-
నేటి పక్షి.. నాటి రాకాసి బల్లి
గుంటూరు: కోతి నుంచి మనిషి అవతరించాడని చెబుతారు. అలాగే ఇప్పటి పక్షుల పూర్వీకులు ఆనాటి రాకాసి బల్లులేనట! సరీసృపాల స్వర్ణయుగంగా పేరొందిన క్రిటేయస్ (దాదాపు వంద మిలియన్ ఏళ్లకు పూర్వం)నాటి టైటనోసారిక్ డైనోసర్ల శిలాజీకరణం చెందిన లోపభూయిష్టమైన గుడ్లను వాటి గూళ్లను కనిపెట్టి అధ్యయనం చేసిన ముగ్గురు శాస్త్రవేత్తల బృందం తేలి్చన సారాంశమిది. డైనోసార్ల పునరుత్పత్తి జీవశాస్త్రంపై వీరి పరిశోధనపత్రం గత వారం నేచర్ గ్రూప్ జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్లో ప్రచురితమైంది. వీరిలో ఒకరు తెనాలికి చెందిన పాలీయాంథాలజీ శాస్త్రవేత్త డాక్టర్ గుంటుపల్లి వీఆర్ ప్రసాద్ కావటం విశేషం. వీఆర్ ప్రసాద్ ఢిల్లీలోని యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీ భౌగోళిక విభాగం అధిపతి. పూర్వ చారిత్రాత్మక కాలం (మెసాజోయిక్ ఎరా)లో భారతదేశంలోని సకశేరుక జంతుజాలం పరిణామక్రమం, జీవవైవిధ్యం, ప్రకృతి, వాతావరణంలో మార్పులను ఆయన 40 ఏళ్లుగా అధ్యయనం చేస్తున్నారు. ఈ అన్వేషణలో కనుగొన్న అంశాలు శాస్త్రపరిశోధన రంగాన్ని అబ్బుర పరిచాయి. 2016లో డైనోసర్లను పోలిన 150 మిలియన్ ఏళ్లకు చెందిన సముద్ర సరీసృపంను గుజరాత్లోని కచ్ తీరంలో వీఆర్ ప్రసాద్ గుర్తించారు. 1988లో క్రిటిíÙయస్ యుగంలో నివసించిన క్షీరదాల ఉనికిని దక్కన్ పీఠ భూమిలో గుర్తించి, వాటి పుట్టుక భారత్లోనే నని శాస్త్రలోకానికి చాటారు. తన విజయాలకు గాను 2019లో భారత ప్రభుత్వంచే ‘జాతీయ ఉత్తమ శాస్త్రవేత్త’ అవార్డును స్వీకరించారు. టైటనోసారిక్ డైనోసార్ల గూడు, గుడ్లు శిలాజాల మైక్రోస్కోపిక్ ఫీల్డ్ ఫొటోలు ఫలించిన ముగ్గురు శాస్త్రవేత్తల అన్వేషణ భారతదేశంలోని మధ్య, పశి్చమ ప్రాంతాల్లో టైటనోసారిక్ డైనోసర్ల గూళ్లలో శిలాజీకరణం చెందిన లోపభూయిష్టమైన గుడ్లను హర్ష ధిమాన్, విశాల్ వర్మతో కలిసి గుంటుపల్లి వీఆర్ ప్రసాద్ గుర్తించారు. గుడ్డు లోపల ఇంకో గుడ్డు ఉండటం లేదా గుడ్డును ఆవరించి ఉండే పెంకు ఎక్కువ పొరల్లో ఉండటాన్ని లోపభూయిష్టమైనవిగా చెబుతారు. వీటిని మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాకు చెందిన పడ్లియా గ్రామంలో కనుగొన్నారు. మరికొన్నిటిని గుజరాత్ రాష్ట్రంలో గుర్తించారు. పరిశోధనల అనంతరం ఈ శిలాజ అవశేషాలను పడ్లియా సమీపంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వ డైనోసర్ శిలాజ జాతీయ పార్కులో భద్రపరిచారు. ఆధార సహితంగా నిర్ధారణ పక్షుల పూరీ్వకులు రాకాసి బల్లులేనని వీఆర్ ప్రసాద్ బృందం ఆధార సహితంగా నిర్ధారించింది. జీవుల్లో లోపభూయిష్ట గుడ్లు ఏర్పడడానికి అనేక కారణాలుంటాయి. దేహరుగ్మతలు, అధిక జనసాంద్రత, ఆహార కొరత, వరదలు, కరువుకాటకాలు, వాతావరణ మార్పులు వంటివి ప్రధానమైనవి. గుడ్డులో గుడ్డు ఉండడాన్ని పక్షుల విషయంలో అప్పుడప్పుడు వింటుంటాం. అలాగే అనేక పొరల పెంకుతో గుడ్లు ఏర్పడటం కూడా సరీసృపాలు, పక్షుల్లో కనిపిస్తోంది. ఈ రెండు అంశాల ఆధారంగా డైనోసర్లు పక్షుల పూర్వీకులనే విషయాన్ని వీఆర్ ప్రసాద్ బృందం స్పష్టం చేసింది. డైనోసర్ల పరిణామక్రమంపై పరిశోధన ప్రథమంగా మన దేశంలో జరగటం, ఇందులో తెలుగు శాస్త్రవేత్త పాలుపంచుకోవటం విశేషం. -
ఈ ‘ప్రశ్నల’కు ఏదీ ‘జవాబు?’
సాక్షి, కాకినాడ : ఉన్న ఊళ్లో రూపాయికి దొరికే సరుకునే పొరుగూరు వెళ్లి అయిదుకో, పదికో కొనేవాడిని ఎవరైనా ఏమంటారు? ‘తెలివితక్కువ దద్దమ్మ’ అనో, ‘డబ్బు విలువ తెలియని దుబారా మనిషి’ అనో అంటారు. మరి, రూ.7.4 కోట్లతో అయ్యే ప్రక్రియకే రూ.43.2 కోట్లు వెచ్చించనున్న జేఎన్టీయూ కాకినాడకూ అవే మాటలు వర్తిస్తాయి. అయితే తక్కువ మొత్తంతో అయ్యే ప్రశ్నపత్రాల రూపకల్పన, జవాబుపత్రాల మూల్యాంకనల కోసం అయిదు రెట్లు అదనంగా ఖర్చు పెట్టడం వెనుక ఉన్నది కేవలం తింగరి తనమో, దుబారా తత్వమో కాదని, వర్సిటీ పెద్ద తలకాయ బంధువుకు చెందిన సంస్థకు మేలు కూర్చాలన్న దురాలోచనే ఇందుకు కారణమని ఆరోపణ వినిపిస్తోంది. అంతే కాక.. గతంలో వర్సిటీ పర్యవేక్షణలోనే జరిగిన ఆ ప్రక్రియను ఇప్పుడు ఒప్పందం పేరుతో ప్రైవేట్ సంస్థకు అప్పగించడం అంటే.. లక్షలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థుల భవిష్యత్తును వారి చేతుల్లో పెట్టడమేనని విద్యారంగ నిపుణులు అంటున్నారు. జేఎన్టీయూకే పరిధిలోని దాదాపు 270 కళాశాలల్లో సుమారు నాలుగు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి ఏడాదికి రెండు సెమిస్టర్ల చొప్పున పరీక్షలు జరుగుతుంటాయి. వాటికి అవసరమైన ప్రశ్న పత్రాల రూపకల్పన, జవాబు పత్రాల మూల్యాంకనం (వాల్యుయేషన్) ఇంత వరకు వర్సిటీ పర్యవేక్షణలోనే జరిగేది. దీని నిమిత్తం నాలుగేళ్లకు రూ.7.4 కోట్లను వర్సిటీ వెచ్చించేది. ఇప్పుడు ఈ ప్రక్రియను గ్లోబరెనా టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ (జీటీపీఎల్)కు కట్టబెడుతూ ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం వర్సిటీ పరిధిలో జరిగే పరీక్షల్లో ప్రశ్న పత్రాల తయారీ, జవాబు పత్రాల మూల్యాంకన బాధ్యతల్ని నాలుగేళ్ల పాటు జీటీపీఎల్, దానికి అనుబంధంగా పని చేసే మరో రెండు సంస్థలూ చేపడతాయి. దీని నిమిత్తం వర్సిటీ జీటీపీఎల్కు రూ.43.2 కోట్లు చెల్లిస్తుంది. అంతేకాదు..ఆ సంస్థ కేవలం ప్రశ్నపత్రాలను రూపొందించడం, జవాబు పత్రాల మూల్యాంకనం మాత్రమే చూస్తుంది. అందుకు అవసరమైన సాధన సంపత్తిని, మూల్యాంకన ప్రక్రియకు అవసరమైన వసతిని కూడా వర్సిటీయే సమకూర్చాల్సి ఉంటుంది. డిసెంబర్లో కొన్న స్టాంపు పేపర్పై నవంబర్లోనే ఒప్పందం.. వర్సిటీ తరఫున రిజిస్ట్రార్ జీవీఆర్ ప్రసాదరాజు, సంస్థ తరఫున జీటీపీఎల్ సీఈఓ వీఎస్ఎన్ రాజు, సాక్షులుగా వర్సిటీ డెరైక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ సీహెచ్ సాయిబాబా, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సీహెచ్ సత్యనారాయణ, సంస్థ తరఫున విజయ్ ఎన్.రావు, బీఎస్వీఎస్ రామచందర్ సంతకాలు చేసిన ఒప్పందాన్ని 2013 నవంబర్లో రిజిస్టర్ చేసినట్టు చెపుతున్నారు. వర్సిటీ నిర్వహణలో కేవలం రూ.7.4 కోట్లు మాత్రమే ఖర్చయిన ప్రక్రియకు సంబంధించి.. అంతకు అయిదు రెట్ల మొత్తానికి ఒప్పందం కుదుర్చుకోవడం వెనుక వర్సిటీలో అత్యున్నత బాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తి ప్రమేయం ఉందన్న ఆరోపణ వినిపిస్తోంది. ఆ వ్యక్తి సోదరుడు జీటీపీఎల్లో భాగస్వామి అని, అస్మదీయుని లబ్ధికే ఇలా వర్సిటీ పర్యవేక్షణలో తక్కువ వ్యయంతో పూర్తయ్యే ప్రక్రియను అతి ఎక్కువకు నిర్వర్తించేలా నష్టదాయక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని వర్సిటీ వర్గాలే అంటున్నాయి. ఈ ఒప్పందం వల్ల మునుముందు తమకు జీతాలు ఇవ్వడానికి వర్సిటీకి కష్టతరం కావచ్చని కొందరు ప్రొఫెసర్లు సాక్షితో అన్నారు. అంతేకాక .. వర్సిటీతో పాటు విద్యార్థుల జాతకం మొత్తాన్ని ప్రైవేట్పరం చేసే ఈ విధానాన్ని రాష్ట్రంలో మిగిలిన అన్ని వర్సిటీలూ వ్యతిరేకించాయంటున్నారు. కాగా జీటీపీఎల్ ఈ పాటికే మొదటి సెమిస్టర్ ఫలితాలు ఇచ్చేయాల్సి ఉండగా ఇంతవరకూ ఇవ్వలేక పోయిందని, చివరికి మే నెలాఖరుకు ఇస్తారన్న భరోసా కూడా లేదని అంటున్నారు. కాగా వర్సిటీ, జీటీపీఎల్ల మధ్య ఒప్పందం 2013 నవంబర్లో కుదిరినట్టు ఉండగా అందుకోసం ఉపయోగించిన స్టాంపు పేపర్ను డిసెంబర్లో కొనుగోలు చేసినట్టు రికార్డయింది. మరి, డిసెంబర్లో కొన్న పత్రంపై నవంబర్లోనే ఒప్పందం ఎలా సాధ్యం, అసలు ఏమి ఆశించి విద్యార్థుల భవిష్యత్తును ప్రైవేట్ సంస్థ చేతుల్లో పెట్టారు అన్న ప్రశ్నలకు వర్సిటీ పెద్దలే జవాబు చెప్పాలి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement