-
ఆ జంటకు బహుమతుల వెల్లువ
సాక్షి, న్యూఢిల్లీ : మే 8న వివాహ బంధంతో ఒక్కటవుతున్న సోనం కపూర్, ఆనంద్ అహుజాలకు సెలెబ్రిటీ స్నేహితులు, సన్నిహితుల నుంచి పుష్పగుచ్ఛాలు, విలువైన బహుమతులు వెల్లువెత్తుతున్నాయి. పెళ్లి పత్రికపై బహుమతులు వద్దని వినతిని జోడించినా కపూర్ మాన్షన్కు గిఫ్ట్లు తరలివస్తున్నాయి. సోనంకు సన్నిహితంగా మెరిగే చిత్ర నిర్మాత కరణ్ జోహార్ ఆమెకు కాంచీపురం చీర, అమ్రపాలి జుంకాలు, చెవిరింగులను బహుమతిగా ఇవ్వనున్నారు. మే 8న వివాహ వేడుకతో పాటు అదే రోజు సాయంత్రం సోనం, ఆనంద్ అహుజాల వివాహ రిసెప్షన్ జరగనుంది. ఇక సోనంకు సన్నిహితంగా మెలిగే సహనటీనటులు సంగీత్లో సందడి చేసేందుకు డ్యాన్స్ రిహార్సల్స్తో హోరెత్తిస్తున్నారు. గత కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్న సోనం, ఆనంద్లు ఎన్నడూ తమ అనుబంధంపై ఎక్కడా నోరుమెదపలేదు. పార్టీలు, ఈవెంట్లకు సైతం ఇద్దరూ కలిసే హాజరైనా వదంతులపై మాత్రం అధికారికంగా స్పందించలేదు. ఇక మే 8న వీరి వివాహం జరుగుతుందని ఇరు కుటుంబాలు అధికారికంగా నిర్ధారించడంతో వివాహ వేడులకపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. మరోవైపు సోనం నటించిన వీరే ది వెడ్డింగ్ జూన్ 1న విడుదలకు ముస్తాబవుతోంది. -
హైకోర్టు నోటీసులు
• ఎన్నికల కమిషన్, అభ్యర్థులకు జారీ • వివాదాస్పద అభ్యర్థులపై 9లోగా వివరణ • పీఎంకే అభ్యర్థుల జాబితా వెల్లడి • బీజేపీ అభ్యర్థుల పేర్లు ఖరారు గడిచిన ఎన్నికల్లో నగదు, బహుమతులు పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొని ఎన్నికల రద్దుకుకార కులైన సెంథిల్ బాలాజీ (అన్నాడీఎంకే), కేసీ పళనిస్వామి (డీఎంకే) లను ఉప ఎన్నికల్లో అభ్యర్థులుగా అనుమతించడంపై వివరణ ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్కు, ఇద్దరు అభ్యర్థులకు మద్రాసు హైకోర్టు సోమవారం నోటీసులు జారీచేసింది. కరూరు జిల్లా అయ్యంపాళయంకు చెందిన ఎస్ రాజేంద్రన్ అనే వ్యక్తి ఇటీవల దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించి నోటీసులు పంపింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో అరవకురిచ్చి, తంజావూరు నియోజకవర్గాల్లో ఓటర్లకు నగదు బట్వాడాతో అక్కడి ఎన్నికలను కోర్టు రద్దు చేసింది. దీంతో 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 232 చోట్ల మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఈ రెండు నియోజకవర్గాలకు వచ్చేనెల 19వ తేదీన ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అన్నాడీఎంకే తరఫున సెంథిల్ బాలాజీ, డీఎంకే తరఫున కేసీ పళనిస్వామి పోటీపడుతున్నారు. వీరిద్దరూ గడిచిన ఎన్నికల్లో ఓటర్లకు నగదు, పంచెలు, చీరలు, బహుమతులు పంపిణీ చేసిన ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే డీఎంకే అభ్యర్థి కుమారుడి ఇంటిపైనా, కరూరులోని అన్నాడీఎంకే అభ్యర్థి అనుచరుడు అన్బునాథన్ ఇంటిపైనా అదాయపు పన్ను శాఖాధికారులు దాడులు నిర్వహించి భారీ ఎత్తున నగదు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక అభ్యర్థుల అనుచరుల ఇళ్లలో మద్యం బాటిళ్లు, చీరలు, పంచెలు పట్టుపడ్డాయి. పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్న కారణంగానే అరవకురిచ్చి, తంజావూరు నియోజకవర్గాల్లో ఎన్నికలు రద్దయ్యాయి. ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ఎన్నికల రద్దుకు కారకులైన అదే అభ్యర్థులను ఉప ఎన్నికల్లో మరలా పోటీకి పెట్టడం సరైన నిర్ణయం కాదు. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసినట్టే అవుతుంది. కాబట్టి వీరిద్దరిని ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించాలి. వారి నామినేషన్లను తిరస్కరించేలా ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని, ఒక వేళ వీరు పోటీ చేస్తే వీరిద్దరికీ పడిన ఓట్లను లెక్కించరాదని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి మహాదేవన్ ముందుకు సోమవారం విచారణకు వచ్చింది. ఎన్నికల పనులు ప్రారంభమైనందున న్యాయస్థానం జోక్యం చేసుకోరాదని చట్టంలో పేర్కొని ఉన్నా ఇది ఎంతో ముఖ్యమైన కేసుగా పరిగణిస్తున్నామని వారు అన్నారు. అరవకురిచ్చిలో ఇప్పటికే 15 రోజులపాటూ ప్రభుత్వ ధనం, అభ్యర్థుల ధనం ఖర్చయిందని చెప్పారు. డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థుల నుంచి ఖర్చయిన సొమ్మును రాబట్టాలని పీఎంకే అభ్యర్థి భాస్కరన్ వేసిన పిటిషన్ను కూడా తాము విచారిస్తున్నట్లు న్యాయమూర్తులు తెలిపారు. భాస్కరన్ వేసిన పిటిషన్ వచ్చే నెల 9వ తేదీ విచారణకు వస్తున్నందున ఈ పిటిషన్ను సైతం 9వ తేదీకి వాయిదా వేస్తున్నామని తెలిపారు. పిటిషన్ దారులు చేసిన ఆరోపణలపై డీఎంకే, అన్నాడీఎంకే, ఎన్నికల కమిషన్ సవివరమైన నివేదికను 9వ తేదీ దాఖలు చేయాలని ఆదేశిస్తూ సోమవారం నోటీసు జారీ చేశారు. హైకోర్టులో పిటిషన్లపై విచారణలు కొనసాగుతుండగా ఈ నెల 28న తంజావూరు, అరవకురిచ్చి డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థులు తమ నామినేషన్ను దాఖలు చేయనున్నారు. పీఎంకే నుంచి పోటీ చేయబోతున్న అభ్యర్థుల పేర్లను సోమవారం ప్రకటించారు. అరవకురిచ్చి నుంచి పీఎంకే భాస్కరన్, తంజావూరు నుంచి కుంజితపాదం, తిరుప్పరగుండ్రం నుంచి టీ సెల్వం ఎన్నికల్లో పోటీకి దిగుతున్నట్లు పీఎంకే ప్రధాన కార్యదర్శి జీకే మణి సోమవారం మీడియాకు తెలియజేశారు. బీజేపీ అభ్యర్థులు ఖరారు: కేంద్ర మంత్రి పొన్ రాష్ట్రంలో అరవకురిచ్చి, తంజావూరు, తిరుప్పరగుండ్రం నియోజకవర్గాల్లో వచ్చేనెల 19 తేదీన జరుగనున్న ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఖరారైనట్లు కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ తెలిపారు. తంజావూరులో సోమవారం మీడియాతో మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర శాఖ ముగ్గురి పేర్లను ఖరారు చేసి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపిందని, ఢిల్లీ నుంచే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారని ఆయన తెలిపారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో చోటు చేసుకున్న ఓటర్లకు నగదు బట్వాడా, బహుమతుల పంపిణీ వంటి అక్రమాలు పునరావృతం కాకుండా ఎన్నికల కమిషన్ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement