-
బాబు 40ఏళ్ల అనుభవం అక్కరకొచ్చిందా..?
సాక్షి, అమరావతి : నలభై ఏళ్ల అనుభవం.. రాజధానికి ఒక్క శాశ్వత ఇటుక కూడా వేయలేకపోయింది.. సమర్థుడిని, పాలనాదక్షుడినని చెప్పుకునే నాయకుడి ఐదేళ్ల పాలనలో స్వయంగా సీఎం నివాసానికి కూతవేటు దూరంలోని 2.6 కిలోమీటర్ల ఫ్లైఓవర్ పూర్తికాలేదు. దార్శనికుడి ఐదేళ్ల ఏలుబడిలో... రాజధానిలో భాగమైన విజయవాడ, గుంటూరు నగరాలు మురికి కూపాలుగా మారింది వాస్తవం కాదా? నిప్పునని నిత్యం చెప్పుకునే నిజాయితీపరుడి రాజ్యంలో.. లక్షల కోట్లు అవినీతి ఎలా జరిగింది? రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నానని ఊదరగొట్టే.. కూలీనెం.1 ఐదేళ్ల పరిపాలనలో చిన్నచిన్న పెండింగ్ పనులు సైతం పూర్తికాలేదు. అన్నీ తాత్కాలిక నిర్మాణాలు, ప్రజాధనం దుబారా, విలువలకు తిలోదకాలు.. ప్రచార కండూతి.. ఇవి చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అడుగడుగునా కనిపించే సచిత్ర దృశ్యాలు. అనుభవజ్ఞుడి ఐదేళ్ల అసమర్థ,అవినీతి పాలననే.. స్వర్ణాంధ్ర అనుకుందామా..? నలభై ఏళ్ల అనుభవంతో ఆంధ్రావనికి అంతర్జాతీయ స్థాయి రాజధానిని నిర్మిస్తానన్నారు..కాని ఐదేళ్లుగా రాజధాని కోసం కనీసం ఒక్క శాశ్వత ఇటుకైనా వేశారా.. రైతుల నుంచి 35 వేల ఎకరాల పంట భూములు లాక్కోవడం, తన వాళ్లకు కట్టబెట్టడం తప్ప.. రాజధాని నిర్మాణానికి ఒక్క రాయి అయినా ఎత్తారా? లేదే!!మరి అనుభవం అక్కరకొచ్చినట్టా... మాటలతో మభ్యపెట్టినట్టా..?! రాష్ట్రానికి శాశ్వత ప్రయోజనాలకోసమే పని చేస్తున్నానంటూ..ఉపన్యాసాలు ఇస్తూ... గత ఐదేళ్లలో రాజధానిలో తాత్కాలిక సచివాలయం..తాత్కాలిక శాసనసభ.. శాసన మండలి.. అన్నీ తాత్కాలిక కట్టడాలే! ఈ తాత్కాలిక నిర్మాణాలకు చదరపు అడుగుకు రూ.11వేలను ఖర్చు చేసి తన కోటరీకి లబ్ధి చేకూర్చడం చంద్రబాబుకే చెల్లింది. అవినీతిలో ఎత్తిపోతలు నిజాయితీ... తాను నిప్పునని పదే పదే చెప్పుకునే చంద్రబాబు ఐదేళ్ల పాలనలో.. ఇసుక, మట్టి, గనుల దగ్గర నుంచి రాజధాని భూముల వరకూ.. జన్మభూమి కమిటీల నుంచి టీడీపీ నాయకులు, ప్రభుత్వ పెద్దల దాకా.. వాటాలు వేసుకొని మరీ సాగించిన దోపడీ పర్వం లక్షల కోట్లు దాటిందన్నది జగమెరిగిన సత్యం కాదా? అంతెందుకు ఒక్క పట్టిసీమ ఎత్తిపోతల్లోనే.. రూ.374 కోట్ల దోచేశారని కాగ్ ఇచ్చిన నివేదికే చంద్రబాబు అవినీతికి అధికారిక నిదర్శనం. ఇప్పుడు చెప్పండి.. చంద్రబాబు నిప్పా.. అవినీతి కుప్పా? విలువలకు వలువలేవీ? నైతిక విలువలతో రాజకీయాలు చేస్తున్నా అంటూ పదే పదే చంద్రబాబు చెబుతున్నారు. కానీ.. దేశంలో రాజకీయాల్లో నైతిక విలువలకు వలువలు వదిలింది చంద్రబాబేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్నాక.. 1996 లోక్సభ ఎన్నికలను ఎదుర్కోవాల్సి వచ్చింది. దేశంలో ఆ ఎన్నికల్లోనే ఓటర్లకు డబ్బులను ఎరగా వేసి..ప్రలోభ పెట్టే కార్యక్రమానికి మొట్టమొదట సారిగా చంద్రబాబే ప్రారంభించారు. 1998 లోక్సభ మధ్యంతరఎన్నికల్లో.. 1999 సాధారణ ఎన్నికలు, 2004, 2014 ఎన్నికల్లోనూ ధనప్రవాహాన్ని ఏరులై పారించారు. నంద్యాల ఉప ఎన్నికలో ధనప్రవాహాన్ని పరాకాష్టకు చేర్చారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఒక్కో నియోజకవర్గానికి సగటున రూ.30 కోట్లు వెదజల్లి.. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి పావులు కదుపుతున్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తుంగలో తొక్కి.. వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని రూ.25 కోట్లకుపైగా వెదజల్లి.. కొనుగోలు చేశారు. ఇవీ రాజకీయాల్లో చంద్రబాబు పాటిస్తున్న నైతిక విలువలు..! దుబారా బాబు రెవెన్యూ లోటు, ఆర్థిక పరిస్థితి సహకరించకున్నా.. అందుబాటులో ఉన్న వనరులకు సమర్థవంగా వినియోగించుకుని.. ఒక్క రూపాయి కూడా వృథా చేయకుండా అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టానని చంద్రబాబు పదేపదే చెబుతుంటారు. గత ఐదేళ్లలో హంగులు ఆర్భాటాలు.. విందులు వినోదాలు.. స్వదేశీ, విదేశీ యాత్రలు.. విహారయాత్రలు.. రియాలిటీ షోల పేరుతో భారీఎత్తున ప్రజాధనాన్ని దుబారా చేశారు. రాజధానికి భూమి పూజ పేరుతో ఒకసారి.. శంకుస్థాపన పేరుతో మరోసారి.. ప్రభుత్వ భవనాల శంకుస్థాపన పేరుతో ఇంకోసారి.. రహదారులకు శంకుస్థాపన పేరుతో మరొకసారి.. ఇలా అనేకసార్లు రాజధానికి శంకుస్థాపనలు చేసి భారీగా రూ.250 కోట్లకు పైగా ఖర్చు చేశారు. చివరకు పోలవరం విహారయాత్ర పేరుతో రూ.121.81 కోట్లను దుర్వినియోగం చేశారు. ఇప్పుడు చెప్పండి ప్రజాధనాన్నిసద్వినియోగం చేసుకునే తీరు ఇదేనా? ప్రచార యావకి29 మంది బలి 2015లో గోదావరి పుష్కరాల ప్రారంభ ముహూర్తంలోనే గోదావరిలో స్నానం చేస్తే.. పుణ్యం వస్తుందంటూ భారీ ఎత్తున ప్రచారం చేశారు. దాంతో రాజమహేంద్రవరానికి ప్రజలు పోటెత్తారు. సీఎం చంద్రబాబు నిబంధనల ప్రకారం– వీఐపీ ఘాట్ వద్ద స్నానం చేయకుండా.. భక్తులకు కేటాయించిన పుష్కర ఘాట్లో స్నానం చేసేందుకు వచ్చారు. భారీఎత్తున పోటెత్తిన భక్తుల నడుమ.. పుష్కరాల్లో తన వైభవాన్ని చాటిచెప్పేలా నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్, సినీ దర్శకుడు బోయపాటి శ్రీనుతో చిత్రీకరణకుప్రయత్నించారు. చిత్రీకరణ పూర్తయి.. చంద్రబాబువెళ్లిపోయాక పుష్కర ఘాట్లోకి భక్తులను ఒకేసారి వదలడంతో తొక్కిసలాట జరిగి 29 మంది కన్నుమూశారు. చంద్రబాబు వీఐపీ ఘాట్లో స్నానం చేసి ఉంటే ఈ ఘోరం జరిగేదా? ఇప్పుడు చెప్పండి చంద్రబాబు ప్రచార కండూతి వల్లే 29 మంది బలయ్యారన్నది వాస్తవం కాదా?! నీ అసమర్థ పాలనకు ‘దుర్గమ్మే’ సాక్షి తన సమర్థతతో, పాలనాదక్షతతో నవ్యాంధ్రను నిర్మిస్తానన్ననాయకుడు.. ఐదేళ్ల పాలన తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి నివాసానికి కూత వేటు దూరంలోని 2.6 కిలోమీటర్ల పొడవైన కనకదుర్గ ప్లైఓవర్ను కూడా నిర్మించలేకపోయారు.. కృష్ణా పుష్కరాలు ప్రారంభమయ్యేలోగా అంటే.. ఆగస్టు 12, 2016 నాటికే ప్లైఓవర్ను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కృష్ణా పుష్కరాలు పూర్తయి 32 నెలలు గడిచిపోయాయి. కానీ.. ప్లైఓవర్ పూర్తి కాలేదు. విజయవాడ నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరనేలేదు. ఇప్పుడు చెప్పండి.. బాబు సమర్థుడా.. పాలనా దక్షుడా?! లేక అది ఆయన అసమర్థతకు నిలువుటద్దమా?! సమీక్షలు సరే.. పనులెక్కడ? హార్డ్వర్క్.. ప్రజల కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తున్నట్లు ఊదరగొట్టే చంద్రబాబు పాలన అంటే.. ఉత్తి సమీక్షలే సమీక్షలు.. పనులు నత్తనడక.. ఫలితాలు శూన్యం..! అనే విషయం ఏ చిన్న అధికారిని అడిగినా చెబుతారు. ఉదాహరణకు వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగంలో కేవలం 3.2 కిమీల పనులు పూర్తి చేస్తే నీటిని విడుదల చేయవచ్చు. కానీ.. ఐదేళ్ల తర్వాత కూడా పనులు ముందుకు సాగక.. ఇప్పటికీ 2.8 కి.మీ. సొరంగం పనులు మిగిలిపోవడాన్ని బట్టి చూస్తేబాబు హార్డ్ వర్క్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. -
పుష్కర కేంద్రానికి ప్రభుత్వం జెల్ల
రాజమండ్రికి రూ.240 కోట్ల ఆర్థిక సంఘం నిధులు ఇప్పటి వరకూ చేపట్టిన పనులు 50 శాతమే ఇంతలోనే రూ.40 కోట్లు ఇరిగేషన్, ఇతర శాఖలకు మళ్లింపు అయినా కిమ్మనని టీడీపీ స్థానిక ప్రజాప్రతినిధులు కుడిచేతితో ఇచ్చి ఎడం చేతితో లాక్కున్నట్టుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం తీరు. గోదావరి పుష్కరాలకు కేంద్రమైన రాజమండ్రి నగరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని ఊరించిన సర్కారు.. చివరికి ఈ నగరంలో భక్తులకు మౌలిక సదుపాయూల కల్పనకు కేటాయించిన నిధులను దొడ్డిదారిన నీటి పారుదల శాఖ, ఇతర శాఖలు చేపట్టే పనులకు మళ్లించింది.అయినా ప్రభుత్వం తమ పార్టీదే కావడంతో నగరపాలకులు నోరు మెదపడం లేదు. రాజమండ్రి :రాష్ట్ర ప్రభుత్వం రాజమండ్రి కార్పొరేషన్ను వెక్కిరిస్తూ.. పుష్కర నిధులను ఇరిగేషన్ (నీటిపారుదల) శాఖకు తరలించింది. పుష్కర పనుల నిమిత్తం ప్రభుత్వం కార్పొరేషన్కు రూ.240 కోట్ల 13వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించింది. అయితే ఇప్పటి వరకు కేవలం రూ.73.22 కోట్లకు సంబంధించిన పనులు మాత్రమే కార్పోరేషన్ చేపట్టింది. దీనిలో కూడా తొలివిడతలో రూ.74.25 కోట్ల విలువ చేసే 306 పనులు చేయాల్సి ఉండగా రూ.45.61 కోట్ల విలువ చేసే 289 పనులు చేపట్టింది. రెండో విడతలో రూ.70.25 కోట్లతో 191 పనులు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.17.61 కోట్ల విలువ చేసే 118 పనులు మాత్రమే చేపట్టింది. మొత్తం మీద రూ.144.50 కోట్లకుగాను, రూ.73.22 కోట్ల విలువ చేసే పనులు మాత్రమే జరుగుతున్నారుు. అంటే కేవలం 50 శాతం పనులు మాత్రమే జరుగుతున్నాయన్న మాట. మిగిలినవాటిలో కొన్నింటిని ద్వితీయ ప్రాధాన్యతా పనులుగా గుర్తించి వాటిని పుష్కరాల తరువాత నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఈ పనులు చేస్తారనే నమ్మకం నగరవాసులకు కలగడం లేదు. ఇదే సమయంలో కార్పొరేషన్కు కేటాయించిన పుష్కర నిధుల్లో సుమారు రూ.40 కోట్లకు పైగా నిధులను నీటిపారుదల శాఖ చేపట్టిన ఘాట్లకు, వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టే పనులకు మళ్లించింది. రాష్ట్రంలో పుష్కరాల నిర్వహణకు రూ.1,200 కోట్లు అని ఒకసారి, కాదు రూ.1,500 కోట్లని మరోసారి చెప్పిన ప్రభుత్వం, అవసరమైన మరిన్ని నిధులు ఖర్చుపెట్టేందుకు సైతం వెనుకాడేది లేదని గొప్పలకు పోరుుంది. అన్ని కోట్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం నగరపాలక సంస్థకు కేటాయించిన 13వ ఆర్థిక సంఘం నిధులు మళ్లించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే హస్తం.. కాగా నిధులు తరలిపోవడం వెనుక అధికారపార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే హస్తముందనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన సూచన మేరకే నిధులు మళ్లించినట్టు కొందరు అంటున్నారు. అయితే ఈ విషయంలో నగరపాలక మండలిలో అధికార పక్షమైన తెలుగుదేశానికి చెందిన ప్రజాప్రతినిధులు ఎవరూ నోరుమెదపడం లేదు. నగర చరిత్రలోనే అత్యంత జనసమ్మర్దం తటస్థించే సందర్భం గోదావరి పుష్కరాలు. నిత్యం నగర జనాభాను మించి భక్తులు వెల్లువెత్తే ఈ సందర్భంలో నగరంలో ఎన్నో నిర్మాణాలు, సదుపాయూలు కల్పించాల్సిన బాధ్యత నగర పాలక సంస్థపై ఉంది. అలాంటి కేటారుుంచిన నిధులనే మళ్లించడం వల్ల నగరంలో పుష్కరాల 12 రోజులూ అవస్థలు తప్పవని, ఎలాంటి అసౌకర్యం కలిగినా నగర పాలక సంస్థకు ఆపాదించే ఆ అపఖ్యాతి దేశం నలుమూలలా వ్యాపిస్తుందని తెలిసినా టీడీపీ ప్రజాప్రతినిధులు పైకి అనే సాహసం లేక మౌనముద్ర వహిస్తున్నారు. అయితే తమ పార్టీకి చెందిన సదరు ఎమ్మెల్యేపై లోలోపలే కారాలుమిరియూలు నూరుతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. ఆమె ఆమ్మగారు ఏమన్నారంటే: నటుడు
నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!
2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!
వరల్డ్కప్ ట్రోఫీతో ఫోజులిచ్చిన యువరాజ్.. ఫోటోలు వైరల్
ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
గతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?: సీఎం జగన్
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement