-
భారత్లో మరో బెంజ్ కారు లాంచ్ - ధర ఎంతంటే?
న్యూఢిల్లీ: లగ్జరీ వాహనాల తయారీలో ఉన్న మెర్సిడెస్–బెంజ్ ప్రీమియం ఎస్యూవీ జీఎల్సీ కొత్త వెర్షన్ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఎక్స్షోరూంలో ఈ కారు ప్రారంభ ధర రూ.73.5 లక్షలు. పెట్రోల్, డీజిల్ పవర్ట్రెయిన్స్తో లభిస్తుంది. ఇప్పటికే 1,500ల పైచిలుకు బుకింగ్స్ నమోదయ్యాయని కంపెనీ ప్రకటించింది. భారత్లో మెర్సిడెస్కు అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్యూవీ ఇదే. తొలిసారిగా మెర్సిడెస్ కార్లలో ఎన్టీజీ 7 ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ను పొందుపరిచారు. 2 లీటర్ పెట్రోల్ ఇంజన్తో తయారైన జీఎల్సీ 300 4మేటిక్ గరిష్ట వేగం గంటకు 240 కిలోమీటర్లు. -
మెర్సిడెస్ కొత్త ఎస్యూవీ ‘జీఎల్సీ’
♦ పెట్రోల్. డీజిల్ వేరియంట్లలో లభ్యం ♦ ధర రూ.50.7 లక్షల నుంచి రూ.50.9 లక్షల రేంజ్లో న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్ కొత్త స్పోర్ట్స్యుటిలిటీ వెహికల్(ఎస్యూవీ)ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. జీఎల్సీ పేరుతో ఈ ఎస్యూవీని పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో అందిస్తున్నామని మెర్సిడెస్ ఇండియా పేర్కొంది. 2143 సీసీ డీజిల్ ఇంజిన్తో రూపొందించిన జీఎల్సీ 220డి మోడల్ ధర రూ.50.7 లక్షలని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈఓ, రోలాండ్ ఫోలర్ చెప్పారు. అలాగే 1991 సీసీ పెట్రోల్ ఇంజిన్తో రూపొందించిన జీఎల్సీ 300, ధర రూ.50.9 లక్షలని(అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, పుణే) వివరించారు. జీఎల్ఏ, జీఎల్ఈ లగ్జరీ ఎస్యూవీల మధ్య ఉన్న ఖాళీని ఈ తాజా జీఎల్సీ ఎస్యూవీ భర్తీ చేస్తుందని పేర్కొన్నారు. మెర్సిడెస్.. ఆరో ఎస్యూవీ: ఈ ఏడాది 12 కొత్త మోడళ్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీంట్లో భాగంగా ఈ ఏడాది తామందిస్తున్న ఐదో మోడల్ ఇదని రోలాండ్ వివరించారు. కాగా భారత్లో మెర్సిడెస్ అందిస్తున్న ఆరో ఎస్యూవీ మోడల్ ఇది. కారు ప్రత్యేకతలు.. : ఈ కారులో ఏడు అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ (ఈ ఎస్యూవీని 360 డిగ్రీల్లో చూడగలిగే ప్రత్యేకతను ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చూపగలదు) 20 సీడీల స్టీరియో, గర్మిన్ ఆధారిత నావిగేషన్, 2 యూఎస్బీ పోర్ట్లు, బ్లూ టూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్లో ఉన్నాయి. 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్, మల్టీపుల్ డ్రైవింగ్ మోడ్స్, 4మ్యాటిక్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్, ఎడాప్టివ్ బ్రేక్ లైట్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 7 ఎయిర్బ్యాగ్లు వంటి ప్రత్యేకతలున్నాయని కంపెనీ అంటోంది. డీజిల్ ఎస్యూవీ 0-100 కిమీ వేగాన్ని 8.3 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 210 కిమీ. ఇక పెట్రోల్ ఎస్యూవీ 0-100 కిమీ. వేగాన్ని 6.5 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 222 కిమీ.
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
రుబెల్లాపై గర్భిణులు అప్రమత్తంగా ఉండాలి
స్పైస్జెట్కు రూ.60 వేల జరిమానా
బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే పింఛన్ల పెంపు
నేడు ప్రధానమంత్రి రోడ్ షో
ఓటింగ్ శాతం పెంచాలి
ఉమ్మరకోట్ సొంతం!
సీ్త్ర, పురుష నిష్పత్తిలో తేడా తగ్గించాలి
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
సమన్వయంతో పనిచేద్దాం: ఎస్పీ
‘12, 13 తేదీల్లో పత్రికా ప్రకటనలపై ముందస్తు అనుమతి తప్పనిసరి’
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement