-
రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు చిత్రం
పెళ్లి తర్వాత డిఫరెంట్ కాన్సెప్టులకే ఓటేస్తోంది హన్సిక. అలా ఆమె ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్, హారర్ మూవీ 105 మినిట్స్. రాజు దుస్సా దర్శకత్వం వహించిన ఈ సినిమాను బొమ్మక్ శివ నిర్మించారు. ఈ మూవీ అంతా హన్సిక పాత్ర ఒక్కటే ఉండటం విశేషం. ఇందులో 34 నిమిషాల షాట్ను సింగిల్ టేక్లో పూర్తి చేసింది. అలా ఎన్నో పెద్ద సన్నివేశాల్లో కట్ చెప్పకుండా అలవోకగా నటించేసింది. రెండు నెలల తర్వాత ఓటీటీలో ఈ హారర్ మూవీ జనవరి 26న థియేటర్లలో విడుదలవగా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. రెండు నెలల తర్వాత 105 మినిట్స్ ఓటీటీలోకి వచ్చేసింది. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్లో రిలీజైంది. కాకపోతే రెంట్ పద్ధతిలో అందుబాటులో ఉంది. వంద రూపాయలు కడితేనే ఈ సినిమా చూడొచ్చని కండీషన్ పెట్టింది. కథేంటంటే.. జాను (హన్సిక) కారులో ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుంది. మార్గమధ్యంలో ఓ అదృశ్య శక్తి తనను వెంటాడుతున్నట్లు అనిపిస్తుంది. భయంగా ఇంటికి చేరగానే భారీ వర్షం కారణంగా కరెంట్ పోతుంది. కొవ్వొత్తి వెలిగించగానే ఏవేవో భయంకర శబ్దాలు వస్తుంటాయి. తనను వెంటాడిన శక్తి.. ఇంట్లోకి వచ్చి జానును ఇనుప గొలుసుతో బంధించి చిత్రహింసలు పెడుతుంది. తన మరణానికి నువ్వే కారణమంటూ.. అందుకే అనుభవించంటూ మేల్ వాయిస్తో భయపెడుతుంది. ఆ అదృశ్య శక్తి మరణానికి, జానుకు సంబంధం ఏంటి? ఆ శక్తి నుంచి జాను తప్పించుకుందా? లేదా? అనేది తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే! చదవండి: చిరంజీవి, మోహన్బాబు మధ్య గొడవ.. వాళ్లకు ఎప్పుడూ అదే పని.. -
స్మశానంలో షూటింగ్.. హన్సిక హారర్ మూవీ రిలీజ్
వివాహానంతరం కథానాయకిగా బిజీగా ఉన్న కొద్దిమంది నటీమణుల్లో హన్సిక ఒకరు. ఈ బహుభాషా నటి యాక్ట్ చేసిన చిత్రాలు వరుసగా తెరపైకి వస్తున్నాయి. అలా తాజాగా హన్సిక నటించిన చిత్రం గార్డియన్. హారర్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీలో హన్సిక ఒక అందమైన యువతిగా, దెయ్యంగా ద్విపాత్రాభినయం చేసింది. ఫిలిం వర్క్స్ పతాకంపై విజయ్చందర్ నిర్మించిన ఈ చిత్రానికి దర్శక ద్వయం శబరి, గురుశరవణన్ దర్శకత్వం వహించారు. శ్యామ్ సీఎస్ సంగీతాన్ని, కేఏ.శక్తివేల్ చాయాగ్రహణం అందించారు. ఈ మూవీ శుక్రవారం (మార్చి 8న) తెరపైకి వచ్చింది. అరణ్మణై 1, 2 చిత్రాల తరువాత హన్సిక నటించిన హారర్ మూవీ ఇది. హన్సిక తన అనుభవం గురించి మాట్లాడుతూ.. గార్డియన్ చిత్రంలో నటించడం సరికొత్త అనుభవంగా పేర్కొంది. ఈ చిత్రంలో దెయ్యం పాత్ర కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టి నటించినట్లు చెప్పింది. ఈ పాత్ర గెటప్ ప్రత్యేకంగా ఉంటుందని తెలిపింది. ఇందుకోసం స్పెషల్ లెన్స్ పెట్టినట్లు వెల్లడించింది. చిత్రంలోని కొన్ని సన్నివేశాలను స్మశానంలో అర్ధరాత్రి 12 గంటలకు చిత్రీకరించారని, అదీ తలకిందులుగా వేలాడుతూ దెయ్యంగా అరిచే సన్నివేశాల్లో నటించడం సవాలుగా మారిందని తెలిపింది ఆ సమయంలో దెయ్యం గెటప్లో ఉన్న తనను చూసి తానే భయపడ్డానని హన్సిక చెప్పుకొచ్చింది. వివాహానంతరం నటించడంలో తనకెలాంటి వ్యత్యాసం అనిపించడం లేదని హన్సిక పేర్కొన్నారు. తన తల్లి, భర్త చాలా మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు. తర్వాత తాను నటిస్తున్న గాంధారి, ది మెన్ చిత్రాలు వరుసగా విడుదల కానున్నాయంది. -
హన్సిక హారర్ మూవీ.. సమ్మర్లో రిలీజ్!
గ్లామర్కు కేరాఫ్ అడ్రస్.. హన్సిక. ఆమె ఇప్పుడు గాంధారిగా మారి తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఆర్. కన్నన్ స్వీయ దర్శకత్వం వహించడంతోపాటు మసాలా పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈయన దర్శకత్వంలో, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన ది గ్రేట్ ఇండియన్ కిచెన్ చిత్రం విశేష ఆదరణ పొందింది. అదేవిధంగా ఇంతకు ముందు జయం కొండాన్, కండెన్ కాదలై, సేటై, ఈవెన్ తందిరన్, బిస్కోత్ వంటి పలు వైవిధ్యమైన కథా చిత్రాలను తెరకెక్కించారు. తాజాగా గాంధారి పేరుతో చిత్రాన్ని చేస్తున్నారు. ఇది ఆయన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా కమర్షియల్ అంశాలతో కూడిన హారర్ నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుందని తాజాగా ఆయన వెల్లడించారు. ఇందులో పురావస్తు శాఖ అధికారిగా పనిచేసే యువతిగా హన్సిక నటిస్తున్నారని తెలిపారు. పురాతన కాలంలో ఓ రాజు నిర్మించిన గాంధర్వ కోటను పరిశోధించడానికి వెళ్లగా, అక్కడ ఆమెకు పలు ఆశ్చర్యకరమైన ఘటనలు ఎదురవుతాయన్నారు. ఇందులో హన్సిక పురావస్తు శాఖ అధికారిగా, ఓ ప్రాచీన తెగకు చెందిన యువతిగా దిపాత్రాభినయం చేస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రం కోసం చైన్నె సముద్ర తీరంలో రూ.60 లక్షల వ్యయంతో బ్రహ్మాండమైన కొండ ఇంటి సెట్ వేసి అందులో 1943 నాటి సన్నివేశాలను చిత్రీకరించినట్లు చెప్పారు. ఇందులో మెట్రో శిరీష్, మయిల్ సామి, తలైవాసల్ విజయ్, ఆడుగళం నరేన్, స్టంట్ సిల్వ, వినోదిని, పవన్ కుడివేలు మురుగన్, కలైరాణి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. చిత్రాన్ని సమ్మర్ స్పెషల్గా ఏప్రిల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆర్.కన్నన్ చెప్పారు. చదవండి: త్రిష,చిరంజీవి కేసు విషయంలో మన్సూర్ అలీఖాన్కు ఊరట -
ఈ ఫోటోతో వివాదంలో చిక్కుకున్న టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?
అల్లు అర్జున్ దేశముదురు సినిమాతో తెలుగు సినిమాలకు ఎంట్రీ ఇచ్చిన హన్సిక.. యూత్ గుండెల్లో చెరగిపోని ముద్రే వేసింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. దీంతో ఎడా పెడా సినిమాలు చేయడం అవి పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో పూర్తిగా అవకాశాలు తగ్గాయి. ఈ మధ్యే మై నేమ్ ఈజ్ శృతి,105 మినిట్స్ సినిమాలతో మళ్లీ తెరపైకి కనిపించింది ఈ బ్యూటీ. తాజాగా హన్సిక చైల్డ్వుడ్ ఫోటో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. ముంబయికి చెందిన హన్సిక పలు హిందీ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. 2003లో రిలీజైన హృతిక్ రోషన్ 'కోయి మిల్ గయా'లో యాక్ట్ చేసింది. ఆ సమయంలోని ఫోటో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. కానీ ఈ ఫోటో వల్ల ఆమె కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంది. 2003లో చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్న హన్సిక కేవలం నాలుగేళ్ల గ్యాప్లో అంటే 2007లో దేశముదురు చిత్రంతో హీరోయిన్ అయిపోయింది. నాలుగేళ్ల గ్యాప్లో హన్సిక మార్పు చూసి, త్వరగా ఎదిగేందుకు ఆమె ఇంజెక్షన్స్ తీసుకుందని కొందరు కామెంట్స్ చేశారు. కానీ ఆ రూమర్స్ను ఆమె కొట్టిపారేసింది. కానీ తన అమ్మగారు చాలా బాధపడినట్లు ఆమె చెప్పుకొచ్చింది. దాదాపు 20 ఏళ్లుగా సినిమాలు చేస్తున్న హన్సిక రెండేళ్ల క్రితం ఓ బిజినెస్మ్యాన్ని పెళ్లి చేసుకొని లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. -
105 Minutes Movie Review: ‘105 మినిట్స్’ మూవీ రివ్యూ
టైటిల్: 105 మినిట్స్ నటీనటులు:హన్సిక నిర్మాత: బొమ్మక్ శివ దర్శకుడు: రాజుదుస్సా సంగీతం: సామ్ సి. ఎస్ సినిమాటోగ్రఫీ : కిషోర్ బోయిదాపు విడుదల తేది: జనవరి 26, 2024 కథేంటంటే.. ఒకే పాత్ర చుట్టూ తిరిగే కథ ఇది. జాను(హన్సిక) కారులో ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరుతుంది. మార్గ మధ్యలో ఓ అదృశ్య శక్తి తనను వెంటాడుతున్నట్లు కనిపిస్తుంది. దీంతో ఆందోళన చెందిన జాను..భయం భయంతో ఇంట్లోకి వెళ్తుంది. భారీ వర్షం కారణంగా ఇంట్లో కరెంట్ పోతుంది. కొవ్వొత్తి వెలిగించగానే కొన్ని భయానక శబ్దాలు వస్తుంటాయి. తనను వెంటాడిన అదృశ్య శక్తి .. ఇంట్లోకి వచ్చి ఇనుప గొలుసుతో జానును బంధించి చిత్ర హింసలు పెడుతుంది.మేల్ వాయిస్లో మధ్య మధ్యలో తన మరణానికి నువ్వే కారణమంటూ.. అందుకే ఇదంతా అనుభవించాలంటూ భయపెడతుంది. ఇంట్లో నుంచి పారిపోయేందుకు జాను ప్రయత్నించినా.. ఆ అదృశ్య శక్తి బయటకు పోనివ్వదు. మరి జాను ఆ అదృశ్య శక్తి నుంచి ఎలా బయటపడుతుంది? ఆ మేల్ వాయిస్ ఎవరిది? తన మరణానికి జాను ఏ విధంగా కారణమైంది? చివరకు ఏం జరిగింది అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఒక సినిమా తీయాలంటే నటీనటులు ఎంతో కీలకం. చాలా పాత్రలు ఉంటాయి. ప్రతి పాత్రకు డైలాగ్స్ ఉండాలి. పాటలు, కామెడీ ఇవన్నీ ఉండాలి. కానీ అలాంటివేమీ లేకుండా సింగిల్ క్యారెక్టర్తో సినిమా తీయడం అంటే కత్తిమీద సామే అని చెప్పాలి. మరీ ముఖ్యంగా ఇలాంటి సినిమాను తీయాలంటే దర్శకుడికి చాలా ధైర్యం ఉండాలి. అలాంటిదీ చేసి చూపించారు దర్శకుడు రాజుదుస్సా. ఇలాంటి ప్రయోగం చేసిన దర్శక నిర్మాతలను అభినందించాల్సిందే. అయితే ఒక్క క్యారెక్టర్తో రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడిని థియేటర్లో కూర్చోబెట్టాలంటే.. బలమైన కథ, ఆసక్తికరమైన సన్నివేశాలు ఉండాలి. లేదంటే ప్రేక్షకుడు ఒక్క పాత్రనే చూస్తూ కుర్చిలో కూర్చోలేడు. 105 మినిట్స్లో అది మిస్సయింది. కాన్సెప్ట్ బాగున్నా.. దాన్ని తెరపై ఆసక్తికరంగా చూపించడంలో దర్శకుడు తడబడ్డాడు. ఒక కనిపించని మనిషి పంచభూతాలని గుప్పెట్లో పెట్టుకొని అమ్మాయిని ఏడిపించే ఆటే ఈ సినిమా కథ. చాలా ఆసక్తికరంగా కథను ప్రారంభించాడు దర్శకుడు. భారీ వర్షం.. ఉరుములు మెరుపులు.. కారులో హీరోయిన్.. సడెన్గా ఓ అదృశ్య శక్తి ప్రత్యేక్షం అవ్వడం.. ఇలాంటి భయపెట్టే సన్నివేశాలన్నీ ప్రారంభంలోనే చూపించాడు. హీరోయిన్ ఇంట్లోకి వెళ్లిన తర్వాత కథ ముందుకు సాగదు. జాను కాళ్లకు కట్టిన సంకెళ్లను విడిపించేందుకు ప్రయత్నించడం.. అదృశ్య శక్తి దాన్ని అడ్డుకోవడం.. ఇంటర్వెల్ వరకు ఇదే సీన్ రిపీట్ అవుతుంటుంది. సినిమా మొత్తం హీరోయిన్ ఏడుస్తూనే ఉంటుంది. ప్రతిసారి ఆత్మ బెదిరించడం.. హీరోయిన్ అక్కడ నుంచి వేరే చోటుకి మారిపోవడం ఇదే జరుగుతుంది. అసలు ఆ ఆత్మ ఎందుకు జానుని వేధిస్తుందో అనేది కూడా బలంగా చూపించలేకపోయారు. క్లైమాక్స్ కూడా ఆసక్తికరంగా ఉండడు. హన్సిక ఇంట్లో ఎందుకు ఇరుక్కుంది? ఆ ఆత్మ నేపథ్యం ఏంటి అనేది క్లారిటీగా చూపిస్తే బాగుండేది. చివర్లో ఒక్క డైలాగ్తో ప్రేక్షకుడే కథను అర్థం చేసుకునేలా చేశారు. సింగిల్ షాట్ మూవీ కాబట్టి ఇతర పాత్రలు, ఎలిమెంట్స్ తీసుకొచ్చే అవకాశం ఉండడు. ఉన్న ఒక్క పాత్ర చుట్టు అయినా ఆసక్తికరమైన సన్నివేశాలు రాస్తే బాగుండేది. కానీ పలు సవాళ్ల మధ్య ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రయోగం అయితే బాగుంది కానీ..అది మాత్ర పూర్తిగా ఫలించలేదనే చెప్పాలి. ఎవరెలా చేశారంటే.. జాను పాత్రకు హన్సిక పూర్తి న్యాయం చేసింది. ఆమెకు ఇది ఒక డిఫరెంట్ మూవీ. తొలిసారి ఇలాంటి క్యారెక్టర్ చేసి మెప్పించింది. అయితే అయితే కథలో బలం లేనప్పుడు నటీనటులు ఎంత చక్కటి నటనను కనబర్చిన అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. సాకేంతిక పరంగా సినిమా బాగుంది. సామ్ సి. ఎస్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. కథలో బలం లేకున్నా.. తనదైన బీజీఎంతో కొన్ని చోట్ల భయపెట్టాడు. సినిమాటోగ్రపీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement