-
50 థియేటర్లని సరదాగా అనుకుంటే, ఇప్పుడేమో..: అల్లు అరవింద్
Allu Aravind Speech In Karthikeya 2 Success Meet: క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్పై ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం "కార్తికేయ 2". ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించారు. మంచి విజయం సాధించిన 'కార్తికేయక'కు సీక్వెల్గా వచ్చిన ఈ చిత్రాన్ని టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 13న థియేటర్స్లలో విడుదలై సక్సెస్ఫుల్గా ప్రదర్శితమవుతున్న సందర్బంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, డైరెక్టర్ శ్రీ వాసు, మైత్రి అధినేత నవీన్ ఏర్నేని తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా వచ్చిన నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ''ఈ సినిమాను హిందీలో సరదాగా రిలీజ్ చేద్దామని 50 థియేటర్స్లలో విడుదల చేస్తే అది రెండో రోజుకు 200 థియేటర్స్ అయింది. ప్రస్తుతం 700 థియేటర్స్లలో ఆడుతుంది. అంటే ఇవాళ భాష అనే బారికేడ్లను దాటుకొని ప్రజల గుండెల్లోకి వెళ్లింది అంటే సినిమాలో సత్తా లేకుంటే అలా జరగదు కదా. ఇలా అన్ని థియేటర్స్లలో ఆడదు కదా. కాబట్టి ఈ సినిమా ఇంకా పెద్ద విజయం సాదించాలి'' అని తెలిపారు. మా సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. చందు మొండేటి చాలా హార్డ్ వర్క్ చేశాడు. నిఖిల్, అనుపమ, టెక్నీకల్ టీం అందరూ బాగా సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది అని చిత్ర నిర్మాత విశ్వ ప్రసాద్ పేర్కొన్నారు. చదవండి: ప్రభాస్ విషయంలో ఆ నిర్మాత వెనుకడుగు.. కారణం అదేనా? మహేశ్ బాబు థియేటర్లో దళపతి విజయ్.. వీడియో వైరల్ ''ఈ సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా హిందీలో కూడా బాగా ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా సినిమాను ఇంత పెద్ద హిట్ చేసినందుకు ఆడియెన్స్కు కృతజ్ఞతలు'' అని హీరో నిఖిల్ తెలిపాడు. ''సినిమా చూస్తుంటే చాలా కొత్తగా ఉంది. అందరూ కొత్త యాక్టర్స్ లా చాలా బాగా నటించారు. వీరందరికీ ఇది 2.0 అనుకోవచ్చు. ఈ సినిమా ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను'' అని దర్శకుడు శ్రీ వాస్ పేర్కొన్నాడు. ''మా చిత్ర నిర్మాతల సహకారం మరువలేనిది. నాకింత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు'' అని డైరెక్టర్ చందు మొండేటి తెలిపాడు. చదవండి: నేను పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు ఒక బాబు: బ్రహ్మాజీ సిల్క్ స్మిత బయోపిక్కు రానున్న సీక్వెల్.. ఈసారి ఏ హీరోయిన్? బిగ్బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్ -
ఓటీటీలోనూ రికార్డులు క్రియేట్ చేస్తున్న 'ఆర్ఆర్ఆర్'..
RRR Hindi Version Create Most Popular Indian Movie In Netflix Globally: జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్చరణ్ మల్టీస్టారర్గా జక్కన్న రూపొందించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ ఏడాది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, యాక్టింగ్.. ఇలా అన్ని కోణాల్లో తిరుగులేదు అనిపించింది ఈ మూవీ. థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం ఓటీటీలోనూ దుమ్ములేపుతోంది. తమ ఓటీటీ ప్లాట్ఫామ్లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చిత్రంగా ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు కొట్టినట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. తెలుగులో తెరకెక్కిన ఈ చిత్రం హిందీ డబ్బింగ్ వెర్షన్ ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. నెట్ఫ్లిక్స్లో మే 20 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఇప్పటివరకు 45 మిలియన్ అవర్స్ స్ట్రీమింగ్ అయిందట. అలా నెట్ఫ్లిక్స్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసినట్లు నెట్ఫ్లిక్స్ తెలిపింది. అలాగే ఈ మూవీ మరో ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లో ఈ చిత్రం తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. చదవండి: 'పుష్ప 2'లో శ్రీవల్లి చనిపోతుందా ? నిర్మాత క్లారిటీ ! కమెడియన్ లైంగిక వేధింపులు.. 50 ఏళ్ల తర్వాత తీర్పు.. RRR is now the most popular Indian film on Netflix around the world 🕺🕺 Sending the biggest 🤝 to fans everywhere! pic.twitter.com/WEOw0nb515 — Netflix India (@NetflixIndia) June 23, 2022 -
‘ఆచార్య’ హిందీ వెర్షన్పై క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్
Ram Charan Clarifies On Acharya Hindi Version: రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, కేజీయఫ్ చిత్రాల అనంతరం ప్రస్తుతం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున సినిమా ‘ఆచార్య’. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్లు కలిసి నటిస్తున్న ఈ సినిమా విడుదల కోసం మెగా అభిమానులతో పాటు సౌత్ ప్రేక్షకులంతా ఆత్రుతుగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదాల అనంతదరం ఏప్రిల్ 29న థియేటర్లో రిలీజ్కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే ఏప్రిల్ 29న ఆచార్య దక్షిణాది అన్ని భాషల్లోనూ విడుదల అవుతుంది. చదవండి: రాజమౌళి గురించి ఈ విషయం 12 ఏళ్ల క్రితమే చెప్పాను కానీ, హిందీలో మాత్రం విడుదల కావడం లేదు. ఈ నేపథ్యంలో ఆచార్య హిందీ వెర్షన్పై చరణ్ తాజాగా క్లారీటీ ఇచ్చాడు. రీసెంట్గా జరిగిన ఆచార్య మూవీ ప్రెస్మీట్లో చరణ్ మాట్లాడుతూ.. ‘ఆచార్య మూవీ షూటింగ్ మేం అనుకున్నదానికంటే ఎక్కువ ఆలస్యమైంది. అంతేకాదు నేను ఆచార్య, ఆర్ఆర్ఆర్ చిత్రాల్లో ఒకేసారి నటిస్తుండటంతో నాకు చాలా తక్కువ సమయం దొరికింది. దీనికి తోడు కరోనా లాక్డౌన్. అయితే మేం ఆచార్యను హిందీలో రిలీజ్ చేయాలని అనుకోలేదు. కానీ ఆర్ఆర్ఆర్ సినిమాకు అక్కడ వచ్చిన రెస్పాన్స్ చూసి ఆచార్యను కూడా హిందీలో రిలీజ్ చేయాలని అనుకున్నాం. చదవండి: దొంగతనం షురూ చేసిన బిగ్బాస్-5 విజేత సన్నీ కానీ హిందీలో రిలీజ్ చేయాలంటే డబ్బింగ్, పొస్ట్ప్రొడక్షన్ పనులకు చాలా సమయంలో పడుతుంది. ఇప్పుడు మా దగ్గర అంత టైం లేదు. అందుకే ఏప్రిల్ 29కి హిందీ వెర్షన్ను రెడీ చేయలేకపోయాం’ అని చెప్పుకొచ్చాడు. కానీ ఆచార్య సినిమాను ఖచ్చితంగా హిందీలో రిలీజ్ చేస్తామని, తన పాత్రకు తానే స్వయంగా హిందీ డబ్బింగ్ చెప్పుకుంటానని చరణ్ పేర్కొన్నాడు. కానీ దీనికి కాస్తా సమయం పడుతుందని, దక్షిణాది భాషల్లో విడదుల అనంతరం హిందీ వెర్షన్పై దృష్టి పెడతామని, త్వరలోనే నార్త్లో ఆచార్య మూవీని రిలీజ్ చేస్తామని రామ్ చరణ్ స్పష్టం చేశాడు. కాగా ఆచార్య మూవీకి చరణ్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
విక్రమాదిత్య, ప్రేరణల ప్రేమకథను టూకీగా చెప్పిన అమితాబ్ బచ్చన్
Amitabh Bachchan Voice Over To Movie: విక్రమాదిత్య, ప్రేరణల ప్రేమకథ ఎలా ఉంటుందో అమితాబ్ బచ్చన్ టూకీగా చెప్పారు. విక్రమాదిత్య అంటే ప్రభాస్, ప్రేరణ అంటే పూజా హెగ్డే అనే విషయం ‘రాధేశ్యామ్’ సినిమా అప్డేట్స్ని ఫాలో అవుతున్నవారికి తెలిసే ఉంటుంది. ఈ సినిమాలో ఈ ఇద్దరూ చేసిన పాత్రల పేర్లివి. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించిన చిత్రం ‘రాధేశ్యామ్’. యూరప్ బ్యాక్డ్రాప్లో 1970ల్లో జరిగే ప్రేమకథతో రూపొందిన ఈ పాన్ ఇండియా మూవీ మార్చి 11న విడుదల కానుంది. చదవండి: Allu Arjun Expensive Things: వావ్.. అల్లు అర్జున్ కొత్త ఇల్లు అదిరిందిగా.. ఎన్ని కోట్లు పెట్టాడంటే.. ఈ నేపథ్యంలో హిందీ వెర్షన్కు అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయాన్ని మంగళవారం చిత్రబృందం ప్రకటించింది. ‘‘బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ నెరేషన్ ఈ సినిమాకి అదనపు ఆకర్షణ అవుతుంది. బిగ్ బీకి ధన్యవాదాలు’’ అని చిత్రబృందం పేర్కొంది. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్కర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: జస్టిన్ ప్రభాకరన్ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం), మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ (హిందీ), కెమెరా: మనోజ్ పరమహంస. Thank you Shahenshah @SrBachchan sir for the Hindi voiceover of #RadheShyam. #Prabhas @hegdepooja @director_radhaa @UV_Creations @TSeries @GopiKrishnaMvs @AAFilmsIndia @RadheShyamFilm #RadheShyamOnMarch11 pic.twitter.com/xrqZWGXoj1 — Radha Krishna Kumar (@director_radhaa) February 22, 2022 -
పుష్ప ఖాతాలో మరో రికార్డ్.. అక్కడ రూ. 100 కోట్ల కలెక్షన్లు
Pushpa Movie Hindi Version Earns 100 Crores In India: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం 'పుష్ప: ది రైజ్'. గతేడాది డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం భారీ హిట్ కొట్టింది. కరోనా సమయంలోనూ అత్యధిక కలెక్షన్లతో దూసుకపోయింది. ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 300 కోట్లు రాబట్టిందని చిత్ర యూనిట్ ప్రకటించింది. 2021లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలవడం మాత్రమే కాదు బన్ని కెరీర్ లో తొలిసారి రూ. 300 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మూవీగా రికార్డుల్లోకి ఎక్కింది పుష్ప. అయితే తాజాగా పుష్ప మరో రికార్డును సొంతం చేసుకుంది. హిందీలో ఈ మూవీ రూ. 100 కోట్లు కలెక్షన్లు రాబట్టి రికార్డు సృష్టించింది. సినిమాకు ముందు నుంచే భారీ హైప్ రావడం అందుకు తగినట్లు సుకుమార్ టేకింగ్, బన్నీ, రష్మిక మందన్నా, సమంత స్పెషల్ సాంగ్ ప్రతీ ఒక్కరూ మూవీ విజయం సాధించేలా చేశాయి. అలాగే పుష్ప సాంగ్స్, డైలాగ్స్, మ్యానరిజంపై వచ్చిన రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సినిమా మరింత పాపులర్ అయింది. ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా థియేటర్లలో మంచి స్పందన రావడం ఈ చిత్రానికే చూశానని ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ ఇటీవల ట్వీట్ చేశారంటే పుష్ప ఎంతలా ఆకట్టుకుంటుందో అర్థమవుతుంది. మొన్నటి వరకూ తెలుగు, మలయాళంలో అభిమానులు ఉన్న బన్నీకి పుష్పతో నార్త్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement