-
హెచ్ఐవీ బాధితులకు హెపటైటిస్ వ్యాక్సిన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని హెచ్ఐవీ బాధితులందరికీ హెపటైటిస్ వ్యాక్సిన్ వేయాలని ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే హెచ్ఐవీ బాధితులకు హెపటైటిస్–బి వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. ప్రస్తుతమున్న హెపటైటిస్ బాధితుల్లోనూ హెచ్ఐవీ సోకిన వారే ఎక్కువగా ఉన్నారని ఆరోగ్య శాఖ పరిశీలనలో తేలింది. రాష్ట్రవ్యాప్తంగా 1.90 లక్షల మంది హెచ్ఐవీ బాధితులున్నారు. వీరంతా రాష్ట్రంలోని 45 యాంటీ రిట్రోవైరల్ టెస్టింగ్ (ఏఆర్టీ) సెంటర్లలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ సెంటర్లలోనే వీరికి వ్యాక్సిన్ వేయాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అలాగే బోధనాస్పత్రుల్లో కూడా వ్యాక్సిన్ వేస్తారు. ముందుగా వైద్య పరీక్షలు చేసి.. ఆ తర్వాతే వ్యాక్సిన్ వేయాలని ఆదేశాలిచ్చారు. వైద్య పరీక్షలు చేశాక హెపటైటిస్ ఉందని భావిస్తే.. వారిని వెంటనే మోడల్ ట్రీట్మెంట్ సెంటర్లకు పంపించి వైద్యమందిస్తారు. ముందుగా ఏఆర్టీ సెంటర్లలో పనిచేస్తున్న వైద్య అధికారులందరికీ ప్రత్యేక శిక్షణ ఇస్తారు. టెస్టులు, చికిత్సలకు సంబంధించిన సాంకేతిక సహకారాన్ని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ అందిస్తుంది. -
స్టార్టప్లకు మంచి కాలమిది
- శాంతా బయోటెక్ అధ్యక్షుడు వరప్రసాదరెడ్డి - ఔత్సాహికులు అందిపుచ్చుకోవాలని సూచన - సీసీఎంబీ ఆధ్వర్యంలో ‘ఐహబ్’ ప్రారంభం సాక్షి, హైదరాబాద్: దేశంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇప్పుడు ఎన్నో అవకాశాలు ఉన్నాయని, యువత వాటిని అందిపుచ్చుకుని సమాజానికి మేలు చేసే వినూత్న ప్రాజెక్టులు చేపట్టాలని శాంతా బయోటెక్ కంపెనీ అధ్యక్షుడు డాక్టర్ వరప్రసాదరెడ్డి సూచించారు. 1992 ప్రాంతంలో తాను దేశంలోనే తొలి బయోటెక్ ఆధారిత వ్యాక్సిన్ తయారీ కంపెనీని ఏర్పాటు చేసేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని, అప్పటితో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చిందని ఆయన అన్నారు. శుక్రవారం సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సంస్థ బయోమెడికల్, బయో ఇన్ఫర్మేటిక్స్ రంగాల్లో స్టార్టప్లను ప్రోత్సహించేందుకు సీసీఎంబీ ‘ఐహబ్’ పేరుతో ఓ కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరప్రసాదరెడ్డి మాట్లాడుతూ హెపటైటిస్ బీ వ్యాక్సిన్ను భారతీయులు తయారు చేయలేరని, ఒకవేళ తాము టెక్నాలజీ అందించినా దానిని అందిపుచ్చుకునేందుకు భారత శాస్త్రవేత్తలకు రెండు దశాబ్దాల కాలం పడుతుందన్న పాశ్చాత్య దేశాల రెచ్చగొట్టే వ్యాఖ్యలే తనను శాంతా బయోటెక్ కంపెనీ ఏర్పాటుకు పురికొల్పాయని తెలిపారు. చదివింది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయినప్పటికీ ప్రభుత్వాలు సహకరించకున్నా తాను పట్టుదలతో కంపెనీని స్థాపించి ముందుకు నడిపించగలిగానని తెలిపారు. ఈ క్రమంలో సీసీఎంబీ తమ కంపెనీ ఆవిర్భావానికి, పరిశోధనలకు ఎంతో సహకరించిందని కొనియాడారు. తన దృష్టిలో ఐటీ రంగంవైపునకు మళ్లుతున్న యువత బాలకార్మికుల కిందే లెక్క అని, సొంతంగా సాఫ్ట్వేర్ ఉత్పత్తులను తయారు చేయడం మానేసి... ఇతర దేశాల కంపెనీలు మేధోహక్కులు సంపాదించుకునేందుకు వీరందరూ సహకరిస్తున్నారని అన్నారు. ఐహబ్తో ఐడియాలకు ఉత్పత్తిరూపం.. సీసీఎంబీ ఆధ్వర్యంలో నడిచే ఐహబ్లో స్టార్టప్లను ఏర్పాటు చేసేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారని సంస్థ డెరైక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. సీసీఎంబీలో పురుడు పోసుకునే ఆలోచనలతోపాటు బయటి వారి ఐడియాలనూ వీలైనంత వేగంగా ఉత్పత్తులుగా మార్చడం ఐహబ్ ప్రధాన లక్ష్యమని ఆయన చెప్పారు. వైద్య, వ్యవసాయ రంగాలతోపాటు బయో ఇన్ఫర్మేటిక్స్ రంగాల్లోని స్టార్టప్లు తమ కేంద్రంలోని యంత్రాలు, పరికరాలను వాడుకుని తమ ఆలోచనలను సాకారం చేసుకునే వీలు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీహబ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రమా అయ్యర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
హెపటైటిస్ బీ వ్యాక్సిన్తో నిరోధకత పెరిగింది
ఎంపీ పొంగులేటి ప్రశ్నకు మంత్రి సమాధానం సాక్షి, న్యూఢిల్లీ: హెపటైటిస్ బీ వ్యాక్సిన్ వల్ల పిల్లల్లో రోగనిరోధకత పెరిగిందని కేంద్ర మంత్రి శ్రీపాద యశోనాయక్ శుక్రవారం లోక్సభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఈ వ్యాక్సిన్ వినియోగం వల్ల పిల్లల్లో రోగనిరోధకత పెరిగిందా అని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాతపూర్వకంగా కేంద్ర ప్రభుత్వాన్ని సభ ద్వారా ప్రశ్నించగా మంత్రి సమాధానమిస్తూ ‘ఏపీలో 2010-11లో 5-11 వయస్సు గల పిల్లలపై ఈ అధ్యయనం నిర్వహించాం. 2003, 2004లో హెపటైటిస్ బీ వ్యాక్సిన్ తీసుకున్న పిల్లలపై ఈ అధ్యయనం చేశాం. ఈ అధ్యయనం ద్వారా తేలిందేమిటంటే.. యూనివర్సల్ టీకా కార్యక్రమంలో హెపటైటిస్ బీ వ్యాక్సిన్ ను చేర్చడం ద్వారా రోగ నిరోధకత పెరిగిందని తేలింది..’ అని మంత్రి వెల్లడించారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement