-
మరోసారి తమిళనాట రణరంగం ?
-
94 నిమిషాల్లో 323.5 కిలోమీటర్లు!
థానే: దేశంలో మరో అరుదైన ఘటనకు మహారాష్ట్ర వేదికైంది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఓ బాలుడి గుండెను గ్రీన్ కారిడార్ ద్వారా కేవలం 94 నిమిషాల్లో 323.5 కిలోమీటర్లు తరలించి నాలుగేళ్ల చిన్నారికి వైద్యులు విజయవంతంగా అమర్చారు. ఔరంగాబాద్లో రోడ్డు ప్రమాదానికి గురైన బాలుడు(13) శుక్రవారం చనిపోవడంతో అక్కడి ఎంజీఎం ఆస్పత్రిలో గుండెను మధ్యాహ్నం 1.50కి సేకరించారు. అనంతరం పోలీసులు, అధికారులు, ప్రజల సహకారంతో గ్రీన్ కారిడార్ ఏర్పాటుచేసి 4.8 కి.మీ దూరాన్ని నాలుగు నిమిషాల్లో పూర్తిచేసి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ్నుంచి చార్టెడ్ విమానంలో ముంబై విమానాశ్రయానికి మధ్యాహ్నం 3.05 గంటలకు చేరుకున్నారు. వెంటనే ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటుచేయడంతో కేవలం 19 నిమిషాల్లోనే గుండె సబర్బన్ ములుంద్లోని ఫోర్టిస్ ఆస్పత్రికి చేరుకుంది. గుండె సమస్యతో ఫోర్టిస్లో చికిత్స పొందుతున్న నాలుగేళ్ల చిన్నారికి ఈ గుండెను వైద్యులు అమర్చారు. బాలికకు ఆపరేషన్ విజయవంతమైందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. -
ఆ ‘గుండె’కు దారి చూపిన గుండెలెన్నో
బెంగళూరులోని బ్రెయిన్డెడ్ వ్యక్తి నుంచి గుండె సేకరణ ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తరలింపు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి.. 2 నిమిషాల 45 సెకన్లలో ప్రయాణం రోడ్లపై ట్రాఫిక్ పూర్తిగా ఆపి సహకరించిన పోలీసులు కొత్తగూడేనికి చెందిన రోగికి విజయవంతంగా గుండె మార్పిడి సాక్షి, హైదరాబాద్: ప్రాంతం: బేగంపేట విమానాశ్రయం సమయం: శనివారం మధ్యాహ్నం ఒంటిగంట నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే అక్కడి ప్రధాన రహదారి ఆ సమయంలో ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారింది. వీవీఐపీలెవరూ ఆ మార్గంలో ప్రయాణించకున్నా కూడళ్ల వద్ద పోలీసుల హడావుడి ఎక్కువైంది. ఇంతలో సరిగ్గా ఒంటిగంటా 16 నిమిషాలకు ఎయిర్పోర్టులోంచి ఓ అంబులెన్సు రయ్మంటూ రోడ్డెక్కింది. విమానాశ్రయం నుంచి 7.1 కిలోమీటర్ల దూరంలో ఉన్న యశోదా ఆస్పత్రికి కేవలం 2 నిమిషాల 45 సెకన్లలో చేరుకుంది. అందులోంచి దిగిన ఓ వ్యక్తి తన చేతిలోని ఓ పెట్టెతో పరుగుపరుగున ఆస్పత్రిలోకి వెళ్లిపోయారు. కొంతకాలంగా హృద్రోగంతో బాధపడుతున్న ఓ మహిళకు యశోదా ఆస్పత్రిలో గుండె మార్పిడి ఆపరేషన్ ద్వారా పునర్జన్మ ప్రసాదించేందుకు రెండు రాష్ట్రాల అధికారులు, పోలీ సులు, వైద్యులు పడిన తపనకు నిదర్శనమిది. గుండె పనితీరు దెబ్బతినడంతో... కొంతకాలంగా హృద్రోగంతో బాధపడుతున్న ఖమ్మం జిల్లా కొత్తగూడేనికి చెందిన పద్మ(46) ఇటీవల సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలోని ప్రముఖ గుండె మార్పిడి శస్త్రచికిత్సల నిపుణుడు డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ (ఏజీకే) గోఖలేను సంప్రదించారు. ఆమెకు పలు వైద్య పరీక్షలు నిర్వహించిన గోఖలే...రోగి గుండె పనితీరు పూర్తిగా దెబ్బతినడంతోపాటు గుండె ఎడమ కవాటం పనిచేయట్లేదని...దీనివల్ల గుండె పనితీరు సామర్థ్యం 20 శాతానికి పడిపోయినట్లు గుర్తించారు. దీనికితోడు బాధితురాలికి హైబీపీ, మధుమేహం, హైపోథైరాయిడిజమ్ సమస్య ఉండటంతో గుండె మార్పిడి ఒక్కటే దీనికి పరిష్కారమని ఆమెకు సూచించారు. ‘ఒ’పాజిటివ్ బ్లడ్గ్రూప్ కలిగి ఉన్న బాధితురాలు అవయవ దాత కోసం జీవన్దాన్ నెట్వర్క్లో పేరు నమోదు చేసుకొని మూడు నెలల నుంచి ఆస్పత్రికి సమీపంలోనే ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటోంది. ఇంతలో ఏం జరిగిందంటే... బెంగళూరులో బ్రెయిన్డెడ్ కేసు నుంచి.. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ వద్ద ఉన్న ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న మహారాష్ట్రలోని షోలాపూర్కు చెందిన పండిట్ శివరాయ బాజే (30) రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని బన్నేరుగట్ట వద్ద ఉన్న ఫోర్టిస్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ బ్రెయిన్డెడ్ స్థితికి చేరుకున్నాడు. దీంతో అవయవదానం కోసం ఒప్పించిన వైద్యులు ఇందుకోసం విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. శనివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో నిమ్స్ జీవన్దాన్తోపాటు యశోదా ఆస్పత్రికి ఈ మేరకు సమాచారం అందింది. దాత, స్వీకర్తల బ్లడ్గ్రూప్, వయసు మ్యాచ్ కావడంతో వెంటనే గుండెను తెచ్చి హృద్రోగి పద్మకు అమర్చాలని వైద్యులు నిర్ణయించారు. బ్రెయిన్డెడ్కు గురైన వ్యక్తి నుంచి సేకరించిన గుండెను ఆరు గంటల వ్యవధిలోనే రోగికి అమర్చాల్సి ఉండటంతో ఇందుకోసం వైద్యులు ప్రత్యేక విమానంతోపాటు ట్రాఫిక్ కంట్రోల్ కోసం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జీఎం ఐజీ మూర్తి సహా హైదరాబాద్, బెంగళూరు పోలీసు కమిషనర్ల అనుమతి పొందారు. విక్టోరియా ఆస్పత్రి నుంచి యశోదాకు తరలింపు డాక్టర్ గోఖలే నేతృత్వంలోని ఏడుగురు సభ్యులతో కూడిన వైద్య బృందం శనివారం ఉదయం 7 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి చేరుకొని పండిట్ బాజే శరీరం నుంచి ఉదయం 11.30 గంటలకల్లా గుండెను సేకరించింది. (అతని శరీరం నుంచి కాలేయం, మూత్రపిండాలు, కార్నియాను కూడా సేకరించి వివిధ ఆస్పత్రులకు అందజేశారు.) ఆ గుండెను ఓ ప్రత్యేక ద్రవాలున్న పెట్టెలో భద్రపరచి ఓ అంబులెన్సులో ‘గ్రీన్ చానల్’ మార్గంలో విక్టోరియా ఆస్పత్రి నుంచి బయలుదేరి కేవలం 11 నిమిషాల వ్యవధిలోనే 15 కిలోమీటర్ల దూరంలోని బెంగళూరులోని హెచ్ఏఎల్ ఎయిర్పోర్టుకు చేరుకుంది. అక్కడ సిద్ధంగా ఉన్న ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1.16 నిమిషాలకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంది. అప్పటికే బేగంపేట విమానాశ్రయం నుంచి సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రి మార్గంలో వాహనాల రాకపోకలను నిలువరిస్తూ ‘గ్రీన్ చానల్’ ఏర్పాటు చేశారు. దీంతో అంబులెన్సు కేవలం 2 నిమిషాల 45 సెకన్ల వ్యవధిలోనే యశోదా ఆస్పత్రికి చేరుకుంది. అందులోంచి దిగిన డాక్టర్ గోఖలే...గుండె ఉన్న పెట్టెను ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు. 5 గంటల శస్త్రచికిత్స అప్పటికే ఆపరేషన్ థియేటర్లో రోగితో సహా సిద్ధంగా ఉన్న పలువురు వైద్యులు మధ్యాహ్నం 1.30 గంటలకు గుండెమార్పిడి ఆపరేషన్ను ప్రారంభించి సాయంత్రం 6.30 గంటలకు ముగించారు. డాక్టర్ గోఖలే నేతృత్వంలో జరిగిన ఈ శస్త్రచికిత్సలో సుమారు 15 మంది వైద్యులు పాల్గొ న్నారు. ప్రస్తుతం రోగిని ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసీయూకు తరలించారు. -
32 కిలోమీటర్లు.. 29 నిమిషాలు.. ఓ జర్నీ!
గుర్గావ్ నుంచి ఢిల్లీకి ఉన్న దూరం.. దాదాపు 32 కిలోమీటర్లు. కానీ, రోడ్డు మార్గంలో వెళ్లాలంటే కనీసం గంటన్నర నుంచి రెండు గంటల వరకు పడుతుంది. కానీ అరగంట కంటే తక్కువ సమయంలోనే ఆ దూరాన్ని దాటుకెళ్లి ఓ 16 ఏళ్ల కుర్రాడికి ప్రాణదానం చేశారు. గుర్గావ్ లోని ఎస్కార్ట్ ఆస్పత్రి నుంచి ఢిల్లీలోని ఎస్కార్ట్ ఆస్పత్రికి గుండెను తరలించాల్సి వచ్చింది. 30 ఏళ్ల వ్యక్తి ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ స్థితికి చేరుకున్నాడు. అతడి గుండెను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. దాంతో ఆస్పత్రి వర్గాలు వెంటనే గ్రీన్ కారిడార్ ఏర్పాటుచేయాలని గుర్గావ్ పోలీసులను కోరాయి. వెంటనే.. ఎప్పుడూ అత్యంత రద్దీగా ఉండే ఆ మార్గం మొత్తం ఖాళీ అయిపోయింది. 23 మంది పోలీసు సిబ్బందితో కూడిన రెండు పోలీసు వాహనాలను అంబులెన్సుతో పాటు పంపారు. దారిలో ఉన్న మొత్తం అందరు ట్రాఫిక్ సిబ్బందికి గ్రీన్ కారిడార్ విషయాన్ని తెలియజేశారు. దాంతో కేవలం 29 నిమిషాల్లోనే అంబులెన్సు గమ్యానికి చేరుకుంది. అది వెళ్లే మార్గంలో మొత్తం అన్నీ గ్రీన్ సిగ్నళ్లే ఉంచారు. ఇంతకుముందు చెన్నై బెంగళూరు నగరాల మధ్య కూడా ప్రత్యేక విమానంలో పంపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement