-
గూగుల్ ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ గ్రేట్ ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్ను ప్రారంభించింది. బుధవారం నుంచి శుక్రవారం వరకు ఆన్లైన్ ఫెస్టివల్ జరగనుంది. ఈ సందర్భంగా గూగుల్ నెక్సస్ 6 స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించారు. గ్రేట్ ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్లో ఈ స్మార్ట్ఫోన్ను అందిస్తున్నామని గూగుల్ ఇండియా ఎండీ రాజన్ ఆనందన్ చెప్పారు. నెక్సస్ 6 స్మార్ట్ఫోన్లు (32 జీబీ ధర రూ.43,999, 64 జీబీ ధర రూ.48,999) ఫ్లిప్కార్ట్ ద్వారా పొందవచ్చని ఆనందన్ తెలిపారు. ఈ జీఓఎస్ఎఫ్లో నెక్సస్ 6 స్మార్ట్ఫోన్తో పాటు డిజిటల్ మీడియా ప్లేయర్, క్రోమ్కాస్ట్ను (ధర రూ. 2,999) కూడా అందిస్తున్నామని, అంతేకాకుండా లెనొవొ, ఏషియన్ పెయింట్స్, టాటా హౌసింగ్, వాన్హ్యూసెన్ ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు. క్రోమ్కాస్ట్ను భారతీ ఎయిర్టెల్ భాగస్వామ్యంతో స్నాప్డీల్ ద్వారా అందిస్తున్నామని ఆనందన్ పేర్కొన్నారు. జీఓఎస్ఎఫ్ను 2012లో తొలిసారిగా ప్రారంభించామని, అప్పుడు 90 వ్యాపార సంస్థలు పాల్గొన్నాయని, ఇప్పుడు ఈ వ్యాపార సంస్థల సంఖ్య 450కు పెరిగిందని తెలిపారు. భారత్లో ఆన్లైన్ షాపింగ్ జోరుగా సాగుతోందని ఆయన చెప్పారు. 2016కల్లా ఆన్లైన్ షాపింగ్ చేసేవారి సంఖ్య 10 కోట్లకు పెరుగుతుందని ఆనందన్ పేర్కొన్నారు. -
మళ్లీ గూగుల్ ఆన్లైన్ షాపింగ్ ధమాకా
హైదరాబాద్: ఇంటర్నెట్ సెర్చి దిగ్గజం గూగుల్ తాజాగా మరోసారి భారీ ఆన్లైన్ షాపింగ్ వేడుకలకు తెర తీస్తోంది. ఈ నెల 11 నుంచి 13 దాకా మూడు రోజుల(72 గంటలు) పాటు గ్రేట్ ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్(జీఎస్వోఎఫ్) నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. దీనిలో భాగంగా వివిధ ఉత్పత్తులపై 20-80 శాతం దాకా డిస్కౌంట్లు అందించనుంది. ఈసారి జీఎస్వోఎఫ్లో 200 పైగా ఈ-కామర్స్ కంపెనీలు పాల్గొంటున్నాయని, భారీ ఆఫర్లు అందించనున్నాయని గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ తెలిపారు. ఆటోమొబైల్ సంస్థలు, ఆన్లైన్ ట్రావెల్ సైట్లు, టెలికం తదితర రంగాల కంపెనీలు ఇందులో ఉంటాయన్నారు. గతేడాది జీఎస్వోఎఫ్కి మంచి స్పందన లభించడంతో ఈ ఏడాది కూడా నిర్వహిస్తున్నట్లు ఆనందన్ వివరించారు. టీవీలపై 50 శాతం దాకా, మొబైల్ ఫోన్లపై 40 శాతం మేర, కంప్యూటర్లు..ట్యాబ్లెట్లపై 45 శాతం దాకా, లగ్జరీ వాచీలపై 60 శాతం దాకా, దేశీ రూట్లలో విమాన టికెట్లపై 20 శాతం దాకా, స్పీకర్లు..హెడ్ఫోన్లు వంటి ఉత్పత్తులపై 50 శాతం దాకా డిస్కౌంట్లు లభించగలవని ఆనందన్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయంగా 2 కోట్ల మంది ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారని, వచ్చే కొన్నేళ్లలో ఇది 5 కోట్లకు చేరగలదని పరిశ్రమ వర్గాల అంచనా. ఆన్లైన్ షాపింగ్ లావాదేవీలు 2017 నాటికి 16 బిలియన్ డాలర్లకు చేరగలవని అంచనా వేస్తున్నట్లు ఆనందన్ వివరించారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
అప్పుడు 'నీ తండ్రి స్థాయి తెలుసా అన్నారు': దీపిందర్ గోయల్
HYD: ఏసీపీ నివాసంలో సోదాలు.. బయటపడుతున్న నోట్ల కట్టలు
శ్యామలపై తప్పుడు కథనాలు.. చట్టపరంగానే ముందుకెళ్తానన్న యాంకర్!
స్టార్క్ సూపర్ డెలివరీ.. హెడ్కు ఫ్యూజ్లు ఔట్
భారీగా పెరిగిన ఫ్లిప్కార్ట్ గ్రోసరీ బిజినెస్
లిక్కర్ కేసు: మనీష్ సిసోడియాకు మళ్లీ చుక్కెదురు
తెలంగాణ దశాబ్దిపై కేటీఆర్ ట్వీట్..
బిగ్బాస్ బ్యూటీకి చేదు అనుభవం.. నెల రోజులైనా రాలేదు!
Tirupati Gangamma Jatara 2024: తిరుపతిలో ఘనంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)
క్యార్వ్యాన్లోకి వచ్చి అతడలా చేసేసరికి భయపడ్డా: కాజల్ అగర్వాల్
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement