-
చెన్నై టు ఏపీ; బియ్యం అక్రమ రవాణ
గుమ్మిడిపూండి(నెల్లూరు జిల్లా) : రైలు మార్గం గుండా తమిళనాడు రాజధాని చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్కు అక్రమంగా బియ్యం తరలిస్తున్న ముఠాను నెల్లూరుజిల్లా అధికారులు పట్టుకున్నారు. దాదాపు 1500 కేజీల బియ్యాన్ని లోకల్ రైలులో తరలిస్తుండగా గుమ్మిడిపూండి రెవెన్యూ అధికారులు వలపన్ని సరుకును స్వాధీనం చేసుకున్నారు. బియ్యం అక్రమ రవాణాపై సమాచారం అందుకున్న గుమ్మిడిపూండి టీఎస్వో ఇళవరసి.. పౌర సరఫరాల శాఖ సిబ్బందితో కలసి శుక్రవారం ఏళావూర్, గుమ్మిడిపూండి, కవరపేట, తదితర స్టేషన్లలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో లోకల్ రైల్లో సీట్ల కింద 45 బియ్యం బస్తాలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటిని పంజెట్టిలోని పౌరసరఫరాల గోదాముకు తరలించారు. -
రేషన్ బియ్యం స్వాధీనం
గుమ్మిడిపూండి: రైలులో ఆంధ్రాకు అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన రెండు టన్నుల రేషన్ బియ్యాన్ని తమిళనాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై సెంట్రల్ నుంచి గుమ్మిడిపూండి మీదుగా తడ, సూళ్లూరుపేట, నెల్లూరుకు వెళ్లే యూనిట్ రైలులో కొందరు రేషన్ బియ్యాన్ని ఆక్రమంగా రవాణా చేస్తున్నారని గుమ్మిడిపూండి టీఎస్ఓ ఇళవరసికి సమాచారం అందింది. దీంతో ఆమె రెండు రోజులుగా తన సిబ్బందితో గుమ్మిడిపూండి, కవరపేట, తదితర స్టేషన్లలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ప్లాట్ఫాం పక్కన ముళ్లపొదల్లో దాచిన బియ్యం బస్తాలను గుర్తించి అధికారులు వాటిని స్వాధీనం చేస్తున్నారు. బియ్యం బస్తాలను పంజెట్టిలోని పౌరసరఫరాల శాఖ గోదాముకు తరలించారు. -
పెళ్లిలో గొడవ: యువకుడి హత్య
గుమ్మిడిపూండి:పెళ్లి భోజనాల వద్ద జరిగిన గొడవలో ఓ యువకుడిని హత్యకు గురైన సంఘటన మాదరపాక్కంలో మంగళవారం జరిగింది. మాదరపాక్కం సమీపంలోని పాదిరివేడు దళిత కాలనికి చెందిన ఓ యువకుడికి ఈగువారిపాలెం సమీపంలోని కుమ్మనాయుడుపేటకు చెందిన యువతితో సోమవారం గుమ్మిడిపూండిలో వివాహం జరిగింది. భోజనాల వద్ద పాదిరివేడు, కుమ్మనాయుడు పేటకు చెందిన యువకుల మధ్య గొడవ ప్రారంభమైంది. అప్పుడు ఇరుగ్రామాలకు చెందిన పెద్దలు నచ్చచేప్పి పంపివేశారు. అయితే పాదిరివేడు గ్రామానికి చెందిన అరుణ్కుమార్ (21) ఒంటరిగా పాదిరివేడుకు వెళుతుండగా కుమ్మనాయుడుపేటకు చెందిన యువకులు కర్రలతో కొట్టి హత్య చేసి సమీపంలోని కల్వర్టు క్రింద పడవేశారు. ఈ విష యం తెలిసిన మాదరపాక్కం గ్రామస్తులు ఆగ్రహంతో కుమ్మనాయుడుపేట గ్రామంపై దాడి చేశారు. అరుణ్కుమార్ను హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ..షాపులు మూసి ధర్నాకు దిగారు. రోడ్డుపై టైర్లు కాల్చి రాస్తారోకో చేశారు. దీంతో బస్సులు నిలిచి పోయాయి. విషయం తెలుసుకున్న గుమ్మిడిపూండి డీఎస్పీ శివలింగం వచ్చి ఆందోళన చేస్తున్న గ్రామస్తులతో చర్చలు జరిపారు. వారు వినకపోవడంతో జిల్లా ఎస్పీకి సమాచారం ఇవ్వగా వెంటనే ఎస్పీ శాంసన్ మాదరపాక్కం గ్రామానికి వచ్చారు. ఈ సమయంలో పాదిరివేడుకు చెందిన కొం దరు కుమ్మనాయుడు పేటకు చెందిన ఓ యువకుడిని చితక్కొట్టారు. దీంతో రెండు గ్రామాల్లో అలజడి రేగింది. నిందితులను అరెస్టు చేసేంత వరకు ఇక్కడినుంచి కదలమని భీష్మించుకుని కూచున్నారు. దీంతో జిల్లా ఎస్పీ శాంసన్, తహసీల్దార్ పాల్స్వామి అక్కడే ఉన్నారు. ఎట్టకేలకు సాయంత్రం గ్రామస్తులు శాంతించారు. -
అన్నాడీఎంకే విజయాన్ని అడ్డుకోలేరు
గుమ్మిడిపూండి, న్యూస్లైన్: రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయాన్ని ఏ కూటమీ అడ్డుకోలేదని రాష్ట్ర మంత్రి వలర్మతి అన్నారు. గుమ్మిడిపూండి బజారువీధిలో అన్నాడీఎంకే యువజన శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ విజయాలను వివరించే బహిరంగసభ జరిగింది. ఈ సభకు యువజనశాఖ జిల్లా కార్యదర్శి ముల్లైవేందన్ నేతృత్వం వహించగా యూనియన్ కార్యదర్శి గోపాల్నాయుడు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథులుగా మంత్రులు వలర్మతి, బీవీ రమణ పాల్గొన్నారు. మంత్రి వలర్మతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జయలలిత ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. అమ్మ పనితీరును జాతీయ పత్రికలు కొనియాడుతుంటే రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు ఇది మింగుడుపడడం లేదన్నారు. డీఎంకే అధినేత కరుణానిధి లోక్సభ ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం పాకులాడుతున్నారని తెలిపారు. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటమి తప్పదని పేర్కొన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో 40 స్థానాల్లో అన్నాడీఎంకే గెలుపు కోసం కార్యకర్తలు ఇప్పటి నుంచే కృషిచేయాలని పిలుపు నిచ్చారు. అనంతరం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వ విజయాలను వివరించారు. ఎమ్మెల్యేలు పొన్రాజా, మణిమారన్, జిల్లా చైర్మన్ రవిచంద్రన్, జిల్లా కౌన్సిలర్లు నారాయణమూర్తి, ఎన్.శ్రీధర్, యూనియన్ చైర్మన్ గుణమ్మ, వైస్ చైర్మన్ నాగలక్ష్మి పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
గుమ్మిడిపూండి, న్యూస్లైన్: ఆరణి సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. కవరపేట సమీపం మేల్మదలంబేడు గ్రామానికి చెందిన కార్మెగం(24) పెయింటర్గా పనిచేస్తున్నాడు. పెరియపాళెంలోని బంధువుల ఇంట్లో కార్యక్రమానికి శుక్రవారం రాత్రి వెళ్లాడు. శనివారం ఉదయం తిరిగి వస్తుండగా ఆరణి వద్ద ఓ ప్రైవేటు స్కూలు బస్సు ఢీకొనింది. తీవ్రంగా గాయపడ్డ కార్మెగం అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఆరణి పోలీ సులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. విద్యార్థులను ఇంటికి పంపి బస్సును పోలీస్ స్టేషన్కు తరలించా రు. కార్మెగం మృతదేహాన్ని పొన్నేరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ఆరణి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement