-
కిరాయిదారులపై కిరాతకం!
సాక్షి, హైదరాబాద్ : ఇల్లు ఖాళీ చేయడం లేదన్న సాకుతో సదరు ఇంటి యజమాని దౌర్జన్యానికి దిగాడు. కిరాయిదారుడి కుటుంబాన్ని గదిలో బంధించాడు. రౌడీ మూకలతో దాడి చేయించాడు. అడ్డుచెబితే పిల్లలను చంపివేస్తామని బెదిరింపులకు పాల్పడిన ఘటన గురువారం ఉదయం కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇంటి యజమాని దాష్టీకం వెనుక అధికార టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ భర్త హస్తం ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. కడప జిల్లా వేంపల్లెకు చెందిన కొక్కంటి మోహన్రెడ్డి మూడేళ్లుగా కేపీహెచ్బీ కాలనీ మూడో ఫేజ్ ఎంఐజీ 6/1లోని ఎంఎల్ఎం ప్రసాద్ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. 12 ఏళ్ల కాలానికి లీజ్ అగ్రిమెంట్ చేసుకున్న అతను అద్దె ఇంటికి దాదాపు రూ.4.లక్షలతో మరమ్మతులు చేయించి, టాటా స్కై డిస్ట్రిబ్యూషన్ కేంద్రం కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇదిలా ఉండగా ప్రసాద్ సదరు ఇంటిని మరొకరికి విక్రయించడంతో కొనుగోలు చేసిన వ్యక్తులు ఇంటిని ఖాళీ చేయాలని మోహన్రెడ్డిపై ఒత్తిడి చేయగా, తనకు 12 ఏళ్ల అగ్రిమెంట్ ఉన్నట్లు చెప్పడంతో వారు వెళ్లిపోయారు. ఏడాది క్రితం ఇంటిని కొనుగోలు చేసిన గోపాల శ్రీహరి అనే మరో వ్యక్తి ఇల్లు ఖాళీ చేయాలని పట్టుబడుతున్నాడు. ఈ వివాదం స్థానిక కార్పొరేటర్ కావ్య భర్త హరీష్రెడ్డి వద్దకు చేరగా, ఆయన మోహన్రెడ్డిని పిలిపించి ఇల్లు ఖాళీ చేయాలని బెదిరించడమేగాక కాగితాలపై సంతకం చేయాలని ఒత్తిడి చేసినట్లు మోహన్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం మోహన్రెడ్డి ఇంటి యజమాని శ్రీహరికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించి స్టేటస్కో ఉత్తర్వులు తెచ్చుకోవడంతో అప్పటి నుంచి కోర్టులో వివాదం నడుస్తోంది. గత నెల 11న కోర్టు యథాతథ స్థితి ఉత్తర్వులు పొడించకపోవడంతో ఇదే అదనుగా భావించిన ఇంటి యజమాని శ్రీహరి గురువారం ఉదయం 50 మంది అనుచరులనతో కలిసి ఇంటిపై దాడిచేశాడు. మోహన్రెడ్డి, అతని భార్య, బిడ్డను వంట గదిలో బంధించి సామాను బయట పారేశారు. ఇంటి గోడలను యంత్రాల సహాయంతో కూల్చివేయించాడు. చుట్టుపక్కల వారు వచ్చి నిలదీయగా.. తాము కోర్టు ఆదేశాల మేరకు కూల్చివేస్తున్నట్లు చెప్పారు. వంట గదిలో నుంచి మోహన్రెడ్డి, భార్య సంధ్య కేకలు వేయడంతో బిడ్డను చంపేస్తామని బెదిరించారు. భయాందోళనకు గురైన వారు పక్కింటి వారికి సమాచారం ఇవ్వడంతో వారు పోలీస్ కంట్రోల్ రూం కు ఫిర్యాదు చేశారు. అప్పటికే శ్రీహరి ఇంట్లోని విలువైన వస్తువులు, నగలు, నగదు, చెక్కు బుక్లు, దస్తావేజులతో పాటు సీసీ కెమె రాలు, డీబీఆర్లను తీసుకెళ్లారని, దీనిపై కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. మోహన్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, ఇల్లు అమ్మిన వ్యక్తిని, కొనుగోలు చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సీఐ కుషాల్కర్ తెలిపారు. ఎమ్మెల్యే ఆర్థికసాయం విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ఇంటి మరమ్మతుల కోసం మోహన్రెడ్డికి రూ.50 వేలు అందజేశారు. హరీష్రెడ్డి బెదిరించాడు: సంధ్య బాలాజీనగర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల కావ్య భర్త హరీష్రెడ్డి తమను ఇల్లు ఖాళీ చేయాలని బెదిరించారని మోహన్రెడ్డి భార్య సంధ్య మీడియాకు తెలిపారు. తమకు రక్షణ కావాలని, తాము సంపాదించుకున్న డబ్బు, నగలు దోచుకెళ్లారని బోరున విలపించింది. -
హీరో ధనుష్ నిర్మిస్తున్న ఇల్లు కూల్చివేత
చెన్నై : కోలీవుడ్ హీరో ధనుష్ కోవై జిల్లాలో నిర్మిస్తున్న భవనాన్ని ఆ జిల్లా అధికారులు కూల్చివేశారు. ధనుష్ కొవై జిల్లా వైదేహి నీర్విళిచ్చి సమీపంలో అధునాతన వసతులతో ఒక భవనాన్ని నిర్మిస్తున్నాడు. అయితే ఆ భవనం అటవీ శాఖ పరిధిలో ఉండటం వల్ల వారి అనుమతి లేకుండా నిర్మించినట్లు ఫిర్యాదు రావటంతో కోవై జిల్లా అధికారులు భవనాన్ని కూల్చివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ధనుష్ భవనం కూల్చివేతకు గురైంది. ఒక పక్క పుట్టినరోజు వేడుకలతో (మంగళవారం పుట్టినరోజు) మరోపక్క నిర్మించి, హీరోగా నటించిన చిత్రం వేలై ఇల్లా పట్టదారి విజయం సాధించిన ఆనందంలో ఉన్న ధనుష్కు ఈ సంఘటన ఆవేదన కలిగించినట్లు సమాచారం. అయితే ఈ ఘటనపై అతను స్పందించలేదు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement