-
జీఎస్టీ పేరుతో విడతల వారీగా రూ.5.90 లక్షలు కాజేశారు
గూడూరు: పెద్ద మొత్తంలో నగదు గెలుచుకున్నారని ఆశపెట్టి గిరిజన దంపతులను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. రెక్కలుముక్కలు చేసుకొని ఇంటి కోసమని కూడబెట్టుకున్న సొమ్మును దోచేశారు. రూ.12.80 లక్షలు గెల్చుకున్నారని మభ్యపెట్టి.. రూ.5.90 లక్షలు కాజేశారు. ఈ ఘటన శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగింది. గూడూరు మండలం పురిటిపాళెంకు చెందిన కమ్మంపాటి మహేష్, లక్ష్మీదేవి.. కొలనుకుదురులో రొయ్యల చెరువుల వద్ద కాపలా ఉంటున్నారు. వారి పెద్ద కుమారుడు చెంచయ్య వరి కోత మిషన్ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. కుటుంబమంతా కలిసి ఇల్లు నిర్మించుకునేందుకని రూ.2.50 లక్షలు పొదుపు చేసుకున్నారు. ఈ క్రమంలో గతేడాది వినాయక చవితికి ముందు లక్ష్మీదేవికి ఓ ఉత్తరం వచ్చింది. అందులో రూ.12.80 లక్షలు గెల్చుకున్నట్లు ఉంది. ఆ కార్డులో ఉన్న నంబర్కు మహేష్, లక్ష్మీదేవి ఫోన్ చేయగా.. అవతలి వ్యక్తి ప్రతి 12 ఏళ్లకు ఒకసారి కంపెనీ ద్వారా కూపన్లు తీస్తామని.. తాజాగా తీసిన లక్కీ డ్రాలో మీకు రూ.12.80 లక్షలు వచ్చాయని చెíప్పి ఫోన్ పెట్టేశాడు. మళ్లీ అదే నంబర్కు ఫోన్ చేయగా.. ఆ మొత్తం మీ అకౌంట్లో జమ చేయాలంటే ఆధార్, పాన్కార్డు నంబర్లతో పాటు అకౌంట్ వివరాలు వాట్సాప్ చేయాలని సూచించాడు. అనంతరం ఆదాయ పన్ను కింద రూ.20 వేలు తమ అకౌంట్లో వేయాలని చెప్పాడు. దీనిపై మహేష్, లక్ష్మీ ప్రశ్నించగా.. ఆదాయ పన్ను చెల్లించకపోతే అధికారులు, పోలీసులు మిమ్మల్ని ఇబ్బంది పెడతారని నమ్మబలికాడు. దాంతో వారిద్దరూ ఆ వ్యక్తి చెప్పిన అకౌంట్లో డబ్బులు వేశారు. ఈసారి జీఎస్టీ, ఇతర ఖర్చులకు డబ్బులు కావాలని చెప్పాడు. మా వద్ద డబ్బులేదని ఆ గిరిజన దంపతులు మొత్తుకున్నా.. వినకుండా ఫోన్ పెట్టేశాడు. దీంతో వారు చేసేదిలేక తమ వద్ద ఉన్న రూ.2.50 లక్షలతో పాటు అప్పు చేసి మరో రూ.3.40 లక్షలు ఇచ్చారు. అప్పటి నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో వారు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మోసగాళ్లు 7585049583, 9831371553 ఈ నంబర్ల నుంచి ఫోన్ చేశారని గిరిజన దంపతులు తెలపగా.. ఇవి కోల్కతాకు చెందిన హరిప్రసాద్ అనే వ్యక్తి పేరున ఉన్నట్లు గుర్తించారు. ఎస్పీ ఆదేశాలతో గూడూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అదృశ్యమైన బాలిక ఆచూకీ లభ్యం
ఇటీవలే తండ్రి ఆత్మహత్య జఫర్గఢ్/గూడూరు: నెల క్రితం అదృశ్యమైన గిరిజన ఆశ్రమపాఠశాల విద్యార్థిని వరంగల్ జిల్లా జఫర్గఢ్ మండలం గర్మిళ్లపల్లిలో ప్రియుడితో కలసి పోలీసులకు పట్టుబడింది. గూడూరు సీఐ వెంకటేశ్వర్రావు, ఎస్సై సతీష్ ఆదివారం విలేకరులకు వివరించారు. గూడూరు మండలం గుండెంగ శివారు చర్లతండాకు చెందిన బోడ రవి, విమల దంపతుల కూతురు కవిత (17) గిరిజన ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. రవి, విమల హైదరాబాద్లో కూలీ పనులు చేసుకుంటుండగా, కవిత గత విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే పాఠశాలకు వెళ్లకుండా ఇంటివద్దే ఉంటోంది. కాగా, జఫర్గఢ్ మండలం గర్మిళ్లపల్లికి చెందిన గబ్బెట చంద్రయ్య (30) గూడూరు ప్రాంతంలో ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో కవితతో చంద్రయ్యకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. దీంతో కుటుంబపరువు తీయవద్దని కవితను రవి మందలించాడు. మనస్తాపానికి గురైన కవిత డిసెంబర్ 3న బయటికి వెళ్లిపోయింది. అతను నెక్కొండకు కవి తను రాత్రి గర్మిళ్లపల్లికి తీసుకెళ్లాడు. చంద్రయ్యకు ఇదివరకే వివాహమైంది. మూడేళ్ల క్రితం భార్య ఆత్మహత్య చేసుకుంది. జనవరి 11న పోలీసులకు ఫిర్యాదు.. కూతురు వెళ్లిన విషయం సోదరులు రవికి చెప్పినా అతడు పట్టించుకోలేదు. దుర్గమ్మ పండుగకు రవి దంపతులు తండాకు వచ్చారు. బంధువులు, తండావాసుల రవిపై ఒత్తిడి తేవడంతో తన కూతురు కనిపించడం లేదంటూ జనవరి 11న గూడూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తర్వాతి పరిణామాలతో మానసిక క్షోభకు గురైన రవి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. వాల్పోస్టర్ల ద్వారా విషయం వెలుగులోకి కవిత కనిపించడం లేదంటూ శనివారం ఆమె ఫొటోతో కూడిన వాల్పోస్టర్లు మహబూబాబాద్లో అంటించారు. కవిత ఫొటో చూసిన ఓ వ్యక్తి చంద్రయ్యకు ఫోన్ చేసి అడగడంతో ఆమె తన వద్దనే ఉందని, పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. వెంటనే ఆ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఎస్సై సతీష్ సిబ్బందితో కలసి గర్మిళ్లపల్లి వెళ్లి కవితను, చంద్రయ్యను అదుపులోకి తీసుకున్నారు. కవిత మైనర్ కావడంతో మానుకోట మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి, జడ్జి ఆదేశానుసారం బాలికను తల్లికి లేదా చిల్డ్రన్స్ హోంకు తరలిస్తామని సీఐ తెలిపారు. చంద్రయ్యపై నిర్భయ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
విద్యార్థి కవిత ఆచూకీ లభ్యం
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నాలుగు ముక్కలు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
Advertisement