-
షాకింగ్ ఘటన: పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి 5 ఏళ్లు జైలు శిక్ష
ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ప్రత్యేక కోర్టు 5 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...మధ్యప్రదేశ్లోని జిల్లా కేంద్రానికి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న సూరజ్పురకాలన్లోని ప్రభుత్వ మిడిల్ స్కూల్లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న చంద్రభాన్ సేన్ గెస్ట్ టీచర్ లక్ష్మీకాంత్ శర్మ అనే వ్యక్తిని పనిలో చేర్చుకునేందుకు రూ. 2 వేల రూపాయాలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. దీంతో ప్రత్యేక న్యాయస్థానం అవినీతి నిరోధక చట్టం కింద చంద్రబాన్ సేన్ను దోషిగా తేల్చి.. ఐదేళ్ల జైలు శిక్ష తోపాటు సుమారు రూ. 30 వేల రూపాయాలు జరిమాన కూడా విధించింది. సదరు గెస్ట్ టీచర్ శర్మ ఈ విషయమై జనవరి 6, 2015న లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రెండు రోజల్లోనే వారు వేసిన ప్లాన్లో ఇరుక్కుని జైలు పాలయ్యాడు. ఈ మేరకు న్యాయమూర్తి సిన్హా మాట్లాడుతూ...ప్రభుత్వ సేవకులు అవినీతికి పాల్పడటం అనేది సమాజంలో ఎదురవుతున్న అతిపెద్ద సమస్య. అందులోకి ఉపాధ్యాయుడు సమాజంలో కీలకమైన భాగం, పైగా అందరికీ మార్గదర్శి. అలాంటి వ్యక్తే అవినీతికి పాల్పడితే సమాజానికే చేటు అంటూ..సదరు ఉపాధ్యాయుడికి ఈ విధంగా శిక్ష విధిస్తున్నట్లు పేర్కొన్నారు. (చదవండి: పక్కా ప్లాన్తో కిడ్నాప్..త్రుటిలో తప్పించుకున్న మహిళ) -
కొత్త గురుకులాల్లో గెస్ట్ టీచర్లు!
‘గురుకుల నోటిఫికేషన్’పై కొరవడిన స్పష్టత సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల కోసం అభ్యర్థులు మరికొంత కాలం నిరీక్షించాల్సిందే. గురుకుల టీచర్ పోస్టులకు సంబంధించి నెలన్నర క్రితం టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కానీ అందులో పేర్కొన్న నిబంధనలపై క్షేత్రస్థాయి నుంచి విమర్శలు, నిరసనలు వ్యక్తం కావడంతో టీఎస్పీఎస్సీ ఆ నోటిఫికేషన్ను రద్దు చేసింది. ఈ క్రమంలో కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తుందని అభ్యర్థులు ఆశించినప్పటికీ ప్రభుత్వం నుంచి ఇప్పటికీ ఎలాంటి స్పంద నా లేదు. దీంతో కొత్త విద్యా సంవత్సరం ముంచుకొస్తుండడంతో ఆయా ఖాళీల్లో గెస్ట్టీచర్ల(తాత్కాలిక ఉపాధ్యాయులు)ను నియమించుకోవాలని గురుకుల సొసైటీ లు భావిస్తున్నాయి. 2017–18 విద్యా సంవత్సరంలో మహాత్మా జ్యోతిబాపూలే వెను కబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (ఎంజేపీబీసీఆర్ఈఐ ఎస్) పరిధిలో కొత్తగా 119 గురుకుల పాఠశాలలను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిని జూన్ 12న ప్రారంభించేందుకు ఆ సొసైటీ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియ ఊపందుకున్నప్పటికీ.. బోధకులు, సిబ్బంది నియామ కాలపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. దీంతో ఈ పాఠశాలల్లో తాత్కాలిక పద్ధతిలో గెస్ట్ టీచర్లను నియమించాలని అధికారులు నిర్ణయించారు. వచ్చే విద్యా సంవ త్సరంలో 119 బీసీ గురుకుల పాఠశాలలు ప్రారం భం కానున్నాయి. వీటికి 714మంది టీచర్లు అవసరం. రెగ్యులర్ ఉపాధ్యా యులు వచ్చే వరకు గెస్ట్ టీచర్లను, ఔట్సోర్సింగ్ ద్వారా 238 మంది బోధనేతర సిబ్బందిని నియమించుకోనున్నారు. జూన్ నాటికి ఈ ప్రక్రియ పూర్తిచేయాలని సొసైటీ భావిస్తోంది. -
ప్రభుత్వ పాఠశాలల్లో ‘గెస్ట్’ టీచర్లు
న్యూఢిల్లీ: నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ఆరువేల మంది ‘అతిథి ఉపాధ్యాయుల’ను నియమించింది. జాతీయ రాజధానిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని విద్యాశాఖ డెరైక్టర్ పద్మినీ సింఘ్లా తెలిపారు. దీంతో ఈ సమస్యను పరిష్కరించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఆరువేల మంది ఉపాధ్యాయులను ‘అతిథి’ ప్రాతిపదికన తీసుకున్నామన్నారు. మరో 10 వేల మందిని త్వరలో నియమించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది జూలైలో 1981 మంది టీజీటీలను, మరో 284 మంది అసిస్టెంట్ టీచర్లను సర్వ శిక్ష అభియాన్ కింద నియమించినట్లు తెలిపారు. ఈ విద్యాసంవత్సరంలో అవసరమైన పోస్టులను ‘ప్రత్యేక’ ప్రాతిపదికన భర్తీచేసేందుకు ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్(డీఎస్ఎస్ఎస్బి)తో డెరైక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నిత్యం సంప్రదిస్తోందని పద్మిని తెలిపారు. పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో ఉన్న నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంపై వస్తున్న విమర్శలను దృష్టిలో పెట్టుకుని తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆమె వివరించారు. ఇదిలా ఉండగా, ప్రభుత్వ పాఠశాలల్లో బోధనను మెరుగుపరిచేందుకు ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులతో ఉత్తరప్రత్యుత్తరాలు నెరపుతున్నట్లు తెలిపారు. అలాగే ఈ నెల త్యాగరాజ్ స్టేడియంలో సుమారు 1007 ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపాల్స్తో బహిరంగ చర్చ నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో విద్యార్థులకు తగిన బోధన అందించేందుకు వారు తీసుకున్న చర్యలు, బోధనాపద్ధతులపై చర్చించి వాటిని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేసేందుకు కృషిచేస్తామన్నారు. 8వ తరగతిలో ‘డిటెన్షన్ పాలసీ’ లేకపోవడంతో విద్యార్థులు ఆ ఏడాది చదువుపై ఎక్కువ శ్రద్ధ చూపించడంలేదని ఆమె అన్నా రు. దీంతో వారు 9వ తరగతిలో చదువుకోవడానికి ఎక్కువ ఇబ్బందిపడుతున్నారని అభిప్రాయపడ్డారు. దీంతో 9వ తరగతి నుంచి ప్రభు త్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు డెరైక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నిర్ణయం తీసుకుందని ఆమె వివరించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎమ్మెల్యే కనకయ్యకు మంత్రి పరామర్శ
వడదెబ్బతో ముగ్గురు మృతి
భార్య హత్య కేసులో భర్తకు జీవితఖైదు
చికిత్స పొందుతున్న వ్యక్తి...
బీజేపీతోనే సుస్థిర పాలన
మద్యం స్వాధీనం
గిరిజనుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి
మిత్రపక్ష పార్టీల కోఆర్డినేటర్లు వీరే...
హైదరాబాద్కు సుప్రీం బెంచ్ తెస్తాం
అకాల వర్షంతో ఆందోళన
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement