-
జమిలి ఎన్నికలతో ప్రజాధనం ఆదా
న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికలు అనేవి భారీ బడ్జెట్ వ్యవహారంగా మారిపోయాయని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు అన్నారు. లోక్సభ, రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ఒకేసారి(జమిలి) నిర్వహిస్తే ఎంతో ప్రజాధనం ఆదా అవుతుందని చెప్పారు. ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా రాజ్యసభలో కిరెణ్ చెప్పారు. ఎన్నికలు ఖరీదైన అంశంగా మారిన నేపథ్యంలో జమిలి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల చట్టాల్లో సంస్కరణల కోసం లా కమిషన్ సమర్పించిన నివేదిక జమిలి ఎన్నికల ఆవశ్యకతను గుర్తుచేసిందన్నారు. పరిపాలనలో స్థిరత్వం కోసం లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు. జమిలి ఎలక్షన్స్తో ప్రజలకే కాదు, పార్టీలకు, అభ్యర్థులకు కూడా లాభమేనని తెలిపారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా నిర్వహించడం వల్ల ‘ఎన్నికల ప్రవర్తనా నియమావళి’ని రెండుసార్లు అమలు చేయాల్సి వస్తోందని, దీనివల్ల అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతోందని కిరణ్ రిజిజు వెల్లడించారు. దేశంలో 1951–52, 1957, 1962, 1967లో జమిలి ఎన్నికలు జరిగాయి. అయితే, 1968, 1969లో కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రద్దయ్యాయి. దాంతో జమిలి ఎన్నికల గొలుసు తెగిపోయింది. -
ఆటోల బడ్జెట్ 10 కోట్లు!!
ఎన్నికల ప్రచారం అనగానే మైకులు, భారీస్థాయిలో పోస్టర్లు, ఫ్లెక్సీలు.. ఇలా అన్నీ ఉండేవి. వాటితో బ్రహ్మాండంగా ప్రచారం చేసుకునేవాళ్లు. భారీగా ఆర్భాటం కూడా ఉండేది. అయితే, ఎన్నికల కమిషన్ నిబంధనల పుణ్యమాని ఎక్కడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టడానికి లేకుండా పోయింది. అయితే నాయకులు మాత్రం ఊరుకుంటారా? శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లుగా కొత్త కొత్త టెక్నిక్లు మొదలుపెట్టారు. ఊళ్లలో ఉన్న ఆటోలన్నింటికీ వెనకాలవైపు తమ ఫ్లెక్సీలు కట్టేయడం, అతికించడం మొదలుపెట్టారు. ఇంతకుముందు కూడా ఆటోల మీద ప్రకటనలకు సంబంధించిన చిన్న చిన్న ఫ్లెక్సీలు ఉండేవి. అయితే వాటి స్థానంలో ఇప్పుడు వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకుల ప్రచార ఫ్లెక్సీలు వెలిశాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లుగా, ఆటోలవాళ్లు కూడా ఈ ఎన్నికల సీజన్ను సొమ్ము చేసుకోడానికి సిద్ధమవుతున్నారు. సాధారణంగా నెల రోజుల పాటు ఒక ప్రచార పోస్టర్ ఆటో వెనక అతికించి ఉంచాలంటే ఇంతకుముందు 300 నుంచి 500 రూపాయల వరకు తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు ఎన్నికల వేళ కావడంతో, ఆ రేటు కూడా పెరిగిపోయింది. కనీసం వెయ్యి రూపాయలు లేనిదే పోస్టర్ పెట్టనిచ్చేది లేదని ఖరాకండిగా చెబుతున్నారు. సగటున ఒక్కో నియోజకవర్గ కేంద్రంలో 10 వేల వరకు ఆటోలు ఉంటున్నాయి. ఆ లెక్కన ఒక్కో ఆటోకు వెయ్యి రూపాయలంటే, మొత్తం అందరు అభ్యర్థులు కలిసి పది కోట్ల రూపాయల వరకు కేవలం ఆటోలకే వెచ్చించాల్సి వస్తోంది. ఎన్నికలా.. మజాకా మరి!! -
మన సినిమా చరిత్రను తిరగరాసే 'బాహుబలి'
భారతీయ సినిమా చరిత్రనే తిరగరాసే విధంగా అత్యంత అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో 'బాహుబలి' చిత్రం రూపొందుతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో దాదాపు వంద కోట్ల రూపాయల వ్యయంతో భారీ చిత్రంగా దీనిని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రం నిర్మాణ దశలో, షూట్ చేసిన డేటా భద్రపరచడంలో, చిత్రం ప్రచారం దశలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఒక్క ధనవ్యయమే కాదు, రాజమౌళి, ప్రభాస్ ఇద్దరూ ఎంతో శ్రమిస్తూ, కటోరదీక్షతో ఓ యజ్ఞంలా ఈ సినిమా చేస్తున్నారు. ప్రభాస్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ఇది. తను ఇంతవరకు పడనంతగా కష్టపడుతున్నారు. గుర్రపు స్వారీ, కత్తి యుద్ధాలలో ప్రత్యేకంగా శిక్షణ పొందారు. రాజమౌళితోపాటు ప్రభాస్ కూడా ఎన్నో జాగ్రతలు తీసుకుంటున్నారు. ఇంటికి షూటింగ్కే పరిమితమయ్యారు. బయట ఏ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. ఎవరికీ కనిపించడంలేదు. ముఖ్యంగా మీడియా కంటపడటంలేదు. సినిమా పూర్తి అయ్యేవరకు ప్రభాస్లో వచ్చిన శారీరక మార్పులు ఎవరూ చూడకుండా ఉండేందుకు ఇలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అవార్డ్ విన్నింగ్ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ అద్బుతమైన రీతిలో భారీ సెట్స్ రూపొందించారు. ఇప్పటికే చాలా కాలం నుంచి ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి అయి మన ముందుకు రావడానికి మరో సంవత్సరం పట్టే అవకాశం ఉంది. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు ఏవీ బయటకు రాకుండా రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. షూటింగ్ స్పాట్లో ఏ రూపంలోనూ ఫొటోలు తీయడానికి అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 'అత్తారింటికి దారేది' చిత్రం విడుదలకు ముందే సిడి బయటకు రావడంతో అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఆధునిక పద్దతులలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమా షూటింగుకు సంబంధించిన వీడియో డేటాను భద్రపరిచేందుకు ‘కస్టమ్ బుల్ట్ ఆన్ లొకేషన్ డేటా స్టోరేజీ' అనే పరికరాన్ని ఉపయోగిస్తున్నారు. హాలీవుడ్ రేంజి సినిమాలకు ఇటువంటి పరికరాలను ఉపయోగిస్తారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఎన్ని ఉపయోగాలు ఉంటాయో, అన్ని నష్టాలు కూడా ఉంటాయని అందరికీ తెలిసిందే. ఆ నష్టాలను అధిగమించడానికి రాజమౌళి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ షూటింగ్ కర్నూలు సమీపంలోని గుట్టల ప్రాంతంలో జరిగింది. రాజమోజీ ఫిల్మ్ సీటీలో వేసిన భారీ సెట్టింగులో సెకండ్ షెడ్యూల్ పూర్తి చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన మరో భారీ సెట్లో మూడో షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్తో పాటు రాణా, అనుష్క, రమ్యకృష్ణ ప్రధాన పాత్ర పాత్రలు పోషిస్తున్నారు. సత్యరాజ్, నాజర్, అడవి శేషు, సుదీప్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఆర్కా మీడియా బేనర్పై శోభు యార్లగడ్డ, కె. రాఘవేంద్రరావు, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషలలో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తరువాత హిందీ, విదేశీ భాషల్లో కూడా విడుదల చేస్తారు. రాజమౌళి ‘ఈగ' చిత్రం ద్వారా అంతర్జాతీయ ఖ్యాతి ఘడించారు. ఈ చిత్రం అంతకుమించిన పేరు తెస్తుందని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమా ప్రచారానికి రాజమౌళి కొత్త పద్దతులను అనుసరిస్తారని తెలుస్తోంది. ఒక చిత్రం విజయవంతం కావడానికి అన్నిరకాల సమర్ధలతోపాటు ప్రచార ప్రాముఖ్యత కూడా తెలిసినవాడు రాజమౌళి. సినిమా నిర్మాణంలోనూ, ప్రచార పద్దతులలో నూతన వరవడులు సృష్టించగల దిట్ట. నిరంతర అన్వేషి. ప్రచారం కోసం కొత్తకొత్త ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ‘ఈగ' విడుదలకు ముందే కథను లీక్ చేశారు. ఈ సారి కథను ఏమాత్రం లీక్ చేయరు. చిత్రం మేకింగ్ వీడియోలను విడుదల చేయాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. చిత్రం షూటింగ్ ప్రారంభమై చాలా కాలం అయింది. పూర్తి కావడానికి మరి కొంతకాలం పడుతుంది. ఈ మధ్యలో చిత్రంపై ప్రేక్షకులకు ఆసక్తి పెంచే మార్గాలను వెతుకుతున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ 23న చిత్రం తొలి మేకింగ్ వీడియోను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక నిమిషం మాత్రమే ఉండే ఈ వీడియోను చిత్రంపై అత్యంత ఆసక్తిని రేకెత్తించే విధంగా రూపొందించాలన్న ఆలోచనతో ఉన్నారు. తెలుగులో అత్యంత భారీ బడ్జెట్తో రూపొందే ఈ చిత్రంపై సినీపరిశ్రమతోపాటు ప్రేక్షకులు కూడా భారీ అంచనాలతో ఉన్నారు. అందరి అంచనాలను రాజమౌళి అధిగమించగలరని ఆశిద్ధాం. s.nagarjuna@sakshi.com
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
ఆటా కన్వెన్షన్ 2024: ఆకాశమే హద్దుగా సాగుతున్న నృత్య పోటీలు!
చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
పేదల పథకాలపై కూటమి కుట్ర..!
బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత
తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా
Summer 2024 : కీరదోసను తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ
జగన్ రాకతో జనసంద్రమైన రాజానగరం
చంద్రబాబు కోసం మాజీ ఐఏఎస్ డ్రామా.. అడ్డంగా దొరికిపోయాడు
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement