-
మొక్కలంటే వ్యసనం.. ఓ ప్రకృతి ప్రేమికుడి కథ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన హరినాథ్ గత పదేళ్లుగా మొక్కల పెంపకమే లోకంగా బతుకుతున్నాడు. ఉదయాన్నే ఇంటి నుంచి వెళ్లి రోడ్లు, అడవులవెంట తిరుగుతూ విత్తనాలు చల్లడమే ఆయన పని. ఆరు పదుల వయసులో అలుపెరగకుండా అడవుల పెంపకమే లక్ష్యంగా శ్రమిస్తున్న ఆయన ఈ పనికి దిగడం వెనుక ఆసక్తికరమైన కథ దాగుంది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం హరినాథ్ తల్లిదండ్రులు కష్టపడటంతో పాల్వంచ సమీపాన జగన్నాథపురంలో ఆ కుటుంబానికి 1970వ దశకంలో 50 ఎకరాలకు పైగా భూమి సొంతమైంది. చదువు కోసం పాల్వంచలోని కేటీపీఎస్ స్కూల్కు రోజూ నడిచి వెళ్లే హరినాథ్ ఆకాశం కనిపించకుండా పెరిగిన చెట్లు, వాటి మధ్యన తిరిగే పక్షులు, పాములు, వన్యప్రాణులను చూస్తుండేవాడు. అయితే హరినాథ్ ఎస్సెస్సీ, ఇంటర్ పూర్తి చేసి డిగ్రీలోకి అడుగుపెట్టగానే విలాసాలు దరిచేరాయి. చదువు పూర్తయి కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్)లో ఉద్యోగిగా పనిచేసిన ఆయన జూదం, తాగుడులాంటి వ్యసనాల్లో చిక్కుకుపోయారు. యాభై ఏళ్లు దాటినా బయటపడలేకపోయారు. దీంతో భూమి హరించుకుపోగా రూ.30 లక్షల అప్పు మిగిలింది. వనజీవి రామయ్య స్ఫూర్తితో.. కేటీపీఎస్ ఉద్యోగిగా కెరీర్ చివరి దశలో ఉన్నప్పుడు 2013లో విలాసాలు, వ్యసనాలపై వైరాగ్యం ఏర్పడింది. దీంతో ఏం చేయాలో తెలియని స్థితికి చేరుకోగా టీవీలో పద్మశ్రీ వనజీవి రామయ్య జీవితంపై వచ్చిన కథనం హరినాథ్ను ఆకట్టుకుంది. దట్టమైన అడవి మీదుగా స్కూల్కు వెళ్లిన రోజులు గుర్తుకురాగా.. ప్రస్తుతం పాల్వంచ – కొత్తగూడెం పరిసర ప్రాంతాలు కాంక్రీట్ జంగిల్గా మారడం కళ్లెదుట కనిపించింది. దీంతో వనజీవి మార్గంలో నడవాలనే నిర్ణయానికి రాగా, కొత్తగూడెంకు చెందిన మొక్కల వెంకటయ్య తదితరులు పరిచయమయ్యారు. అలా పదేళ్లుగా పాల్వంచ – కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో పచ్చదనం పెంపే లక్ష్యంగా హరినాథ్ గడుపుతున్నాడు. మొక్కల పెంపకమే లక్ష్యంగా... ఏటా మార్చి నుంచి జూన్ వరకు 40 రకాల చెట్ల విత్తనాలను సేకరిస్తాడు. ఆ విత్తనాలను జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అడవుల్లో చల్లుతాడు. పాల్వంచ, కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, టేకులపల్లి, సుజాతనగర్ మండలాల పరి ధి రోడ్లు, అడవులు, కార్యాలయాలు.. ఖాళీ స్థలం కనిపి స్తే చాలు ఔషధాలు, పండ్లు, నీడనిచ్చే నలభై రకాల మొ క్కల విత్తనాలు చల్లుతున్నాడు. పండ్లను కోతులు, పక్షు లు తింటున్నప్పుడు కలిగే సంతోషం తనకు జీవితంలో ఎప్పుడూ కలగలేదని హరినాథ్ చెబుతుంటాడు. 2016 లో ఉద్యోగ విరమణ చేశాక వచ్చే పెన్షన్ నుంచే మొక్కల పెంపకానికి ఖర్చు భరిస్తున్నాడు. పదేళ్ల క్రితం హరినాథ్ మొలుపెట్టిన పయనానికి ఇప్పుడు మరో ఇరవై మంది సాయంగా ఉంటున్నారు. మరో ఏడు జిల్లాల నుంచి వనప్రేమికులు విత్తనాలు తీసుకెళ్తుంటారు. మొక్కలపై అవగాహన పెంచండి పదేళ్లుగా లక్షలకొద్దీ విత్తనాలు చల్లుతున్నాను. పశువుల కాపర్ల అత్యుత్సాహంతో చెట్లు చనిపోతున్నాయి. మొక్కల సంరక్షణపై పశువుల కాపర్లకు అవగాహన కలి్పస్తే మంచిది. నాకు ముగ్గురు ఆడపిల్లలు. నేను వ్యసనాల్లో మునిగిపోయినప్పుడు వాళ్ల బాగోగులు మా ఆవిడే చూసు కుంది. వ్యసనాల నుంచి బయటకు వచ్చాక ప్రకృతి రక్ష ణ, అడవుల పెంప కంపై ధ్యాస పె ట్టా. నా సహకారం లేకున్నా ముగ్గురు పిల్లలు చదువు పూ ర్తి చేసి అమెరికాలో స్థిరపడ్డారు. ఇది ప్రకృతి నాకు తిరిగి ఇచ్చిన బహుమతిగా భావిస్తున్నా. –హరినాథ్ -
మనోధర్మం కోసమే సినిమాలు
‘‘వృత్తిధర్మం కోసం డాక్టర్గా చేస్తున్నాను. మనోధర్మం కోసం సినిమాల్లో నటిస్తున్నాను. కేవలం డబ్బు వల్లే అన్ని విషయాలూ సాధించలేం’’ అని దర్శక–నిర్మాత హరినాథ్ పొలిచర్ల అన్నారు. ఆయన టైటిల్ రోల్లో రూపొందిన చిత్రం ‘కెప్టెన్ రాణాప్రతాప్’. హరినాథ్ స్వీయదర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా హరినాథ్ చెప్పిన విశేషాలు. ► మిలిటరీ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా ఉంటుంది. రానా ప్రతాప్ పాత్రలో నేను నటించాను. ఓ కోవర్టు అపరేషన్ కోసం రానా ప్రతాప్ పాకిస్తాన్ వెళ్తాడు. అక్కడికి వెళ్లి రానా ప్రతాప్ ఆ ఆపరేషన్ను ఎలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారన్నదే కథ. మా సినిమాకి, అభినందన్ వర్తమాన్ (భారతీయ సైనికుడు) సంఘటనకూ సంబంధం లేదు. రెండేళ్ల క్రితమే ఈ కథ రాసుకున్నా. ► చిన్నతనం నుంచే నాకు నటనపై ఆసక్తి ఉంది. స్టేజ్ ఆర్టిస్ట్ని కూడా. సినిమాలు చేస్తూనే ఉన్నాను. ‘చంద్రహాస్’ సినిమా టైమ్లో నేను పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తానని... ఆ చిత్రదర్శకుడు శివదత్తా (ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి) గారు నాకు మంచి కాంప్లి్లమెంట్ కూడా ఇచ్చారు. ‘కెప్టెన్ రాణాప్రతాప్’ సినిమాకు హీరోగా నేనైతే న్యాయం చేయగలనని నాకు అనిపించింది. అందుకే నేనే నటించాను. నా విజన్ను స్క్రీన్పై చూపించడానికి సులువు అవుతుందని నేనే ఈ సినిమాకు దర్శకుడిగా మారాను. ఈ సినిమా రిలీజ్కు మైత్రీ మూవీ మేకర్స్ సహకరించింది. ► ఇందులో దాదాపు గంటకు పైగా యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. మార్షల్ ఆర్ట్స్లో నాకు ప్రవేశం ఉండటంతో యాక్షన్ సీక్వెన్స్ చేయడం నాకు ప్రాబ్లమ్ అనిపించలేదు. అలాగే ఈ సినిమాలో సైనికుల కుటుంబాల సమస్యలను కూడా ప్రస్తావించాం. మహిళా సాధికారిత అంశాన్ని కూడా టచ్ చేశాం. ఇందుకోసం కొందరి సైనికుల కుటుంబాలతో మాట్లాడటం జరిగింది. సుమన్గారు గ్రేట్ యాక్టర్ ఆయన ఈ సినిమాలో మేజర్గా నటించారు. ► ఈ సినిమా తర్వాత రజాకార్ల కాలంలో పోరాడిన ఓ కుటుంబం నేపథ్యంలో ఓ సినిమా చేయబోతున్నాను. ఇది పీరియాడికల్ మూవీ కాబట్టి నేను దర్శకత్వం వహించాలనుకోవడం లేదు. -
పేదరికాన్ని జయించి.. లక్ష్యాన్ని చేరుకుని..
పలమనేరు: అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు పేదరికం అడ్డుకాదని నిరూపించాడు ఓ గ్రామీణ యువకుడు. తల్లిదండ్రుల కష్టాలను చూసి కష్టపడి చదివి ఎస్ఐగా ఎంపికయ్యాడు. పలమనేరులోని పెద్దపంజాణి మండలం గోనుమాకులపల్లికి చెందిన వెంకటేష్, ముత్యాలమ్మల కుమారుడు తోటి హరినాథ్ గత ఏడాది ఎస్ఐగా ఎంపికయ్యాడు. అనంతపురంలోని పోలీసు శిక్షణకేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకుని రెండ్రోజుల క్రితం ఉపముఖ్యమంత్రి నుంచి నియామక పత్రం అందుకున్నారు. గురువారం గ్రామానికి చేరుకున్న అతనికి గ్రామస్తుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. హరినాథ్ మాట్లాడుతూ తాను ఈ స్థాయికి రావడానికి తన తల్లే కారణమన్నాడు. కూలిపనులు చేసి తనను చదివించిందన్నారు. ఆమె ఆశయాన్ని నిలబెట్టడమే ధ్యేయంగా తాను కష్టపడ్డానన్నారు. ప్రజలకు ఉత్తమ సేవలను అందించి బాధితులకు న్యాయం జరిగేలా కృషిచేస్తానని హరినాథ్ పేర్కొన్నాడు. -
బుల్లితెర పోలీస్
బెళుగుప్ప: బుల్లితెర సీరియల్స్, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తున్నాడు బెళుగుప్పకు చెందిన రాచర్ల హరినాథ్ గుప్తా. రైతు, ధాన్యం వ్యాపారి రాచర్ల కోటేశ్వరప్ప పెద్ద కుమారుడు హరినాథ్గుప్తా టీవీ సీరియల్స్లో ఎస్సై, కానిస్టేబుల్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. న్యాయవాది, ఎమ్మెల్యే తదితర పాత్రల్లోనూ తన అభినయాన్ని ప్రదర్శిస్తున్నాడు. హరినాథ్ గుప్తా తన మిత్ర బృందంతో కలిసి 1983లో గ్రామంలో ఒక వీధి నాటకం ప్రదర్శించారు. ఆ నాటకంలో ఎస్సైగా హరినాథ్ గుప్తా అభినయం అందరినీ ఆకట్టుకుంది. అప్పటి నుంచి నటనపై ఆసక్తి పెంచుకున్న ఆయన 2013లో హైదరాబాద్కు మకాం మార్చాడు. అక్కడ జరిగే అనేక ఆడిషన్స్లో పాల్గొన్నాడు. 2014లో తొలిసారిగా ‘ఈజీ మనీ’ అనే సినిమాలో కృష్ణభగవాన్, రాకెట్ రాఘవల కాంబినేషన్లో నటించే అవకాశం వచ్చింది. నటించిన సినిమాలు, సీరియళ్లు.. ఆడదేఆధారం, జాబిలమ్మ, మిస్సమ్మ, సౌభాగ్యవతి, కాంచనగంగ, స్వాతిచినుకులు, అగ్నిపూలు, శ్రావణ సమీరాలు, కెరటాలు తదితర 15 సీరియళ్లలో హరినాథ్గుప్తా నటించారు. వీటిలో కెరటాలు సీరియల్లో రాజుపాలెం ఎస్సై పాత్ర మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. పడ్డానండి ప్రేమలో మరి, ఊపిరి, శౌర్య, సింగం 123, భంభంబోలేనాథ్, వైరస్, మెంటల్ కృష్ణ తదితర సినిమాలలో నటించారు. ప్రస్తుతం విడుదల కానున్న ఆక్సిజన్, రూల్, కార్తీకా సినిమాలలోనూ నటించారు. రూల్ సినిమాలో ఎమ్మెల్యే పాత్ర పోషించారు. అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలి నటనారంగంలో అవకాశాలు రావడమే కష్టం. వచ్చిన ఎలాంటి అవకాశాన్నీ వదులుకోకుండా సద్వినియోగం చేసుకోవాలి. అనంత జిల్లా వాసిగా నటనా రంగంలో రాణిస్తున్నందుకు సంతోషంగా ఉంది. జిల్లా నుంచి మరింత మంది నటనా రంగంలోకి రావాలి. అలాంటివారికి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నా. – హరినాథ్గుప్తా -
రోడ్డు ప్రమాదంలో సద్గురు పైప్స్ ఎండీ మృతి
నల్లగొండ: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్న ఘటనలో సద్గురు పీవీసీ పైపుల ఎండీ హరినాథ్ గుప్తా(45) అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామం సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు కుటుంబ సభ్యులతో కలసి కారులో వెళ్తున్నారు. ఆ క్రమంలో కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో హరినాథ్ గుప్తా అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను నార్కెట్పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు.అలాగే మృతదేహన్ని స్వాధీనం చేసుకుని... పోస్ట్ మార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చే సి దర్యాప్తు చేస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement