-
దేశంలో నెం.1 ఐటీ కంపెనీ.. 19 ఏళ్లలో తొలిసారి ఇలా..
దేశంలో నంబర్ వన్ ఐటీ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో ఉద్యోగుల సంఖ్య తొలిసారి తగ్గింది. టీసీఎస్లో హెడ్కౌంట్ తగ్గడం కంపెనీ 2004లో లిస్ట్ అయినప్పటి నుంచి 19 ఏళ్లలో ఇదే మొదటిసారి అని కంపెనీ వెల్లడిందింది. హెడ్కౌంట్ అనేది ఒక నిర్దిష్ట వ్యవధిలో కంపెనీలో లేదా నిర్దిష్ట విభాగంలో పని చేసే సిబ్బంది సంఖ్యను సూచిస్తుంది. 202-24 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్య 13,249 తగ్గి మొత్తం సిబ్బంది సంఖ్య 6,01,546కి తగ్గిపోయిందని టీసీఎస్ ప్రకటించింది. ఇక కొత్త ఉద్యోగుల నికర చేరిక మొత్తం సంవత్సరానికి కేవలం 22,600 మాత్రమే. 2022 ఆర్థిక సంవత్సరం డేటాను పరిశీలిస్తే ఆ ఏడాది కంపెనీ 1.03 లక్షల మంది ఉద్యోగులు పెరిగారు. క్యూ 4లో కంపెనీ హెడ్కౌంట్ 1,759 తగ్గింది. టీసీఎస్లో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య 2023 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంతో పోలిస్తే 2024 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 5,680 తక్కువ. అలాగే రెండవ త్రైమాసికంలో కంపెనీలో మొత్తంంగా 6,333 మంది ఉద్యోగులు తగ్గారు. అయితే 2024 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ 523 మందిని అధికంగా నియమించుకుంది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 24 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో టీసీఎస్ లాభం 9 శాతం పెరిగి రూ. 12,434 కోట్లకు చేరుకుంది. మార్చి 31తో ముగిసిన మూడు నెలల కాలానికి దాని ఆదాయం కూడా 3.5 శాతం పెరిగి రూ. 61,237 కోట్లకు చేరుకుంది. కంపెనీ లాభం అంచనాలను అధిగమించినప్పటికీ, దాని ఆదాయం మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. మరోవైపు టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ 2024 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో అట్రీషన్ (రిటైరవడం, తొలగించడం లేదా మానేయడం ద్వారా కంపెనీని వీడటం) రేటులో 12.5 శాతం క్షీణతను నివేదించారు. రానున్న రోజుల్లో ఈ రేటు మరింత తగ్గుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. -
ఉద్యోగుల విషయంలో టీసీఎస్ తప్పు తెలుసుకుందా?
TCS plans to increase headcount : ఐటీ పరిశ్రమలో లేఆఫ్లు నిత్య కృత్యమైన ప్రస్తుత తరుణంలో చాలా కంపెనీలు నియామకాల జోలికే వెళ్లడం లేదు. ఈ క్రమంలో దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఆశ్చర్యకరమైన ప్రణాళికను బయటపెట్టింది. గతేడాది టీసీఎస్ సైతం గణనీయమైన తొలగింపులు చేపట్టింది. రానున్న రోజుల్లో మరిన్ని తొలగింపులు ఉంటాయని భావిస్తుండగా ఇందుకు విరుద్ధంగా తమ శ్రామిక శక్తిని పెంచుకోవాలనే ఉద్దేశాన్ని టీసీఎస్ ప్రకటించింది. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కేకే కృతివాసన్ నాస్కామ్ సెషన్లో టీసీఎస్ నియామకాల లక్ష్యాల గురించి మాట్లాడారు. రిక్రూట్మెంట్ ప్రయత్నాలను తగ్గించే ప్రణాళికలేవీ లేవని స్పష్టం చేశారు. కీలక మార్కెట్ల నుంచి డిమాండ్ మందగించడంతో సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాల నియామకాలు తగ్గుతాయని పరిశ్రమ నివేదికలు సూచిస్తున్న తరుణంలో ఇందుకు విరుద్ధంగా టీసీఎస్ నుంచి ఈ ప్రకటన వచ్చింది. ముఖ్యంగా 2023లో టీసీఎస్ వేలాది మంది ఉద్యోగులను తొలగించింది. లైవ్మింట్ నివేదిక ప్రకారం.. గత సంవత్సరంలో 10,818 మంది ఉద్యోగులను టీసీఎస్ తొలగించింది. నియామక ధోరణుల గురించి ఆందోళనలను ప్రస్తావిస్తూ.. " ఇప్పటికే ఆర్థిక వ్యవస్థలో కొన్ని సానుకూలతలు చూస్తున్నాం. మాకు మరింత మంది సిబ్బంది అవసరం ఉంది" అని కృతివాసన్ పేర్కొన్నారు. నియామక ప్రక్రియలో సర్దుబాట్లు చేసినప్పటికీ, రిక్రూట్మెంట్ కార్యక్రమాలలో ఎలాంటి తగ్గింపు ఉండదని సూచిస్తూ కంపెనీ నియామక ఎజెండా పట్ల టీసీఎస్ నిబద్ధతను ఆయన స్పష్టం చేశారు. 6 లక్షల మందికిపైగా ఉద్యోగులున్న టీసీఎస్.. మార్కెట్లో సవాళ్లు ప్రబలంగా ఉన్నప్పటికీ దాని మధ్యస్థ, దీర్ఘకాలిక అవకాశాల గురించి ఆశాజనకంగా ఉందని పీటీఐ నివేదించింది. ఇటీవలి త్రైమాసిక ఫలితాలలో టీసీఎస్ నికర లాభంలో 8.2 శాతం వృద్ధిని సాధించింది. టీసీఎస్ నియామక ప్రణాళికలతోపాటు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంపై కంపెనీ వైఖరిని సైతం కృతివాసన్ ప్రస్తావించారు. సంస్థాగత సంస్కృతి, విలువలను మెరుగుపరచడానికి రిమోట్ వర్క్ లేదా హైబ్రిడ్ మోడల్లు సరైనవి కాదన్నారు. వ్యక్తిగత సహకారం, అభ్యాసం ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. సహోద్యోగులను, సీనియర్లను గమనిస్తూ విలువైన పాఠాలు కార్యాలయ వాతావరణంలో ఉత్తమంగా నేర్చుకోవచ్చని సూచించారు. -
టీసీఎస్లో భారీగా తగ్గిన ఉద్యోగులు.. క్యాంపస్ నియామకాలు డౌటేనా?
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (TCS)లో ఉద్యోగుల సంఖ్య భారగా తగ్గింది. 2023 డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో అంటే మూడు నెలల్లో కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 5,680 పడిపోయిందని ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్’ నివేదించింది. టీసీఎస్లో హెడ్కౌంట్ తగ్గడం వరుసగా ఇది రెండో త్రైమాసికం. టీసీఎస్లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2023 జూన్ చివరి నాటికి 6.15 లక్షలు ఉండగా తాజా క్షీణతతో డిసెంబర్ చివరి నాటికి 6.03 లక్షలకు తగ్గింది. మరో ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ఎప్పటిలాగా కాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరంలో క్యాంపస్ నియామకాల లక్ష్యాన్ని సైతం కంపెనీ స్పష్టం చేయడం లేదు. బలవంతపు తొలగింపుల కంటే కూడా ఉద్యోగులు స్వచ్ఛందంగా కంపెనీని విడిచిపెట్టడం వల్లే హెడ్కౌంట్ తగ్గినట్లు భావిస్తున్నారు. కంపెనీ వదిలివెళ్లిన ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా నియామకాలు చేపట్టనప్పుడు కూడా హెడ్కౌంట్ తగ్గుతుంది. తాము మంచి సంఖ్యలోనే ఉద్యోగులను, ట్రైనీలను మార్కెట్ నుంచి నియమించుకున్నామని, నియామకం ఎల్లప్పుడూ అట్రిషన్కి అనుగుణంగా ఉండకపోవచ్చని టీసీఎస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, హెచ్ఆర్ గ్లోబల్ హెడ్ మిలింద్ లక్కడ్ చెబుతున్నారు. అయితే దీనిని ప్రతికూలంగా చూడవలసిన అవసరం లేదని ఆయన తెలిపారు. భవిష్యత్ త్రైమాసికాల్లోనూ ఇదే విధమైన క్షీణత కనిపించవచ్చని ఆయన హింట్ ఇచ్చారు. క్యాంపస్ నియామకాలు డౌటే! ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే లక్ష్యానికి టీసీఎస్ ఇప్పటికీ కట్టుబడి ఉందా అంటే మిలింద్ లక్కడ్ స్పష్టత ఇవ్వలేదు. 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మా వద్ద ఖచ్చితమైన సంఖ్య లేదు కానీ క్యాంపస్ నియామకాలలో ముందుంటామని లక్కడ్ చెప్పారు. నేర్చుకునే సామర్థ్యం, జిజ్ఞాస, ఆప్టిట్యూడ్, కోడింగ్ నైపుణ్యాలు ఉన్న విద్యార్థులకు అవకాశం ఉంటుందన్నారు. -
టీసీఎస్లో తగ్గిపోయిన ఉద్యోగులు! కారణం ఇదే..
దేశంలో ప్రముఖ ఐటీ సేవల సంస్థ టీసీఎస్ (TCS) లో గడిచిన సెప్టెంబర్ త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య (హెడ్కౌంట్) 6,333 పడిపోయింది. ఇది క్రితం సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే 7,186 తగ్గింది. ప్రస్తుతం టీసీఎస్లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,08,985. ఫ్రెషర్లపై దృష్టి దీనిపై కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ మాట్లాడుతూ కంపెనీ కొత్త టాలెంట్పై ఎక్కువగా ఖర్చు పెడుతోందని, దానికి తగిన ఫలితం లభిస్తోందని చెప్పారు. ‘కంపెనీలో అట్రిషన్ తగ్గుతున్నట్లు చూశాం. మా నియామకాల్లో కీలక మార్పులు చేస్తున్నాం. ఫలితంగా మా మొత్తం నియామకం ఈ త్రైమాసికంలో అట్రిషన్ కంటే తక్కువగా ఉంది. దీని అర్థం మానవ వనరుల కోసం ఖర్చు పెడుతున్నాం. కొంచెం ఆలస్యమైనా మా అన్ని జాబ్ ఆఫర్లను గౌరవిస్తూ ఫ్రెషర్ల ఆన్బోర్డ్ను కొనసాగిస్తాం’ అని పేర్కొన్నారు. కాగా జూన్ త్రైమాసికంలో ఐటీ అట్రిషన్ 17.8 శాతం నుంచి 14.9 శాతానికి తగ్గింది. (గూగుల్, యాపిల్పై సీసీఐ విచారణ.. నివేదిక రాగానే చర్యలు!) టీసీఎస్ తన వర్క్ఫోర్స్లో 70 శాతం మందికి 100 శాతం వేరియబుల్ పే అందిస్తోంది. మిగిలినవారికి మాత్రం పనితీరు ఆధారంగా చెల్లిస్తోంది. ఆఫీస్ పాలసీ గురించి.. “మేము గత మూడు సంవత్సరాలలో చాలా మందిని నియమించుకున్నాం. వారంతా చాలా కాలం పాటు హైబ్రిడ్ లేదా వర్చువల్ రిమోట్ (మోడ్)లో పని చేస్తున్నారు. కొత్త వర్క్ఫోర్స్ కంపెనీలో ఇప్పటికే ఉన్న విస్తృత వర్క్ఫోర్స్తో ఏకీకృతం కావడానికి వారంతా ఆఫీస్కు రావాలని గట్టిగా నమ్ముతున్నాం. కొత్తవారు టీసీఎస్ విలువలను అర్థం చేసుకుని నేర్చుకోవడానికి ఇది ఏకైక మార్గం” అని మిలింద్ లక్కడ్ చెప్పారు. దాదాపు 70 శాతం మంది ఉద్యోగులు ఇప్పటికే కార్యాలయాలకు రావడం ప్రారంభించారన్నారు. -
భారీగా ఉద్యోగులపై వేటు..ఇంటెల్ చరిత్రలోనే తొలిసారి!!
ప్రముఖ సెమీ కండక్టర్ తయారీ సంస్థ ఇంటెల్ ఊహించని నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా పర్సనల్ కంప్యూటర్ మార్కెట్ డిమాండ్ తగ్గడంతో ఆ సంస్థలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించనున్నట్లు తెలుస్తోంది. బ్లూం బెర్గ్ విడుదల చేసిన జులై రిపోర్ట్లో ఇంటెల్ మొత్తం ఉద్యోగులు 113,700 మంది పనిచేస్తున్నారు. అయితే తాజాగా పీసీ మార్కెట్లో నెలకొన్న ఒడిదుడుకుల కారణంగా ఇంటెల్ 20శాతం మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపనున్నట్లు, వారిలో సేల్స్, మార్కెటింగ్ బృంద సభ్యులున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. నో కామెంట్ ఉద్యోగుల తొలగింపుపై ఇంటెల్ నుంచి ఎలాంటి ప్రకటన రాకున్నా.. జులై నెలలో ఆ సంస్థ ప్రకటించిన సేల్స్ గణాంకాలే కారణమని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ దశాబ్ధ కాలంలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచ దేశాల ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తున్న ద్రవ్యోల్బణం, దీనికి తోడు కొనుగోలు సామర్ధ్యం తగ్గిపోవడం, స్కూల్స్ ఓపెన్ కావడం, ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి కార్యాలయాల నుంచి విధులు నిర్వహించడం వంటి ఇతర కారణాల వల్ల పీసీల వినియోగం తగ్గిపోయింది. చదవండి👉 'మీ పర్ఫార్మెన్స్ బాగలేదయ్యా'..ఉద్యోగులకు సుందర్ పిచాయ్ వార్నింగ్! చైనా- ఉక్రెయిన్ వార్ సెమీ కండక్టర్ల తయారీ సంస్థలకు కీలకమైన పర్సనల్ కంప్యూటర్ల మార్కెట్ చైనాలో కోవిడ్-19 ఆంక్షలు, ఉక్రెయిన్పై రష్యా యుద్ధం సప్లయి చైన్ సమస్యలు డిమాండ్పై ప్రభావంపై పడింది.అందుకే మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ఇంటెల్ కార్యకలాపాల్ని కొనసాగించాలని భావిస్తోంది. కాబట్టే ఉద్యోగుల్ని తొలగించడంపై దృష్టిసారించినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. చదవండి👉 బెటర్డాట్ కామ్ సీఈవో, పీకల్లోతు అప్పుల్లో ఉన్నా! నన్ను క్షమించండి!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement