-
మహిళలు, పిల్లలకు ‘భరోసా’: నాయిని
సాక్షి, హైదరాబాద్: విపత్కర పరిస్థితుల్లో ఉన్న మహిళలు, పిల్లలకు ‘భరోసా’ చేయూతనిస్తుందని రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని హాకా భవన్లో ఏర్పాటుచేసిన భరోసా కేంద్రాన్ని డీజీపీ అనురాగ్ శర్మతో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మహిళా భద్రత కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. వేధింపులకు గురవుతున్న స్త్రీలు, పిల్లల్లో మనోస్థైర్యం నింపడానికి నగర పోలీసులు ‘భరోసా’ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇది తొలి అడుగే..: అనురాగ్ శర్మ మహిళలకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించడంతో పాటు పోలీసు శాఖలోనూ మహిళా సిబ్బందిని పెంచాల్సిన అవసరముందని డీజీపీ అనురాగ్శర్మ అన్నారు. మహిళలకు ఆపన్న హస్తం అందించేందుకు ఏర్పాటుచేసిన ఏకీకృత కేంద్రం (వన్ స్టాప్ సెంటర్) ‘భరోసా’ తొలి అడుగేనని అన్నారు. ఇక్కడ పూర్తిస్థాయిలో విజయవంతమైతే ప్రతి జిల్లా ప్రధాన కార్యాలయంలో భరోసా కేంద్రాన్ని ఏర్పాటుచేస్తామని తెలిపారు. అంతేగాకుండా ప్రతి ఠాణాలో ఒక కౌన్సెలర్, లీగల్ అడ్వైజర్ ఉండాలనే ఆలోచన చేస్తున్నామని, వీరిని అవుట్ సోర్సింగ్ ద్వారా తీసుకురావాలని అనుకుంటున్నామని తెలిపారు. భరోసా కేంద్రంలో అడుగుపెట్టినప్పటి నుంచి బాధితులకు న్యాయం అందేంత వరకు తమ సహకారం ఉంటుందని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేది, మహిళా, శిశు సంక్షేమ కార్యదర్శి జగదీశ్వర్, హైదరాబాద్ నగర క్రైమ్స్ అండ్ సిట్ అదనపు పోలీసు కమిషనర్ స్వాతి లక్రా, తరుణి స్వచ్ఛంద సంస్థ స్థాపకురాలు మమతా రఘువీర్, నీలోఫర్ ఆస్పత్రి చిన్నపిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ లాలూప్రసాద్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. -
సిటీ ల్యాబ్స్ సిద్ధం! .
ఇక కేసుల దర్యాపు వేగవంతం సైబర్, నేరాల విశ్లేషణ కోసం వినియోగం సైబర్ ఠాణా, హాకా భవన్లో ఏర్పాటు సాక్షి, సిటీబ్యూరో: నేర స్థలాల్లో లభించే, నేరాలకు సంబంధించిన ఆధారాలను విశ్లేషించేందుకు లాబొరేటరీలు ఏర్పాటు చేస్తున్నారు. నగర కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి ఆలోచన మేరకు సిటీ ల్యాబ్స్ పేరుతో అందుబాటులోకి వస్తున్న వీటిని దర్యాప్తులు వేగవంతం చేయడం, ‘అనుమానాస్పదాలను’ గుర్తించడం కోసం వినియోగించనున్నారు. క్రైమ్ ల్యాబ్కు సంబంధించిన ఉపకరణాలు, సైబర్ ల్యాబ్కు అవసరమైన టూల్స్, సాఫ్ట్వేర్స్ ఖరీదు చేయడానికి టెండర్లు ఆహ్వానించారు. రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి ఇవి ప్రత్యామ్నాయం కావని అధికారులు స్పష్టం చేశారు. నకిలీ నోట్లు, బోగస్ ధ్రువీకరణలు, దొంగ సంతకాలు తదితరాలపై నిత్యం అనేక ఫిర్యాదులు వస్తుంటాయి. ఇతర విభాగాల కంటే సీసీఎస్కు వీటి తాకిడి ఎక్కువ. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా అనుమానాస్పద పత్రాలు (క్వశ్చన్డ్ డాక్యుమెంట్స్), సంతకాలను ఫోరెన్సిక్ లాబ్కు పంపి, వారి నివేదిక అందిన తరవాతే నిందితులపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటోంది. ఇది కాలయాపనతో కూడినది కావడంతో పాటు కొన్ని సందర్భాల్లో నిందితులు ‘ప్రత్యామ్నాయ మార్గాలు’ చూసుకోవడానికి, అజ్ఞాతంలోకి వెళ్లడానికీ అవకాశం ఏర్పడుతోంది. డ్రగ్ కేసుల్లో ‘వీగిపోయే’ ముప్పు... నగరంలో మాదకద్రవ్యాల వినియోగం గణనీయంగా పెరిగింది. ఇతర దేశాలు, రాష్ట్రాల వారితో పాటు స్థానికులూ వివిధ రకాలైన డ్రగ్స్తో పట్టుబడుతున్నారు. చెరస్, గంజాయి వంటి కొన్నింటిని తప్ప మిగతా వాటిని చూసి గుర్తించడం పోలీసులకు సాధ్యం కాదు. ఆ సందర్భంలో నిందితులు చెప్పిన దానిపై ఆధారపడాల్సి వస్తోంది. దీనికి పరిష్కారంగా గతంలో నగర పోలీసు విభాగం స్పాట్ టెస్టింగ్ కిట్స్ ఖరీదు చేసినా ఆశించిన స్థాయిలో ఫలితాలు లేవు. కొన్ని రకాలైన మాదకద్రవ్యాలు ఏమిటో తెలుసుకోవడానికీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఫోరెన్సిక్ ల్యాబ్లపై ఆధారపడటంతో జాప్యం జరుగుతోంది. మాదకద్రవ్యాల నియంత్రణ చట్టం ప్రకారం నమోదు చేసే ఈ కేసుల్లో ఎలాంటి పొరపాట్లకూ ఆస్కారం ఉండకూడదు. పట్టుబడినప్పు పోలీసులు రాసిన వివరాలు, ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఉన్న అంశాల మధ్య ఏమాత్రం వ్యత్యాసం కనిపించినా కోర్టుల్లో కేసులు వీగిపోయే ప్రమాదం ఉంది. ఆదమరిస్తే ‘సైబర్ క్రాష్’... ఇటీవల సిటీలో పెరిగిపోతున్న సైబర్ నేరాలు దర్యాప్తు అధికారులకు కొత్త సవాళ్లు విసురుతున్నాయి. ఫిర్యాదు అందినప్పటి నుంచీ కేసు దర్యాప్తులో అడుగడుగునా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆన్లైన్, సోషల్ మీడియాలతో పాటు పెన్డ్రైవ్స్, హార్డ్డిస్క్లు తదితరాలనూ విశ్లేషిస్తారు. వీటిలో లభించిన ఆధారాలను బట్టే నిందితుల్ని గుర్తించడం, కేసు తీవ్రతను తెలుసుకోవడం సాధ్యమవుతాయి. కొన్ని సందర్భాల్లో పాక్షికంగా దెబ్బతిన్న సీడీలు, డీవీడీలతో పాటు ఇతరాల నుంచీ సమాచారం సంగ్రహించాల్సి ఉంటుంది. సెల్ఫోన్లు, ఈ-మెయిల్స్ నుంచి డిలీట్ చేసిన డేటాను సేకరించాలి. వీటిలో ఏమాత్రం పొరపాటు జరిగినా... సాంకేతిక ఆధారాలు నాశనమై దర్యాప్తుకే ఆటంకం కలుగుతుంది. రెండూ రెండు చోట్ల ఏర్పాటు... ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా సిటీ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నారు. సైబర్ ల్యాబ్ను సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో, క్రైమ్ ల్యాబ్ను సీసీఎస్ సమీపంలోని హాకా భవన్లో అద్దెకు తీసుకున్న ప్రాంతంలో రూపుదిద్దుకుంటున్నాయి. నగర అదనపు పోలీసు కమిషనర్ (నేరాలు) నేతృత్వంలో ఇవి పని చేస్తాయి. వీటిలో వినియోగించే పరికరాలు, సాఫ్ట్వేర్స్ ఖరీదు చేయడానికి టెండర్లు పిలిచారు. ఈ ల్యాబ్స్లో పని చేయడానికి నగర పోలీసు విభాగంలోని సిబ్బందినే ఎంపిక చేసి, అవసరమైన శిక్షణ ఇప్పించనున్నారు. ఈ ల్యాబ్స్ ఆధారాల స్వరూపం చెడిపోకుండా విశ్లేషించి, దర్యాప్తును వేగవంతం చేయడానికి ఉపకరించనున్నాయి. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలతో వీటికి సంబంధం లేదని, న్యాయస్థానంలో అవి కచ్చితమని అధికారులు తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement