధించిన తీరు ఇంకా అపూర్వం. రెట్టింపు గర్వంగా అనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ గెలుపు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక మన దేశం నుంచి ఇప్పటికే కాంస్యం, రజతం చూశాం. ఇప్పుడు స్వర్ణం కూడా దక్కింది’ అని గోపీచంద్ భావోద్వేగంతో చెప్పారు. ఒకుహారాతో జరిగిన మ్యాచ్పై ప్రత్యేక వ్యూహంతో బరిలోకి దిగాల్సిన అవసరం లేకపోయిందని, ఒక్కసారి మ్యాచ్లో పట్టు చిక్కితే ఆమె దూసుకుపోతుందనే విషయం తనకు తెలుసని కోచ్ వ్యాఖ్యానించారు. ‘ఒలింపిక్స్, వరల్డ్ చాంపియన్షిప్, కామన్వెల్త్, ఆసియా క్రీడలు... ఇలా అన్ని చోట్లా సింధు రాణించింది. బయటి వారి సంగతి ఎలా ఉన్నా ఆమె ఆటపై నాకు మాత్రం ఎలాంటి సందేహాలు లేవు. ఫైనల్లో ఫలితం ప్రతికూలంగా వచ్చినా నేను బాధపడకపోయేవాడిని. మన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడమే ముఖ్యం’ అని మాజీ ఆల్ఇంగ్లండ్ చాంపియన్ అభిప్రాయపడ్డారు. ఎమ్మెస్కే అభినందన... సింధు విజయంపై భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అభినందనలు తెలియజేశారు. ఈ క్రమంలో గోపీచంద్ చేసిన కృషిని ఆయన ప్రశంసించారు ‘సింధు కఠోర శ్రమ, అంకితభావం, నైపుణ్యానికి దక్కిన ఫలితమిది. ఆమెను చూసి దేశం గర్విస్తోంది. భారత బ్యాడ్మింటన్కు వెన్నెముకలా నిలిచి శ్రమించిన గోపీచంద్కు కూడా నా అభినందనలు. వ్యక్తిగతంగా ఆయన నాకు ఆత్మీయ మిత్రుడు. ఇంతటి అంకితభావం ఉన్న కోచ్ను నేను ఎప్పుడూ చూడలేదు’ అని ప్రసాద్ అన్నారు. చాముండేశ్వరీనాథ్ కారు కానుక... వరల్డ్ చాంపియన్షిప్ స్వర్ణం గెలిచిన పీవీ సింధుకు అత్యాధునిక హై ఎండ్ కారును బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు వి.చాముండేశ్వరీనాథ్ ప్రకటించారు. నేడు హైదరాబాద్లో జరిగే కార్యక్రమంలో దీనిని అందజేసే అవకాశం ఉంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement