-
FIH League: శెభాష్ గుర్జీత్.. చైనాపై మరో విజయం.. టేబుల్ టాపర్గా..
FIH Pro League: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్లో భారత మహిళల జట్టు ఖాతాలో వరుసగా రెండో విజయం చేరింది. చైనా జట్టుతో మంగళవారం జరిగిన రెండో మ్యాచ్లో టీమిండియా 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ సాధించిన రెండు గోల్స్ను స్టార్ డ్రాగ్ ఫ్లికర్ గుర్జీత్ కౌర్ చేయడం విశేషం. ఆట మూడో నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను తొలి గోల్గా మలిచిన గుర్జీత్... 49వ నిమిషంలో మరో పెనాల్టీ కార్నర్ను కూడా లక్ష్యానికి చేర్చి భారత విజయాన్ని ఖాయం చేసింది. చైనా తరఫున 39వ నిమిషంలో షుమిన్ వాంగ్ ఏకైక గోల్ సాధించింది. మొత్తం తొమ్మిది జట్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ప్రొ లీగ్ జరుగుతోంది. ప్రస్తుతం భారత్ ఆడిన రెండు మ్యాచ్ల్లో గెలిచి ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. భారత్ తదుపరి మ్యాచ్ల్లో భువనేశ్వర్ వేదికగా ఈనెల 19, 20 తేదీల్లో నెదర్లాండ్స్తో... 27, 28వ తేదీల్లో స్పెయిన్తో తలపడుతుంది. చదవండి: IPL 2022 Auction: ఈ క్రికెటర్లకు భారీ డిమాండ్, రికార్డు ధర ఖాయం.. అంబటి రాయుడు, హనుమ విహారి కనీస విలువ ఎంతంటే! -
ఆ జవాను అమరుడయ్యారు!
శ్రీనగర్: పాకిస్తాన్ రేంజర్స్ జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన బీఎస్ఎఫ్ జవాన్ గుర్నామ్ సింగ్ శనివారం రాత్రి అమరుడయ్యారు. చికిత్స పొందుతున్న గుర్నామ్ ను మెరుగైన వైద్యం కోసం ఏయిమ్స్ కు తరలించాలని చూస్తుండగా దురదృష్టవశాత్తూ గుర్నామ్ చనిపోయారని ఓ అధికారి రాజేందర్ థాపా మీడియాకు తెలిపారు. పాక్ దాడులలో గాయపడ్డ జవాన్లకు మెరుగైన వైద్యం అందించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని అమరుడైన జవాను సోదరి గుర్జీత్ కౌర్ శనివారం ఆరోపించారు. తన సోదరుడి పరిస్థితి విషమంగా ఉందని, గుర్నమ్ ను విదేశాలకు తీసుకెళ్లి ట్రీట్ మెంట్ ఇప్పించాలని కుదరని పక్షంలో అక్కడి నుంచి మంచి వైద్యుల బృందాన్ని తీసుకురావాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. (తప్పక చదవండీ: కేంద్ర ప్రభుత్వానికి జవాను సోదరి సూటి ప్రశ్న!) పాకిస్తాన్ రేంజర్స్ జమ్ముకశ్మీర్ కతువా జిల్లాలో నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్ద శుక్రవారం జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాను గుర్నామ్ సింగ్ గాయపడ్డారు. పాక్ కాల్పులను తిప్పికొట్టిన భారత్ మొత్తం ఏడు మందిని మట్టుపెట్టిన విషయం తెలిసిందే. -
కేంద్ర ప్రభుత్వానికి జవాను సోదరి సూటి ప్రశ్న!
భారత ఆర్మీపై కేంద్ర ప్రభుత్వం తీరు సరిగా లేదని బీఎస్ఎఫ్ జవాను కుటుంబం ఆరోపించింది. పాకిస్తాన్ రేంజర్స్ జరిపిన దాడులలో గాయపడ్డ జవాన్లకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదని భారత జవాను గుర్నామ్ సింగ్ సోదరి గుర్జీత్ కౌర్ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు మాత్రం విదేశీ పర్యటనలకు వెళ్తారు.. కానీ గాయపడ్డ సైనికులను మాత్రం తీసుకెళ్లడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తారని సూటిగా ప్రశ్నించారు. అలా వీలుకాని పక్షంలో విదేశాల నుంచి మంచి వైద్య బృందాన్ని అయినా ఇక్కడికి తీసుకొచ్చి ట్రీట్ మెంట్ ఇప్పించొచ్చు కదా అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు. ప్రస్తుతం తన సోదరుడు గుర్నామ్ కౌర్ ఆరోగ్య పరిస్థితిపై తమ కుటుంబం తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు జాతీయ మీడియాకు వెల్లడించారు. జమ్ములోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో గుర్నామ్ చికిత్స పొందుతున్నారు. తన సోదరుడి పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం అతడ్ని విదేశాలకు ఎందుకు తీసుకెళ్లడం లేదని గుర్జీత్ కౌర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పాకిస్తాన్ రేంజర్స్ జమ్ముకశ్మీర్ లోని హిరానగర్ సమీపంలో లైన్ ఆఫ్ కంట్రోల్(ఎల్ఓసీ) వద్ద శుక్రవారం జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాను గుర్నామ్ సింగ్ గాయపడ్డారు.పాక్ రేంజర్స్ కాల్పులను తిప్పికొట్టిన భారత్ మొత్తం ఏడుగురు ఉగ్రవాదులను మట్టుపెట్టిన విషయం తెలిసిందే.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement