-
కక్ష్యలోకి చేరిన జీశాట్–9
ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన రాష్ట్రపతి ప్రణబ్ శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సార్క్ దేశాలకు ఉపయోగపడే జీశాట్–9 (దక్షిణాసియా ఉపగ్రహం)ను 3 విడతలుగా కక్ష్య దూరాన్ని పెంచుకుంటూ సోమవారం రాత్రి భూమికి 36కి.మీ ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఉపగ్రహంలోని లామ్ ఇం జిన్లో 1,255 కిలోల ఇంధనాన్ని ఈ నెల 6న 2,643 సెకన్ల పాటు మండించి మొదటి విడతగా కక్ష్య దూరా న్ని పెంచారు. 7న 3,529.7 సెకన్లతో పాటు మరో మారు ఇంధనాన్ని మండించి రెండో విడతగా కక్ష్య దూరాన్ని పెంచారు. మళ్లీ 8న 445.8 సెకన్ల పాటు ఇంధనాన్ని మండించి మూడోసారి కక్ష్య దూరాన్ని పెంచారు. ఈ నెల 5న సాయంత్రం 4.57కు షార్ కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్– 09 రాకెట్ ద్వారా జీశాట్–9 ఉపగ్రహాన్ని 170 కి.మీ పెరిజీ (భూమికి దగ్గరగా), 35,975 కి.మీ అపోజీ (భూమికి దూరంగా) ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. శని, ఆది, సోమవారాల్లో బెంగళూరులోని ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం వారు ఉపగ్రహాన్ని తమ అదుపులోకి తీసుకుని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టే ప్రక్రియను పూర్తి చేశారు. ఉపగ్రహం కక్ష్యలోకి చేరిన తరువాత సోలార్ ప్యానెల్స్ విచ్చుకుని బాగా పనిచేస్తోందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ ఉపగ్రహం సార్క్దేశాల్లో సభ్య దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్,భూటాన్, శ్రీలంక, అఫ్గా నిస్థాన్, మాల్దీవులకు 12 ఏళ్ల పాటు సేవలందిస్తోం ది. ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తూ ప్రత్యేక లేఖను పంపించారు. -
జయహో.. జీశాట్
జీఎస్ఎల్వీ–ఎఫ్09 వాహక నౌక ద్వారా నింగిలోకి ► సాకారమైన ప్రధాని నరేంద్ర మోదీ కల ► దక్షిణాసియా దేశాలకు సమాచార, విపత్తు రంగాల్లో సాయం ► తొలిసారి ప్రాంతీయ సహకారం బలోపేతానికి ఉపగ్రహ సాయం శ్రీహరికోట(సూళ్లూరుపేట), బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శుక్రవారం మరో అరుదైన ఘనత సాధించింది. సార్క్ దేశాలకు సమాచార, విపత్తు నిర్వహణ రంగాల్లో సేవలందించే జీశాట్–9 (దక్షిణాసియా ఉపగ్రహం) ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. పూర్తిగా భారత ఆర్థిక సాయంతో నిర్మించిన ఈ ఉపగ్రహం సార్క్ సభ్య దేశాలైన భారత్, శ్రీలంక, భూటాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, మాల్దీవులకు 12 ఏళ్ల పాటు సేవలందించనుంది. ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేసేందుకు చేసిన ఈ ప్రయోగాన్ని చరిత్రాత్మక అడుగుగా భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కోరిక మేరకు ఇస్రో నిర్మించిన జీశాట్–9ని శుక్రవారం సాయంత్రం 4.57 గంటలకు జీఎస్ఎల్వీ–ఎఫ్09 వాహక నౌక అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. 28 గంటల కౌంట్డౌన్ ముగిసిన వెంటనే శ్రీహరికోటలో సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్ఎల్వీ రాకెట్ నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లింది. అనంతరం మూడు దశలను విజయవంతంగా అధిగమించి నిర్ణీత కక్ష్యలోకి జీశాట్–9ను ప్రవేశపెట్టింది. భూమి నుంచి బయల్దేరిన 17 నిమిషాల్లో ప్రయోగం విజయవంతమైంది. జీఎస్ఎల్వీ సిరీస్లో 11 ప్రయోగాలు చేయగా ఇస్రో శాస్త్రవేత్తలు ఎనిమిది సార్లు విజయం సాధించారు. అత్యంత బరువైన ఉపగ్రహాల్ని ప్రయోగించేందుకు ఇతర దేశాలపై ఆధారపడకుండా మనమే ప్రయోగించే సామర్థ్యం జీశాట్–9తో ఇస్రో సొంతమైంది. కక్ష్యలోకి చేరిన ఉపగ్రహం సక్రమంగా పనిచేస్తున్నట్లు హసన్లోని మాస్టర్ కంట్రోల్ సెంటర్ ప్రకటించిందని ఇస్రో తెలిపింది. ప్రాజెక్టు కోసం రూ.450 కోట్ల ఖర్చు జీశాట్–9 మొత్తం బరువు 2230 కిలోలు. ఇక జీఎస్ఎల్వీ–ఎఫ్9 పొడవు 49 మీటర్లు కాగా బరువు 415 టన్నులు. జీశాట్–9లోని కేయూ బ్యాండ్ ట్రాన్స్పాండర్ల ద్వారా దక్షిణాసియా దేశాలకు టెలి కమ్యునికేషన్స్, టెలివిజన్, డీ2హెచ్, వీశాట్స్, టెలి–ఎడ్యుకేషన్, టెలిమెడిసన్ వంటి రంగాల్లో పూర్తి స్థాయి సేవలు అందుతాయి. ఇక భూకంపాలు, తుపాన్లు, వరదలు, సునామీలు వంటి సమయంలో దక్షిణాసియా దేశాల మధ్య సమన్వయం కోసం హాట్లైన్ సంభాషణలకు వీలు కల్పిస్తుంది. జీశాట్–9 తయారీకి భారత ప్రభుత్వం మొత్తం రూ. 235 కోట్లు ఖర్చుచేసింది. మొత్తం ప్రాజెక్టుకు రూ.450కోట్లు వెచ్చించారు. క్రయోజనిక్ ఇంజిన్తో వరుసగా నాలుగోసారీ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమవడంతో ఇక జీఎస్ఎల్వీ ప్రయోగాలకు తిరుగు ఉండదని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2010లో రెండు జీఎస్ఎల్వీ ప్రయోగాలు విఫలమవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు నాలుగేళ్లు శ్రమించి క్రయోజనిక్ ఇంజిన్లను మరింత అభివృద్ధి చేశారు. అనంతరం 2014 జనవరి, 2015 ఆగస్టు, 2016 సెప్టెంబర్లో చేసిన మూడు ప్రయోగాలతో హ్యాట్రిక్ సాధించింది. 2014లోనే ఉపగ్రహ ప్రయోగానికి నాంది 2014లో తన ప్రమాణ స్వీకారానికి సార్క్ కూటమి దేశాధినేతల్ని ప్రధాని మోదీ ఆహ్వానించారు. అనంతరం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఒక ఉపగ్రహాన్ని కానుకగా ప్రకటించారు. ప్రధాని ఆకాంక్షను ఇస్రో విజయవంతంగా నిజం చేసింది. మొదట దీనికి సార్క్ ఉపగ్రహం అని పేరు పెట్టినా.. ప్రాజెక్టులో చేరేందుకు పాకిస్తాన్ నిరాకరించడంతో దక్షిణాసియా ఉపగ్రహంగా పేరు మార్చారు. సమష్టి విజయం : ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ ప్రయోగం అనంతరం ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్కుమార్ మాట్లాడుతూ ఇది సమష్టి విజయమని పేర్కొన్నారు. క్రయోజనిక్ దశను రూపొందించడంలో ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన కృషి ప్రశంసనీయమైందని అభివర్ణించారు. ప్రధాని కోరిన మేరకు సార్క్దేశాలకు ఉపయోగపడే విధంగా ఒక ఉపగ్రహాన్ని తయారు చేయాలని ఆకాంక్షను నెరవేర్చినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. భవిష్యత్తులో భారీ ప్రయోగాలు సైతం చేయగలమన్న నమ్మకం ఏర్పడిందని, వాణిజ్యపరంగా కూడా భవిష్యత్తులో మరెన్నో భారీ ప్రయోగాలు చేస్తామన్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
మళ్లీ హానీమూన్కి వెళ్లిన రకుల్.. అనసూయ స్మైలీ పోజులు
అమెరికా ‘సాంత ఫె’లో విహారయాత్ర !
రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం!
IPL 2024: చెల్లెలు కాదు.. అక్క! ఈమెను గుర్తుపట్టారా?
తప్పుడు ఆరోపణలపై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా
Watermelon Seeds Benefits: పుచ్చకాయ గింజల ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు
ప్రియాంక చోప్రా న్యూ లుక్! ఏకంగా 200 క్యారెట్ల డైమండ్ నెక్లెస్..
TG క్రేజ్ ..రవాణా శాఖకు ఒకే రోజు 40 లక్షల ఆదాయం
T20 WC: అఫ్గానిస్తాన్ బౌలింగ్ కన్సల్టెంట్గా డ్వేన్ బ్రావో..
‘రైసీ’ మృతి కేవలం ప్రమాదమే: అమెరికా
తప్పక చదవండి
- సింగపూర్ ఎయిర్లైన్స్ విమానంలో కుదుపులు.. ఒకరు మృతి
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- ‘సీఎం రేసులో ఉన్నానని చెప్పేందుకు ఢిల్లీకి రూ.100 కోట్లు’
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- IPL 2024: ధోనిని అవమానించిన ఆర్సీబీ ప్లేయర్లు!.. తప్పు ‘తలా’దేనా?
- కెనడాలో భారతీయ విద్యార్థుల నిరసన.. ఎందుకంటే?
- Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్
- కొన్ని గంటల్లోనే నిర్ణయం వెనక్కి తీసుకున్న బీఐఏఎల్
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement