-
బీర కాదు.. ‘భీమ’ కాయలు
గోగన్నమఠం (మామిడికుదురు): సాధారణంగా దేశవాళీ రకం బీర కాయలు రెండు వందల నుంచి మూడొందల గ్రాముల బరువు మాత్రమే ఉంటాయి. అంతకు మించి తూగడం చాలా అరుదు. అయితే గోగన్నమఠంలో భూపతిరాజు సతీష్రాజు ఇంటి పెరట్లో దేశవాళీ బీరపాదుకు కాసిన కాయల్లో కొన్ని కేజీ బరువు తూగుతున్నాయి. చూడ్డానికి తక్కువ పొడవు ఉన్నా వాటి బరువు మాత్రం భారీగా ఉండడం విశేషం. స్థానికులు ఈ బీరకాయలను ఆసక్తిగా చూస్తున్నారు. బీర కాయల ‘భీమ’ పరిమాణంపై ఉద్యాన శాఖాధికారి శైలజను సోమవారం ‘సాక్షి’ వివరణ కోరగా పెరట్లో మొట్టమొదటిసారిగా బీర పాదు పెట్టడం వల్ల అది భూమిలో ఉన్న పోషకాలను విరివిగా గ్రహించి అధిక బరువు గల కాయలు కాస్తోందన్నారు. ఇలా అరుదుగా మాత్రమే జరుగుతుందన్నారు. -
అంబేడ్కర్ విగ్రహం విధ్వంసంపై ఆందోళన
గోగన్నమఠం(మామిడికుదురు): గోగన్నమఠం ప్రధాన కూడలిలో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహం కుడి చేతిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీన్ని నిరసిస్తూ బుధవారం ఉదయం దళిత సంఘాల నాయకులు నాలుగు రోడ్ల కూడలిలో ఐదు గంటల పాటు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దోషులను మూడు రోజుల్లో అరెస్టు చేస్తామని డీఎస్పీ ఎల్ అంకయ్య హామీ ఇవ్వడంతో వారు చివరకు ఆందోళనను విరమించారు. అంతకు ముందు కోనసీమ దళిత సంఘాల ఐక్య వేదిక నాయకులు డీబీ లోక్, ఇసుకపట్ల రఘబాబు, జంగా బాబూరావు, ఉండ్రు బాబ్జి, మాజీ ఎమ్మెల్యేలు రాపాక వరప్రసాదరావు, ఎంఏ వేమా సంఘటనా స్థలానికి చేరుకుని దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అమలాపురం డీఎస్పీ ఎల్ అంకయ్య, రాజోలు సీఐ కె.క్రిషో్టపర్, నగరం ఎస్సై జి.వెంకటేశ్వరరావు, తహసీల్దార్ బత్తుల ఝాన్సీభాయి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాకినాడ నుంచి డాగ్ స్వాడ్తో పాటు క్లూస్ టీమ్ వచ్చి ఇక్కడి పరిస్థితిని పరిశీలించారు. అంబేడ్కర్ విగ్రహం పక్కనే ఉన్న మద్యం బెల్ట్ షాపును తక్షణం తొలగించాలని, విగ్రహానికి అడ్డుగా ఉన్న హోటల్ను కూడా తొలగించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బెల్ట్ షాపుకు తాళం వేసి దాన్ని ఎక్సైజ్ అధికారులకు స్వాధీనం చేశారు. విగ్రహం వద్ద అడ్డుగా ఉన్న హోటల్ను తొలగించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఈ ఆందోళనలో బత్తుల మురళీకృష్ణ, బత్తుల జనార్దనరావు, ఎన్వీ సత్యనారాయణ, యాలంగి విశ్వనా«థం, కోరుకొండ రాజా, చిగురుపాటి పెద్దిరాజు, యల్లమెల్లి విజయభాస్కర్రెడ్డి, కలిగితి పళ్లంరాజు, గోగి గోపాలకృష్ణ, భూపతి సూర్యనారాయణ, కుసుమ పెరుమాళ్లకుమార్, చేట్ల సత్యనారాయణ, బొంతు మణిరాజు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
టీడీపీ ఎగనామం: సర్వేల పేరుతో పనిచేయించుకొని డబ్బులు ఎగ్గొట్టిన టీడీపీ
47వ అంతస్తు.. రూ.97 కోట్లు! ఖరీదైన ఫ్లాట్ కొన్న వజ్రాల వ్యాపారి
కిర్గిజిస్తాన్లో ఘర్షణ: భారతీ విద్యార్థులకు కేంద్రం అలెర్ట్
పార్లమెంట్ ఎన్నికలు..BRS పరిస్థితి ఏంటి ?..KSR విశ్లేషణ
వచ్చే ఏడాది మెగా వేలంలోకి.. కోచ్ ప్రశ్నకు రోహిత్ శర్మ ఆన్సర్ ఇదే
TG: విడుదలైన ఈఏపీ సెట్ ఫలితాలు
ఒక్క క్లిక్తో ఈఏపీ సెట్ ఫలితాలు
వదిన మరిది బండారం బయటపెట్టిన లక్ష్మీపార్వతి
కేన్స్లో మెరిసిన ఐశ్వర్య.. ఫొటోస్ వైరల్! (ఫొటోలు)
బీజేపీ భారీ ప్రయోగం.. ఫలించేనా?
తప్పక చదవండి
- అనంతలో ఘోర ప్రమాదం: పెళ్లి షాపింగ్ చేసి తిరిగొస్తుండగా..
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- అలాంటి సీన్స్ నా వల్ల కాదు.. కొందరు దర్శకులు కావాలనే..
- నేడు ఈఏపీ సెట్ ఫలితాలు
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- Delhi liquor scam: నిందితుల జాబితాలో ఆప్, కేజ్రీవాల్
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
- చివరి బెర్త్ ఎవరిదో?
- బుల్లితెర నటి కేసులో ట్విస్ట్.. ప్రియుడు సూసైడ్!
Advertisement