-
వెండితెరకు యామిని జీవితం
ప్రముఖ నాట్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి జీవితం వెండితెరకు రానుంది. ‘దివ్యమణి’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన గిరిధర్ గోపాల్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘విశ్వనాథ్, డైరెక్టర్ లక్ష్మీ దీపక్, కెమెరామెన్ సత్తిబాబు గార్లవద్ద పని నేర్చుకున్నా. ఫొటోగ్రఫీ, మ్యూజిక్, వీఎఫ్ఎక్స్లపై మంచి పట్టు ఉంది. చాలా యాడ్స్ చేశా. నా తొలి చిత్రం ‘దివ్యమణి’. రెండవ చిత్రంగా పద్మశ్రీ యామిని కృష్ణమూర్తిగారి బయోపిక్ తెరకెక్కించనున్నా. నేటి తరానికి ఆమె ఎంతో స్ఫూర్తి. కూచిపూడి, భరతనాట్యంతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారామె. చిన్న వయసులోనే పద్మశ్రీ, పద్మ విభూషణ్, పద్మభూషణ్ లాంటి ఎన్నో అవార్డులు అందుకున్నారు. అలాంటి యామినిగారి జీవిత కథను అందరికీ తెలియజేయాలనే ఆలోచనతో సినిమా తీయాలని నిర్ణయించుకున్నా. ఈ బయోపిక్కు యామినిగారే కొరియోగ్రఫీ అందించనుండటం విశేషం. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కించనున్నాం. త్వరలోనే ఈ బయోపిక్ పూర్తి వివరాలు తెలియచేస్తా’’ అన్నారు. -
దళారుల కట్టడికే ఆన్లైన్ టికెట్లు
సాక్షి, తిరుమల: ఆన్లైన్లో రూ. 300 టికెట్ల విక్రయాల ద్వారా కల్పించే దర్శనంలో అక్రమాలకు అవకాశం లేకుండా అమలు చేస్తామని టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ అన్నారు. గురువారం జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణతో కలిసితో కలసి ఆయన రూ.300 ఆన్లైన్ టికెట్ల క్యూను సందర్శించారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ రోజుకు 11 వేల టికెట్లు ఇస్తున్నామని, త్వరలోనే ఈ సంఖ్యను 15వేలకు పెంచే ఏర్పాట్లు చేస్తామన్నారు. దళారులను ఆశ్రయించకుండా ఉండేందుకే ఈ ఆన్లైన్ దర్శనం ప్రవేశ పెట్టామన్నారు. వస్త్రధారణ, టీటీడీ నిబంధనలను టికెట్లపై అన్ని భాషల్లో ముద్రించే చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. -
‘సాక్షి’ బ్రహ్మోత్సవ సంచికపై అభినందనలు
శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక కథనాలతో ఆదివారం ‘నమో లక్ష్మీపతే’ శీర్షికన ప్రచురితమైన ‘సాక్షి ఫన్ డే’ సంచికను సింహవాహన సేవలో సంబంధిత తిరుమల అధికారులు ఆవిష్కరించారు. టీటీడీ సాధికారిక మండలి అధ్యక్షుడు జగదీష్చంద్ర శర్మ, ఈవో గిరిధర్ గోపాల్, జేఈవోలు కేఎస్ శ్రీనివాసరాజు, పోలా భాస్కర్, డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు, పీఆర్వో టి. రవి, ద్రవిడ వర్సిటీ పూర్వ ఉప కులపతి రవ్వా శ్రీహరిలు ‘ఫన్ డే’ సంచికను ఆవిష్కరించారు. -
వాహన సేవల ఊరేగింపు యథాతథం
తిరుమల: తిరుమల బ్రహ్మోత్సవాల్లో సందర్భంగా వాహన సేవల ఊరేగింపులో ఎలాంటి మార్పులు చేయడం లేదని టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ వెల్లడించారు. వాహన సేవలకు ముందుగా ప్రత్యేక బ్యాడ్జిలు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తామన్నారు. ఈసారి గతంలో కంటే తక్కువ సంఖ్యలోనే ప్రముఖులకు ప్రోటోకాల్ బ్యాడ్జిలు, పాసులు ఇస్తామన్నారు. స్వామి సన్నిధిలో పూర్తి స్థాయిలో భద్రత ఉందని, ఎలాంటి అభద్రతా భావం, అపోహలు అనవసరమని ఆయన భరోసా ఇచ్చారు. గరుడ సేవకు ఐదు లక్షల మంది: జేఈవో తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 30న నిర్వహించనున్న శ్రీవారి గరుడ సేవకు ఐదు లక్షల మంది భక్తులు రావచ్చని అంచనా వేసినట్టు జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు వెల్లడించారు. నాలుగు మాడ వీధుల్లో 2.20 లక్షల మంది భక్తులు హాయిగా కూర్చుని స్వామి వాహన సేవల్ని దర్శించుకునేలా ఏర్పాట్లు చేపట్టారు. అలాగే, వెలుపల ఉన్నవారు మొత్తం 10 ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా స్వామి సేవల్ని తిలకించే వీలుంటుంది. కొత్తగా బ్యాటరీ వాహనాలు..: ఆలయం ముందున్న వృద్ధుల క్యూలైనును మొదటి వైకుంఠం క్యూకాంప్లెక్స్ ఆవరణలోకి మార్పు చేశారు. బ్రహ్మోత్సవాల్లోగా ఈ కొత్త క్యూలైను అందుబాటులోకి రానుంది. వృద్ధుల కోసం మ్యూజియం వద్ద 10 సీట్లు, 25 సీట్లు కలిగిన బ్యాటరీ కార్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచి అనంతాళ్వారు తోట మీదుగా మొదటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్కు చేరవేస్తారు. తూర్పు మాడవీధిలోనూ ఇనుప కంచె భద్రత కోసం మూడేళ్లకు ముందు ప్రారంభించిన ఇనుప కంచెనిర్మాణం(ఇన్నర్ సెక్యూరిటీ కార్డాన్) పనులు తూర్పుమాడ వీధిలోనూ ప్రారంభించారు. ఇవి పూర్తయితే, ఆలయ నాలుగు మాడ వీధులు భద్రతా విభాగం ఆధీనంలోకి వస్తాయి. 22న వేద విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం రెండవ స్నాతకోత్సవం ఈనెల 22న జరగనుంది. గవర్నర్ నరసింహన్ చాన్స్లర్ హోదాలో హాజరై విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా కృష్ణాజిల్లాకు చెందిన వేదపండితుడు మద్దూరి వెంకటేశ్వరయాజులుకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. ఆయన స్నాతకోపన్యాసం చేస్తారు. -
‘స్వర్ణమయం’పై సమగ్ర పరిశీలన: టీటీడీ ఈవో
తిరుమల: శ్రీవారి ఆలయానికి బంగారు తాపడం పనుల(ఆనంద నిలయం అనంత స్వర్ణమయం) పథకంపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీటీడీలో ఉన్న ఆడిట్ అభ్యంతరాల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఆలయంలో ప్రవేశ పెట్టిన మూడు వరుసల క్యూ విధానంతో భక్తుల మధ్య తోపులాట తగ్గిందన్నారు. కల్యాణ కట్టలో భక్తులకు తలనీలాలు తీసే సమయం తగ్గించేందుకు శాశ్వత ఉద్యోగులు, పీస్రేట్ కార్మికుల నియామకం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్లు తెలిపారు. ప్రస్తుతం 11 వేల వరకు రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు ఇస్తున్నామని, మరో 7 వేల టికెట్లను కూడా ఆన్లైన్లో కేటాయించిన తర్వాతే తిరుమల లో కరెంటు బుకింగ్ రద్దు చేస్తామని ఈవో చెప్పారు. తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో పేరుకుపోయిన నోట్లను ప్రత్యేకంగా లెక్కించేందుకు శుక్రవారం నుంచి అదనపు పరకామణి ప్రారంభించారు. కాగా, శుక్రవారం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. కోనేటి రాయుడికి కోటి విలువైన బంగారు హారం: చిత్తూరు జిల్లా శ్రీనివాసమంగాపురంలో కొలువైన కల్యాణ వేంకటేశ్వర స్వామికి చెన్నైకి చెందిన అజ్ఞాత భక్తుడు కోటి రూపాయల విలువ చేసే మూడు కిలోల బంగారు హారాన్ని కానుకగా అందించారు. 3 కిలోల బంగారంతో శ్రీదేవి, భూదేవి ప్రతిమలు ఉండేలా అందంగా చేయించిన హారాన్ని శుక్రవారం ఆలయ అధికారులకు అందజేశారు. గతంలో తాను మొక్కుకున్న మేరకు ఈ హారాన్ని కానుకగా ఇచ్చినట్లు ఆయన చెప్పారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- గుండె ఘోష విన్నారు..
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement