-
డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీ
సాక్షి, అమరావతి: వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే గ్రూప్–2, గ్రూప్–1, పాలిటెక్నిక్, జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్న ఏపీపీఎస్సీ.. తాజాగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 11 సబ్జెక్టుల్లో 240 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ప్రకటించింది. సబ్జెక్టుల వారీగా పోస్టులు, విద్యార్హతలు, వేతనం, పరీక్ష విధానం తదితర వివరాలతో కూడిన పూర్తి సమాచారాన్ని సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో జనవరి 24 నుంచి అందుబాటులో ఉంటుందని పేర్కొంది. పోస్టులకు సంబంధించి అభ్యర్థులు ఆబ్జెక్టివ్ విధానంలో రెండు పేపర్లు పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ (పేపర్–1) 150 మార్కులకు డిగ్రీ స్థాయిలో ఉంటుంది. పేపర్–2 సంబంధిత సబ్జెక్టు పోస్టు గ్రాడ్యుయేషన్ స్థాయిలో 150 ప్రశ్నలు 300 మార్కులకు ఉంటుంది. తప్పు సమాధానానికి మైనస్ మార్కులు ఉంటాయని కమిషన్ పేర్కొంది. అభ్యర్థులు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షల సబ్జెక్టు సిలబస్ https://psc.ap.gov.inలో చూడవచ్చు. -
సూదంటురాళ్లైన సర్కారీ డిగ్రీ కళాశాలలు
* బీకాం కంప్యూటర్స్, బీఎస్సీ మ్యాథ్స్ కోర్సులపై పెరిగిన మొగ్గు * ఎక్కువ మార్కులతో సీట్లు దక్కించుకుంటున్న ‘ప్రైవేట్’ విద్యార్థులు * పోటీ పడలేక నష్టపోతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల అభ్యర్థులు బాలాజీచెరువు (కాకినాడ) : ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఇంతవరకూ ఇంజనీరింగ్, మెడిసిన్, పాలిటెక్నిక్, ఐటీఐ సీట్లకు మాత్రమే ఉన్నడి మాండ్ ఇప్పుడు డిగ్రీ కళాశాలల్లో సీట్లకూ పెరిగింది. ఒకప్పు డు ఇంటర్మీడియట్ ప్రభు త్వ జూనియర్ కాలేజీల్లో చదివి, అంతంత మాత్రపు మార్కులతో ఉత్తీర్ణులైన వారు మాత్రమే సర్కారీ డిగ్రీ కళాశాల ల్లో చేరే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి తారుమారైంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సీట్లను ఇంటర్మీడియట్లో ఎక్కువ మార్కులు సాధించిన ప్రైవేట్ జూనియర్ కాలేజీల విద్యార్థులు దక్కించుకుంటుండగా.. వారితో పోటీ పడలేక ప్రభుత్వ జూనియర్ కాలేజీల నుంచి వచ్చిన వారు అవకాశాలకు దూరమవుతున్నారు. ఇంటర్మీడియట్ కార్పొరేట్ కళాశాలల్లో చదివి, 90 శాతం పైబడి మార్కులు సాధించిన విధ్యార్దులు ప్రభుత్వ కళాశాలల్లో చదవడానికి మక్కువ చూపుతున్నారంటే డిగ్రీ కోర్సులకు గిరాకీ ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. ఉదాహరణకు ఇంటర్మీడియట్ సీఈసీ గ్రూపులో 800 మార్కులు వచ్చిన ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థికి కాకినాడలోని పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్లో సీటు రాలేదు. దరఖాస్తుల వెల్లువ జిల్లాలో పిఠాపురం, అన్నవరం, ఏలేశ్వరం, పెద్దాపురం, అమలాపురం, రాజ మండ్రి, తుని, రాజోలు, కొత్తపేట తదితర ప్రాంతాల లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలుం డగా వీటిలో బీఏ, బీకాం, బీఎస్సీ విభాగాల్లో దాదాపు నాలుగు వేల సీట్లు ఉన్నాయి. ఈ కళాశాలల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే దరఖాస్తులు వెల్లువెత్తారుు. ఇంటర్మీడియట్లో ఆర్ట్స్ గ్రూపు చదివిన విద్యార్థులు బీకాం (కంప్యూటర్స్)లో చేరడానికీ, సైన్స్ గ్రూపు విద్యార్థులు బీఎస్సీ (మ్యాథ్స్)లో చేరడానికీ ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. బీకాంలో సీఏ సంబంధిత కోర్సు, బీఎస్సీ మ్యాథ్స్లో ఇంజనీరింగ్ సబ్జెక్టులైన పెట్రోకెమికల్స్, ఫుడ్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ వంటి కోర్సులు ఉండటం, కార్పొరేట్ కళాశాలలతో సమానంగా ప్రభుత్వ కళాశాలల్లో కూడా క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించడం వారి ఆసక్తికి ఓ ప్రధాన కారణం. కాకినాడ పీఆర్ ప్రభుత్వ డిగ్రీకళాశాలలో బీకాం సీట్లు 160 ఉండగా ఆరు వందల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఇంటర్లో 800 మార్కులు పైబడి వచ్చిన వారికే కాల్ లెటర్లు పంపించారు. బీఎస్సీకి సంబంధించి కూడా అలాంటి పరిస్థితి ఏర్పడింది. స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలలో ఇంజనీరింగ్ తరహాలో సెమిస్టర్ విధానం ఉండటం కూడా విద్యార్థుల ఆసక్తికి మరో కారణమని చెప్పవచ్చు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన వారికి సీట్లు కేటాయించాలి.. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకూ ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదివే పేద, సామాన్య వర్గాల విద్యార్థులు ఇంటర్ అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సీట్లు రాక నిరుత్సాహపడుతున్నారు. కార్పొరేట్ కళాశాలల విద్యార్థులే 90 శాతం పైగా మార్కులతో డిగ్రీ సీట్లను దక్కించుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన వారు నష్టపోతున్నారు. అలాంటి వారికి సీట్లు కేటాయించాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జేకేసీల వల్లా పెరుగుతున్న ఆసక్తి ప్రభుత్వ కళాశాలల్లో కూడా కార్పొరేట్ కాలేజీల తరహాలో అత్యాధునిక పరికరాలు, ఈ లైబ్ర రీ, ల్యాబ్ల వంటి సౌకర్యాలు ఉండటంతో విద్యార్థులు చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా డిగ్రీ విద్యతో పాటు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలు సాధించడానికి తోడ్పడేలా జేకేసీల ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందింపజేయడానికి శిక్షణ ఇవ్వడంతో విద్యార్థుల ఆసక్తి పెరుగుతోంది. - డాక్టర్ చప్పిడి కృష్ణ, ప్రిన్సిపాల్, పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కాకినాడ
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
ఇండియా కూటమితో విభేదాలు.. వెనక్కి తగ్గిన దీదీ
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తప్పక చదవండి
- ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement