-
పాక్ ఎన్నికల్లో 26/11 సూత్రధారి స్థాపించిన పార్టీ
ఇస్లామాబాద్: 26/11 సూత్రధారి హఫీజ్ సయీద్ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ పాకిస్థాన్ మర్కాజీ ముస్లిం లీగ్ (PMML) పాకిస్థాన్లో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనుంది. పార్టీ తమ అభ్యర్థులను ఇప్పటికే ఎంపిక చేసినట్లు సమాచారం. హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ కూడా పోటీలో ఉన్నాడు. నేషనల్ అసెంబ్లీ నియోజకవర్గం NA-127 లాహోర్ నుంచి బరిలో నిలవనున్నట్లు తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద సంస్థగా గుర్తించిన లష్కరే తోయిబా (ఎల్ఈటీ) వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్. అనేక ఉగ్రవాద ఫైనాన్సింగ్ కేసుల్లో దోషిగా తేలడంతో 2019 నుంచి హఫీజ్ సయీద్ జైలులో ఉన్నాడు. సయీద్పై అమెరికా 10 మిలియన్ డాలర్ల బహుమతిని కూడా ప్రకటించింది. నిషేధిత జమాత్-ఉద్-దవా (JuD)లష్కరే తోయిబా (LeT)కు చెందిన సంస్థ. 2008 నాటి ముంబయి పేలుళ్లకు ఈ సంస్థే బాధ్యత వహిస్తుంది. ఈ సంస్థకు హఫీజ్ సయీద్ నాయకత్వం వహించాడు. పీఎంఎంఎల్ ఎన్నికల గుర్తు కుర్చీ. తమ పార్టీ జాతీయ, ప్రావిన్షియల్ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని పీఎంఎంఎల్ అధ్యక్షుడు ఖలీద్ మసూద్ సింధు ఒక వీడియో సందేశంలో తెలిపారు. అవినీతి కోసం కాకుండా ప్రజలకు సేవ చేయడమే ధ్యేయమని పేర్కొన్నారు. పాకిస్థాన్ను ఇస్లామిక్ సంక్షేమ రాజ్యంగా మార్చాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కాగా.. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్పై ఖలీద్ మసూద్ పోటీ చేయనున్నారు. ఫిబ్రవరి 8న పాకిస్థాన్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇదీ చదవండి: Year End 2023: ప్రపంచాన్ని వణికించిన భూకంపాలు ఇవే..! -
పాక్ ఎన్నికల్లో పోటీకి హఫీజ్ సయీద్ దూరం
లాహోర్: ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాత్ ఉద్ దవా నాయకుడు హఫీజ్ సయీద్ పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాడు. అయితే, జాతీయ, ప్రావిన్షియల్ అసెంబ్లీ సీట్లకు 200 మందికిపైగా తన మద్దతుదారులను బరిలోకి దించనున్నాడు. తన పార్టీకి ఎన్నికల కమిషన్ గుర్తింపునివ్వకపోవడంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా(ఎల్ఈటీ)కు అనుబంధ సంస్థ అయిన జమాత్ ఉద్ దవా(జేయూడీ) నాయకుడు హఫీజ్ మిల్లీ ముస్లిం లీగ్(ఎంఎంఎల్) పేరిట రాజకీయ పార్టీని స్థాపించాడు. కానీ, ఎంఎంఎల్కు ఎన్నికల కమిషన్ గుర్తింపునివ్వలేదు. దీంతో ఈసీ గుర్తింపు ఉన్న అల్లాహు అక్బర్ తెహ్రీక్(ఏఏటీ)తో ఎంఎంఎల్ జట్టు కట్టింది. సీట్ల పంపకంలో భాగంగా ఎంఎంఎల్ 200 మందికిపైగా అభ్యర్థులను రంగంలోకి దించనుంది. ఎంఎంఎల్ పార్టీలో చేరిన వారికి ఏఏటీ పార్టీ టికెట్లు ఇస్తామని చెప్పారు. -
సయీద్పై అమెరికా సూచన.. పాక్ వినేనా!
వాషింగ్టన్: ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ పాకిస్థాన్లో యథేచ్ఛగా తిరుగుతూ.. ఉపన్యాసాలు దంచడంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితి సయీద్ను ఉగ్రవాదిగా గుర్తించినప్పటికీ పాక్లో అతడు యథేచ్ఛగా తిరుగుతుండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి ఉగ్రవాద గ్రూపులు, మిలిటెంట్, తాలిబన్ గ్రూపులన్నింటినీ టార్గెట్ గా చేసుకొని వాటిని సమూలంగా నిర్మూలించాలని తాము పాకిస్థాన్కు చాలా స్పష్టంగా చెప్తూ వస్తున్నామని అమెరికా తెలిపింది. అమెరికా విదేశాంగ శాఖ ప్రెస్ కార్యాలయం డైరెక్టర్ ఎలిజబెత్ ట్రడూ గురువారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్లో హింసను ఖండించకపోవడం ద్వారా అమెరికా భారత్కు మరింత స్వేచ్ఛను ఇస్తున్నదని సయీద్ మీడియాతో పేర్కొన్న వ్యాఖ్యల నేపథ్యంలో పాక్లో అతడి స్వేచ్ఛాయుత కదలికలపై ట్రడూ ఆందోళన వ్యక్తం చేశారు. అతని కదలికలపై తాము చాలాసార్లు ఆందోళన వ్యక్తం చేసినా పాక్ పట్టించుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్లో శాంతియుత పరిష్కారం కోసం అన్నివర్గాల వారు కృషి చేసేందుకు తాము సహకరిస్తామని ఆయన పేర్కొన్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
త్వరలో మస్క్కు ముప్పు.. భారత్ సంతతి సీఈవో సంచలన వ్యాఖ్యలు
ఏపీ పోలింగ్పై సీఎం జగన్ ట్వీట్
టీ20 వరల్డ్కప్ 2024.. ఐసీసీ కీలక నిర్ణయం!? అలా అయితే కష్టమే
తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైఎస్ఆర్సీపీ నేతలపై రాళ్ల దాడి
నేనెవర్నీ విడగొట్టలేదు.. ఆ హీరోయిన్కు, నా భర్తకు ఆల్రెడీ బ్రేకప్!
పెళ్లిరోజే చెల్లెలి కొంపముంచిన ‘ఇన్స్టాగ్రామ్’ అన్నలు
అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
యోగా విషయంలో రాందేవ్ కృషి మంచిదే కానీ: సుప్రీంకోర్టు
మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
రెమో మళ్లీ వచ్చేస్తున్నాడు.. బుకింగ్స్ అదుర్స్!
తప్పక చదవండి
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- హోర్డింగ్ కూలి 14 మంది మృతి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
- వీడు మాములోడు కాదు.. 100 రోజులు, 200 విమానాలు కట్ చేస్తే..!
- మెడికల్ బోర్డు చీఫ్పై సుప్రీం ఆగ్రహం
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైళ్లు.. నేడు అదనపు ట్రిప్పులు
- మీ పిల్లలను సరైన క్రమంలో తీర్చిదిద్దాలంటే ఇలా చేయండి!
- తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
- ‘గాజాపై అణు బాంబు వేయనివ్వండి’
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement