-
6 కారులోనే మరో ఆరు ఏకగ్రీవం..'సిక్సర్'తో స్వీప్
సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్: స్థానిక సంస్థల కోటాలో ఎన్నికలు జరిగిన ఆరు శాసనమండలి స్థానాలను టీఆర్ఎస్ క్లీన్స్వీప్ చేసింది. మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో దండె విఠల్ (ఆదిలాబాద్), ఎల్.రమణ, టి.భానుప్రసాద్రావు (కరీంనగర్), తాతా మధు (ఖమ్మం), ఎంసీ కోటిరెడ్డి (నల్లగొండ), డాక్టర్ యాదవరెడ్డి (మెదక్) గెలుపొందారు. అన్నిచోట్ల కలిపి మొత్తంగా 5,035 ఓట్లు చెల్లుబాటుకాగా.. టీఆర్ఎస్ అభ్యర్థులకే 77.19శాతం ఓట్లు వచ్చాయి. ఉమ్మడి మెదక్, ఖమ్మంలలో కాంగ్రెస్ అభ్యర్థులు.. కరీంనగర్, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లో స్వతంత్ర అభ్యర్థులు ద్వితీయ స్థానంలో నిలిచారు. ఖమ్మం మినహా అన్నిచోట్లా ఇతర పార్టీల ఓటర్లు కూడా టీఆర్ఎస్కు ఓటేసినట్టు సంబంధిత జిల్లాల మంత్రులు ప్రకటించారు. ఖమ్మంలో మాత్రం టీఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి పడ్డాయి. దీనిపై అంతర్గతంగా సమీక్షిస్తామని, పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్సీగా గెలుపొందిన టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధు ప్రకటించారు. ఇదివరకే ఆరు ఏకగ్రీవం రాష్ట్రంలో జనవరి 4న ఖాళీకాబోయే 12 ‘స్థానిక’కోటా ఎమ్మెల్సీ స్థానాలకు గత నెల 16న నోటిఫికేషన్ వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటికే కల్వకుంట్ల కవిత (నిజామాబాద్), పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి (వరంగల్), శంభీపూర్ రాజు, పట్నం మహేందర్రెడ్డి (రంగారెడ్డి), కూచుకుళ్ల దామోదర్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి (మహబూబ్నగర్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా ఆరు సీట్లకు ఈ నెల 10న పోలింగ్ నిర్వహించగా.. మంగళవారం ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించారు. క్యాంపుల మధ్య! కాంగ్రెస్తోపాటు బలమైన స్వతంత్ర అభ్యర్థి బరిలో ఉన్న స్థానాలకు సంబంధించి టీఆర్ఎస్ క్యాంపులు నిర్వహించింది. నామినేషన్ల ప్రక్రియ ముగియగానే కరీంనగర్, మెదక్, ఖమ్మం స్థానాలకు చెందిన టీఆర్ఎస్ ఓటర్లను ఢిల్లీ, బెంగుళూరు, గోవాలలో క్యాంపులకు తరలించింది. ఇందులో మెదక్, ఖమ్మంలలో కాంగ్రెస్ అభ్యర్థులు రంగంలో ఉండగా.. కరీంనగర్లో టీఆర్ఎస్కు రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన మాజీ మేయర్ సర్దార్ రవీందర్సింగ్ బరిలో నిలిచారు. టీఆర్ఎస్ ఓటర్లను కాపాడుకోగలిగిందని.. ఆరుచోట్లా తొలి ప్రాధాన్యత ఓటుతో గెలవడం సంతృప్తికరమని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ♦ ఆదిలాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్ధి దండె విఠల్కు 742 ఓట్లు.. స్వతంత్ర అభ్యర్థి పుష్పరాణికి 75 ఓట్లు వచ్చాయి. ♦కరీంనగర్లో టీఆర్ఎస్ అభ్యర్థులు భానుప్రసాద్రావుకు 585 ఓట్లు, ఎల్.రమణకు 479 ఓట్లురాగా.. స్వతంత్ర అభ్యర్థి సర్దార్ రవీందర్సింగ్ 232 ఓట్లు సాధించారు. కరీంనగర్లో ఏకగ్రీవం కావాల్సి ఉన్నా కొందరు కడుపు మంట, అక్రమ పొత్తుతో ఎన్నికదాకా తెచ్చారని.. ఈటల రాజేందర్ పాచిక పారలేదని మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. అయితే ఈ స్థాయిలో ఓట్లు సాధించడం అంటే తాను నైతికంగా విజయం సాధించినట్టేనని రవీందర్సింగ్ చెప్పారు. ♦ మెదక్లో టీఆర్ఎస్ అభ్యర్థి యాదవరెడ్డికి 762 ఓట్లురాగా, కాంగ్రెస్ అభ్యర్థి నిర్మల జగ్గారెడ్డికి 238 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి మల్లారెడ్డికి ఆరు ఓట్లు పోలయ్యాయి. ♦ నల్లగొండలో టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డికి 917 ఓట్లు, రెండో స్థానంలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి కుడుదుల నగేశ్కు 226 ఓట్లు వచ్చాయి. ♦ ఖమ్మంలో టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుకు 480 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వర్రావుకు 242 ఓట్లు వచ్చాయి. ఇక్కడ టీఆర్ఎస్కు 530కిపైగా ఓట్లు ఉండగా.. 34 మంది ప్రజాప్రతినిధులున్న సీపీఐ మద్దతివ్వడంతో 564 ఓట్లకుపైగా వస్తాయని భావించారు. కానీ క్రాస్ ఓటింగ్ జరిగి.. 116 మంది స్థానిక ప్రజాప్రతినిధులున్న కాంగ్రెస్కు 242 ఓట్లు వచ్చాయి. ఇది తమ నైతిక విజయమని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ♦ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేసిన సుధారాణి (ఖమ్మం), ఇనుముల సత్యనారాయణ, రమేశ్, గంగాధర్ (కరీంనగర్) సైదులు (నల్లగొండ) ఒక్క ఓటు కూడా సాధించలేక పోయారు. తెలంగాణ భవన్లో సంబరాలు.. ‘స్థానిక’కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను టీఆర్ఎస్ క్లీన్స్వీప్ చేయడంతో మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో సంబరాలు జరుపుకొన్నారు. గులాబీ రంగు చల్లుకుని, బాణసంచా కాల్చి.. మిఠాయిలు పంచుకున్నారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, పలువురు నేతలు ఈ సంబరాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ విజయాల పరంపర కొనసాగుతోందని, కేసీఆర్ పథకాలే విజయాలకు కారణమని తలసాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రతిపక్షాల ఓట్లు కూడా టీఆర్ఎస్ అభ్యర్థులకు పడ్డాయని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. టీఆర్ఎస్కు తిరుగులేదని తేలింది: హరీశ్ ఎమ్మెల్సీలుగా గెలుపొందిన వారిని మంత్రులు, టీఆర్ఎస్ నేతలు అభినందించారు. ముఖ్యమంత్రి ఊహించిన విధంగానే ఎమ్మెల్సీ ఫలితాలు వచ్చాయని, కాంగ్రెస్ జిమ్మిక్కులు, ప్రలోభాలు పనిచేయలేదని మంత్రి హరీశ్రావు అన్నారు. టీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా మరోమారు రుజువైందని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. వీరితోపాటు మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, జగదీశ్రెడ్డి, పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీలు కవిత, గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యే జీవన్రెడ్డి తదితరులు ‘కొత్త ఎమ్మెల్సీ’లను అభినందించారు. -
మంత్రి హరీశ్కు మిషిగన్ వర్సిటీ ఆహ్వానం
‘మిషన్ కాకతీయ’పై ప్రసంగించాలని విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ-చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించేందుకు తమ విశ్వవిద్యాలయానికి రావాల్సిందిగా రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావును అమెరికాలోని మిషిగన్ యూనివర్సిటీ ఆహ్వానించింది. ఈ మేరకు వర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ నాచురల్ రిసోర్సెస్ అండ్ ఎన్విరాన్మెంట్ విభాగం మంత్రికి లేఖను పంపింది. ప్రభుత్వం చేపడుతున్న చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంపై అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో ఒకటైన మిషిగన్ వర్సిటీ విద్యార్థి బృందం తెలంగాణలో పరిశోధన చేస్తోంది. ఆగస్టులో వివిధ జిల్లాల్లో పర్యటించిన ఈ బృందం తమ ప్రాథమిక అధ్యయన నివేదికను వర్సిటీకి సమర్పించింది. నివేదికను ఆమోదించిన వర్సిటీ అధికారులు దీనిపై విస్తృత పరిశోధనకు 50 వేల డాలర్లను (సుమారు రూ. 30 లక్షలు) కేటాయించారు. -
టీ ప్రాజెక్టుల్ని మేమెందుకు అడ్డుకుంటాం?
హరీశ్రావుపై దేవినేని ధ్వజం విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపర్చిన విధంగానే గోదావరి, కృష్ణా నదులపై నూతన ప్రాజెక్టులకు ఆమోదం, నిర్మాణ పనులు నదీ నిర్వహణ మండళ్లు, కేంద్ర జల సంఘం సిఫార్సుల మేరకే జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంత్రి హరీశ్రావు ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టుల్ని అడ్డుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రూపంలో కుట్రలు పన్నుతున్నారని హరీశ్రావు ఆరోపించడం బాధ్యతా రాహిత్యమేనని దేవినేని ధ్వజమెత్తారు. -
గజ్వేల్లో నీటి ఎద్దడి నివారణకు రూ.100 కోట్లు
గజ్వేల్: గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలో మం చినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.100 కోట్లకుపైగా నిధులను మంజూరుచేయడానికి సిద్ధంగా ఉన్నారని నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్రావు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి గజ్వేల్ పట్టణంలోని మదీన మజీద్లో ముస్లింలకు ఇచ్చిన ఇఫ్తార్ విందుకు ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్రావు ప్రసంగిస్తూ మంచినీటి సమస్యకు సంబంధించి వార్డుల వారీగా సమగ్ర నివేదికను అందజేస్తే సీఎం నిధులు విడుదల చేయనున్నారని చెప్పారు. ముస్లిం సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ‘రంజాన్’ను రాష్ట్ర పండుగగా ప్రకటించడమే ఇందుకు నిదర్శమన్నారు. గజ్వేల్లో ముస్లిం సోదరులకు రూ.కోటితో మోడల్ షాదీఖాన నిర్మించి ఇస్తామని ప్రకటించారు. గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఇందుకోసమే గడా(గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) పనిచేస్తున్నదని వెల్లడించారు. అంతకుముందు హరీష్రావు.. మండలంలోని సింగాటం గ్రామంలో రూ.6 లక్షలతో నిర్మించతలపెట్టిన మహిళాశక్తి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ భవనానికి మరో రూ. 6 లక్షల మంజూరుచేయడానికి మంత్రి అంగీకరించారు. ఈ సందర్భంగా గ్రామంలో సబ్స్టేషన్ నిర్మాణం, చెక్ డ్యామ్ల నిర్మాణం కోసం చేసిన విజ్ఞాపనలపై సానుకూలంగా స్పందించారు. ఆ తర్వాత గజ్వేల్లోని సంగాపూర్ రోడ్డు పక్కన రూ.30 లక్షలతో నిర్మించతలపెట్టిన ఐసీడీఎస్ భవన నిర్మాణానికి శంకుస్థాపనచేశారు. అనంతరం హానీ అనాథ ఆశ్రమంలో బాలురు, బాలికల గదులను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్. సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, డీసీసీబీ మాజీ చైర్మన్ ఎలక్షన్రెడ్డి, మాజీ ఎంపీపీ పొన్నాల రఘుపతిరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డాక్టర్ వి.యాదవరెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి మడుపు భూంరెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్, నగర పంచాయతీ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాగా జోరుగా వర్షం కురుస్తున్నా మంత్రి హరీష్రావు కార్యక్రమాలన్నీ పూర్తి చేయడం గమనార్హం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హైదరాబాద్లో భారీగా భూమిని కొన్న మైక్రోసాఫ్ట్!
మరో మహిళతో రొమాన్స్.. చాలా ఎగ్జైట్ అయ్యానన్న సోనాక్షి
‘రైతుల భూ డాక్యుమెంట్లను బుగ్గిపాలు చేసింది బాబేగా!’
ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్
తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వరంగల్ను BRS, కాంగ్రెస్ బారి నుంచి కాపాడాలి: ప్రధాని మోదీ
కొవిషీల్డ్ వ్యాక్సిన్ను రద్దు చేసిన ఆస్ట్రాజెనెకా.. కారణం తెలుసా..
పేదవాడు జీవచ్ఛవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు
పవన్ను గెలిపించాలని చిరంజీవి ఎలా అడుగుతారు?: పోసాని
తప్పక చదవండి
- ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
- ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఓటేయవచ్చు!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ఎయిరిండియా సిబ్బంది సిక్ లీవ్.. 70కి పైగా విమానాలు రద్దు
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
- రెచ్చిపోయిన పచ్చ మూక.. హోం మంత్రి తానేటి వనితపై దాడికి యత్నం
Advertisement