-
సచిన్, వినోద్ కాంబ్లేల స్నేహం.. సినిమా ప్లాన్ చేస్తున్న స్టార్ డైరెక్టర్
వైవిద్య భరిత ప్రేమ కథా చిత్రాలతో పాటు యాక్షన్తో కూడిన కమర్షియల్ చిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు గౌతమ్మీనన్ దిట్ట. కోలివుడ్లో మిన్నలే చిత్రంతో కెరీర్ను ప్రారంభించిన ఆయన తాజాగా శింబు కథానాయకుడిగా నటించిన వెందు తనిందదు కాడు చిత్రం సక్సెస్ఫుల్గా సాగుతోంది. కాగా విక్రమ్ కథానాయకుడిగా ఈయన దర్శకత్వం వహించిన ధ్రువనక్షత్రం చిత్రం పలు ఆటంకాలను ఎదుర్కొని సుదీర్ఘకాలం తర్వాత ఈనెల 24వ తేదీన తెరపైకి రానుంది. అయినప్పటికీ ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. నటి రీతూ వర్మ నాయకిగా నటించిన ఇందులో రాధికా శరత్కుమార్, సిమ్రాన్, నటుడు పార్థిబన్ ముఖ్యపాత్రలు పోషించారు. కాగా బుధవారం ఇండియా, న్యూజిలాండ్ మధ్య సాగిన ప్రపంచ క్రికెట్ కప్ సెమీఫైనల్స్ పోటీని విశ్లేషించే విధంగా ఒక టీవీ చానల్ కార్యక్రమంలో గౌతమ్ మీనన్ పాల్గొన్నారు. నటుడు, దర్శకుడు ఆర్జే బాలాజీ అడిగిన పలు ప్రశ్నలకు గౌతమ్మీనన్ బదులిచ్చారు. ఈ సందర్భంగా క్రికెట్ నేపథ్యంలో చిత్రం చేస్తారా..? అన్న ఆర్జే బాలాజీ ప్రశ్నకు గౌతమ్ మీనన్ బదులిస్తూ ఆల్రెడీ ఆ ప్రయత్నంలో ఉన్నానని, అందుకు కథ కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారులు సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లేల మధ్య స్నేహం ఇతివృత్తంగా ఈ చిత్ర కథ ఉంటుందన్నారు. వారు క్రికెట్ క్రీడాకారులుగా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎలా చేరుకున్నారు అనే పలు ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్ర కథ ఉంటుందని తెలిపారు. ఈ చిత్రంలో నటించే హీరోలు ఎవరన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. -
విడాకుల తర్వాత తొలిసారి సమంతతో ఉన్న ఫోటో షేర్ చేసిన చై
సమంత-నాగచైతన్య తొలిసారి నటించిన సినిమా ఏమాయ చేశావే. గౌతమ్మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతోనే సమంత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే జెస్సీగా అలరించి కుర్రాళ్ల మనసు దోచుకుంది. అంతేకాదు ఇండస్ట్రీలోనూ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్తో టాలీవుడ్ స్టార్ హీరోయిన్గానూ క్రేజ్ సంపాదించుకుంది. నాగ చైతన్య అంతకుముందే జోష్ అనే సినిమాతో టాలీవుడ్కు పరిచయమైనా ఏమాయ చేశావే సినిమాతోనే తొలి హిట్ అందుకున్నాడు. తెరపైనే కాదు ఆఫ్ స్క్రీన్లోనూ చై-సామ్ల జోడికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా సెట్స్లోనే వీరిద్దరి మధ్య స్నేహం చిగురించింది. అలా మొదలైన వారి పరిచయం ప్రేమగా మారి 2017లో పెళ్లి చేసుకున్నారు. కానీ వ్యక్తిగత కారణాలతో 2021, అక్టోబర్ 2న విడిపోతున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు. టాలీవుడ్ క్యూట్ కపుల్గా పేరు తెచ్చుకున్న వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారన్నది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. నాగచైతన్యతో విడాకుల తర్వాత అతనితో దిగిన ఫోటోలన్నింటిని సామ్ తన సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి డిలీట్ చేసిన సంగతి తెలిసిందే. అటు చై కూడా విడాకుల తర్వాత సామ్కు సంబంధించి ఎలాంటి పోస్టులు చేయలేదు. అయితే తాజాగా ఏమాయ చేశావే సినిమా వచ్చి నేటితో 13ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆ మూవీలో సమంతతో దిగిన ఓ ఫోటోను నాగచైతన్య తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ.. సెలబ్రేటింగ్ 13ఇయర్స్ అంటూ పోస్ట్ చేశాడు. సమంత కూడా ఏమాయ చేశావేకు పదమూడేళ్లు అంటూ పలు ఫోటోలను షేర్ చేసినా అందులో కేవలం తన ఫోటోలు మాత్రమే నెట్టింట పోస్ట్ చేసింది. దీంతో ఇద్దరి ఇన్స్టా పోస్టులు ఇప్పుడు మరోసారి హాట్టాపిక్గా మారాయి. ❤️🫠#Yemaayachesave pic.twitter.com/9UL9j1528c — Movie Muthyam (@MovieMuthyam) July 22, 2022 -
సందీప్ కిషన్ 'మైఖేల్' ఫస్ట్లుక్ చూశారా?
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న తాజా చిత్రం మైఖేల్. రంజిత్ జేయకొడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర సినిమాస్ మరియు కరణ్ సి ప్రొడక్షన్స్ పతాకాలపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కతున్న ఈ సినిమాలో విజయ్ సేతపతి, గౌతమ్ మీనన్లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా శనివారం(మే7)న సందీప్ కిషన్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో సిక్స్ప్యాక్ బాడీతో చేతిలో గన్ పట్టుకొని పవర్ఫుల్గా కనిస్తున్నాడు.తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ తదితర భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. సందీప్ సరసన దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా నటిస్తుంది. వరలక్ష్మి శరత్కుమార్, వరుణ్ సందేశ్లు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. Happy to share the Fiery 1st Look of my Dear most director @jeranjit ‘s #Michael 👊🏽@Dir_Lokesh presents 🌟#HBDSundeepKishan ❤️@sundeepkishan @menongautham @varusarath5 @itsdivyanshak @SVCLLP @KaranCoffl @SamCSmusic @adityamusic @sivacherry9 @proyuvraaj pic.twitter.com/N6qZc498Jz — VijaySethupathi (@VijaySethuOffl) May 7, 2022 -
'నా ప్రేమకథ ఎప్పటికీ ముగియదు,సమంత ఎమోషనల్ పోస్ట్
Samantha Emotional Post On Her 12 Years Career: 'ఏమాయ చేశావే’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన సమంత చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి నేటికి 12 ఏళ్లు పూర్తి కావొస్తుంది. గౌతమ్మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతోనే సమంత తెరంగేట్రం చేసింది. ఈ చిత్రం విడుదలైన నేటికి 12ఏళ్లు. ఈ సందర్భంగా తన సినీ జర్నీని తెలియజేస్తూ సామ్ ఎమోషనల్ పోస్ట్ను షేర్ చేసుకుంది. 'చిత్ర పరిశ్రమలో నటిగా నా ప్రయాణం మొదలై నేటికి 12 సంవత్సరాలు. చదవండి: 'ప్రాణహాని ఉంది.. నా ప్రైవసీని అతిక్రమించారు' సమంత పోస్ట్ వైరల్ లైట్స్, కెమెరా, యాక్షన్.. వీటి చుట్టూ నాకున్న మధుర ఙ్ఞాపకాలు, అద్భుతమైన అనుభూతులకు 12 ఏళ్లు. ఇన్నేళ్ల ప్రయాణంలో ప్రపంచ వ్యాప్తంగా నిస్వార్థమైన అభిమానులను పొందినందుకు ఆనందంగా ఉంది. సినిమాపై నాకున్న ప్రేమ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా' అంటూ సమంత పేర్కొంది. కాగా ఈ సినిమాతోనే సమంత-నాగ చైతన్య తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అలా మొదలైన వారి పరిచయం ప్రేమగా మారి 2017లో పెళ్లి చేసుకున్నారు. కానీ వ్యక్తిగత కారణాలతో 2021, అక్టోబర్ 2న విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తన తొలి సినిమా గురించి సమంత పోస్ట్ చేయడం ఆసక్తిగా మారింది. చదవండి: బిగ్బాస్ నాన్స్టాప్: 24 గంటలు, 84 రోజులు, 17మంది కంటెస్టెంట్లు View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
సందీప్ కిషన్ చిత్రంలో విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్
యంగ్ హీరో సందీప్ కిషన్ తాజా చిత్రం మైకేల్. ఈ మూవీలో విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలో నటించనున్నారు. మరో ప్రత్యేకత ఏంటంటే ఇందులో ప్రతినాయకుడిగా దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ నటిస్తున్నారు. ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని నారాయణ దాస్ కె నరంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్బి, కరన్.సీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్బి సంస్థల అధినేతలు భరత్ చౌదరి, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. చదవండి: పునీత్ స్టైల్లో ‘నాటు నాటు’ సాంగ్, ఆర్ఆర్ఆర్ టీం ఫిదా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ తదితర భాషలో పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రానికి రంజిత్ జయకొడి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు వెల్లడించారు. సోమవారం చిత్ర పోస్టర్ను విడుదల చేయగా మంచి ఆదరణ వచ్చిందన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
వైఎస్ జగన్ కోసం రెండు నెలలుగా ప్రార్థనలు
ప్రజల మధ్య వైరుధ్యాలు పెంచుతున్న రాహుల్
పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించాలి
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement