-
గోరఖ్పూర్ ఘోరం ఎవరి నేరం?
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్, గోరఖ్పూర్ జిల్లా కేంద్రంలోని బాబా రఘుదాస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా గత మూడు రోజుల్లో 70 మంది పిల్లలు అకాల మత్యువాత పడిన విషయం తెల్సిందే. ఆక్సిజన్ కొరత కారణంగా అంతమంది మరణించలేదని, వారిలో 30 మంది పిల్లలు మెదడు వాపు వ్యాధి కారణంగా మరణించారని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధిత్యనాథ్ యోగి సమర్థించుకున్నారు. మెదడు వాపు వ్యాధి వచ్చిన పిల్లలకు వారు కోలుకునే వరకు తప్పనిసరిగా ఆక్సిజన్ వాయువును నిరంతరం అందించాల్సిన అవసరం ఉందనేది, అదిలేకపోతే వారు వెంటనే మత్యువాత పడతారని ఏ డాక్టర్ను అడిగినా చెబుతారు. మెదడువాపైనా, మరో వ్యాధైనా గోరఖ్పూర్ ఆస్పత్రిలో పిల్లలు మాత్రం ఆక్సిజన్ అందక మరణించారన్నది నిర్వివాదాంశం. ఆస్పత్రికి అవసరమైన నిధులను విడుదల చేయకపోవడం వల్ల తాము ఆక్సిజన్ సిలిండర్ల కొరతను ఎదుర్కొంటున్నామని తెలియజేస్తూ రాష్ట్రంలోని కొత్త ప్రభుత్వానికి మూడు లేఖలు రాసినా స్పందన రాలేదని ఆస్పత్రి సూపరింటెండెంట్ మీడియా సాక్షిగా తెలిపారు. ఒక్క గోరఖ్పూర్ వైద్య కళాశాల ఆస్పత్రిలోనే కాకుండా మీరట్, ఝాన్సీ, లక్నో ప్రభుత్వ కళాశాలల ఆస్పత్రుల్లో కూడా దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయని కాగ్ నివేదిక వెల్లడించింది. అయినప్పటికీ వాటిని సరిదిద్దేందుకు ప్రభుత్వపరంగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. మెదడువాపు వ్యాధి ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని 1970వ దశకం నుంచి పీడిస్తోంది. ఆనాటి నుంచి నేటి వరకు ఒక్క గోరఖ్పూర్ ఆస్పత్రిలోనే ఒక్క పడకకు సరాసరి 200 మంది పిల్లలు మరణించారని ‘బ్రూకింగ్స్ ఇండియా’ అంచనా వేసింది. ఈ ఆస్పత్రిలో 900 పడకలు ఉన్నాయి. వ్యాధి నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు అందించడంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొదటి నుంచి బాగా వెనకబడి ఉంది. ఆస్పత్రులకు నిధులను సక్రమంగా సకాలంలో విడుదల చేయరు. చేసినా సదరు ఆస్పత్రి అధికారులు వాటిని సక్రమంగా ఖర్చు చేయరు. సిబ్బంది, సాంకేతిక పరికరాల కొరత ఎప్పుడూ వేధిస్తూనే ఉంటోంది. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 46 శాతం కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. ఇంకా 54 శాతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కొరత ఉంది. ఒక్క గోరఖ్పూర్ జిల్లాలో 3,319 గ్రామాలు ఉండగా, వాటిలో 1,114 గ్రామాలకు మాత్రమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో వీటి కొరత 26 శాతం ఉంది. దేశంలోని పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే ఆరోగ్య వసతుల విషయంలో యూపీ కింది నుంచి మూడోస్థానంలో ఉంది. యూపీలో ప్రతి వెయ్యి మంది పిల్లల్లో 64 మంది శిశువులు మరణిస్తున్నారని, ఇక ఐదేళ్లలోపు పిల్లలు ప్రతి వెయ్యి మందిలో 78 మంది మరణిస్తున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సంస్థ జరిపిన ఓ అధ్యయనంలో తేలింది. ఇక ప్రసవం సందర్భంగా ప్రతి లక్ష మంది తల్లుల్లో 258 మంది తల్లులు మరణిస్తున్నారని ఆ సంస్థ వెల్లడించింది. సాంకేతిక పరికరాల కొరత కేంద్రంలోని వైద్య మండలి సూచించిన మార్గదర్శకాల ప్రకారం గోరఖ్పూర్ ప్రభుత్వాస్పత్రిలో 27 శాతం సాంకేతిక పరికరాల కొరత ఉన్నది. గర్భస్థ పిండాలకు సంబంధించి వివిధ దశల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఉపయోగించే ఎన్డీ–లేజర్, ఎన్ఎస్టీ మెషిన్లు, అల్ట్రాసౌండ్ మెషిన్లు గత ఐదు సంవత్సరాలుగా పనిచేయడం లేదు. గోరఖ్పూర్ ఆస్పత్రిలోని 11 విభాగాల్లో ఏర్పాటు చేసిన 200లకుపైగా పరికరాలు ‘నిర్వహణ కాంట్రాక్ట్’ పరిధిలో లేవంటే ఆస్పత్రి అధికారుల నిర్లక్ష్యం ఎంతగా ఉందో తెలుసుకోవచ్చు. ఎంఆర్ఐ, కోబాల్ట్–60 యూనిట్ టెండర్లలో భారీ అక్రమాలు జరిగినట్లు కాగ్ నివేదికే ఆరోపించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఇటు ప్రభుత్వం, అటు ఆస్పత్రి అధికారుల నిర్లక్ష్యం వెరసి పసిపిల్లల ప్రాణాలు లోకం చూడకుండానే గాల్లో కలసిపోతున్నాయి. -
గోరఖ్పూర్లో ఘోరం : 30 మంది చిన్నారులు మృతి
-
గోరఖ్పూర్లో ఘోరం
వైద్య కళాశాల ఆస్పత్రిలో 30 మంది చిన్నారుల మృతి ఆక్సిజన్ అందక 21 మంది మృత్యువాత గోరఖ్పూర్ : ఉత్తర ప్రదేశ్లోని గోరఖ్పూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. రెండ్రోజుల వ్యవధిలో అక్కడ చికిత్స పొందుతున్న 30 మంది చిన్నారులు మృత్యువాత పడటం అందరినీ కలిచివేసింది. బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9–10 తేదీల్లో ఈ మరణాలు చోటుచేసుకు న్నాయి. ఆక్సిజన్ కొరత వల్ల 21 మంది చిన్నారులు మరణించారని కేంద్ర హోం శాఖ ప్రకటించగా.. ఆక్సిజన్ కొరత కారణం కాదని జిల్లా కలెక్టర్ పేర్కొనడం గమనార్హం. ‘గోరఖ్పూర్ ఎస్పీ సమాచారం మేరకు.. ద్రవరూప ఆక్సిజన్ కొరతతో 21 మంది మరణించారు. ఉన్నతాధికారులు ఆస్పత్రికి చేరుకుని పరిస్థితి సమీక్షిస్తున్నారు’అని హోం శాఖ ప్రతినిధి శుక్రవారం రాత్రి తెలిపారు. చిన్నారుల వార్డులో 17 మంది, మెదడువాపు వార్డులో ఐదుగురు, జనరల్ వార్డులో 8 మంది మృతి చెందారని, కారణాలపై వైద్యుల్ని విచారిస్తున్నామని జిల్లా కలెక్టర్ రాజీవ్ రౌతలా చెప్పారు. పక్కనున్న సంత్ కబీర్ నగర్ జిల్లా ఆస్పత్రి నుంచి ఆక్సిజన్ తెప్పించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు. చెల్లింపుల్లో జాప్యంతో ఆక్సిజన్ సరఫరా నిలిపివేశారా? అని ప్రశ్నించగా.. ఆక్సిజన్ సరఫరా కోసం సంబంధిత కంపెనీకి కొంత మొత్తం చెల్లించారని రౌతలా సమాధానమిచ్చారు. రోజూ 7 నుంచి 10 మంది రోగుల మృతి: బీజేపీ ఎంపీ ఈ ఘటన చాలా దురదృష్టకరమని, విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని యూపీ ఆరోగ్య శాఖ మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ చెప్పారు. ఆస్పత్రిని పరిశీలించిన అనంతరం బీజేపీ ఎంపీ కమలేశ్ పాశ్వాన్ మాట్లాడుతూ.. కొన్ని మరణాలు ఆక్సిజన్ కొరత వల్ల సంభవించవచ్చని, అసలు కారణాలు తెలుసుకునేందుకు విచారణ అవసరమ న్నారు. ఆస్పత్రిలో ప్రతి రోజూ 7 నుంచి 10 మంది రోగులు మరణిస్తున్నారని, చాలా సమస్యలున్నా యని పాశ్వాన్ తెలిపారు. కాగా ఈ సంఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ యూపీ ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు డిమాండ్ చేశాయి. గతంలో యూపీ సీఎం ఆదిత్యనాథ్ నియోజక వర్గమైన గోరఖ్పూర్లో రాఘవ్దాస్ వైద్య కళాశాలే అతి పెద్ద ప్రభుత్వ ఆస్పత్రి కావడం గమనార్హం. -
యూపీలో దారుణం..30మంది చిన్నారులు మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్లో విషాదం చోటు చేసుకుంది. ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 48గంటల్లో 30మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. వీరంతా మెదడు వాపు వ్యాధి కారణంగా చికిత్స పొందుతున్నవారే. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గోరఖ్పూర్లోని బీఆర్డీ మెడికల్ ఆస్పత్రిలో ఈ విషాదం చోటు చేసుకున్నట్లు కలెక్టర్ రాజీవ్ రౌటెలా తెలిపారు. రెండు రోజుల కిందటే సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ ఆస్పత్రికి తనిఖీకోసం వచ్చి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు అక్కడి వారంతా సమస్యల ఏకరువు పెట్టగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆస్పత్రి వర్గాల సమాచారం ప్రకారం.. ఆక్సిజన్ సరఫరా చేస్తున్న కంపెనీకి సదరు ఆస్పత్రి రూ.66లక్షల బాకీ ఉంది. అది ఇప్పటి వరకు చెల్లించకపోవడంతో ఆ కంపెనీ ఆక్సిజన్ పంపిణీని ఆపేసింది. ఫలితంగా ఇంతమంది చిన్నారుల ప్రాణాలు గాల్లో పోయాయి. ఇందులో ఆస్పత్రి వర్గాలు, ప్రభుత్వ వర్గాల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, మరో 45మంది చిన్నారులు వెంటిలేషన్పై ఉన్నారని తెలుస్తోంది. ముప్పైమంది చిన్నారులు చనిపోవడం, పైగా బీజేపీ పాలిత పెద్ద రాష్ట్రంలో ఈ దుర్ఘటన సంభవించడం రాజకీయంగా సంచలనం రేపే అవకాశం ఉంది.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?
సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో
తప్పక చదవండి
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement