-
ఆదివాసీ హక్కుల కోసం.. త్యాగాలకు వెనుకాడం
ఇల్లెందు అర్బన్, న్యూస్లైన్: ఆదివాసీల హక్కుల సాధనకు ఎలాంటి త్యాగాలకైనా వెనుకాడేది లేదని పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య అన్నారు. గిరిజనుల హక్కులను కాపాడేది విప్లవ పార్టీలేనని చెప్పారు. శుక్రవారం రాత్రి ఇల్లెందు కొత్తబస్టాండ్ ఆవరణంలో జరిగిన ఎన్డీ బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. అడవులను పరిరక్షించుకునేందుకు ఆదివాసీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వారికి ఏ కష్టమొచ్చినా అండగా ఉంటామన్నారు. ఆదివాసీల చట్టాలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. గిరిజన పోరాటాల ఫలితంగా వారి రక్షణ కోసం 1920 నుంచే చట్టాలు చేశారని, అయితే పాలకుల నిర్లక్ష్యంతో అవి అమలు కావడం లేదని ఆరోపించారు. 1/70 చట్టం వచ్చినా భూ బదలాయింపును అడ్డుకోలేకపోతోందన్నారు. ప్రజల ఒత్తిడి ఫలితంగా 2006 డిసెంబర్ 29న అటవీ హక్కుల గుర్తింపు చట్టం వచ్చిందని గుర్తు చేశారు. ఈ చట్టం వల్ల 10 ఎకరాలు అనుభవించే హక్కు గిరిజనుడికి ఉందన్నారు. జిల్లాలో బీడీ ఆకు అధికంగా లభ్యమవుతున్నందున బీడీ పరిశ్రమలను నెలకొల్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సబ్ప్లాన్ నిధులను ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికే కేటాయించాలన్నారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు సాధినేని వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ.. సింగరేణి యాజమాన్యం ఓపెన్కాస్టుల పేరుతో పచ్చని పల్లెలను బొందలగడ్డగా మారుస్తోందని, అడవులు అంతరిస్తున్నాయని ఆరోపించారు. ఓపెన్కాస్టులు ఏర్పడిన ప్రాంతాల్లో జలవనరులు కూడా అడుగంటిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓసీల కింద వేల ఎకరాల సాగుభూమి పోతోందన్నారు. సింగరేణి సంస్థ ఏజెన్సీ ప్రాంతాల్లో గనులను ప్రారంభిస్తున్నదే తప్ప ఆయా ప్రాంతాల గిరిజనులకు ఉపాధి కల్పించడం లేదని విమర్శించారు. అధిక ఉత్పత్తి, లాభాల కోసం గిరిజన ప్రాంతాలను ఓసీలతో విధ్వంసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఓసీలతో బొందల గడ్డగా మార్చొద్దని సింగరేణి యాజమాన్యానికి సూచించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 67 ఏళ్లయినా నేటికీ అందరికీ ఆహార భద్రత లేదని వాపోయారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు గోవర్ధన్ మాట్లాడుతూ.. సీల్డ్ కవర్లో సీఎం పదవి దక్కించున్న కిరణ్ కుమార్రెడ్డి తెలంగాణ విషయంలో రోజుకొక మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. అధిష్టానం మాట గౌరవిస్తానని నాడు చెప్పిన కిరణ్.. ఇప్పుడు దానికి వ్యతిరేకంగా తెలంగాణ బిల్లును తిప్పి పంపుతానని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు సైతం రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఇద్దరికీ మరో తోడు దొంగలా అశోక్బాబు తయారయ్యాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం 1969లో 369 మంది మృతి చెందితే, నేడు వెయ్యి మందికి పైగా అమరులయ్యారని, ఈ విషయాన్ని సీమాంధ్రులు గుర్తుంచుకోవాలని అన్నారు. సభలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, నాయకులు ముక్తార్పాషా, వెంకటేశ్వర్లు, వెంకన్న, గౌని ఐలయ్య, జడ సత్యనారయణ, విశ్వనాథం, సీతారామయ్య, యదళ్లపల్లి సత్యం, భూక్యా లక్ష్మణ్, కొండపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎరుపెక్కిన బొగ్గుట్ట బహిరంగ సభకు ముందు సుమారు ఆరువేల మంది ఎన్డీ కార్యకర్తలు అరుణ పతాకాలు చేబూని భారీ ప్రదర్శన నిర్వహించారు. జేకే కాలనీ నుంచి జగదాంబ సెంటర్, పాత బస్టాండ్ ,బుగ్గవాగు బ్రిడి మీదుగా కొత్త బస్టాండ్ సెంటర్ వరకు ప్రదర్శన సాగింది. అరుణ పతాకాల రెపరెపలతో బొగ్గుట్ట ఎరుపెక్కింది. ఈ సందర్భంగా పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, భూగర్భ గనులను ఏర్పాటు చేయాలని, దుమ్ముగూడెం ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం బహిరంగ సభ వేదికపై అరుణోదయ కళకారులు చేసిన నృత్యాలు, గేయాలు ఉర్రూతలూగించాయి. -
అయ్యో ‘బంగారు తల్లీ’
విజయనగరం అర్బన్, న్యూస్లైన్: మేలిమి బంగారు తల్లుల్లారా..కలువ కన్నుల కన్నెల్లారా..రేపటికి దీపాలయ్యే పాపల్లారా..మీరు చదువుకోవాలి. మీరు చదువుకుంటే మీ ఇల్లు బాగుపడుతుంది. మీకు చదువులేక పోతే మీ కుటుంబంతో పాటు సమాజం కూడా అభివృద్ధిలో వెనుకపడుతుంది. స్త్రీకి చదువులేని పరిస్థితి రాకూడదనే భావించిన దివంగత నేత వైఎస్రాజశేఖరరెడ్డి ‘బాలికా సంరక్షణ’ పేరుతో మహత్తర పథకానికి రూపకల్పన చేశారు. ఈ పథకంలో భాగంగా ఆడపిల్ల పుట్టగానే కొంత నగదు లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని యోచించారు. బాలిక పెరిగి పెద్దయ్యాక ఆమెకు నగదు చేరాలంటే తప్పనిసరిగా చదువుకోవాలనే నిబంధన విధించారు. ఆయన హయాంలో ఈ పథకం వల్ల ఎంతో మంది లబ్ధిపొందారు. ఇంతవరకూ బాగానే ఉన్నా సీఎం కిరణ్కుమార్ రెడ్డి ఆ పథకం పేరును ఆర్భాటాల మధ్య ‘బంగారుతల్లి- మా ఇంటి మహాలక్ష్మి’గా మా ర్చేశారు. అయితే ఈ పథకం ఇప్పుడు ప్రాథమిక దశలోనే కునికిపాట్లు పడుతోంది. ఆడపిల్ల పుట్టగానే తల్లి ఖాతాలో పడాల్సిన సొమ్ము లబ్ధిదారులకు ఇప్పటికీ అందలేదు. ఎక్కడో అరకొరగా... ఆదీ ఈ వారంలోనే జమ అయినట్లు తెలిసింది. పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అధికారులకు, పాపం తీరిక లేకుండా పోవడంతో పథకం అమలు గతుకుల రోడ్డుపై బండి నడకలా తయారైంది. ప్రస్తుతం పథకం ఎలా ఉందంటే... 2013 మే 1 తర్వాత పుట్టిన ప్రతి ఆడపిల్లకు ఈ పథకం వర్తింపచేయాలని నిర్ణయించారు. జిల్లాలో ఈ ఏడాది మే నుంచి సెప్టెంబర్ వరకు 2,243 మంది ఆడపిల్లలు జన్మించినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ జననాల్లో విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీల్లో 400 మాత్రమే ఉన్నాయి. మిగిలినవన్నీ గ్రామీణ ప్రాంతాల ఆడపిల్లలుగానే దరఖాస్తులు వచ్చాయి. వారి వివరాలను ఆన్లైన్లో రిజిస్టర్ చేసే ప్రక్రియ ఇప్పటికీ నవీకరణ కాలేదు. పథకం కింద వచ్చిన ప్రతి ఆడపిల్లకూ ముందుగా రూ.2,500 జమచేయాలి. అయితే పథకం ప్రారంభించి ఐదునెలలు కావస్తున్నా ఇప్పటికి పైసా కూడా జమకాలేదు. గతంలోని బాలికా సంర క్షణ పథకాన్ని ఐసీడీఎస్ పరిధిలో చేర్చగా ప్రస్తుతం బంగారు తల్లి పథకం నిర్వహణ బాధ్యతను ఐకేపీకి అప్పగించారు. అర్హులు...నిబంధనలు.. ఈ పథకంలో చేరేవారు తెల్లరేషన్ కార్డుదారులై ఉండాలి. కుటుంబంలోని ఇద్దరు బాలికల వరకు ఈ పథకం వర్తిస్తుంది. మొదటి, రెండో కాన్పులో కూడా ఆడపిల్ల జన్మించినా...లేక ఇద్దరూ కవలలుగా పుట్టినా పథకానికి అర్హులే. అయితే కాన్పును ప్రభుత్వ లేదా ప్రైవేటు వైద్యశాలల్లోనే చేయించాలి. బాలిక జనన ధ్రువీకరణ పత్రం, తల్లితో సంయుక్తంగా బాలిక పేరున బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు, తల్లీబిడ్డల సంయుక్త ఫొటోను అధికారులకు అందించాలి. ఈ వివరాలను ఆన్లైన్లోని బంగారు తల్లి పథకం వెబ్సైట్లో నమోదు చేస్తారు. మూడేళ్లపాటు అంగన్వాడీ కేంద్రంలో కచ్చితంగా టీకాలు వేయించి...ఐదేళ్లు వచ్చేవరకూ కేంద్రానికి పంపాలి. బిడ్డకు ఏడేళ్ల వయసు నిండగానే తల్లీబిడ్డల పేర్లపై సంయుక్త బ్యాంక్ ఖాతా తెరవాలి. పథక ప్రయోజనం పథకం కింద పేరు రిజిస్టర్ కాగానే తల్లీబిడ్డల పేరుపై ఉండే బ్యాంకు ఖాతాలో రూ.2,500 జమ అవుతాయి. ఏడాది దాటిన వెంటనే రూ.1,000, రెండేళ్లు పూర్తికాగానే మరో రూ.1,000 మూడు నుంచి పదేళ్లలోపు ఏడాదికి రూ.1,500 చొప్పున మొత్తం రూ.4,500 బ్యాంకులో వేస్తారు. ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి పూర్తయ్యే లోపు ఏడాదికి రూ.2 వేల చొప్పున రూ.10 వేలు ఇస్తారు. ఆరు నుంచి 8వ తరగతి వరకు ఏడాదికి రూ. 2,500 చొప్పున మూడేళ్లకు రూ.7,500, తొమ్మిది, పది తరగతుల్లో ఏడాదికి రూ.3 వేలు చొప్పున ఆరువేలు జమ చేస్తారు. ఇంటర్ రెండేళ్లకు రూ.7వేలు, ఏదైనా డిగ్రీ నాలుగేళ్ల పాటు చదివితే ఏడాదికి రూ. 4 వేలు చొప్పున రూ.16 వేలు ఇస్తారు. లబ్ధిదారురాలికి 21 సంవత్సరాలు నిండగా నే బ్యాంకు ఖాతాలో జమ అయి న రూ.55,500కు అదనంగా లక్ష రూపాయలు ఇస్తారు. ఇంట ర్ వరకు మాత్ర మే చదివితే 21 సంవత్సరాలకు రూ.50 వేలు మాత్రమే అందుతాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement