-
సకల సదుపాయాల సర్కారీ దవాఖానాలు
ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్య గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాలే మా లక్ష్యం హెలికాప్టర్ ద్వారా అత్యవసర చికిత్సలు సర్కారీ ఆస్పత్రులకు వచ్చే రోగులు మందులు బయట కొనాల్సిన పని ఉండదు నష్టపోయిన మెడిసిన్ సీట్లను మళ్లీ సాధిస్తా.. హైదరాబాద్: ‘వైద్యునిగా 30 ఏళ్ల అనుభవముంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు వజ్రకవచంలా ఉపముఖ్యమంత్రి పదవిచ్చారు. వీటిని ఉపయోగించి సర్కార్ వైద్యాన్ని కార్పొరేట్ స్థాయికి తీసుకెళతా.సర్కారీ దవాఖానాల్లో సకల సదుపాయాలను సమకూర్చుతాం. తెలంగాణలోని గడపగడపకూ వైద్యాన్ని అందిస్తా. సర్కార్ ఆస్పత్రులకు వచ్చే రోగు లు ఇకపై మందులు బయట కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. పరీక్షల కోసం ప్రైవేటు లాబ్లకు వెళ్లకుండా ప్రక్షాళన చేస్తా. మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాలే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తా. అవసరమైతే ఆ ప్రాంతాలకు హెలికాప్టర్ ద్వారా వైద్యాన్ని అందించేందుకు కృషి చేస్తా.’ అని వైద్యశాఖను నిర్వహిస్తున్న ఉపముఖ్యమంత్రి టి.రాజయ్య చెప్పారు. వైద్య రంగాభివృద్ధి, ప్రభుత్వాస్పత్రుల బలోపేతం, ఏజెన్సీ ప్రాంతాల్లో రోగాల నివారణ, పేదలకు కార్పొరేట్ వైద్యం వంటి అంశాల్లో రాజయ్య తన విజన్ను, ప్రభుత్వ లక్ష్యాలను ‘సాక్షి’కిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... వైద్యానికి వజ్రకవచం డీసీఎం రోగులందరికీ చక్కని వైద్యాన్ని అందించేందుకు ఈ పదవిని ఉపయోగిస్తా. సచివాలయంలో సమీక్షలకే పరిమితమవడానికి నేను వ్యతిరేకం. క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షిస్తూ వ్యా ధుల నివారణకు, మెరుగైన వైద్యానికి చర్యలు తీసుకుంటా. గ్రామాలు, తండాల్లో మార్పు ఇప్పుడున్న రోగాల్లో 70 శాతం దోమలు, ఈగలవల్లే సంభవి స్తున్నాయి. గ్రామాల, ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకు వీటిపై అవగాహన లేదు. పైగా మూఢ నమ్మకాలు ఎక్కువ. జ్వరం ఎక్కువై అది మెదడుకు సోకి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే దెయ్యం పూనిందని యంత్రాలు కట్టించుకుంటారే తప్ప చికిత్స చేయించుకోవాలనుకోరు. అందుకే ఆ ప్రాంతాలపైనే నేను దృష్టి సారించా. వైద్యశాఖతోపాటు ఐటీడీఏ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, అంగన్వాడీ ఉద్యోగులనూ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులనూ భాగస్వామిని చేస్తా. కళాజాతాల ద్వారా రోగాల నివారణపై అవగాహన కల్పిస్తా. హెలికాప్టర్ అంబులెన్సుల ఏర్పాటు అత్యవసర పరిస్థితిలో కేసీఆర్ చెప్పినట్టు హెలికాప్టర్ అంబులెన్సులను ఏర్పాటు చేసి మెరుగైన వైద్యాన్ని అందించేందుకు కృషి చేస్తాం. ఇందుకోసం దీర్ఘకాలిక ప్రణాళికను రూపొం దిస్తున్నాం. మారుమూల ప్రాంతాల్లో బోర్లలో పిల్లలు పడితే ప్రభుత్వం ఎంత ఖర్చైనా వెచ్చించి వాళ్ల ప్రాణాలను కాపాడడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఏజెన్సీ ప్రజలు రోగాలబారినపడినప్పుడు హెలికాప్టర్ అంబులెన్సులను వినియోగిస్తే తప్పేముంది? సర్కార్ దవాఖానాల ప్రక్షాళన ప్రభుత్వాస్పత్రుల్లో మందులు, కనీస సౌకర్యాలు, డాక్టర్లు, సిబ్బంది కొరత ఉన్నమాట వాస్తవమే. ఇకపై అలాంటివి ఉండకుండా చూస్తాం. సర్కార్ దవాఖానాలకు వచ్చేవారు ఇకపై బయట మందులు కొనడం, ప్రైవేటు డయాగ్నొస్టిక్ కేంద్రాల్లో పరీక్షలు చేయించుకునే పరిస్థితి రానీయను. మందులను ఆస్పత్రుల్లో అందజేయిస్తా. పరీక్షలను సైతం అక్కడే జరిపిస్తా. సమయపాలన పాటించాల్సిందే.. డాక్టర్లు, సిబ్బంది సరిగా విధులకు హాజరు కావడం లేదని, సమయపాలన పాటించడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇకపై సమయాలను కచ్చితంగా పాటించాల్సిందే. డాక్టర్ల గౌరవాన్ని పెంపొందించే బాధ్యతను నేను తీసుకుంటా. విధులను నిర్లక్ష్యం చేస్తే కఠినంగా వ్యవహరిస్తాం. ఉన్నతాధికారులు జవాబుదారీగా ఉండాలి. అవినీతిని నిర్మూలిస్తా.. ప్రభుత్వాస్పత్రుల్లో రెండు రకాల అవినీతి జరుగుతోంది. రోగుల వద్ద అటెండర్, సెక్యూరిటీ గార్డ్ వంటి కింది స్థాయి ఉద్యోగులు తీసుకునే పది, పరకా వంటివి ఒకటైతే... మందులు, ఇతరత్రా వాటిల్లో జరిగే అవినీతి మరొకటి. రెండో రకం అవినీతిని నిర్మూలిస్తే... మొదటిది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అందుకోసం కృషి చేస్తా. హెల్త్హబ్గా తెలంగాణ తెలంగాణ రాష్ట్రాన్ని హెల్త్టూరిజంగా మార్చేందుకు ప్రయత్నిస్తా. ప్రభుత్వ దవాఖానాలను కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దుతా. బీబీనగర్ నిమ్స్ పనులను పూర్తిచేసి రెండు నెలల్లో ఓపీ బ్లాకును ప్రారంభిస్తా. గాంధీ, కాకతీయ మెడికల్ కళాశాలల్లో ఎంసీఐ నిబంధనలు పాటించలేదనే కారణంతో వంద సీట్లకు కోత విధించారు. వాటిని తిరిగి సాధించుకుంటాం. మరోసారి ఎంఐసీ ఆయా కళాశాలలను సందర్శించాలని, కేంద్ర నిబంధనలను పూర్తిగా పాటించేలా రాష్ట్ర ప్రభుత్వం తరపున హామీ ఇస్తా. -
వీరి బతుకులింతేనా?
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కల్హేర్, కంగ్టి, మనూర్, పెద్దశంకరంపేట, నారాయణఖేడ్ మండలాల్లో 110 పంచాయతీలు ఉండగా 181 తండాలు ఉన్నాయి. ని యోజకవర్గంలోని తండాల్లో సుమారు 48 వేల జనాభా ఉంటుంది. చాలాచోట్ల మౌలిక వసతులు లేవనే చెప్పాలి. అంతర్గత రోడ్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో తండాలన్నీ అభివృద్ధిలో వెనుకబడి పో యాయి. తండాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉన్నా కార్యరూపం దాల్చడం లేదు. సౌకర్యాల జాడేది? సిర్గాపూర్, బాచేపల్లి, నాగధర్, మునిగేపల్లి, కడ్పల్, మాసాన్పల్లి, కల్హేర్ పంచాయతీల్లోని తండాల్లో సమస్యలు తిష్టవేశాయి. బీబీపేట జంలా తండాలో మంచి నీటి ట్యాంక్ నిర్మించి ఏళ్లు కావస్తున్న నిరుపయోగంగానే ఉంది. చాలాచోట్ల ఇంకా మట్టిరోడ్లు, పూరి గుడిసెలు దర్శనమిస్తున్నాయి. సిర్గాపూర్తోపాటు తదితర తండాలు ఇప్పటికీ విద్యుత్ సౌకర్యానికి నోచుకోలేదు. ఇళ్లల్లో ఇప్పటికీ కిరోసిన్ దీపాలనే ఉపయోగిస్తున్నారు. తాగునీటికి కటకటే.. తాగు నీటికి కోసం గిరిజనులు అనేక అవస్థలు పడుతున్నారు. కొన్ని తండాల్లో మంచి నీటి ట్యాంకులు నిర్మించినా బోరు, పైపులైన్ లేకపోవడంతో వృధాగా పడి ఉన్నాయి. గిరిజనులు నీటి కోసం వ్యవసాయ బోర్ల వద్దకు పరుగులు పెడుతున్నారు. పంపుల వద్ద బురద గుంటలు ఉండడంతో నీరు కలుషితం అవుతున్నాయి. ఫలితంగా వారు తరచూ రోగాల బారిన పడుతున్నారు. గతంలో ఎంతో మంది డయేరియా, ఇతర వ్యాధుల బారిన పడిన సందర్భాలున్నాయి. విద్య.. మిథ్యే.. తండాల్లో పాఠశాలలు ఉన్నా అవి సరిగా తెరుచుకోవడం లేదు. మెజార్టీ పాఠశాలలు ఏకోపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇందులో చాలామంది తరచూ డుమ్మాలు కోడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా గిరిజనులు నిరక్షరాస్యులుగా మిలిగిపోతున్నారు. ప్రభుత్వ వైద్యం గగనమే.. తండాల వాసులకు ప్రభుత్వ వైద్యం గగనంగా మారింది. ఆరోగ్య సిబ్బంది తండాలకు వెళ్లడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. 104 వైద్య సేవలు అందడం లేదని ఆయా తండా వాసులు ఆరోపిస్తున్నారు. ఇటివలే నాగధర్ రాంచందర్ తండాల్లో గిరిజనులు డయేరియాతో మంచం పట్టిన సంఘటనలు చోటుచేసుకున్న విషయం తెల్సిందే. రాకపోకలకు తప్పని ఇబ్బందులు మెజార్టీ తండాల్లో మట్టిరోడ్లే దర్శనమిస్తున్నాయి. కల్హేర్ పోమ్యానాయక్ తండా, సిర్గాపూర్ జంలా తండా, గైర్హాన్ తండా, మాసాన్పల్లి రత్ననాయక్ తండా, బుగ్యనాయక్ తదితర తండాలకు రోడ్డు సౌకర్యం లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికలప్పుడు వచ్చే నాయకులు ఆ తర్వాత తండాల వైపు కన్నెత్తి చూడడం లేదు. వ్యక్తిగత మరుగుదొడ్లు కరువే.. తండాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు లేకపోవడంతో రాత్రి వేళల్లో బహిర్భూమికి బయటకు వెళ్తున్నారు. ఆరుబయటే తడకలు వేసి స్నానపు గదులుగా వినియోగిస్తున్నారు. మురికి కాలువలు లేకపోవడంతో ఆ నీరంతా వీధుల్లోనే ఉండిపోతుంది. ఇళ్ల ముందే పెంట కుప్పలు పేరుకుపోతున్నాయి. వర్షాకాలంలోనైతే పరిస్థితి భయానకంగా ఉంటుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కనీసం ఉపాధి పనులు సైతం లభించక ఎంతోమంది వలస బాట పడుతున్నారు. తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేస్తే అభివృద్ధి బాటపట్టవచ్చని గిరిజనులు భావిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని పట్టించుకునే వారే కరువయ్యారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement