-
ఇంటర్లో మార్కులకు స్వస్తి?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ మార్కుల్లో నెలకొన్న అనారోగ్యకర పోటీని తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇంటర్లో మార్కుల విధానాన్ని తొలగించి, సీబీఎస్ఈ తరహాలో గ్రేడింగ్ విధానం అమలు చేసే దిశగా పరిశీలన జరుపుతోంది. వీలైతే 2016 మార్చిలో జరిగే పరీక్షల్లోనే దీన్ని అమల్లోకి తేవాలని భావిస్తోంది. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ధ్రువీకరించారు. పరీక్షల సంస్కరణలో భాగంగా గ్రేడింగ్ విధానంతోపాటు ఆన్లైన్లో జవాబు పత్రాల మూల్యాకనం పైనా అధ్యయనం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వీలైతే ఈ ఏడాది పరీక్షల్లోనే ఈ విధానాలను అమల్లోకి తెస్తామన్నారు. అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, అధ్యయనం పూర్తయ్యాక దీనిపై నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. సీబీఎస్ఈలో ఇలా.. దేశవ్యాప్తంగా నడుస్తున్న పాఠశాలల్లోని విద్యార్థులందరిని పరిగణనలోకి తీసుకొని టాప్ మార్కులు సాధించినవారి సంఖ్య ఆధారంగా ‘9 పాయింట్ గ్రేడింగ్’ విధానాన్ని సీబీఎస్ఈ అమలు చేస్తోంది. విద్యార్థులకు గ్రేడ్లతోపాటు మార్కులను కూడా ఇస్తోంది. కానీ రాష్ట్రంలో మార్కులను వెల్లడించొద్దని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే 9, 10 తరగతుల్లో గ్రేడింగ్ విధానాన్ని పాఠశాల విద్యాశాఖ ప్రవేశ పెట్టింది. 6, 7, 8 తరగతుల్లోనూ ఇంటర్నల్స్ను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్లో గ్రేడింగ్ విధానంపై కసరత్తు చేస్తోంది. -
రెవెన్యూ ఉద్యోగులకు గ్రేడింగ్
ఏలూరు, న్యూస్లైన్ : ప్రజలకు సత్వర సేవలు అందించేం దుకు గ్రామ రెవెన్యూ వ్యవస్థ ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని, వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ టి.బాబూరావు నాయుడు హెచ్చరించారు. కలెక్టరేట్లో శుక్రవారం డెప్యూ టీ తహసిల్దార్ల సమావేశంలో రెవెన్యూ వ్యవస్థ ప్రాధాన్యతను జేసీ వివరించారు. గ్రామస్థాయి నుంచి రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేయాలనే ఉద్దేశ్యంతోనే వీఆర్వోల వ్యవస్థను బలోపేతం చేశారని, అయితే వీఆర్వోల పనితీరు ఆశించిన మేర లేదని ఆయన ఆవేదన వ్యక్తం చే శారు. గ్రామస్థాయిలో అన్ని శాఖలతో సమన్వయంగా పనిచేయాల్సిన వీఆర్వోలు సరైన సమాచారాన్ని యంత్రాంగానికి ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తేలిందన్నారు. దశాబ్దాల తరబడి గ్రామాల్లో పాతుకుపోయిన వీఆర్వోలను బదిలీ చేసి రెవెన్యూ వ్యవస్థను జిల్లాలో పటిష్టం చేయడానికి కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆలోచిస్తున్నట్లు జే సీ వివరించారు. వీఆర్వో స్థారుు నుంచి ప్రగతి నివేదికలు వీఆర్వో స్థాయి నుంచి ప్రగతి నివేదికలు ప్రతినెలా సమగ్రంగా సమర్పించాలని, గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు రెవెన్యూ అధికారులు ప్రతి విషయంపై సమగ్ర అవగాహనతో విధులు నిర్వర్తించాలన్నారు. ఎవరైనా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తే ఊపేక్షించబోమని జేసీ హెచ్చరించారు. జిల్లాలో ఒక్క గజం కూడా స్థలం అన్యాక్రాంతం కాకూడదని, భూముల సమగ్ర సమాచారం, జమాబందీ రికార్డులు, మీ సేవ కేంద్రాల పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని ఆయన ఆదేశించారు. త్వరలో మండల స్థాయిలో వీఆర్వోలు, ఆర్ఐలతో సమావేశాలు నిర్వహించి రెవెన్యూ వ్యవస్థను ఏ విధంగా పటిష్టం చేయా లో సూచించాలని డీటీలను కోరారు. డీఆర్వో కె.ప్రభాకర్రావు మాట్లాడుతూ ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఎవరికైనా భూమి కేటాయించాలంటే ఆయా శాఖల ప్రధాన కార్యాలయాల నుంచి అవసరమైన భూ ప్రతిపాదనలు కలెక్టర్కు అందాలని చెప్పారు. 10 ఎకరాలు లేదా రూ.50 లక్షల విలు వ లోపు భూములను ప్రభుత్వం సంస్థలకు కేటాయిం చే అధికారం కలెక్టర్కు ఉందని, ఆపై ప్రతిపాదనలను ప్రభుత్వానికి అనుమతి కోసం పంపాలని ఆయన వివరించారు. కేటాయించిన భూములు లీజుకు ఇచ్చినా చట్ట విరుద్ధంగా వినియోగిస్తున్నా అటువంటి వాటిపై నివేదిక సమర్పిస్తే జిల్లా స్థాయి ల్యాండ్ ఆడిట్ మోనటరింగ్ కమిటీ పరిధిలోకి తీసుకువచ్చి వాటిని రద్దు పరుస్తామని డీఆర్వో తెలిపారు. ఉద్యోగుల పనితీరు తెలుసుకునేందుకు గ్రేడింగ్ విధానం జిల్లాలో పనిచేస్తున్న రెవెన్యూ ఉద్యోగుల పనితీరును తెలుసుకునేందుకు గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామని, ఇందుకు రెవెన్యూ స్కోర్ కార్డును ఆన్లైన్లో పొందుపర్చామని జారుుంట్ కలెక్టర్ చెప్పారు. ప్రతి నెలాఖరున గ్రామాల వారీగా ప్రగతి వివరాలను డీటీలు సేకరించి ఆన్లైన్లో రెండో తేదీలోగా డేటాను పొందుపర్చాలన్నారు. ప్రభుత్వ లక్ష్యాలను నూరు శాతంపైగా సాధించిన ఉద్యోగులకు గ్రేడ్-ఏ 90 నుంచి 100 శాతం లక్ష్యాలు సాధిస్తే గ్రేడ్ బి, 80 నుంచి 90లోపు సాధిస్తే గ్రేడ్ సీ, 80 శాతం లోపు ఉంటే వారిని డి గ్రేడ్లో ఉంచుతామన్నారు. పనితీరును బట్టి పదోన్నతులు కల్పిస్తామన్నారు. రెవెన్యూ స్కోర్ కార్డులో తప్పుడు సమాచారం పొందుపరిస్తే అటువంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement