-
నారా లోకేష్కు ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి సవాల్
సాక్షి, పల్నాడు జిల్లా: వైఎస్సార్సీపీ పాలనలో అభివృద్ధిపై మంగళగిరి టీడీపీ ఆఫీసులో చర్చ పెట్టినా తాను చర్చకు సిద్ధమని నారా లోకేష్కు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి సవాల్ విసిరారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నేను అబద్ధాలు చెప్పినట్లు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. గురజాల నియోజకవర్గంలో టీడీపీ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. ‘‘రూ.83 కోట్లతో నిర్మించిన సీసీరోడ్లు, అంగన్వాడీలు, కమ్యూనిటీ హాళ్లని రూ.2020 కోట్లతో నిర్మించానని లోకేష్ అబద్ధాలు చెప్పాడు. సారా డబ్బులతో హైదరాబాద్లో చంద్రబాబుకు రూ.300 కోట్ల భవనం. ప్రజల్ని లూటీ చేసి చంద్రబాబు, లోకేష్ సంపాదించారు. టీడీపీ హయాంలో లిప్ట్ ఇరిగేషన్ నుంచి సర్వే అయినా చేయించారా?’’ అంటూ మహేష్రెడ్డి ప్రశ్నించారు. చదవండి: అన్నమయ్య జిల్లా: చంద్రబాబుపై కేసు నమోదు -
టార్గెట్ యరపతినేని.. టీడీపీలో హాట్ టాపిక్.. అసలేం జరుగుతోంది?
ఏపీలోని పల్నాడు జిల్లా గురజాలకు ఒకప్పుడు యరపతినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యే. తెలుగుదేశం పార్టీ నుంచి ఆరు సార్లు పోటీ చేసిన ఆయన మూడు సార్లు విజయం సాధించారు. 2014లో టీడీపీ విజయంతో గురజాలలో యరపతినేని అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. పోలీసుల పోస్టింగ్లనుంచి మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియాల వరకు నేరాలకు నాయకత్వం వహించాడు. అన్నిటికీ తన ఇంటినే అడ్డాగా మార్చాడు. నియోజకవర్గంలోని లైమ్ స్టోన్, ముగ్గురాయి అక్రమ క్వారీయింగ్తో మైనింగ్ డాన్గా ఎదిగాడు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఐదువేల కోట్లకుపైగా సంపాదించాడనే ఆరోపణలున్నాయి. అయ్యగారు చేసిన అరాచకానికి గత ఎన్నికల్లో గురజాల ఓటర్లు గట్టి గుణపాఠం నేర్పారు. జనం కొట్టిన దెబ్బకు ఏడాదివరకూ యరపతినేని శ్రీనివాసరావు నియోజకవర్గంలో కనిపించలేదు. ఎన్నిక రాగానే హడావిడి ప్రజలకు కనిపించకపోతే ఎక్కడ ఉనికి కోల్పోతానో అన్న భయంతో అప్పుడప్పుడు గురజాల వచ్చి తెగ హడావుడి చేస్తున్నారు యరపతినేని శ్రీనివాసరావు. ఆయన ఎంత హడావుడి చేసినా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకటి రెండు గ్రామాల్లో తప్ప నియోజకవర్గంలో ఎక్కడా పార్టీని గెలిపించలేకపోయాడు. పిడుగురాళ్ల మున్సిపాలిటీలో అయితే పోటీ చేసేందుకు ఒక్క అభ్యర్ది కూడా దొరకలేదు. దీంతో మున్సిపాలిటీలో అన్ని వార్డులు ఏకగ్రీవమయ్యాయి. అయినా యరపతినేనికి బుద్దిరాలేదు. ఈసారి నేనే గెలుస్తా... మీ సంగతి తేలుస్తానంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణుల్ని రెచ్చగొడుతున్నారు. అయితే యరపతినేనికి ఇప్పుడు ఆయన పార్టీలోనే ఊహించని స్థాయిలో ఎదురుదెబ్బ తగిలింది. గురజాలకు చెందిన టీడీపీ నేత చల్లగుండ్ల శ్రీనివాస్ తెరపైకి వచ్చారు. యరపతినేనికి పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మెడికల్ క్యాంపులతో నియోజకవర్గం మొత్తాన్ని చుట్టేశారు. రెండుసార్లు చంద్రబాబును కలిసి యరపతినేనికి టికెట్ ఇవ్వద్దని, ఆయనకు టికెట్ ఇస్తే పార్టీ ఓడిపోవడం గ్యారెంటీ అని చెప్పారట. చిన వర్సెస్ పెద్ద యరపతినేని వ్యతిరేకులందరినీ కలిపి ఒకేతాటిపైకి తీసుకొచ్చి వ్యవహారం మొదలుపెట్టారు చల్లగుండ్ల శ్రీనివాస్. దీనికితోడు చంద్రబాబు కుటుంబానికి దగ్గరగా ఉన్న టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు నాదెండ్ల బ్రహ్మం కూడా యరపతినేనికి ఎర్త్ పెట్టడానికి చంద్రబాబు వద్ద పావులు కదుపుతున్నారు. ఇప్పుడు కొత్తగా చినకమ్మ, పెద్దకమ్మ ఫీలింగ్ తీసుకొచ్చారు. యరపతినేని పెదకమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. డాక్టర్ చల్లగుండ్ల శ్రీనివాస్, నాదెండ్ల బ్రహ్మంలు చినకమ్మ వర్గానికి చెందిన నేతలు. నియోజకవర్గంలో చినకమ్మ వర్గం ఓటర్లు 23వేల వరకూ ఉంటే, పెదకమ్మ ఓటర్లు కేవలం రెండు వేలే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే.. తమ ఓట్లతో గెలిచి తమనే అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్న యరపతినేనిని ఎలాగైనా ఓడిస్తామంటున్నారు చిన్న కమ్మ వర్గం నాయకులు. అందుకే యరపతినేనితో ఢీ అంటే ఢీ అంటూ సవాళ్లు విసురుతున్నారు. యరపతినేనిపై తిరుగుబాటులో భాగంగానే నూతన సంవత్సర శుభాకాంక్షల పేరుతో గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్లలో చల్లగుండ్ల శ్రీనివాస్ భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలలో ఎక్కడా యరపతినేని ఫొటో లేదు. ఇదే ఇప్పుడు గురజాల నియోజకవర్గంలోని టీడీపీలో హాట్ టాపిక్గా మారింది. ఫ్లెక్సీల వ్యవహారంతో ఆగ్రహించిన యరపతినేని వర్గీయులు రాత్రికి రాత్రే చల్లగుండ్ల శ్రీనివాస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మొత్తం పీకేయించారు. అంతటితో ఆగకుండా వాటి స్థానంలో యరపతినేని ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెలుగుదేశం నాయకుల మధ్య ఫ్లెక్సీల యుద్ధం ఇప్పుడు తారా స్థాయికి చేరుకుంది. చదవండి: ఏపీలో బీఆర్ఎస్.. ‘కారు’ సీన్ ఎంత?.. ఈ ప్రశ్నకు సమాధానమిదే.. యరపతినేని శ్రీనివాసరావుతో అమీతుమీ తేల్చుకునేందుకు చినకమ్మ సామాజికవర్గం నేతలందరూ ఏకమవుతున్నారు. గతంలో జనసేన తరపున పోటీ చేసిన చింతలపూడి శ్రీనివాసరావు కూడా రంగంలోకి దిగారు. ఇలా అందరూ యరపతినేనిని టార్గెట్ చేస్తూ అధిష్టానం వద్ద ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నారట. సొంతపార్టీ నేతలే తనపై తిరుగుబాటు చేస్తూ అధిష్టానం వద్ద పంచాయతీ పెట్టేందుకు రెడీ అవుతున్నారని తెలుసుకుని యరపతినేని వర్గీయులు తెగ హైరానా పడుతున్నారట. పచ్చ పార్టీలో యరపతినేని పరిస్థితి ఏమవుతుందో చూడాలి. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
పల్నాడు జిల్లా గురజాలలో టీడీపీ నేతల ఫ్లెక్సీ వార్
-
గురజాల అత్యాచార ఘటనపై సమగ్ర దర్యాప్తు
సాక్షి, అమరావతి: గురజాల రైల్వే హాల్ట్లో మహిళపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితులను వెంటనే పట్టుకోవాలని, కేసు దర్యాప్తును ముమ్మరం చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ రైల్వే పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆమె విజయవాడ రైల్వే ఎస్పీకి లేఖ పంపారు. కేసు నమోదు చేసిన నడికుడి రైల్వే పోలీస్ సీఐ శ్రీనివాసరావుతో ఆమె ఫోన్లో మాట్లాడి ఘటన వివరాలను ఆరాతీశారు. బాధితురాలి ఆరోగ్యంపై వాకబు చేశారు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు రైల్వేతో పాటు పోలీసు శాఖ కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసును శరవేగంగా చేధించాలని కోరారు. బాధితురాలి ఆరోగ్యం కుదుటపడే వరకు ఆమెతోపాటు తనతో ఉన్న చంటిబిడ్డ సంరక్షణ బాధ్యతను మహిళా శిశు సంక్షేమ శాఖ చూసుకోవాలని ఆదేశించారు. -
ఒడిశా యువతిపై లైంగిక దాడి.. అపస్మారకస్థితిలో
సాక్షి, గురజాల: ఒడిశాకు చెందిన మహిళపై లైంగిక దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన దుర్ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది. సేకరించిన సమాచారం మేరకు ఒడిశాకు చెందిన మహిళ తన మూడేళ్ల కుమారుడితో కలిసి శుక్రవారం రాత్రి మాచర్ల ప్యాసింజర్ రైలు నుంచి గురజాల రైల్వే గేట్ హాల్ట్ వద్ద దిగింది. పొట్టకూటి కోసం వచ్చిన ఆమె టికెట్ కౌంటర్ వద్దే రాత్రి నిద్రించింది. ఆ సమయంలో ఆమెపై లైంగిక దాడి జరిగినట్టు తెలిసింది. తీవ్ర రక్తస్రావంతో అపస్మారకస్థితిలో ఆమె పడి ఉంది. శనివారం ఉదయం ఆమె పక్కనే మూడేళ్ల బాలుడు బిక్కచూపులు చూస్తూ కూర్చుండడాన్ని గమనించిన స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది వచ్చి బాధితురాలిని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తరలించారు. వైద్యురాలు లక్ష్మి యువతికి ప్రాథమిక చికిత్స చేశారు. పోలీసులు వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. బాధితురాలు మాట్లాడే భాష అర్థం కాకపోవడంతో కొందరు స్థానికులను పిలిపించి విచారణ సాగిస్తున్నారు. మహిళ ఇంకా దిగ్భ్రాంతిలో ఉండడంతో సరైన వివరాలు చెప్పలేకపోతున్నట్టు పోలీసులు వెల్లడిస్తున్నారు. గురజాల డీఎస్పీ బెజవాడ మోహర జయరాం ప్రసాద్, సీఐ రాయన ధర్మేంద్రబాబు, జీఆర్పీ సీఐ టి శ్రీనివాసరావు, ఆర్పీఫ్ సీఐ నాగార్జునరావు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పరిసరాల్లో ఆరా తీస్తున్నారు. చదవండి: (సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement