-
కోడ్ బ్రేక్
జలమండలి పథకాలకు ఎన్నికల కోడ్ బ్రేకులు వేస్తోంది. రూకల్లోతు నష్టాల్లో ఉన్న జలమండలి రూ.878 కోట్ల నీటిబిల్లు బకాయిలు వసూలు చేసుకునేందుకు ఫిబ్రవరి మొదటి వారంలో వన్టైమ్సెటిల్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. సుమారు మూడు లక్షల మంది బకాయిదారులకు పెండింగ్ నీటిబిల్లులు చెల్లించేందుకు ఈ నెల 31 వరకు గడువునిచ్చింది. ఆలోగా చెల్లించిన వారికి వడ్డీ మాఫీ ప్రకటించింది. కానీ ఈ పథకం ఎన్నికల కోడ్ పరిధిలోకి వస్తుందో? రాదో? అన్న సంశయంతో జలమండలి అధికారులు వారం క్రితం ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అక్కడి నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాధానం రాలేదు. మరోవైపు అక్రమ కుళాయిల క్రమబద్ధీకరణ పథకానిదీ ఇదే పరిస్థితి. గ్రేటర్ పరిధిలో సుమారు 1.50 లక్షల వరకు ఉన్న అక్రమ కుళాయిలను కూడా మార్చి 31 వరకు క్రమబద్ధీకరించుకునేందుకు స్వచ్ఛంద క్రమబద్ధీకరణ పథకం (వీడీఎస్) ప్రవేశపెట్టింది. ఈ పథకం కూడా కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందన్న అనుమానంతో అధికారులు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. కానీ ఎలాంటి అనుమతి రాకపోవడంతో ఏం చేయాలో తెలియక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. గోదావరి రుణానికీ చిక్కులు కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి నుంచి నగర శివారులోని శామీర్పేట్ వరకు 186 కిలోమీటర్ల మేర జరుగుతున్న గోదావరి మంచినీటి పథకానికి హడ్కో సంస్థ రూ.వెయ్యి కోట్లు రుణ మంజూరుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. కానీ రుణ మంజూరుకు రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి పూచీకత్తు (కౌంటర్ గ్యారంటీ) కోరింది. కానీ కోడ్ నేపథ్యంలో పూచీకత్తు ఇచ్చే విషయంలో ఆర్థికశాఖ అధికారులు కూడా సంశయంలో పడినట్లు విశ్వసనీయంగా తెలి సింది. దీంతో గోదావరి పథకానికి రుణ మంజూరు విషయం కూడా డైలమాలో పడినట్లు సమాచారం. నష్టాలు గట్టెక్కేదెలా..? బోర్డు నష్టాలను తగ్గించుకునేందుకు బకాయిల వసూలు మినహా ప్రత్యామ్నాయం లేదని గతంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో.. వన్టైమ్ సెటిల్మెంట్, అక్రమ కుళాయిల క్రమబద్ధీకరణ పథకాలను ప్రవేశపెట్టారు. నెలకు రూ.29 కోట్ల నష్టాలతో నెట్టుకొస్తున్న జలమండలికి సత్వరం బకాయిలు వసూలు చేసుకోని పక్షంలో నష్టాలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. దీంతో బోర్డు వర్గాలు తాజా పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల సంఘం అనుమతి లభిస్తేనే ఈ పథకాలను అమలు చేసే అవకాశం ఉంటుందని తెలిపాయి. -
గోదా‘వర్రీ’
ప్రాజెక్టు: గోదావరి మంచినీటి పథకం అంచనా వ్యయం: రూ.3800 కోట్లు (రింగ్మెయిన్ పనులతో కలిపి) ఇప్పటికి వ్యయం: సుమారు రూ.1800 కోట్లు పథకం పూర్తికయ్యే వ్యయం: సుమారు రూ.2000 కోట్లు మొదటి దశ పూర్తికావాల్సింది: 2014 ఏప్రిల్ చివరికి పైప్లైన్ నిర్మాణం: 186 కి.మీ. ఇప్పటికి పూర్తయింది: సుమారు 120 కి.మీ. తొలి దశలో తరలించే జలాలు: 172 మిలియన్ గ్యాలన్లు మూడు దశల్లో తరలింపు: 31 టీఎంసీలు ప్రాజెక్టు రూట్: కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి - శామీర్పేట్ నిర్మాణం: మూడు దశల్లో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు : ఎల్లంపల్లి, మగ్దూంపూర్, మల్లారం, కొండపాక, ఘన్పూర్ రిజర్వాయర్ల పనుల్లో పురోగతి : 40 శాతమే సాక్షి, సిటీబ్యూరో: మహానగర వరదాయినిగా పేర్కొంటున్న గోదావరి మంచినీటి పథకాన్ని పూర్తిచేసే విషయంలో కిరణ్ సర్కారు చేతులెత్తేసింది.ఈ పథకానికి అవసరమైన రూ.2 వేల కోట్ల రుణం ఇచ్చేం దుకు హడ్కో (హౌసింగ్ అండ్ అర్భన్ డెవలప్మెంట్ కార్పొరేషన్) సుముఖంగా ఉన్నా.. రాష్ట్ర ఆర్థిక శాఖ పూచీకత్తు (కౌంటర్ గ్యారంటీ) ఇవ్వలేమంటూ మొండికేస్తోంది. ఏడాది క్రితం పూచీకత్తు ఇస్తామన్న సర్కారు పెద్దలు.. ఇపుడు మాటమార్చడంతో గోదావరి జలాలతో గొంతు తడుపుకొందామనుకున్న సిటీజనుల ఆశలు అడియాసలే అవుతున్నాయి.గత ఆరు నెలలుగా సర్కారు పైసా నిధులు విదల్చకపోవడం, పూచీకత్తు ఇవ్వకపోవడంతో నిధుల లేమి వల్ల ప్రాజెక్టు పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. ఇప్పటివరకు పథకం మొదటి దశ పనుల్లో 65 శాతమే పూర్తయ్యాయి. మిగతా పనులు ఈ ఏడాది ఏప్రిల్ చివరి నాటికి పూర్తికావడం అనుమానమే. సర్కారు తీరుతో జలమండలి లక్ష్యం కాగితాలకే పరిమితమౌతుందన్న ఆందోళన వ్యక్తమౌతోంది. మొండి సర్కార్.. కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి నుంచి నగర శివారుల్లోని శామీర్పేట్ వరకు 186 కిలోమీటర్ల మేర నిర్మించదలచిన గోదావరి మంచినీటి పథకం రూ.3800 కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించారు. ఇప్పటివరకు ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1800 కోట్లు ఖర్చుచేసింది. మరో రూ.2 వేల కోట్ల రుణం మంజూరుకు హడ్కో అంగీకరించింది. కానీ రాష్ట్ర ఆర్థిక శాఖ పూచీకత్తు ఇస్తేనే రుణం మంజూరు చేస్తామని స్పష్టం చేసింది. కానీ మొండి సర్కారు కరుణించడం లేదు. ఒకవేళ జలమండలి హడ్కో సంస్థ నుంచి రూ.2000 కోట్ల రుణం స్వీకరించిన పక్షంలో నెలకు రూ.20 కోట్ల మేర వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఈ స్థాయిలో వడ్డీ చెల్లించే స్థితిలో బోర్డు లేకపోవడంతో గోదావరి పథకంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. సర్కారు తీరు ఇలాగే ఉంటే ఈ ఏడాది ఏప్రిల్ చివరి లోగా సిటీకి గోదావరి జలాలు రావడం కల్లేనని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఎక్కడి గొంగళి అక్కడే.. 2008లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు పనుల్లో ఇప్పటివరకు 65 శాతం పనులే పూర్తయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ చివరి నాటికి మొదటి దశను పూర్తిచేసి నగరానికి 172 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలించాలన్న లక్ష్యం నెరవేరే పరిస్థితి దరిదాపుల్లో కనిపించడం లేదు. మొత్తం 186 కిలోమీటర్ల పైప్లైన్ పనులకు ఇప్పటివరకు 120 కిలోమీటర్ల మేర పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇక ఎల్లంపల్లి, మగ్దూంపూర్, మల్లారం, కొండపాక, ఘన్పూర్, శామీర్పేట్ రిజర్వాయర్ల పనుల్లో కేవలం 40 శాతమే పూర్తయ్యాయి. ఇప్పటివరకు సుమారు రూ.వెయ్యి కోట్లు బిల్లులు చెల్లించని కారణంగా పనులు చేపట్టిన సంస్థలు పనులు ఆపేశాయి. దీంతో పథకం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
Advertisement