-
దేశ ప్రజలకు ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్ హోలీ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: రంగుల కేళీ హోలీ పండుగ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. ‘అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ప్రేమ, ఆప్యాయత, సౌభ్రాతృత్వానికి ప్రతీక అయిన ఈ రంగుల పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని తీసుకురావాలి’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. आप सभी को होली की हार्दिक शुभकामनाएं। आपसी प्रेम, स्नेह और भाईचारे का प्रतीक यह रंगोत्सव आप सभी के जीवन में खुशियों का हर रंग लेकर आए। — Narendra Modi (@narendramodi) March 18, 2022 రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దేశ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ‘హోలీ శుభ సందర్భంగా దేశప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. రంగుల పండుగ హోలీ, మత సామరస్యం సయోధ్యకు సజీవ ఉదాహరణ. హోలీ అందరి జీవితాల్లో ఆనందం, ఉత్సాహం. కొత్త శక్తిని నింపాలని కోరుకుంటున్నాను.’ అని ట్వీట్ చేశారు. చదవండి: సీఎం వైఎస్ జగన్ హోలీ శుభాకాంక్షలు होली के पावन अवसर पर सभी देशवासियों को हार्दिक बधाई एवं शुभकामनाएं। रंगों का पर्व होली, सामुदायिक सद्भाव और मेल-मिलाप का जीवंत उदाहरण है। यह वसंत ऋतु के आगमन का शुभ समाचार लेकर आता है। मेरी कामना है कि यह त्योहार सभी देशवासियों के जीवन में आनंद, उमंग और नई ऊर्जा का संचार करे। — President of India (@rashtrapatibhvn) March 18, 2022 ప్రధాని మోదీ, రాష్ట్రపతితోపాటు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు సీఎం కేసీఆర్ హోలీ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి సంతోషంగా సాగాలనే సందేశాన్ని హోలీ రంగుల పండుగ ఇస్తుందని పేర్కొన్నారు. ప్రకృతి మెచ్చే రంగులతో హోలీని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సీఎం సూచించారు. ఈ మేరకు తెలంగాణ సీఎంఓ ట్వీట్ చేసింది. CM Sri KCR has conveyed #Holi greetings to the people of the State. Hon'ble CM stated that the festival of colours conveys the message of unity and togetherness. Wished people to celebrate the festival with joy and with eco-friendly colours.#HappyHoli pic.twitter.com/clrRdgjRjO — Telangana CMO (@TelanganaCMO) March 18, 2022 -
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ హోలీ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: హోలీ పండుగ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రంగుల పండుగ అందరి జీవితాలను వర్ణశోభితం చేయాలని, వసంత రుతువు ఆగమనాన్ని సూచించే ఈ పండుగ జరుపుకుంటున్న వారందరికీ శుభం జరగాలని ఆయన ఆకాంక్షించారు. హోలీ సందర్భంగా సురక్షితమైన సేంద్రీయ రంగులను వాడాలని ఆయన సూచించారు.
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు
ముంబైలో భారీ వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం
వరుస దాడులు..భయాందోళనలో ప్రజలు..
కొన్ని గంటల్లో 'కల్కి' ట్రైలర్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడేనా..?
చెలరేగిన విండీస్ బ్యాటర్లు.. పసికూన ముందు భారీ టార్గెట్
Gunshot: ఓడినా గెలిచాడు YS Jagan
బేగంపేటలో వ్యక్తి దారుణ హత్య..
ఈఎంఐల్లో లంచాలు
సెంట్రల్ క్యాబినెట్ లో తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట
మహాత్మునికి నివాళులు అర్పించిన ప్రధాని మోదీ
Advertisement