-
స్టడీ మెటీరియల్స్ దండగ
సాక్షి, హైదరాబాద్: గ్రూప్స్తో పాటు ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు సిఫార్సు చేస్తున్న స్టడీ మెటీరియల్స్పై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నాణ్యతలేని మెటీరియల్ను విద్యార్థులకు అంటగడుతున్నారని నిపుణుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి మెటీరియల్తో లాభం కన్నా నష్టమే ఎక్కువని, క్లిష్టమైన ప్రశ్నలకు సమా ధానాలు రాయడం కష్టమని వారు అభిప్రాయపడుతున్నారు. మూస విధానంలో, షార్ట్ కట్ పద్ధతిలో మెటీరియల్స్ ఉంటున్నాయని చెబుతున్నారు. కొన్ని మెటీరియల్స్ అడ్డగోలుగా, తప్పులతడకగా ఉంటున్నాయని.. అకడమిక్ పాఠ్య పుస్తకాల్లో చదివిన దానికి, మెటీరియల్స్లో ఇచ్చే దానికి పోలిక ఉండటం లేదని, దీనిపై వివరణ అడిగినా కోచింగ్ సెంటర్స్ సరిగా స్పందించట్లేదని అభ్యర్థులు అంటున్నారు. అంటగట్టేస్తున్నారు.. గ్రూప్స్కు ఉన్న డిమాండ్, అభ్యర్థుల్లో ఆత్రుతను కోచింగ్ కేంద్రాలు సొమ్ము చేసుకుంటున్నాయి. వాటిని ఎవరు రాశారు, రచయిత ప్రొఫైల్ ఏంటి అనే విషయాలను వెల్లడించలేదు. చరిత్ర మెటీరియల్స్లో చారిత్రక తేదీలు కూడా తప్పుగా ఇస్తున్నారని, అభ్యర్థులు గుర్తించి చెబితే అచ్చు తప్పులని దాటేస్తున్నారని అంటున్నారు. కోచింగ్ కేంద్రాలకు వెళ్లే అభ్యర్థులకు ఎక్కడ మెటీరియల్ కొనాలో నిర్వాహకులు సూచిస్తున్నారని, ఇదంతా వ్యాపారంగా సాగుతోందని నిపుణులు అంటున్నారు. డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులతో ముందే మాట్లాడుకుని, వారికి నెలకు కొంత ముట్టజెప్పి మెటీరియల్ రాయిస్తున్నట్టు తెలుస్తోంది. గ్రూప్స్ ప్రకటన విడుదలైన మర్నాటి నుంచి ఈ ప్రక్రియ మొదలైందని, ఎక్కడా నిష్ణాతులైన అధ్యాపకులను ఎంపిక చేసుకోలేదనే వాదన వినిపిస్తోంది. ఒక్కో అభ్యర్థి కేవలం మెటీరియల్ కోసమే రూ. 7 వేల వరకూ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అకాడమీ దగ్గర బారులు.. తెలుగు అకాడమీ స్టడీ మెటీరియల్లో నాణ్యత ఉందని, చాప్టర్లలో లోతైన విధానం కనిపిస్తోందని అన్ని వర్గాలు అంగీకరిస్తున్నా యి. నిష్ణాతులైన అధ్యాపకులతో గ్రూప్స్ సిలబస్ ప్రకారం మెటీరియల్ సిద్ధం చేయించినట్టు అభ్యర్థులు చెబుతున్నారు. అయితే తగినవిధంగా పుస్తకాలు అందుబాటులో లేవు. మెటీరియల్ ముద్రణ, పంపిణీలో జరిగిన జాప్యమే దీనికి కారణమని అకాడమీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే మెటీరియల్ విడుదలవగా విక్రయ కేంద్రం వద్ద అభ్యర్థులు బారులు తీరుతున్నారు. లాభాలే కొలమానంగా.. ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు లాభాలే కొలమానంగా పనిచేస్తున్నాయి. అభ్యర్థులకు ఇచ్చే మెటీరియల్లో నాణ్యత కనిపించట్లేదు. ఇది వ్యాపారమైనప్పుడు నాణ్యత ఉంటుందని ఆశించడం కూడా సరికాదు. తెలుగు అకాడమీ లాభాపేక్ష లేకుండా పుస్తకాలు ముద్రిస్తుంది. కాబట్టి నాణ్యతకే ప్రాధాన్యం ఇస్తుంది. ఈ పని ఓపెన్ వర్సిటీ కూడా చేయాలి. అక్కడ అవసరమైన వనరులున్నాయి. – ప్రొఫెసర్ హరగోపాల్ (సామాజిక వేత్త) ఎన్సీఈఆర్టీ పుస్తకాలు బెస్ట్ ఎన్సీఈఆర్టీ పుస్తకాలు చదివిన అభ్యర్థి గ్రూప్స్లో ఎలా ప్రశ్న వచ్చినా సమాధానం రాయగలడు. ప్రైవేటు స్టడీ మెటీరియల్ ఫాలో అయితే ప్రధాన పరీక్షలో తికమకపడటం ఖాయం. నాణ్యత కన్పించని ప్రైవేటు మెటీరియల్కు దూరంగా ఉండటమే మంచిది. – దండెబోయిన రవీందర్ (ఉస్మానియా వర్సిటీ వీసీ) డెప్త్ ఉండట్లేదు కోచింగ్ కేంద్రం వాళ్లు తాము చెప్పిన చోట మెటీరియల్ కొనాలని చెప్పారు. అకాడమీ మెటీరియల్కు, ప్రైవేటు స్టడీ మెటీరియల్కు అస్సలు పోలిక ఉండట్లేదు. లోతైన అవగాహన కనిపించట్లేదు. కొన్న తర్వాత గానీ ఈ విషయం తెలియట్లేదు. హిస్టరీలోనైతే సంఘటన తేదీలు కూడా తప్పుగా ముద్రించారు. చరిత్రలో వరుస సంఘటనల్లో కొన్ని తప్పించారు. దీంతో సబ్జెక్టు పూర్తిగా అర్థం కావట్లేదు. – సబ్బతి రమ్య (గ్రూప్స్ అభ్యర్థిని) -
గ్రూప్స్పై అవగాహన సదస్సు నేడు
‘సాక్షి’, వనితా సివిల్స్ అకాడమి సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు గ్రూప్స్ సాధనలో మెళకువలపై ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నిపుణులు పోటీ పరీక్షలకు శిక్షణ పొందుతున్న విద్యార్థులకు తగిన సూచనలు, సలహాలు అందజేస్తారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. స్థలం: వనస్థలిపురం రైతుబజార్ సమీపంలోని వనితా సివిల్స్ అకాడమి సవుయుం: ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ముఖ్యవక్తలు: మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్, లీలానాయర్ పూర్తి వివరాలకు ఫోన్నెంబర్: 7032959590 -
పోటీపరీక్షలకు ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలి
ఏఎన్యూ: ప్రత్యేక శిక్షణతోపాటు ప్రణాళికాబద్ధంగా సిద్ధమయితేనే సివిల్స్, గ్రూప్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు లక్ష్యాన్ని చేరుకోగలుగుతారని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్చాన్సలర్ ఆచార్య కె.వియ్యన్నారావు అన్నారు. యూనివర్సిటీ సెంటర్ ఫర్ హెచ్ఆర్డీ ఆధ్వర్యంలో విజయవాడ ఏస్ ఐఏఎస్ అకాడమీ శుక్రవారం యూనివర్సిటీలో సివిల్స్, గ్రూపు-1, 2 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు అవగాహన సదస్సు నిర్వహించింది. ముఖ్యఅతిథి ఆచార్య వియ్యన్నారావు మాట్లాడుతూ దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఐఏఎస్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అన్ని అంశాల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. సమాజంలోని అన్ని అంశాలపై పూర్తి అవగాహన అవసరమన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలతోపాటు, స్వతహాగా పరీక్షలకు సిద్ధమవడం కూడా కీలకమని తెలిపారు. పోటీపరీక్షలకు సిద్ధమయ్యేప్పుడు సమయం చాలా విలువైందని దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం సివిల్ సర్వీసెస్లో ఖాళీలు ఎక్కువగా ఉంటున్నాయని వాటిని అందిపుచ్చుకునేందుకు అభ్యర్థులు సిద్ధం కావాలన్నారు. అన్ని అవరోధాలను అధికమించి ఐఏఎస్కు ఎంపికైన రేవు ముత్యాలరాజు వంటి వారిని ఆదర్శంగా తీసుకుని పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ఏఎన్యూ సెంటర్ ఫర్ హెచ్ఆర్డీ ఆధ్వర్యంలో ఆయా రంగాల నిపుణులతో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఏస్ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ వైవీ గోపాలకృష్ణమూర్తి మాట్లాడుతూ నిరంతర కృషి, అంకితభావంతో ప్రణాళికాబద్ధంగా సిద్ధమయితే సివిల్స్ వంటి ప్రతిష్టాత్మక పరీక్షల్లో విజయం సాధించవచ్చన్నారు. అకాడమీ కోఆర్డినేటర్ ఈ.వీరబాబు ఐఏఎస్ పరీక్ష విధానం, మార్కుల కేటాయింపు, పరీక్షకు సిద్ధమవడం, పరీక్ష రాసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. హెచ్ఆర్డీ డెరైక్టర్ డాక్టర్ బి.నాగరాజు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ట్రాక్టర్తో తొక్కించి ఏఎస్ఐ హత్య
హీరోగా జబర్దస్త్ కమెడియన్.. ఆసక్తిగా ట్రైలర్!
‘రాహుల్ గాంధీపై పాక్ ప్రేమ ఆందోళన కలిగించింది’
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
కొత్త పగటివేషగాడు వచ్చాడు
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
మహిళల టీ20 వరల్డ్కప్ 2024: అక్టోబర్ 6న భారత్-పాక్ మ్యాచ్
అక్కడ శృతి మించిందో.. మీ పాట శాస్వతంగా రద్దే!
తప్పక చదవండి
- కొత్త పగటివేషగాడు వచ్చాడు
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- రేటే 'బంగార'మాయెనే..!
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement